
ASHOK VEMULAPALLI
@ashuvemulapalli • 8,708 subscribers
EDITOR IN CHIEF, BIGTV (Two times national telivision(NT) awardee (BEST news Reporter)// delhi telugu academy awarded…tweets are truly personnel
Shorts
Videos

“పుష్ప బ్రిడ్జ్” ఎంత అందంగా ఉందో ఈ బ్రిడ్జ్ .. చుట్టూ పచ్చదనం .. కాసేపైనా అక్కడ కూర్చుని రావాలని అనిపిస్తుంది ఇది మోతుగూడెం బ్రిడ్జ్ ఫోర్బే డ్యామ్ బ్రిడ్జ్ .. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం వద్ద ఉన్న మోతుగూడెం అనే గ్రామంలో ఫోర్బే డ్యామ్ వద్ద ఉంది. దీన్ని 'పుష్పా బ్రిడ్జ్ అని కుడా అంటారు.. ఎందుకంటే అల్లు అర్జున్ మూవీ 'పుష్ప లోని కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్, లారీ సీన్లు, మరియు పోలీసులు తనిఖీ చేసే వంతెన సీన్లుఈ మోతుగూడెం లోని ఫోర్బే డ్యామ్ మరియు దాని వంతెన పరిసరాల్లో షూట్ చేసారు సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రాంతం బాగా పాపులర్ అయింది పర్యాటకులు, సినిమా అభిమానులు ఈ వంతెనను చూడటానికి రావడం ప్రారంభించడంతో, స్థానికంగా దీనిని "పుష్ప బ్రిడ్జ్" అని పిలవడం మొదలుపెట్టారు.
ASHOK VEMULAPALLI43,542 просмотров • 12 дней назад

కూతురు -పరువు -హత్య అత్యంత బాధాకర ఘటన ఇది పరువు కోసం కన్నకూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు గుండెనొప్పితో చనిపోయిందని సీన్ క్రియేట్ చేసి అంత్యక్రియలు కూడా చేసేసిన పేరెంట్స్ వేరే పెళ్లి చేసుకున్న కూతుర్ని హైదరాబాఫ్ నుంచి శ్రీకాకుళంజిల్లా టెక్కలి పిలిపించి మరీ చంపిన అమ్మానాన్న ముందుగానే ప్రమాదం ఊహించి వీడియో రికార్డ్ చేసి శక్తియాప్ ద్వారా పోలీసులకి పంపిన బాధితురాలు దురదృష్టం ఆమె చనిపోయాక ఆ వీడియోని పోలీసులు గుర్తించారు శ్రీకాకుళం జిల్లా సొర్లి గ్రామానికి చెందిన గ్రూప్-1 అభ్యర్థి దుంపల హరిణి (24) హత్య కేసు సంచలనం రేపుతోంది.భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్న హరిణిని ఆమె తల్లి, భర్త, తాత కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముందుగానే ప్రమాదాన్ని ఊహించిన హరిణి రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఆమె స్నేహితుడు 'శక్తి యాప్' ద్వారా పోలీసులకు పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టెక్కలి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్లేముందు రికార్డ్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా బాధతో కళ్లు చెమ్మగిల్లుతాయి . మానవ సంబంధాలు చివరికి ఏ దారికి వెళ్తున్నాయి అర్ధం కావడం లేదు 🤦🤦🤦🤦
ASHOK VEMULAPALLI131,897 просмотров • 1 месяц назад

పుచ్చిపోయిన యాపిల్స్ -అరిచే కుక్కలు .. అంట..ok .. అర్థమైంది 🤦🤦🤦
ASHOK VEMULAPALLI138,500 просмотров • 1 месяц назад

