Somireddy Chandra Mohan Reddy's banner
Somireddy Chandra Mohan Reddy's profile picture

Somireddy Chandra Mohan Reddy

@Somireddycm41,438 subscribers

Member of Legislative Assembly, Sarvepalli | Former Minister, Andhra Pradesh | Politburo Member, Telugu Desam Party. @jaitdp #TDPTwitter

Videos

Somireddycm's profile picture

అల్లీపురం నుంచి హైవే మీదుగా వేదాయపాళెం వెళుతుండగా కనుపర్తిపాడు క్రాస్ రోడ్డు వద్ద ఒక కుటుంబం చాలా దీనావస్థలో కనిపించింది. కర్రతుమ్మ చెట్ల కింద కూర్చున్న ఆ కుటుంబంలో ఒక బిడ్డకు వంటిపై కనీసం దుస్తులు కూడా లేవు. పిల్లలు బడికి పోతే తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకు రూ.13 వేలు చొప్పున తల్లి అకౌంట్ లో జమ అవుతాయి. బడిలో ఆరు రోజులు పౌష్టికాహారం అందిస్తారు. అందులో ఐదు రోజులు కోడి గుడ్డు పెడతారు. ఉచితంగానే పుస్తకాలు, రెండు జతల దుస్తులు ఇస్తారు. అయినా బిడ్డలను బడికి పంపడం లేదు. ప్రతి రోజూ నేను ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఇలాంటి వారు కనిపిస్తూనే ఉన్నారు. కాళ్లకు చెప్పులు లేకపోయినా, మాసిన జుట్టుతో కనిపించినా వారు గిరిజనులే. బడి సమయంలో రోడ్లపై చిన్నారులు కనిపిస్తే వాళ్లు గిరిజన బిడ్డలే. వీరి జీవితంలో కచ్చితంగా మార్పు తేవాల్సిందే. ప్రస్తుతం నెల్లూరు ఐటీడీఏ మైదాన ప్రాంత కేటగిరిలో ఉంది..ఏజెన్సీ ప్రాంతంలోని ఐటీడీఏలు షెడ్యూల్డ్ కేటరిగిలో ఉన్నాయి. నెల్లూరు ఐటీడీఏను కూడా షెడ్యూల్డ్ కేటగిరిలోకి మారిస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే చాలా సంక్షేమ పథకాలు మన చల్లా యానాదులకు కూడా వర్తిస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా నియోజకవర్గంలోని వెంకటాచలంలో నేను గిరిజనుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమానికి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. వీరిలో అనేక మందికి ఆధార్, రేషన్ కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని గుర్తించాం. స్పెషల్ డ్రైవ్ చేపట్టి నియోజకవర్గ వ్యాప్తంగా 3500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించాం. సర్వేపల్లి స్ఫూర్తితో అప్పటి కలెక్టర్ ఆనంద్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి 11500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించారు. ఈ దేశంలో భారతీయుడుగా గుర్తింపు రావాలంటే ప్రాథమిక ఆధారం ఆధార్ కార్డు. ఆ కార్డు లేని వారు ఇంకా ఉన్నారంటే వారు గిరిజనులే. సమాజంలో అత్యంత నిరక్షరాస్యులు గిరిజనులే. అత్యంత అమాయకులు గిరిజనులే. మోసపోయేవారు గిరిజనులే. గిరిజన బిడ్డల దుస్థితిపై నేను అసెంబ్లీలోనూ ప్రస్తావించాను. నెల్లూరు పర్యటనకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషనర్ కు ప్రత్యక్షంగా చూపించాను. గిరిజనుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి నెల్లూరు ఐటీడీఏను షెడ్యూల్ కేటగిరిలోకి మార్చడమే మార్గమని నిర్ణయానికి వచ్చాను. అందులో భాగంగా త్వరలోనే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారి ఆధ్వర్యంలో మన కేంద్ర మంత్రులతో కలసి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులను కలవాలని నిర్ణయించుకున్నాం. నెల్లూరు ఐటీడీఏను మైదాన కేటగిరి నుంచి షెడ్యూల్డ్ కేటగిరిలో మార్చేందుకు కృషి చేస్తున్నా.

Somireddy Chandra Mohan Reddy

58,709 görüntüleme • 9 gün önce

Somireddycm's profile picture

నెల్లూరు ఎస్2 థియేట‌ర్ కాంప్లెక్స్ లో ఈ రోజు Pawan Kalyan గారు న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా చూశాను. చాలా మంచి సినిమా..హార్ట్ టచింగ్ ఫిల్మ్..మా డిప్యూటీ సీఎం గారి న‌ట‌న చాలా బాగుంది. సినిమాను అద్భుతంగా చిత్రీక‌రించారు. హిందువులను కాపాడటం వంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. సెకండాఫ్ నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. గ‌త పాతికేళ్ల‌లో నాకు న‌చ్చిన ఐదారు సినిమాల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఒక‌టి..నా మ‌న‌వ‌డు ర‌ణ‌దేవ్ కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాడు. ఒక మంచి సినిమాను మా నాయకులతో పాటు ఆఫీస్ స్టాఫ్ అందరితో కలిసి చూడటం చాలా ఆనందంగా ఉంది. JanaSena Party #HariHaraVeeraMallu

Somireddy Chandra Mohan Reddy

19,792 görüntüleme • 11 ay önce

Daha fazla içerik yok.