ASHOK VEMULAPALLI's banner
ASHOK VEMULAPALLI's profile picture

ASHOK VEMULAPALLI

@ashuvemulapalli8,708 subscribers

EDITOR IN CHIEF, BIGTV (Two times national telivision(NT) awardee (BEST news Reporter)// delhi telugu academy awarded…tweets are truly personnel

Shorts

పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ ఎందుకంటే ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో భుజానికి శాస్త్ర చికిత్స ఎందుకు చేశారంటే .. రెండు భుజాలకూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలు, Muscle టీర్, కుడి భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ (Avulsion Fracture) ఉండటం వల్ల ఆయనకు ఈ శస్త్రచికిత్స అవసరమైంది. దీనికి ప్రధాన కారణం .. ప్రజా యాత్రల్లో ఒత్తిడి: 2018 నాటి 'పోరాట యాత్ర', ఆ తర్వాత 'వారాహి యాత్ర' మరియు 2024 ఎన్నికల ప్రచార సమయాల్లో అభిమానులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి మరియు అభివాదం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. ఆ ఉత్సాహంలో ఆయన చేతులను పట్టి బలంగా లాగడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇలా చేతులు పట్టుకుని పదేపదే లాగేయడం వల్ల మజిల్ టియర్స్ వచ్చేశాయని గతంలో ఆయనే స్వయంగా చెప్పారు .. దీనికి తోడు పాత గాయం తీవ్రమయింది ..పవన్ కళ్యాణ్‌కు మొదట 2016లోనే భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో వైద్యులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆయన తన రాజకీయ, ప్రజా కార్యక్రమాల్లో నిరంతరాయంగా పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు ముక్కుకు సంబంధించిన (సైనస్) శస్త్రచికిత్స జరిగినప్పుడు నిర్వహించిన ముందస్తు వైద్య పరీక్షల్లో భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ అవసరమని సూచించినప్పటికీ, ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. రెండు భుజాలకూ ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి, కదలికలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో వైద్యులు ముందుగా కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. రెండు నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. మనకే కాదు .. సెలబ్రిటీలకు కష్టాలు ఉంటాయి .. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ అభిమానంతో చేసిన గాయం …

పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ ఎందుకంటే ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో భుజానికి శాస్త్ర చికిత్స ఎందుకు చేశారంటే .. రెండు భుజాలకూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలు, Muscle టీర్, కుడి భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ (Avulsion Fracture) ఉండటం వల్ల ఆయనకు ఈ శస్త్రచికిత్స అవసరమైంది. దీనికి ప్రధాన కారణం .. ప్రజా యాత్రల్లో ఒత్తిడి: 2018 నాటి 'పోరాట యాత్ర', ఆ తర్వాత 'వారాహి యాత్ర' మరియు 2024 ఎన్నికల ప్రచార సమయాల్లో అభిమానులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి మరియు అభివాదం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. ఆ ఉత్సాహంలో ఆయన చేతులను పట్టి బలంగా లాగడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇలా చేతులు పట్టుకుని పదేపదే లాగేయడం వల్ల మజిల్ టియర్స్ వచ్చేశాయని గతంలో ఆయనే స్వయంగా చెప్పారు .. దీనికి తోడు పాత గాయం తీవ్రమయింది ..పవన్ కళ్యాణ్‌కు మొదట 2016లోనే భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో వైద్యులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆయన తన రాజకీయ, ప్రజా కార్యక్రమాల్లో నిరంతరాయంగా పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు ముక్కుకు సంబంధించిన (సైనస్) శస్త్రచికిత్స జరిగినప్పుడు నిర్వహించిన ముందస్తు వైద్య పరీక్షల్లో భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ అవసరమని సూచించినప్పటికీ, ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. రెండు భుజాలకూ ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి, కదలికలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో వైద్యులు ముందుగా కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. రెండు నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. మనకే కాదు .. సెలబ్రిటీలకు కష్టాలు ఉంటాయి .. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ అభిమానంతో చేసిన గాయం …