హైదరాబాద్ లో సరైన అనుమతుల్లేకుండా .. కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొంటే చివరికి ఇలా నరకం అనుభవించాల్సి వస్తుంది .. నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికి అమీన్ పూర్ లో నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం ఇలా వరదనీటిలో నిండిపోయింది .. సెల్లార్ లో ఉన్న పదికార్లు బైక్ లు అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి .. ఆఖరికి లిఫ్ట్ అంతా నీళ్ళల్లోనే ఉంది .. ఈ అపార్ట్మెంట్ కి కేవలం పంచాయతీ పర్మిషన్ తీసుకుని కట్టేసి అమ్మేసారు .. కాస్త తక్కువ ధరకు ఫ్లాట్ వస్తోంది కదా అనే ఆశతో మధ్యతరగతి ప్రజలు కొని ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు చివరికి హైడ్రా వచ్చి నీళ్లన్నీ తోడాల్సి వస్తుంది . ఈ వర్షానికే ఇలా అయింది ఈ వర్షాకాలం ఇలా వర్షాలు కురుస్తూనే ఉంటాయి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ? అందుకే ఫ్లాట్ కొనుక్కునేవాళ్లకు ఆలోచించండి .. తక్కువ ధరకు వస్తోంది కదా అని ఇలా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొనకండి .. మీరు ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోయినా బిల్డర్ పట్టించుకోదు ..
ASHOK VEMULAPALLI65,321 просмотров • 1 месяц назад

అభిమానం తెచ్చే కష్టాలు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటనలో దృశ్యం ఇది.. జనాలు ఎంతమంది వచ్చారు.. అనేది నాకు అనవసరం.. అభిమానం ఎంతైనా ఉండొచ్చు గానీ ఇలా అభిమానించే నాయకుడి ప్రాణాలకు ఇబ్బంది కలిగేంతగా ఆ అభిమానం ఉండకూడదు..ఈ రకంగా అంతమంది మీదపడిపోతే ఎవరికైనా దారుణమైన ఇబ్బంది కలుగుతుంది..ఊపిరాడని పరిస్థితి ఉంటుంది..అసలు ఆ జనాల మధ్యలో జగన్ ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు..అలాంటి సిచ్యువేషన్ లో స్టేజ్ మీదికి వెళ్లిన ఆయన అక్కడా తోపులాటలో కిందపడిపోబోయారు... వైఎస్ జగన్ ను అభిమానించే జనం ఇంతమంది వస్తారనే అంచనా ఇంటెలిజెన్స్ కు కచ్చితంగా ఉంటుంది..ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి కదా..ఈ రకంగా జనం విరుచుకుపడితే ఆ మాబ్ లో ఏదైనా జరగొచ్చు.. అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు?? మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఉన్నపుడు పోలీస్ సిబ్బందిని అదనంగా నియమించి జనాన్ని కంట్రోల్ చేయాలి కదా.. పైగా ఆ మాబ్ లో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.. తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉంది.. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి విషయాలు ఆలోచించండి..ఎవరు అధికారంలో ఉన్నా సరే.. ప్రత్యర్థి పార్టీల నాయకులు పర్యటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..ఏదైనా జరిగితే అది మళ్లీ ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.. అక్కడ మాజీ సీఎం జగన్ కావొచ్చు..లేదా సీఎం చంద్రబాబు,డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఇలా ఎవరైనా ఉండొచ్చు..అత్యధిక ప్రజాధరణ కలిగిన నాయకులు ఇలా పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చినపుడు వారి భద్రత కచ్చితంగా ప్రభుత్వానిదే.. ఇలా జనాల మధ్యలో ఇష్టమొచ్చినట్టు మీద పడి..చేతులు లాగితే ఏకంగా డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు ఏకంగా భుజాల దగ్గర టియర్స్ కారణంగా ముంబైలో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.. నేను జగన్ గారి మీద అభిమానంతో ఈ పోస్ట్ పెట్టడం లేదు.. నాకు ఫలానా రాజకీయనాయకుడి మీద అభిమానమో,..వ్యతిరేకతో ఏదీ ఉండదు..నా అభిప్రాయం మాత్రమే పోస్ట్ చేస్తున్నాను...అశోక్ వేములపల్లి
ASHOK VEMULAPALLI31,187 просмотров • 18 дней назад

