
ASHOK VEMULAPALLI
@ashuvemulapalli • 9,525 subscribers
JOURNALIST (Two times national telivision(NT) awardee (BEST news Reporter)// delhi telugu academy awarded…tweets are truly personnel
Shorts
Videos

లడఖ్ కొండల్లో అమరావతి స్వరం హిమాలయాల మంచు తెరల నుంచి కృష్ణా తీరం వరకు:..ఒక ఆశల రాజధాని ‘అమరావతి’ సరిహద్దుల్లో ఎత్తైన కొండలు, శ్వేత వర్ణపు మంచు పర్వతాలు, దేశానికి ఉత్తర కొసన ఉండే లడఖ్ ప్రాంతం. అక్కడ జీవనం సాగే చల్లని లోయల్లో ఓ తెలుగోడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా స్థానిక పిల్లలు పలకరించారు. "ఎక్కడి నుంచి వచ్చారు?" అన్న అమాయకమైన ప్రశ్నకు "ఆంధ్రప్రదేశ్" అన్న సమాధానం రాగానే, ఏమాత్రం తడుముకోకుండా ఆ చిన్నారుల పెదవుల నుంచి వెలువడిన ఒకే ఒక్క పదం — "అమరావతి!" ఆ పలకరింపు కేవలం ఒక సాధారణ సమాధానం మాత్రమే కాదు; భౌగోళిక సరిహద్దులు, భాషా భేదాలను దాటి దేశపు నలుమూలలకూ చేరిన ఒక నవ నగరం పేరు. ఆశల రూపం.. ప్రజా సంకల్పం ఒక రాష్ట్రానికి రాజధాని అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక భవనాలు మాత్రమే కాదు. అది కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు, వారి భవిష్యత్ తరాల కలలకు ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ క్రమంలో అమరావతిని ఎంచుకున్నది కేవలం నేల కోసం కాదు; శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, బౌద్ధ నాగరికత వెల్లివిరిసిన పవిత్ర కృష్ణా తీరపు వారసత్వానికి ప్రాణం పోసేందుకు. వేలాది మంది రైతులు తమ సారవంతమైన భూములను నవ సమాజ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా సమర్పించిన విధానం భారతదేశ చరిత్రలోనే అపూర్వమైన ప్రజా భాగస్వామ్య గాథగా నిలిచింది. ఆటుపోట్లను అధిగమిస్తూ.. అలుపెరుగని ప్రయాణం ఏ మహత్తర నగర నిర్మాణమూ పూలబాటపై సాగదు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలైనా, చారిత్రక రాజధానులైనా ఎన్నో సవాళ్లు, ఆటంకాలు, ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచినవే. అమరావతి ప్రయాణం కూడా కాల పరీక్షకు నిలబడింది. అనిశ్చితులు చుట్టుముట్టినా, ప్రకృతి సహకరించకపోయినా, నిర్మాణ పనుల్లో వేగం మారినా... ఆ నేలపై ఆధారపడిన ప్రజల నమ్మకం మాత్రం చెక్కుచెదరలేదు. ఆశావహ దృక్పథం, దృఢ సంకల్పం ఉంటే ఎంతటి సంక్షోభాల నుంచైనా మళ్ళీ లేచి నిలబడొచ్చని అమరావతి నిరూపిస్తోంది. దేశానికి చివర వినిపించిన గుర్తింపు లడఖ్లోని చిన్నారి నోట ‘అమరావతి’ ధ్వనించడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. భారతీయ చిత్రపటంలో అమరావతి ఒక రాజధానిగా తన ముద్రను ఇప్పటికే వేసింది. పాఠ్యపుస్తకాల్లోనో, వార్తల్లోనో విని ఆ పసిమనసులు గుర్తుపెట్టుకున్నారంటే, ఆ పేరు దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. శిలాఫలకాలు, గగనతల భవనాలు సమయంతో పాటు వాటంతట అవే రూపుదిద్దుకుంటాయి. కానీ ఒక నగరం ప్రజల హృదయాల్లో, దేశపు భావనలో సజీవంగా ఉన్నంత కాలం దాని అభివృద్ధిని ఏదీ ఆపలేదు. చరిత్రను పుణికిపుచ్చుకుని, రేపటి తరం ఆధునికతను ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్న అమరావతి... తెలుగుజాతి ఆత్మగౌరవానికి, సమష్టి సంకల్పానికి శాశ్వత ప్రతీక. అమరావతి .. అజరామరం ..అశోక్ వేములపల్లి
ASHOK VEMULAPALLI69,852 次观看 • 7 天前