144,577 次观看

భారీ వర్షాల తో భారతదేశంలోని ముంబై సమీపంలోని వసాయ్‌లోని మధుబన్ ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. వర్షాలతో మునిగిన ముంబయిని చూస్తే హైదరాబాద్ లక్ష రేట్లు బెటర్ అనిపిస్తుంది .. ఇక్కడా వరద నీరు నిలిచిపోతుంది కాని మరీ ఈ స్థాయిలో అయితే ఉండదు

భారీ వర్షాల తో భారతదేశంలోని ముంబై సమీపంలోని వసాయ్‌లోని మధుబన్ ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. వర్షాలతో మునిగిన ముంబయిని చూస్తే హైదరాబాద్ లక్ష రేట్లు బెటర్ అనిపిస్తుంది .. ఇక్కడా వరద నీరు నిలిచిపోతుంది కాని మరీ ఈ స్థాయిలో అయితే ఉండదు

137,563 次观看

బూతు పాటల్ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరిస్తున్న చంద్రహాస్ అనబడే జూనియర్ యాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను .. కేసు నమోదు అయింది

బూతు పాటల్ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరిస్తున్న చంద్రహాస్ అనబడే జూనియర్ యాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను .. కేసు నమోదు అయింది

212,318 次观看

ఒక శాటిలైట్ ఛానెల్ వారు.. వాళ్ల యూట్యూబ్ ఛానెల్లో పెట్టిన థంబ్ నెయిల్ ఇది .. ఇందులో వల్గారిటీ స్పష్టంగా జనానికి అర్థమైపోతోంది .. ఇప్పటికే తెలుగు మీడియా జనాల్లో పలచన అయిపోయింది .. విలువ, గౌరవం లేకుండా మనమే చేసుకున్నాం .. ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ జనాల ఆలోచన తప్పని మనం ఇలాంటి థంబ్ నెయిల్స్ తో ప్రూవ్ చేసుకుంటున్నాం .. ఒక జర్నలిస్ట్ గా .. ఇది చూడగానే కరెక్ట్ కాదనిపించింది .. ఇందులో తప్పేముంది అని అడ్డంగా వాదించవచ్చు … కానీ ఈ థంబ్ నెయిల్ ఇంటెన్షన్ జనానికి చాలా క్లారిటీగా తెలిసిపోతోంది .. నేను ఒక న్యూస్ ఛానెల్లోనే పని చేస్తున్నాను .. మా దగ్గర కూడా కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ విషయంలో కచ్చితంగా ఇలాంటి పొరబాట్లు చేస్తే నేనే సరిదిద్దాను కూడా .. ఇది వేరే ఛానెల్ ఇష్యూ అయినప్పటికీ ఎందుకో మనసొప్పక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.. ప్రజల్లో మన గౌరవం కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మీడియాలు సెల్ఫ్ కంట్రోల్ కావాలి .. మన ఎడిటింగ్ సరిగా లేకపోతే జనాలు మనల్ని ఎడిట్ చేస్తారు .. ఎరేజ్ కూడా చేస్తారు అనేది నా ఉద్దేశం 🙏🙏అక్కడ అభిమాని అన్నదే కదా .. మేము పోస్ట్ చేసాము .. ఇందులో నీకు తప్పేం కనిపించింది అని కూడా నన్ను అడగొచ్చు .. అంతా మీ ఇష్టం .. సరిదిద్దుతారని ఆశతో … 🙏🙏🙏