ఆస్కార్ నటి ప్రియా గోయల్ కాబోయే భార్య చేతిలో హత్యకు గురైన బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ కేసులో స్టోరీ తెలిసి ఇప్పుడు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు .. ప్రియుడు కోసం కాబోయే భర్తను హత్య చేయించిన ప్రియాగోయల్ ను కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయా గోయల్ తో ఎంగేజ్మెంట్ అయ్యాక ఆమెను ఎంతగానో ప్రేమించాడు .. అప్పటి వారిద్దరి వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి .. ఆమె బర్త్ డే న ఇచ్చిన గిఫ్ట్ సహా ఆమెపై అతనికి ఉన్న ప్రేమని గుర్తు చేస్తున్నాయి .. అయ్యో ఇంతలా ప్రేమించినవాడిని ఎలా చంపాలనిపించింది అని జనాలు బాధపడుతున్నారు .. పెళ్లి కోసం 17 కోట్లతో రాజస్థాన్ లో ప్యాలెస్ బుక్ చేసారు .. అయితే ఎప్పుడు తనకు కేతన్ తనకు ఇష్టం లేదనే విషయం చెప్పలేదు .. అలా చెప్పి ఉంటే ఇవాళ కేతన్ ప్రాణాలతో హ్యాపీగా ఉండేవాడేమో .. తనకు అతనంటే చాలా ఇష్టం అని చెప్పింది .. అంతేకాదు అతనితో కలిసి ఉన్న వీడియోల్లో సైతం అతనంటే ఎంతగానో ప్రేమ ఉన్నట్టు నటించింది ఎవరికీ అనుమానం రాకుండా .. తన మీద ఆమె చూపిస్తున్న ప్రేమకి కేతన్ కరిగిపోయాడు ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక తన ప్రియుడు చేతన్ చౌదరిని రంగంలోకి దింపింది . తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ను లోహగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి, వెనుక నుంచి 400 అడుగుల లోతైన లోయలోకి తోసి చంపేసింది . కేతన్కు, సియా గోయల్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో జరగనున్న పెళ్లి కోసం రాజస్థాన్లోని ఒక లగ్జరీ ప్యాలెస్ను రూ.17 కోట్లకు బుక్ చేసి, అతిథుల కోసం రెండు చార్టర్డ్ విమానాలను కూడా సిద్ధం చేశారు. కాగా, జూన్ 18న సియా పుట్టినరోజు కావడంతో ఆమె కేతన్ను లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్కు తీసుకెళ్లింది. అయితే అక్కడ కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా బలమైన గాలులకు పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులు తొలుత ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. కేతన్ మంచి ట్రెక్కర్ కావడంతో అంత సులభంగా కాలుజారి పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ కేతన్ సోదరి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె తడబడుతూ సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. దర్యాప్తులో సియాకు పుణెలోని కొంధ్వాకు చెందిన చేతన్ బాబూలాల్ చౌదరి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. గత ఆరు నెలల్లో వీరిద్దరూ 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా హత్య జరిగిన జూన్ 18న చేతన్ తన మొబైల్ డేటాను పూర్తిగా ఆఫ్ చేసి, తన ఫోన్ను సొంత షాపులోనే వదిలేశాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన షాప్ ఉద్యోగి ఫోన్ తీసుకుని రహస్యంగా లోహగఢ్ కోటకు చేరుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో, చేతన్తో కలిసి కేతన్ను వదిలించుకోవాలని పథకం వేసింది. జూన్ 14నే అతడిని కొండపై నుంచి నెట్టేయాలని ప్రయత్నించినా అది కుదరలేదు. దీంతో మళ్లీ జూన్ 18న బర్త్డే నెపంతో కొండపైకి తీసుకెళ్లి, వెనుక నుంచి లోయలోకి నెట్టేసి హత్య చేసినట్లు వెల్లడైంది. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు సియా ఇన్స్టాగ్రామ్లో కేతన్తో ఉన్న పాత వీడియోలను షేర్ చేస్తూ: “నా పుట్టినరోజే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, తిరిగి వచ్చేయ్” ఈ మహానటి యాక్టింగ్ కి ఆస్కార్ కూడా తక్కువే అంటున్నారు .. ఇప్పుడు ఆనే జైల్లో ఉంది .. ఆమె తల్లిదండ్రులు పరువు పోయి ఏడుస్తున్నారు .. ఆమె ప్రియుడు జీవితం నాశనమైంది . కేతన్ తల్లిదండ్రులు కొడుకుని తల్చుకుని కుమిలిపోతున్నారు .. ప్రియాగోయల్ కి వచ్చిన ఆ దుష్ట ఆలోచన ఇంతమంది జీవితాలతో ఆడుకుంది .. రెండు కుటుంబాల వాళ్ళు కోటీశ్వరులే .. పెద్ద వ్యాపారవేత్తలే .. కానీ ఏమీ ప్రయోజనం లేదు .. అంతా అయిపోయింది … అశోక్ వేములపల్లి
ASHOK VEMULAPALLI60,806 просмотров • 1 месяц назад