నా రిజైన్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మీద క్లారిటీ ఇది .. నా రిజైన్ అనేది వ్యక్తిగతం తప్ప ఇందులో ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ లేదు .. కాకపోతే డీఎస్సీ వ్యవహారం జరుగుతున్నపుడు రిజైన్ చేయడం వల్ల దానికి ముడిపెడుతున్నారు కానీ నేను ఈనెల 1 వ తేదీనే రిజైన్ చేశాను .. దయచేసి అర్ధం చేసుకోండి 🙏🙏🙏
ASHOK VEMULAPALLI97,872 次观看 • 11 天前

22 A ఇష్యూ వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద నష్టమే జరిగింది .. కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అంశం BRS పార్టీకి కచ్చితంగా ప్లస్ అయింది ..దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్న విషయం కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు , సలహాదారులు ఎందుకు అప్రమత్తం కాలేకపోతున్నారు ? అతిపెద్ద ప్రజాసమస్యని పరిష్కరించడంలో ఎందుకు వెనుకబడ్డారు ?
ASHOK VEMULAPALLI37,114 次观看 • 7 天前

కూతురు -పరువు -హత్య అత్యంత బాధాకర ఘటన ఇది పరువు కోసం కన్నకూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు గుండెనొప్పితో చనిపోయిందని సీన్ క్రియేట్ చేసి అంత్యక్రియలు కూడా చేసేసిన పేరెంట్స్ వేరే పెళ్లి చేసుకున్న కూతుర్ని హైదరాబాఫ్ నుంచి శ్రీకాకుళంజిల్లా టెక్కలి పిలిపించి మరీ చంపిన అమ్మానాన్న ముందుగానే ప్రమాదం ఊహించి వీడియో రికార్డ్ చేసి శక్తియాప్ ద్వారా పోలీసులకి పంపిన బాధితురాలు దురదృష్టం ఆమె చనిపోయాక ఆ వీడియోని పోలీసులు గుర్తించారు శ్రీకాకుళం జిల్లా సొర్లి గ్రామానికి చెందిన గ్రూప్-1 అభ్యర్థి దుంపల హరిణి (24) హత్య కేసు సంచలనం రేపుతోంది.భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్న హరిణిని ఆమె తల్లి, భర్త, తాత కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముందుగానే ప్రమాదాన్ని ఊహించిన హరిణి రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఆమె స్నేహితుడు 'శక్తి యాప్' ద్వారా పోలీసులకు పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టెక్కలి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్లేముందు రికార్డ్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా బాధతో కళ్లు చెమ్మగిల్లుతాయి . మానవ సంబంధాలు చివరికి ఏ దారికి వెళ్తున్నాయి అర్ధం కావడం లేదు 🤦🤦🤦🤦
ASHOK VEMULAPALLI131,897 次观看 • 3 个月前