ఒక శాటిలైట్ ఛానెల్ వారు.. వాళ్ల యూట్యూబ్ ఛానెల్లో పెట్టిన థంబ్ నెయిల్ ఇది .. ఇందులో వల్గారిటీ స్పష్టంగా జనానికి అర్థమైపోతోంది .. ఇప్పటికే తెలుగు మీడియా జనాల్లో పలచన అయిపోయింది .. విలువ, గౌరవం లేకుండా మనమే చేసుకున్నాం .. ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ జనాల ఆలోచన తప్పని మనం ఇలాంటి థంబ్ నెయిల్స్ తో ప్రూవ్ చేసుకుంటున్నాం .. ఒక జర్నలిస్ట్ గా .. ఇది చూడగానే కరెక్ట్ కాదనిపించింది .. ఇందులో తప్పేముంది అని అడ్డంగా వాదించవచ్చు … కానీ ఈ థంబ్ నెయిల్ ఇంటెన్షన్ జనానికి చాలా క్లారిటీగా తెలిసిపోతోంది .. నేను ఒక న్యూస్ ఛానెల్లోనే పని చేస్తున్నాను .. మా దగ్గర కూడా కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ విషయంలో కచ్చితంగా ఇలాంటి పొరబాట్లు చేస్తే నేనే సరిదిద్దాను కూడా .. ఇది వేరే ఛానెల్ ఇష్యూ అయినప్పటికీ ఎందుకో మనసొప్పక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.. ప్రజల్లో మన గౌరవం కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మీడియాలు సెల్ఫ్ కంట్రోల్ కావాలి .. మన ఎడిటింగ్ సరిగా లేకపోతే జనాలు మనల్ని ఎడిట్ చేస్తారు .. ఎరేజ్ కూడా చేస్తారు అనేది నా ఉద్దేశం 🙏🙏అక్కడ అభిమాని అన్నదే కదా .. మేము పోస్ట్ చేసాము .. ఇందులో నీకు తప్పేం కనిపించింది అని కూడా నన్ను అడగొచ్చు .. అంతా మీ ఇష్టం .. సరిదిద్దుతారని ఆశతో … 🙏🙏🙏

131,932 次观看

ఈ వీడియో ఎంత బావుందో.. ఆ బుజ్జిగాడి క్యూట్ నెస్ అదుర్స్ అన్నమాట 😀😀😀😀

ఈ వీడియో ఎంత బావుందో.. ఆ బుజ్జిగాడి క్యూట్ నెస్ అదుర్స్ అన్నమాట 😀😀😀😀

30,560 次观看

ఈ దృశ్యం చూడగానే .. ఎప్పుడూ రాయిలాగా ఉండే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి .. జీవితం కొందరి పట్ల ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనిపిస్తుంది 😢😢😢

ఈ దృశ్యం చూడగానే .. ఎప్పుడూ రాయిలాగా ఉండే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి .. జీవితం కొందరి పట్ల ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనిపిస్తుంది 😢😢😢

25,356 次观看

Videos

ashuvemulapalli's profile picture

“పుష్ప బ్రిడ్జ్” ఎంత అందంగా ఉందో ఈ బ్రిడ్జ్ .. చుట్టూ పచ్చదనం .. కాసేపైనా అక్కడ కూర్చుని రావాలని అనిపిస్తుంది ఇది మోతుగూడెం బ్రిడ్జ్ ఫోర్‌బే డ్యామ్ బ్రిడ్జ్ .. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం వద్ద ఉన్న మోతుగూడెం అనే గ్రామంలో ఫోర్‌బే డ్యామ్ వద్ద ఉంది. దీన్ని 'పుష్పా బ్రిడ్జ్ అని కుడా అంటారు.. ఎందుకంటే అల్లు అర్జున్ మూవీ 'పుష్ప లోని కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్, లారీ సీన్లు, మరియు పోలీసులు తనిఖీ చేసే వంతెన సీన్లుఈ మోతుగూడెం లోని ఫోర్‌బే డ్యామ్ మరియు దాని వంతెన పరిసరాల్లో షూట్ చేసారు సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రాంతం బాగా పాపులర్ అయింది పర్యాటకులు, సినిమా అభిమానులు ఈ వంతెనను చూడటానికి రావడం ప్రారంభించడంతో, స్థానికంగా దీనిని "పుష్ప బ్రిడ్జ్" అని పిలవడం మొదలుపెట్టారు.