బెజవాడలో బాగా బలిసిన బడాబాబుల కొడుకులు ఇలా రోడ్డు మీద థార్ కార్లతో గుద్దుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు .. ఒకరి కార్ ని మరొకరు రాడ్లతో అద్దాలు పగుల గొట్టుకుంటూ రౌడీయిజం చేసారు .. లింగమనేని రోహిత్ , బొల్లా ఓమ్ అనే ఈ ఇద్దరు తిన్నది అరగక ఇలా కొట్టుకున్నారు .. ఒక అమ్మాయి విషయం లో చెలరేగిన గొడవ ఇది .. ఆ అమ్మాయి కూడా ఒకరి కారులో ఉంది .. పోలీసులు ఈ బ్యాచ్ ని అదుపులోకి తీసుకున్నారు .. ఇలాంటి విషయాల్లో వీళ్ళ బెండు తీయాలి .. కాసేపటికి ఎలాగూ వీళ్ళ డాడీస్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయిపోతారు .. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు ఈ ఎంపీ తెలుసు ఆ మంత్రి తెలుసు అంటూ నానా హడావిడి చేసి లాబీయింగ్ చేసి మొత్తం మీద వీరిని బయటకు తీసుకెళ్లిపోతారు .. మళ్లీ యధావిధిగా కొత్త థార్ కార్లు కొనిచ్చి రోడ్డుమీదికెళ్లి గుద్దుకోమని ఆంబోతుల్ని వదిలినట్టు వదులుతారు ..
ASHOK VEMULAPALLI101,546 просмотров • 2 месяцев назад

రంకులు.. బొంకులు తప్ప ప్రజల సమస్యలపై టీవీ ఛానల్స్ పోరాడుతున్నాయా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది కచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ? కానీ ఇవే రంకు-బొంకు మాత్రమే చూపిస్తున్న విషయం మీరు పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత మాత్రమే గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది ..
ASHOK VEMULAPALLI93,031 просмотров • 2 месяцев назад

వీడిని పోలీసులు కొడుతుంటే అయ్యో పావం అనిపించింది .. అతను తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్షించాలి గానీ.. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి ? అని ప్రశ్నించాలనిపించింది .. కానీ వాడు ఏమి చేశాడో తెలిసాక .. నేనే వెళ్లి వాడిని కొట్టాలనిపించింది .. రైతులు పశువుల కోసం దాచిన గడ్డి వాముల్ని తగులబెట్టిన నీచుడు వీడు .. పోలీసులు డ్రోన్ కెమెరాలతో చెక్ చేస్తుండగా అందులో గడ్డి వాములు తగులబెడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అనంతపురం జిల్లా: పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పు పెట్టిన నిందితుడు సుధాకర్ ని అరెస్ట్ చేసారు.. తనతో తో ఎవరైనా గొడవ పడితే వారికి చెందిన గడ్డివాములకు నిప్పు పెట్టేస్తాడు ఈ సైకో .. రైతులు ఇచ్చిన కంప్లయింట్ తో ఇతన్ని అరెస్ట్ చేసారు పోలీసులు ...
ASHOK VEMULAPALLI135,708 просмотров • 3 месяцев назад

