
Deputy CMO, Andhra Pradesh
@APDeputyCMO • 159,494 subscribers
Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech
Shorts
Videos

Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru K.Annamalai Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu. “From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees. He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility. Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics. Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service. PIB in Tamil Nadu
Deputy CMO, Andhra Pradesh742,151 görüntüleme • 2 ay önce

An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (Peddireddy Ramachandra Reddy) garu. Hon’ble Deputy CM Pawan Kalyan visited the site, reviewed the violations, briefed Hon’ble CM Sri N Chandrababu Naidu garu, and Cabinet Ministers, and immediately ordered a comprehensive probe. Pawan Kalyan directed officials to: 🔸Publish the names of all forest land encroachers on the department website. 🔸Reveal the extent of encroachment and the status of cases on each individual. 🔸Take strict legal action against anyone who grabbed forest land, without exceptions. 🔸Investigate discrepancies in land records, including inflated Webland entries and false claims of “ancestral land” inside protected forest areas. 🔸Act based on vigilance reports and legal expert guidance. 🔸Digitize all land records to prevent manipulation and ensure transparency. Forest lands are national assets. Those who encroach upon them, misuse them, or violate forest laws, no matter who they are, will be held accountable. The government will not tolerate the grab of protected forest areas or wildlife zones. PMO India MoEF&CC Bhupender Yadav CMO Andhra Pradesh PIB India PIB in Andhra Pradesh I & PR Andhra Pradesh #OperationAranya
Deputy CMO, Andhra Pradesh1,282,705 görüntüleme • 8 ay önce

#PawanKalyanTransformsAP మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ Pawan Kalyan గారు అని యువ హీరో శ్రీ Teja Sajja అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు. #Chapter7
Deputy CMO, Andhra Pradesh340,370 görüntüleme • 2 ay önce

ఒక నాయకుడిలో ప్రజలు కోరుకునేది స్పందించే హృదయం. అలాంటి స్పందించే అందరికంటే ఎక్కువ నేను మన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారిలో చూశానంటున్నారు ప్రముఖ నటుడు శ్రీ Adivi Sesh గారు. సమస్య విన్నవెంటనే స్పందించే తత్వం ఆయనకి మాత్రమే సొంతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని స్పష్టం చేశారు. #PawanKalyanTransformsAP #Chapter9
Deputy CMO, Andhra Pradesh200,138 görüntüleme • 2 ay önce

గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందర్నీ తన సొంత కుటుంబంలా చూసుకుంటారని Niharika Konidela గారు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 300కి పైగా ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేయడమే అందుకు నిదర్శనం అని, ప్రజల సమస్యల పట్ల సకాలంలో స్పందించే ఆయనకి ఆయనే సాటి అని అభిప్రాయపడ్డారు. #PawanKalyanTransformsAP #Chapter10
Deputy CMO, Andhra Pradesh174,798 görüntüleme • 2 ay önce

#PawanKalyanTransformsAP #Chapter2 మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో Nani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
Deputy CMO, Andhra Pradesh197,107 görüntüleme • 2 ay önce