ASHOK VEMULAPALLI

43,542 次观看 • 12 天前

ashuvemulapalli's profile picture

కూతురు -పరువు -హత్య అత్యంత బాధాకర ఘటన ఇది పరువు కోసం కన్నకూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు గుండెనొప్పితో చనిపోయిందని సీన్ క్రియేట్ చేసి అంత్యక్రియలు కూడా చేసేసిన పేరెంట్స్ వేరే పెళ్లి చేసుకున్న కూతుర్ని హైదరాబాఫ్ నుంచి శ్రీకాకుళంజిల్లా టెక్కలి పిలిపించి మరీ చంపిన అమ్మానాన్న ముందుగానే ప్రమాదం ఊహించి వీడియో రికార్డ్ చేసి శక్తియాప్ ద్వారా పోలీసులకి పంపిన బాధితురాలు దురదృష్టం ఆమె చనిపోయాక ఆ వీడియోని పోలీసులు గుర్తించారు శ్రీకాకుళం జిల్లా సొర్లి గ్రామానికి చెందిన గ్రూప్-1 అభ్యర్థి దుంపల హరిణి (24) హత్య కేసు సంచలనం రేపుతోంది.భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్న హరిణిని ఆమె తల్లి, భర్త, తాత కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముందుగానే ప్రమాదాన్ని ఊహించిన హరిణి రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఆమె స్నేహితుడు 'శక్తి యాప్' ద్వారా పోలీసులకు పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టెక్కలి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్లేముందు రికార్డ్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా బాధతో కళ్లు చెమ్మగిల్లుతాయి . మానవ సంబంధాలు చివరికి ఏ దారికి వెళ్తున్నాయి అర్ధం కావడం లేదు 🤦🤦🤦🤦

ASHOK VEMULAPALLI

131,897 次观看 • 1 个月前

ashuvemulapalli's profile picture

హైదరాబాద్ లో సరైన అనుమతుల్లేకుండా .. కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొంటే చివరికి ఇలా నరకం అనుభవించాల్సి వస్తుంది .. నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికి అమీన్ పూర్ లో నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం ఇలా వరదనీటిలో నిండిపోయింది .. సెల్లార్ లో ఉన్న పదికార్లు బైక్ లు అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి .. ఆఖరికి లిఫ్ట్ అంతా నీళ్ళల్లోనే ఉంది .. ఈ అపార్ట్మెంట్ కి కేవలం పంచాయతీ పర్మిషన్ తీసుకుని కట్టేసి అమ్మేసారు .. కాస్త తక్కువ ధరకు ఫ్లాట్ వస్తోంది కదా అనే ఆశతో మధ్యతరగతి ప్రజలు కొని ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు చివరికి హైడ్రా వచ్చి నీళ్లన్నీ తోడాల్సి వస్తుంది . ఈ వర్షానికే ఇలా అయింది ఈ వర్షాకాలం ఇలా వర్షాలు కురుస్తూనే ఉంటాయి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ? అందుకే ఫ్లాట్ కొనుక్కునేవాళ్లకు ఆలోచించండి .. తక్కువ ధరకు వస్తోంది కదా అని ఇలా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొనకండి .. మీరు ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోయినా బిల్డర్ పట్టించుకోదు ..