Prof Dasoju Sravan Kumar దాసోజు శ్రవణ్ గారు .. నేను 22A వల్ల నేను కొనాలనుకున్న సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఆగిపోయిన మాట వాస్తవం . అలాగే నేను 40 లక్షల రూపాయలు యజమాని తరఫు అడ్వకేట్ కి చెల్లించింది వాస్తవం .. అలాగే .. మూడు నెలల నుంచి అటు రిజిస్ట్రేషన్ కాక ఇటు డబ్బులు వెనక్కి రాక మానసికంగా ఇబ్బంది పడుతుంది కూడా నిజమే .. కానీ మీరు చెప్పినట్టుగా నేను హరీష్ రావు గారిని కలవలేదు ..నేను ఎలాంటి లెటర్ ఇవ్వలేదు .. మీరు చేతిలో చూపించిన లెటర్ ఏంటో నాకు తెలీదు .. మీరు అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు .. దయచేసి వివాదంలోకి నన్ను లాగొద్దని విజ్ఞప్తి .. నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా 22A మీద ఒక బాధ అనుభవించిన వ్యక్తిగా ఆర్టికల్ రాసాను .. వార్తలు రాయడం నా డ్యూటీ .. 22 ఏళ్లుగా వార్తలు రాస్తూనే ఉన్నాను .. వార్తలు చెబుతూనే ఉన్నాను .. అందులో భాగంగానే ఈ ఆర్టికల్ రాసాను .. కానీ నేను Harish Rao Thanneeru హరీష్ రావు గారిని ఎప్పడు కలవలేదు .. ఆయనకు దగ్గరకు వచ్చి లెటర్ ఇవ్వడం అనేది వాస్తవం కాదు .. వీలైతే నేను ఇచ్చానని చెబుతున్న ఆ లెటర్ ని దయచేసి పబ్లిక్ గా పోస్ట్ చేయండి .. ఎందుకంటే ఇది అసలు నా సమస్య పక్కదారి పట్టి .. ఇది రాజకీయ వివాదం అవుతుంది .. సమాజంలోకి మెసేజ్ రాంగ్ గా ప్రాజక్ట్ అవుతుంది ..
ASHOK VEMULAPALLI37,660 次观看 • 1 个月前

వీడిని పోలీసులు కొడుతుంటే అయ్యో పావం అనిపించింది .. అతను తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్షించాలి గానీ.. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి ? అని ప్రశ్నించాలనిపించింది .. కానీ వాడు ఏమి చేశాడో తెలిసాక .. నేనే వెళ్లి వాడిని కొట్టాలనిపించింది .. రైతులు పశువుల కోసం దాచిన గడ్డి వాముల్ని తగులబెట్టిన నీచుడు వీడు .. పోలీసులు డ్రోన్ కెమెరాలతో చెక్ చేస్తుండగా అందులో గడ్డి వాములు తగులబెడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అనంతపురం జిల్లా: పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పు పెట్టిన నిందితుడు సుధాకర్ ని అరెస్ట్ చేసారు.. తనతో తో ఎవరైనా గొడవ పడితే వారికి చెందిన గడ్డివాములకు నిప్పు పెట్టేస్తాడు ఈ సైకో .. రైతులు ఇచ్చిన కంప్లయింట్ తో ఇతన్ని అరెస్ట్ చేసారు పోలీసులు ...
ASHOK VEMULAPALLI135,786 次观看 • 5 个月前

బెజవాడలో బాగా బలిసిన బడాబాబుల కొడుకులు ఇలా రోడ్డు మీద థార్ కార్లతో గుద్దుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు .. ఒకరి కార్ ని మరొకరు రాడ్లతో అద్దాలు పగుల గొట్టుకుంటూ రౌడీయిజం చేసారు .. లింగమనేని రోహిత్ , బొల్లా ఓమ్ అనే ఈ ఇద్దరు తిన్నది అరగక ఇలా కొట్టుకున్నారు .. ఒక అమ్మాయి విషయం లో చెలరేగిన గొడవ ఇది .. ఆ అమ్మాయి కూడా ఒకరి కారులో ఉంది .. పోలీసులు ఈ బ్యాచ్ ని అదుపులోకి తీసుకున్నారు .. ఇలాంటి విషయాల్లో వీళ్ళ బెండు తీయాలి .. కాసేపటికి ఎలాగూ వీళ్ళ డాడీస్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయిపోతారు .. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు ఈ ఎంపీ తెలుసు ఆ మంత్రి తెలుసు అంటూ నానా హడావిడి చేసి లాబీయింగ్ చేసి మొత్తం మీద వీరిని బయటకు తీసుకెళ్లిపోతారు .. మళ్లీ యధావిధిగా కొత్త థార్ కార్లు కొనిచ్చి రోడ్డుమీదికెళ్లి గుద్దుకోమని ఆంబోతుల్ని వదిలినట్టు వదులుతారు ..
ASHOK VEMULAPALLI102,036 次观看 • 4 个月前