పలమనేరు సమీపంలో ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్న అడవి ఏనుగు పట్టివేత •ఏనుగును పట్టుకునేందుకు నెల రోజులపాటు ప్రత్యేక ఆపరేషన్ •ఆపరేషన్ కోసం అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సర్ కెమెరాల వినియోగం •తుది అంకంలో పాల్గొన్న ఐదు కుంకీ ఏనుగులు, అటవీ సిబ్బంది, పశువైద్య నిపుణులు •గతంలో అటవీ సెక్షన్ అధికారి శ్రీ సుకుమార్ పై దాడి చేసి గాయపర్చిన ఏనుగు •గాయాల నుంచి కోలుకుని ఆపరేషన్ లో పాల్గొన్న శ్రీ సుకుమార్ •ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అటవీ సిబ్బిందికి శ్రీ Pawan Kalyan గారి అభినందనలు •సెక్షన్ ఆఫీసర్ శ్రీ సుకుమార్ ధైర్యాన్ని మెచ్చుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు •ఏనుగును కుంకీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచన గత కొంత కాలంగా పలమనేరు పరిసరాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తూ, సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ విజయవంతంగా బంధించింది. ఈ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది నెల రోజులకుపైగా చెమటోడ్చాల్సి వచ్చింది. సుమారు 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన ఈ ఏనుగును వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు లోబడి, పశు వైద్య నిపుణులు, అటవీశాఖ ఫీల్డ్ సిబ్బంది పర్యవేక్షణలో బంధించారు. బుధవారం నిర్వహించిన తుది ఆపరేషన్లో ముసలమడుగు క్యాంపు నుంచి వచ్చిన ఐదు కుంకీ ఏనుగులు కూడా పాల్గొని, ఏనుగుని బంధించడంలో కీలకపాత్ర పోషించాయి. గతంలో ఈ ఏనుగు దాడిలో గాయపడిన అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీ సుకుమార్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం గమనార్హం. అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసిన పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సిబ్బందిని, అనంతపురం సర్కిల్ కన్జర్వేటర్ శ్రీమతి యశోదా బాయ్, చిత్తూరు జిల్లా అటవీ అధికారితో పాటు పశువైద్య నిపుణులు, ట్రాకర్లు, మహౌత్ లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. గతంలో ఏనుగు దాడిలో గాయపడినప్పటికీ, కోలుకుని ఈ ఆపరేషన్లో పాల్గొన్న శ్రీ సుకుమార్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ప్రజల భద్రత, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అటవీశాఖ చేపట్టిన ఆపరేషన్ ను ప్రశంసించారు. పట్టుకున్న ఈ ఏనుగును ముసలమడుగు క్యాంపుకి తరలిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలుపగా, కుంకీగా శిక్షణ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ ఏనుగు పలమనేరు సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ పదే పదే పంటలను ధ్వంసం చేయడంతోపాటు పరిసర గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. పలుమార్లు జనావాసాల మధ్యకు రాగా, గతంలో చేపట్టిన మళ్లింపు చర్యల్లో పలమనేరు అటవీ విభాగానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ సుకుమార్ పై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. పంటలకు నష్టం కలిగించడం, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ఒంటరి మగ ఏనుగును బంధించాల్సి వచ్చింది. అందుకోసం సుదీర్ఘకాలం ఏనుగు కదలికలను క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది, ట్రాకర్ల సాయంతో పర్యవేక్షించారు. అప్పట్లో అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసినా తర్వాత ఏనుగు ప్రవర్తనలో మార్పు రావడాన్ని గుర్తించారు. అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో నెల రోజులుగా ఏనుగు కదలికలను ట్రాక్ చేశారు. గతంలో ఏనుగు దాడి చేసిన సెక్షన్ లోనే జాతీయ రహదారికి సమీపంలో పట్టుకున్నారు. వన్యప్రాణి నిర్వహణ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పీసీసీఎఫ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చే ప్రక్రియను డాక్టర్ నవీన్, అరుణ్ లు సమన్వయం చేయగా, విశ్రాంత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ ఆపరేషన్ అనంతర కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు. అనంత సర్కిల్ కన్జర్వేటర్ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తూ కీలక సూచనలు ఇచ్చారు. ఉపముఖ్యమంత్రివర్యుల సూచన మేరకు పట్టుకున్న ఏనుగును ముసలమడుగు కుంకీ శిబిరానికి తరలించారు. అక్కడ పశువైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, ఏనుగు ప్రవర్తనను కొంతకాలం పర్యవేక్షిస్తారు. మనుషులతో మెలిగే అంశంలో సానుకూల దృక్పథం కనబరిస్తే ప్రత్యేక శిక్షణ ఇచ్చి కుంకీగా తీర్చిదిద్దుతారు. #HANUMAN #AndhraPradesh
Deputy CMO, Andhra Pradesh20,362 görüntüleme • 10 gün önce

సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా పని చేసేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక లైవ్ ద్వారా వెల్లడించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan I & PR Andhra Pradesh PIB India PIB in Andhra Pradesh CMO Andhra Pradesh #SayNoToSocialMediaAbuse
Deputy CMO, Andhra Pradesh46,827 görüntüleme • 25 gün önce