ASHOK VEMULAPALLI

65,321 次观看 • 1 个月前

ashuvemulapalli's profile picture

అభిమానం తెచ్చే కష్టాలు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటనలో దృశ్యం ఇది.. జనాలు ఎంతమంది వచ్చారు.. అనేది నాకు అనవసరం.. అభిమానం ఎంతైనా ఉండొచ్చు గానీ ఇలా అభిమానించే నాయకుడి ప్రాణాలకు ఇబ్బంది కలిగేంతగా ఆ అభిమానం ఉండకూడదు..ఈ రకంగా అంతమంది మీదపడిపోతే ఎవరికైనా దారుణమైన ఇబ్బంది కలుగుతుంది..ఊపిరాడని పరిస్థితి ఉంటుంది..అసలు ఆ జనాల మధ్యలో జగన్ ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు..అలాంటి సిచ్యువేషన్ లో స్టేజ్ మీదికి వెళ్లిన ఆయన అక్కడా తోపులాటలో కిందపడిపోబోయారు... వైఎస్ జగన్ ను అభిమానించే జనం ఇంతమంది వస్తారనే అంచనా ఇంటెలిజెన్స్ కు కచ్చితంగా ఉంటుంది..ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి కదా..ఈ రకంగా జనం విరుచుకుపడితే ఆ మాబ్ లో ఏదైనా జరగొచ్చు.. అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు?? మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఉన్నపుడు పోలీస్ సిబ్బందిని అదనంగా నియమించి జనాన్ని కంట్రోల్ చేయాలి కదా.. పైగా ఆ మాబ్ లో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.. తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉంది.. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి విషయాలు ఆలోచించండి..ఎవరు అధికారంలో ఉన్నా సరే.. ప్రత్యర్థి పార్టీల నాయకులు పర్యటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..ఏదైనా జరిగితే అది మళ్లీ ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.. అక్కడ మాజీ సీఎం జగన్ కావొచ్చు..లేదా సీఎం చంద్రబాబు,డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఇలా ఎవరైనా ఉండొచ్చు..అత్యధిక ప్రజాధరణ కలిగిన నాయకులు ఇలా పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చినపుడు వారి భద్రత కచ్చితంగా ప్రభుత్వానిదే.. ఇలా జనాల మధ్యలో ఇష్టమొచ్చినట్టు మీద పడి..చేతులు లాగితే ఏకంగా డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు ఏకంగా భుజాల దగ్గర టియర్స్ కారణంగా ముంబైలో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.. నేను జగన్ గారి మీద అభిమానంతో ఈ పోస్ట్ పెట్టడం లేదు.. నాకు ఫలానా రాజకీయనాయకుడి మీద అభిమానమో,..వ్యతిరేకతో ఏదీ ఉండదు..నా అభిప్రాయం మాత్రమే పోస్ట్ చేస్తున్నాను...అశోక్ వేములపల్లి