Breaking విజయనగరం భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద వృద్ధ దంపతులని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపి భయపెట్టారు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూముల స్వాధీనానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకుండా భూముల స్వాధీనం చేయరాదంటూ అడ్డుకున్న రైతులు జేసీబీని అడ్డుకొని, జేసీబీ బకెట్ లో కూర్చున్న వృద్ధ దంపతులు అక్కడ సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ ఇలా వృద్ధ దంపతులని పైగా రైతుల్ని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపడం కచ్చితంగా తప్పు ..ఇలాంటి దృశ్యాలు ప్రజల్ని ఆగ్రహానికి , ఆవేదనకి గురి చేస్తాయి ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని నేను అనను .. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారులు దగ్గర ఉండి చేయించిన ఈ నిర్వాకం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది .. ఇలాంటి అంశాల్ని లేవనెత్తిన మాలాంటి వాళ్ళని తిట్టిపోయకుండా ఇలా ఇంకోసారి జరగకుండా చూడండి .. ఆ రైతులకి న్యాయం చేయండి ప్లీజ్ 🙏🙏🙏 Lokesh Nara
ASHOK VEMULAPALLI97,366 просмотров • 2 месяцев назад

నన్ను కూడా ఎక్కువ సినిమాల్లో పెట్టుకోండి అని ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ గారు స్టేజ్ మీద అంటుంటే ఎందుకో తెలీని బాధగా అనిపించింది .. 2008 లో ఆయన ఫ్యామిలీపై దాడి జరిగినపుడు నేను ఈటేవి రిపోర్టర్ గా ఆయన ఇంటిదగ్గర కవరేజ్ లో ఉంటే ఆయనే స్వయంగా నన్ను కెమెరమ్యాన్ ని వారి ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టారు ..
ASHOK VEMULAPALLI138,962 просмотров • 4 месяцев назад

దర్బార్ మూవీ రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్భార్ అనే సినిమా చాలా బావుంటుంది .. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు మైనర్ అమ్మాయిని రేప్ చేస్తాడు . ఆ కేసులో ఈ పోలీస్ ఆఫీసర్ కష్టపడి రేపిస్ట్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతాడు .. తీరా జైల్లో ఆ నిందితుడు స్థానంలో వేరే వ్యక్తి జైల్లో ఉంటాడు .. ఒకరోజు వెరిఫికేషన్ కు వచ్చిన ఆఫీసర్ నిందితుడి స్థానంలో మరో వ్యక్తి ఉండటం చూసి షాక్ అవుతాడు .. నిందితుడి తండ్రి జైలు సిబ్బంది మొత్తాన్ని కొనేస్తాడు .. అందుకే తనకొడుకు స్థానంలో డబ్బులిచ్చి వేరొక వ్యక్తిని జైల్లో ఉంచుతారు .. proxy … ఈ సినిమా చూసేవాళ్ళకి ఒక డౌట్ వస్తుంది .. తప్పు ఒకరు చేసి తమ స్థానంలో వేరొకరిని జైల్లోకి పంపించవచ్చా ? ఎందుకంటే జైలు లోపలికి వెళ్లి అసలైన నిందితుడు బ్యారక్ లో ఉన్నాడో లేదో ఎవరూ చెక్ చేయలేరు కదా .. ఈ లెక్కన ఇప్పటివరకు ఎంతమంది బడాబాబులు , కార్పొరేట్లు , పొలిటీషియన్స్ తప్పు చేసిన తమ కొడుకుల స్థానంలో వేరొకరిని జైల్లో పెట్టించారో అనిపిస్తుంది .. ACCORDING TO SOURCES .. ….అశోక్ వేములపల్లి
ASHOK VEMULAPALLI83,066 просмотров • 2 месяцев назад

వీడు ఈ భూమికి భారమైన నీచుడు .. పేరు వడ్డే నాగరాజు.. మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఒక మహిళా బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి వచ్చి ఆమె డ్రెస్ ను పైకి ఎత్తి అత్యంత నీచంగా ప్రవర్తించాడు .. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు .. ఇలాంటి మానసిక రోగులు ఉంటే ఎప్పటికైనా సొసైటీకి ప్రమాదమే .. ఇలా ఎంత మంది మహిళలను వేధించాడో తెలీదు .. ఈ ఘటనలో సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు .. కానీ ఇలాంటివి బయటకు చెప్పుకోలేక ఎంతమంది మహిళలు ఇబ్బందిపడ్డారో అర్ధం ఆలోచించండి .. ఇలాంటివాడిని జైల్లో పెట్టి పోషించకుండా కాలో చేయో తీసేయండి .. అప్పుడు బుద్ది వస్తుంది .. సొసైటీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది
ASHOK VEMULAPALLI74,347 просмотров • 2 месяцев назад