మన సంప్రదాయ కళలను పరిరక్షించడం అంటే వాటిని ప్రోత్సహించడమే కాదు… వాటిని జీవనాధారంగా మలుచుకున్న కళాకారుల ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించడం కూడా. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా మన హస్తకళాకారులు, చేనేత కార్మికులతో ఆత్మీయంగా మమేకమయ్యే అవకాశం లభించింది. వారి అసాధారణ నైపుణ్యం, అపారమైన ఓర్పు, వృత్తిపట్ల ఉన్న అంకితభావం నన్నెంతో ఆకట్టుకున్నాయి. అదే సమయంలో, వారితో జరిగిన సంభాషణల్లో వారు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తూ వెన్ను, మెడ, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో చాలామంది కళాకారులు బాధపడుతున్నారని వారు వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తమ చేతుల మీద మోస్తున్న ఈ కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా కూటమి ప్రభుత్వ బాధ్యత అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అందుకే వారి సమస్యలను విన్న వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులను ఆదేశించి, రాష్ట్రంలోని వివిధ హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించేలా చర్యలు చేపట్టాము. నిన్న (08.07.2026) తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులు, పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారాంపురం క్రోషే లేస్ కళాకారుల కోసం వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు (09.07.2026) ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి బొమ్మల కళాకారులు, కాకినాడ జిల్లాలోని ఉప్పాడ చేనేత కార్మికులు, కడప జిల్లాలోని మాధవరం చేనేత కార్మికులు, అనంతపురం జిల్లాలోని యడికి చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. రేపు (10.07.2026) విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వీణ కళాకారులు, అనకాపల్లి జిల్లాలోని ఎటికొప్పాక కళాకారులు, ఏలూరు జిల్లాలోని హ్యాండ్ నాటెడ్ వూలెన్ పైల్ కార్పెట్ కళాకారులు, మదనపల్లె చేనేత కార్మికుల కోసం వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. 11.07.2026న సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులు, శ్రీకాకుళం జిల్లాలోని బుడితి ఇత్తడి కళాకారులు, కృష్ణా జిల్లాలోని పెడన బ్లాక్ కలంకారీ కళాకారులు, తిరుపతి జిల్లాలోని చెక్క శిల్ప కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. తదుపరి వారంలో కూడా రాష్ట్రంలోని మరిన్ని హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ఇదే తరహా ప్రత్యేక వైద్య శిబిరాలను దశలవారీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాల ద్వారా సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన చోట నిపుణుల వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు, తదుపరి చికిత్సకు అవసరమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి హస్తకళాకారుడు, ప్రతి చేనేత కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కళను గౌరవించడం అంటే కళాకారుడి శ్రమను గౌరవించడం. కళాకారుడి శ్రమను గౌరవించడం అంటే ఆయన ఆరోగ్యాన్ని కాపాడడం. మన కళాకారులు ఆరోగ్యంగా ఉంటేనే మన సంప్రదాయాలు, మన వారసత్వం భావితరాలకు సజీవంగా నిలుస్తాయి. కళను కాపాడాలంటే… ముందు కళాకారుడిని కాపాడాలి. - Pawan Kalyan CMO Andhra Pradesh Ministry of Culture Ministry of Textiles DC (Handicrafts) PIB India I & PR Andhra Pradesh PIB in Andhra Pradesh #AndhraPradeshHastakalaMahotsavam #ArtisanWelfare
Deputy CMO, Andhra Pradesh30,423 görüntüleme • 17 gün önce

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి శ్రీ Lokesh Nara గారి తనయుడు, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్స్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను - Pawan Kalyan
Deputy CMO, Andhra Pradesh598,539 görüntüleme • 1 yıl önce

Every chapter tells a story. Every step leaves an impact. And many remarkable chapters are yet to unfold… Stay tuned for a journey of service, courage, and transformation. Manohar Nadendla K.Annamalai Naga Babu Konidela Nikhil Siddhartha Adivi Sesh Niharika Konidela #PawanKalyanTransformsAP
Deputy CMO, Andhra Pradesh101,202 görüntüleme • 2 ay önce

Founder of Microsoft, Mr. Bill Gates, visited Andhra Pradesh this morning. Hon’ble Chief Minister Sri N Chandrababu Naidu garu, and Deputy Chief Minister Pawan Kalyan accorded him a warm welcome at the State Secretariat. During the subsequent meeting, DyCM Pawan Kalyan appreciated the Gates Foundation’s commitment to partnering with the Government of Andhra Pradesh to strengthen the education, healthcare, and agriculture sectors. The State looks forward to a meaningful collaboration that advances inclusive and sustainable development. #APWelcomesBillGates
Deputy CMO, Andhra Pradesh160,547 görüntüleme • 5 ay önce