ASHOK VEMULAPALLI

31,187 次观看 • 18 天前

ashuvemulapalli's profile picture

ఆస్కార్ నటి ప్రియా గోయల్ కాబోయే భార్య చేతిలో హత్యకు గురైన బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ కేసులో స్టోరీ తెలిసి ఇప్పుడు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు .. ప్రియుడు కోసం కాబోయే భర్తను హత్య చేయించిన ప్రియాగోయల్ ను కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయా గోయల్ తో ఎంగేజ్మెంట్ అయ్యాక ఆమెను ఎంతగానో ప్రేమించాడు .. అప్పటి వారిద్దరి వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి .. ఆమె బర్త్ డే న ఇచ్చిన గిఫ్ట్ సహా ఆమెపై అతనికి ఉన్న ప్రేమని గుర్తు చేస్తున్నాయి .. అయ్యో ఇంతలా ప్రేమించినవాడిని ఎలా చంపాలనిపించింది అని జనాలు బాధపడుతున్నారు .. పెళ్లి కోసం 17 కోట్లతో రాజస్థాన్ లో ప్యాలెస్ బుక్ చేసారు .. అయితే ఎప్పుడు తనకు కేతన్ తనకు ఇష్టం లేదనే విషయం చెప్పలేదు .. అలా చెప్పి ఉంటే ఇవాళ కేతన్ ప్రాణాలతో హ్యాపీగా ఉండేవాడేమో .. తనకు అతనంటే చాలా ఇష్టం అని చెప్పింది .. అంతేకాదు అతనితో కలిసి ఉన్న వీడియోల్లో సైతం అతనంటే ఎంతగానో ప్రేమ ఉన్నట్టు నటించింది ఎవరికీ అనుమానం రాకుండా .. తన మీద ఆమె చూపిస్తున్న ప్రేమకి కేతన్ కరిగిపోయాడు ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక తన ప్రియుడు చేతన్ చౌదరిని రంగంలోకి దింపింది . తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను లోహగఢ్‌ కోట వద్దకు తీసుకెళ్లి, వెనుక నుంచి 400 అడుగుల లోతైన లోయలోకి తోసి చంపేసింది . కేతన్‌కు, సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో జరగనున్న పెళ్లి కోసం రాజస్థాన్‌లోని ఒక లగ్జరీ ప్యాలెస్‌ను రూ.17 కోట్లకు బుక్‌ చేసి, అతిథుల కోసం రెండు చార్టర్డ్‌ విమానాలను కూడా సిద్ధం చేశారు. కాగా, జూన్‌ 18న సియా పుట్టినరోజు కావడంతో ఆమె కేతన్‌ను లోహగఢ్‌ కోటకు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లింది. అయితే అక్కడ కేతన్‌ తనను ఫొటోలు తీస్తుండగా బలమైన గాలులకు పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులు తొలుత ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. కేతన్‌ మంచి ట్రెక్కర్‌ కావడంతో అంత సులభంగా కాలుజారి పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కేతన్‌ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ కేతన్‌ సోదరి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె తడబడుతూ సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. దర్యాప్తులో సియాకు పుణెలోని కొంధ్వాకు చెందిన చేతన్‌ బాబూలాల్‌ చౌదరి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. గత ఆరు నెలల్లో వీరిద్దరూ 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా హత్య జరిగిన జూన్‌ 18న చేతన్‌ తన మొబైల్ డేటాను పూర్తిగా ఆఫ్‌ చేసి, తన ఫోన్‌ను సొంత షాపులోనే వదిలేశాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన షాప్ ఉద్యోగి ఫోన్ తీసుకుని రహస్యంగా లోహగఢ్‌ కోటకు చేరుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో, చేతన్‌తో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని పథకం వేసింది. జూన్‌ 14నే అతడిని కొండపై నుంచి నెట్టేయాలని ప్రయత్నించినా అది కుదరలేదు. దీంతో మళ్లీ జూన్‌ 18న బర్త్‌డే నెపంతో కొండపైకి తీసుకెళ్లి, వెనుక నుంచి లోయలోకి నెట్టేసి హత్య చేసినట్లు వెల్లడైంది. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు సియా ఇన్‌స్టాగ్రామ్‌లో కేతన్‌తో ఉన్న పాత వీడియోలను షేర్‌ చేస్తూ: “నా పుట్టినరోజే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, తిరిగి వచ్చేయ్‌” ఈ మహానటి యాక్టింగ్ కి ఆస్కార్ కూడా తక్కువే అంటున్నారు .. ఇప్పుడు ఆనే జైల్లో ఉంది .. ఆమె తల్లిదండ్రులు పరువు పోయి ఏడుస్తున్నారు .. ఆమె ప్రియుడు జీవితం నాశనమైంది . కేతన్ తల్లిదండ్రులు కొడుకుని తల్చుకుని కుమిలిపోతున్నారు .. ప్రియాగోయల్ కి వచ్చిన ఆ దుష్ట ఆలోచన ఇంతమంది జీవితాలతో ఆడుకుంది .. రెండు కుటుంబాల వాళ్ళు కోటీశ్వరులే .. పెద్ద వ్యాపారవేత్తలే .. కానీ ఏమీ ప్రయోజనం లేదు .. అంతా అయిపోయింది … అశోక్ వేములపల్లి