నన్ను కూడా ఎక్కువ సినిమాల్లో పెట్టుకోండి అని ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ గారు స్టేజ్ మీద అంటుంటే ఎందుకో తెలీని బాధగా అనిపించింది .. 2008 లో ఆయన ఫ్యామిలీపై దాడి జరిగినపుడు నేను ఈటేవి రిపోర్టర్ గా ఆయన ఇంటిదగ్గర కవరేజ్ లో ఉంటే ఆయనే స్వయంగా నన్ను కెమెరమ్యాన్ ని వారి ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టారు ..
ASHOK VEMULAPALLI138,962 次观看 • 5 个月前

రంకులు.. బొంకులు తప్ప ప్రజల సమస్యలపై టీవీ ఛానల్స్ పోరాడుతున్నాయా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది కచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ? కానీ ఇవే రంకు-బొంకు మాత్రమే చూపిస్తున్న విషయం మీరు పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత మాత్రమే గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది ..
ASHOK VEMULAPALLI93,031 次观看 • 3 个月前

Breaking విజయనగరం భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద వృద్ధ దంపతులని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపి భయపెట్టారు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూముల స్వాధీనానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకుండా భూముల స్వాధీనం చేయరాదంటూ అడ్డుకున్న రైతులు జేసీబీని అడ్డుకొని, జేసీబీ బకెట్ లో కూర్చున్న వృద్ధ దంపతులు అక్కడ సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ ఇలా వృద్ధ దంపతులని పైగా రైతుల్ని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపడం కచ్చితంగా తప్పు ..ఇలాంటి దృశ్యాలు ప్రజల్ని ఆగ్రహానికి , ఆవేదనకి గురి చేస్తాయి ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని నేను అనను .. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారులు దగ్గర ఉండి చేయించిన ఈ నిర్వాకం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది .. ఇలాంటి అంశాల్ని లేవనెత్తిన మాలాంటి వాళ్ళని తిట్టిపోయకుండా ఇలా ఇంకోసారి జరగకుండా చూడండి .. ఆ రైతులకి న్యాయం చేయండి ప్లీజ్ 🙏🙏🙏 Lokesh Nara
ASHOK VEMULAPALLI97,409 次观看 • 4 个月前

హైదరాబాద్ లో సరైన అనుమతుల్లేకుండా .. కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొంటే చివరికి ఇలా నరకం అనుభవించాల్సి వస్తుంది .. నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికి అమీన్ పూర్ లో నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం ఇలా వరదనీటిలో నిండిపోయింది .. సెల్లార్ లో ఉన్న పదికార్లు బైక్ లు అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి .. ఆఖరికి లిఫ్ట్ అంతా నీళ్ళల్లోనే ఉంది .. ఈ అపార్ట్మెంట్ కి కేవలం పంచాయతీ పర్మిషన్ తీసుకుని కట్టేసి అమ్మేసారు .. కాస్త తక్కువ ధరకు ఫ్లాట్ వస్తోంది కదా అనే ఆశతో మధ్యతరగతి ప్రజలు కొని ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు చివరికి హైడ్రా వచ్చి నీళ్లన్నీ తోడాల్సి వస్తుంది . ఈ వర్షానికే ఇలా అయింది ఈ వర్షాకాలం ఇలా వర్షాలు కురుస్తూనే ఉంటాయి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ? అందుకే ఫ్లాట్ కొనుక్కునేవాళ్లకు ఆలోచించండి .. తక్కువ ధరకు వస్తోంది కదా అని ఇలా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొనకండి .. మీరు ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోయినా బిల్డర్ పట్టించుకోదు ..
ASHOK VEMULAPALLI65,345 次观看 • 2 个月前