Deputy CMO, Andhra Pradesh's banner
Deputy CMO, Andhra Pradesh's profile picture

Deputy CMO, Andhra Pradesh

@APDeputyCMO160,820 subscribers

Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech

Shorts

Age is never a barrier when driven by passion and determination. At 52 years of age, Goli Shyamala Garu from Samarlakota has achieved an extraordinary milestone by swimming 150 km along the coast from Visakhapatnam to Kakinada, setting an inspiring example for many. I extend my heartfelt congratulations to her on this remarkable accomplishment. I have always believed that there is immense talent around us. The Government of Andhra Pradesh is committed to identifying and encouraging such talented athletes - Pawan Kalyan #AgeNoBarrier #GoliShyamala

Age is never a barrier when driven by passion and determination. At 52 years of age, Goli Shyamala Garu from Samarlakota has achieved an extraordinary milestone by swimming 150 km along the coast from Visakhapatnam to Kakinada, setting an inspiring example for many. I extend my heartfelt congratulations to her on this remarkable accomplishment. I have always believed that there is immense talent around us. The Government of Andhra Pradesh is committed to identifying and encouraging such talented athletes - Pawan Kalyan #AgeNoBarrier #GoliShyamala

50,399 次观看

Videos

APDeputyCMO's profile picture

#PawanKalyanTransformsAP #Chapter2 మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో Nani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.

Deputy CMO, Andhra Pradesh

197,442 次观看 • 4 个月前

APDeputyCMO's profile picture

జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు వేగం పుంజుకున్నాయి. పల్నాడు–ప్రకాశం, ఉభయ గోదావరి, చిత్తూర్ జిల్లాల్లో కీలకమైన ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి దిశానిర్దేశంతో, నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనుల వేగంతో పాటు నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం

Deputy CMO, Andhra Pradesh

35,219 次观看 • 24 天前

APDeputyCMO's profile picture

రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి • సీమ ప్రజల కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక విజన్ • రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు • రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు • 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి • జల సంరక్షణ చర్యలతో సీమ సస్యశ్యామలం • ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు... 28 వేల మంది రైతులకు లబ్ధి • నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి • 50 వేలకు పైగా ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం • పాడి రైతుకు అండగా గోకులాలు, నీటి తొట్టెల నిర్మాణం • సీమ దాహార్తి తీర్చేందుకు సిద్ధమవుతున్న జేజేఎం-అమరజీవి జలధారలు • 13 నగర వనాలతో పట్టణాల్లో పచ్చదనం పెంపు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి ప్రత్యేక చొరవతో, రాయలసీమలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, అటవీ మరియు పర్యావరణ రంగాల్లో గత రెండేళ్లలో రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు, 28 వేల మందికి పైగా రైతులకు లబ్ధి, 41,614 ఫారం పాండ్లు, 15,000 మినీ గోకులాలు నిర్మించడం జరిగింది. గ్రామీణ మౌలిక వసతుల్లో రూ.4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు చేపట్టగా, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామీణ అనుసంధానం మరింత బలోపేతమవుతోంది. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద రూ.2,782 కోట్లతో పులివెందుల, డోన్, చిత్తూరు మెగా వాటర్ స్కీమ్‌ల పనులు పురోగతిలో ఉన్నాయి. నీటి సంరక్షణతో పాటు ఇంకుడు గుంతలు, కంపోస్ట్ గుంతలు వంటి పారిశుధ్య చర్యలు కూడా చేపట్టడం జరుగుతోంది. అటవీ రంగంలో 13 నగర వనాలు, ముసలమడుగులో కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రం, ఎకో టూరిజం, వుడ్ బ్యాంకుల వంటి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. కుంకీ ఏనుగుల చర్యలతో మానవ–ఏనుగు ఘర్షణలు 75 శాతం, పంట నష్టం 50 శాతం తగ్గడం గమనార్హం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి నిరంతర సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది.

Deputy CMO, Andhra Pradesh

14,029 次观看 • 10 天前

APDeputyCMO's profile picture

డొక్కా సీతమ్మ గారి పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించాను. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి మార్గదర్శకత్వంలో విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ Lokesh Nara గారు తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయి. కడపలో ‘స్మార్ట్ కిచెన్’ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా|| శ్రీధర్ చెరుకూరి గారికి అభినందనలు. - Pawan Kalyan PMO India Ministry of Education CMO Andhra Pradesh District Collector, YSR Kadapa District PIB India I & PR Andhra Pradesh PIB in Andhra Pradesh

Deputy CMO, Andhra Pradesh

306,623 次观看 • 1 年前

APDeputyCMO's profile picture

ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు •ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు •24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు •టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు •48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు •లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా అభివృద్ధి పనులు “ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి దృఢ సంకల్పం. పిఠాపురం నియోజకవర్గ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, ఆ వైభవాన్ని భవిష్యత్ తరాలకు మరింత ఘనంగా అందించాలనే ఆయన కార్యాచరణ ఇప్పుడు క్షేత్రస్థాయిలో రూపుదాలుస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకొని, నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి , భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 30.66 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు ప్రస్తుతం నియోజకవర్గవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి. • భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయాల ఆధునీకరణ నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.17.06 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతులతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరింది. కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, రామకృష్ణాపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి రూ.5 కోట్లు, శ్రీ పాద శ్రీవల్లభ దేవస్థానానికి రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. పునరుద్ధరణ జరుగుతున్న ఆలయాల్లో శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన 10వ శతాబ్దం నాటి శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంతోపాటు, పిఠాపురం మహారాజుల కాలం నాటి అనేక పురాతన దేవాలయాలు ఈ ప్రాజెక్టు ద్వారా సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు ఏటా సుమారు 13.76 లక్షల నుంచి 18.07 లక్షల మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆయా పర్వదినాల్లో రోజుకు 20 వేల నుంచి ఏకంగా 50 వేల మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. • అత్యాధునిక వసతులతో టీటీడీ కల్యాణ మండపం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో గతంలో పాడా ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని అన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు. అలాగే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ మాడ వీధుల విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం యు.కొత్తపల్లి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర సామాజిక అవసరాలకు అనువుగా అత్యాధునిక వసతులతో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. • భజన మందిరాలతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ కాకినాడ జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో 419 భజన మందిరాలను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి రూ.11.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ భజన మందిరాలు కేవలం భక్తి కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. భజనలు, ఆధ్యాత్మిక సమావేశాలు, స్థానిక సాంస్కృతిక వేడుకలు, గ్రామస్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా రూ.30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతోపాటు ఆలయాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రామీణ సామాజిక వేదికల బలోపేతానికి దోహదపడనున్నాయి. #Pithapuram

Deputy CMO, Andhra Pradesh

17,012 次观看 • 15 天前