ASHOK VEMULAPALLI

60,806 次观看 • 1 个月前

ashuvemulapalli's profile picture

బెజవాడలో బాగా బలిసిన బడాబాబుల కొడుకులు ఇలా రోడ్డు మీద థార్ కార్లతో గుద్దుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు .. ఒకరి కార్ ని మరొకరు రాడ్లతో అద్దాలు పగుల గొట్టుకుంటూ రౌడీయిజం చేసారు .. లింగమనేని రోహిత్ , బొల్లా ఓమ్ అనే ఈ ఇద్దరు తిన్నది అరగక ఇలా కొట్టుకున్నారు .. ఒక అమ్మాయి విషయం లో చెలరేగిన గొడవ ఇది .. ఆ అమ్మాయి కూడా ఒకరి కారులో ఉంది .. పోలీసులు ఈ బ్యాచ్ ని అదుపులోకి తీసుకున్నారు .. ఇలాంటి విషయాల్లో వీళ్ళ బెండు తీయాలి .. కాసేపటికి ఎలాగూ వీళ్ళ డాడీస్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయిపోతారు .. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు ఈ ఎంపీ తెలుసు ఆ మంత్రి తెలుసు అంటూ నానా హడావిడి చేసి లాబీయింగ్ చేసి మొత్తం మీద వీరిని బయటకు తీసుకెళ్లిపోతారు .. మళ్లీ యధావిధిగా కొత్త థార్ కార్లు కొనిచ్చి రోడ్డుమీదికెళ్లి గుద్దుకోమని ఆంబోతుల్ని వదిలినట్టు వదులుతారు ..

ASHOK VEMULAPALLI

101,499 次观看 • 2 个月前

ashuvemulapalli's profile picture

వీడిని పోలీసులు కొడుతుంటే అయ్యో పావం అనిపించింది .. అతను తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్షించాలి గానీ.. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి ? అని ప్రశ్నించాలనిపించింది .. కానీ వాడు ఏమి చేశాడో తెలిసాక .. నేనే వెళ్లి వాడిని కొట్టాలనిపించింది .. రైతులు పశువుల కోసం దాచిన గడ్డి వాముల్ని తగులబెట్టిన నీచుడు వీడు .. పోలీసులు డ్రోన్ కెమెరాలతో చెక్ చేస్తుండగా అందులో గడ్డి వాములు తగులబెడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అనంతపురం జిల్లా: పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పు పెట్టిన నిందితుడు సుధాకర్ ని అరెస్ట్ చేసారు.. తనతో తో ఎవరైనా గొడవ పడితే వారికి చెందిన గడ్డివాములకు నిప్పు పెట్టేస్తాడు ఈ సైకో .. రైతులు ఇచ్చిన కంప్లయింట్ తో ఇతన్ని అరెస్ట్ చేసారు పోలీసులు ...

ASHOK VEMULAPALLI

135,708 次观看 • 3 个月前

ashuvemulapalli's profile picture

Breaking విజయనగరం భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద వృద్ధ దంపతులని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపి భయపెట్టారు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూముల స్వాధీనానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకుండా భూముల స్వాధీనం చేయరాదంటూ అడ్డుకున్న రైతులు జేసీబీని అడ్డుకొని, జేసీబీ బకెట్ లో కూర్చున్న వృద్ధ దంపతులు అక్కడ సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ ఇలా వృద్ధ దంపతులని పైగా రైతుల్ని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపడం కచ్చితంగా తప్పు ..ఇలాంటి దృశ్యాలు ప్రజల్ని ఆగ్రహానికి , ఆవేదనకి గురి చేస్తాయి ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని నేను అనను .. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారులు దగ్గర ఉండి చేయించిన ఈ నిర్వాకం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది .. ఇలాంటి అంశాల్ని లేవనెత్తిన మాలాంటి వాళ్ళని తిట్టిపోయకుండా ఇలా ఇంకోసారి జరగకుండా చూడండి .. ఆ రైతులకి న్యాయం చేయండి ప్లీజ్ 🙏🙏🙏 Lokesh Nara