రక్తం తాగే పిశాచులు వీల్ చైర్ కోసం సెల్ఫోన్ తాకట్టు! అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన వీల్చైర్ ఇవ్వడానికి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, సెల్ఫోన్ కుదవ పెట్టుకున్నారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది ..దీనిపై బాధితులు ఆస్పత్రి తనిఖీలకు వచ్చిన డీఎంఈ విష్ణువర్ధన్కు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ తాకట్టు పెట్టుకుని ఇచ్చిన వీల్ చెయిర్ కి కింద కాలు పెట్టే సపోర్ట్ స్టెప్ కూడా లేదు .. ఆ వీల్ చైర్ అధ్వాన్న స్థితిలో ఉంది .. గవర్నమెంట్ హాస్పిటల్ లోనింటటి దారుణ పరిస్థితులా ? అసలు ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫేనా ? లేక రక్తం తాగే పిశాచులా ? ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ అదే అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు .. ఇది మీ దృష్టికి వచ్చిందా ? Satya Kumar Yadav గారు ? అలాగే నిధులు ఇచ్చే ఫైనాన్స్ శాఖామంత్రి కూడా అదే జిల్లాకు చెందినవారు .. ఇది మీ దృష్టికి వచ్చిందా ? Payyavula Keshav గారు ? Lokesh Nara గారు .. ఇది మీరు కూడా పరిశీలించండి ప్లీజ్ .. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేద ప్రజల్ని పీక్కు తింటున్న ఇలాంటివారిని ఏరిపారేయండి ..
ASHOK VEMULAPALLI32,984 просмотров • 1 месяц назад

పులుసు మరిగిపోతోందిరా .. కోటయ్యా .. అంటూ సిల్క్ స్మిత బాధ -కోపం -ఆవేదన -సిగ్గు తో చెప్పే ఈ డైలాగ్ సీతాకోకచిలుక సినిమాకి హైలెట్ .. తప్పు చేసిన భర్త నిర్వాకం పనివాడికి తెలియకూడదని ఆమె పదే తాపత్రయం , రహస్యాన్ని దాటాలనే ప్రయత్నం అన్నీ ఆ మాటల్లో కనిపిస్తాయి .. తీరా తప్పు చేసిన భర్త కళ్ళముందే దొరికిపోవడంతో పనివాడు రాళ్ళపల్లి చూసిన చూపుకి సిగ్గుతో చచ్చిపోతూ అతన్ని క్షమించమని ప్రాధేయపడుతున్నట్టుగా , నా భర్తను కాపాడేందుకు నేను కూడా తప్పు చేసాను అనే భావన , భర్తవైపు రౌద్రంతో చూసే చూపు .. అన్నీ ఏకకాలంలో సిల్క్ స్మిత ముఖంలో మనం చూస్తాము ..ఆమె బాధతో ఏడుస్తూ నేలమీద కూర్చుంటే ..శరత్ బాబు తప్పుచేసినట్టు భార్యకు ముఖం చూపించలేని స్థితిలో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్లడం , అదే సమయంలో కుమిలిపోతూ తన గుడిసెలో భార్యని చూడడానికి వెళ్తున్న కోటయ్య ఇవన్నీ లాంగ్ ఫ్రేమ్ లో చూపిస్తారు భారతీరాజా ..దీనికి కరెక్ట్ గా సింక్ అయ్యే మ్యూజిక్ తోడై భావోద్వేగాలను రగిలించే ఈ సీన్ ఆ దర్శక ప్రతిభకు నిదర్శనం .. అలాంటి గ్రేట్ డైరెక్టర్ ఇవాళ శాశ్వతంగా ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు 🙏🙏🙏🙏
ASHOK VEMULAPALLI51,575 просмотров • 1 месяц назад
3:10
Sensitive content
This media may contain sensitive content.