Full Speech of Deputy Chief Minister Pawan Kalyan On this historic day, as the Hon'ble PM, Sri Narendra Modi Ji, laid the foundation for the reconstruction of Andhra Pradesh's state people capital, Amaravati, Deputy Chief Minister Pawan Kalyan addressed a massive public gathering. In his speech, he expressed the NDA government's commitment to the development of Amaravati and emphasized the importance of fulfilling the aspirations of the people. #Modi4Amaravati #AmaravatiTheRise
Deputy CMO, Andhra Pradesh385,028 görüntüleme • 1 yıl önce

డొక్కా సీతమ్మ గారి పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించాను. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి మార్గదర్శకత్వంలో విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ Lokesh Nara గారు తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయి. కడపలో ‘స్మార్ట్ కిచెన్’ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా|| శ్రీధర్ చెరుకూరి గారికి అభినందనలు. - Pawan Kalyan PMO India Ministry of Education CMO Andhra Pradesh District Collector, YSR Kadapa District PIB India I & PR Andhra Pradesh PIB in Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh306,337 görüntüleme • 1 yıl önce

Hon’ble Deputy Chief Minister Sri Pawan Kalyan addressing the Tirumala Lord Venkateswara sacred laddu ghee adulteration issue during the Assembly session. • The CBI-led SIT report stated that not even a single litre of milk was used in the preparation of the ghee. • It concluded that adulterated ghee was manufactured by mixing chemicals into palm oil. However, it also clarified that the specific technology required to determine the exact composition of those chemicals is not available with them. • In connection with the adulterated ghee case, criminal cases have been registered against 36 accused persons. • The tender conditions were altered to award contracts to preferred entities. #NoGheeInTTDLaddu #SanatanaDharmaRakshaBoard
Deputy CMO, Andhra Pradesh133,920 görüntüleme • 5 ay önce

పిల్లలపై వేధింపులు, పోక్సో చట్టం యొక్క నిబంధనలపై అన్ని పాఠశాలల్లో అవగాహనా సదస్సులు నిర్వహించి సమాజాన్ని చైతన్యవంతం చెయ్యడంలో తమదైన పాత్ర పోషిస్తున్న కాకినాడ జిల్లా అధికార యంత్రాంగానికి, వారికి సహకరిస్తున్న పడాల చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు శ్రీ పడాల సూర్య ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు. - Pawan Kalyan PMO India CMO Andhra Pradesh Collector Kakinada
Deputy CMO, Andhra Pradesh376,846 görüntüleme • 1 yıl önce

అరకు వ్యాలీలో 1,736 మంది గిరిజనులకు, పర్యాటకులకు రహదారుల సమస్య నుండి విముక్తి కలిపించిన ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండలం, చినలబుడు మరియు పద్మాపురం గ్రామా పంచాయతీలలో పక్కనకుడి, మంజాగూడ, తుడుము , మాలివలస , రణజిల్లేడ గ్రామాలకు ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆదేశాలతో, MGNREGS నిధులతో, హట్టగూడ గ్రామం నుండి 2.70 కిలోమీటర్లు మేర, రూ 552.00 లక్షల అంచనాతో తారురోడ్డును, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మించటం జరిగింది ఈ రహదారి నిర్మాణం ద్వారా 1,736 జనాభా కలిగిన ఈ గిరిజన గ్రామాలకు రాకపోకలు మరియు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న రణజిల్లేడ వాటర్ ఫాల్స్ కు మార్గంగా ఉండటం వలన ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా విద్య,వైద్య, వ్యాపార పరమైన వసతులకు మరింత చేరువయ్యేలా కానుంది. ఇప్పటికే BT రోడ్డు 2.60 kms పూర్తి స్థాయిలో వేయటం జరిగింది మరియు రవాణా సౌకర్యం కలిగించుట జరింగింది.ఐతే మిగిలిన 100 మీటర్ల మార్గం కాజ్ వే CC అప్రోచ్ సబ్ బేస్ కొత్తగా వేయడం వల్ల గట్టు పూర్తిగా కంప్యాక్షన్ జరుగుతుందనే ఉద్దేశంతో అలానే ఉంచడం జరిగింది. కన్సాలిడేషన్ల జరిగిన వెంటనే సీసీ రోడ్డు పూర్తి చేసి, గిరిజనుల రహదారి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపనున్నాము. CMO Andhra Pradesh MGNREGA, MoRD, GoI Ministry of Panchayati Raj, Government of India Ministry of Rural Development, Government of India #APGovtForTribalWelfare #PallePanduga
Deputy CMO, Andhra Pradesh329,645 görüntüleme • 1 yıl önce