ASHOK VEMULAPALLI

97,366 次观看 • 2 个月前

ashuvemulapalli's profile picture

దర్బార్ మూవీ రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్భార్ అనే సినిమా చాలా బావుంటుంది .. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు మైనర్ అమ్మాయిని రేప్ చేస్తాడు . ఆ కేసులో ఈ పోలీస్ ఆఫీసర్ కష్టపడి రేపిస్ట్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతాడు .. తీరా జైల్లో ఆ నిందితుడు స్థానంలో వేరే వ్యక్తి జైల్లో ఉంటాడు .. ఒకరోజు వెరిఫికేషన్ కు వచ్చిన ఆఫీసర్ నిందితుడి స్థానంలో మరో వ్యక్తి ఉండటం చూసి షాక్ అవుతాడు .. నిందితుడి తండ్రి జైలు సిబ్బంది మొత్తాన్ని కొనేస్తాడు .. అందుకే తనకొడుకు స్థానంలో డబ్బులిచ్చి వేరొక వ్యక్తిని జైల్లో ఉంచుతారు .. proxy … ఈ సినిమా చూసేవాళ్ళకి ఒక డౌట్ వస్తుంది .. తప్పు ఒకరు చేసి తమ స్థానంలో వేరొకరిని జైల్లోకి పంపించవచ్చా ? ఎందుకంటే జైలు లోపలికి వెళ్లి అసలైన నిందితుడు బ్యారక్ లో ఉన్నాడో లేదో ఎవరూ చెక్ చేయలేరు కదా .. ఈ లెక్కన ఇప్పటివరకు ఎంతమంది బడాబాబులు , కార్పొరేట్లు , పొలిటీషియన్స్ తప్పు చేసిన తమ కొడుకుల స్థానంలో వేరొకరిని జైల్లో పెట్టించారో అనిపిస్తుంది .. ACCORDING TO SOURCES .. ….అశోక్ వేములపల్లి

ASHOK VEMULAPALLI

83,066 次观看 • 2 个月前

ashuvemulapalli's profile picture

వీడు ఈ భూమికి భారమైన నీచుడు .. పేరు వడ్డే నాగరాజు.. మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఒక మహిళా బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి వచ్చి ఆమె డ్రెస్ ను పైకి ఎత్తి అత్యంత నీచంగా ప్రవర్తించాడు .. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు .. ఇలాంటి మానసిక రోగులు ఉంటే ఎప్పటికైనా సొసైటీకి ప్రమాదమే .. ఇలా ఎంత మంది మహిళలను వేధించాడో తెలీదు .. ఈ ఘటనలో సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు .. కానీ ఇలాంటివి బయటకు చెప్పుకోలేక ఎంతమంది మహిళలు ఇబ్బందిపడ్డారో అర్ధం ఆలోచించండి .. ఇలాంటివాడిని జైల్లో పెట్టి పోషించకుండా కాలో చేయో తీసేయండి .. అప్పుడు బుద్ది వస్తుంది .. సొసైటీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది

ASHOK VEMULAPALLI

74,347 次观看 • 2 个月前

ashuvemulapalli's profile picture

రక్తం తాగే పిశాచులు వీల్ చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు! అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన వీల్‌చైర్ ఇవ్వడానికి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, సెల్‌ఫోన్ కుదవ పెట్టుకున్నారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది ..దీనిపై బాధితులు ఆస్పత్రి తనిఖీలకు వచ్చిన డీఎంఈ విష్ణువర్ధన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ తాకట్టు పెట్టుకుని ఇచ్చిన వీల్ చెయిర్ కి కింద కాలు పెట్టే సపోర్ట్ స్టెప్ కూడా లేదు .. ఆ వీల్ చైర్ అధ్వాన్న స్థితిలో ఉంది .. గవర్నమెంట్ హాస్పిటల్ లోనింటటి దారుణ పరిస్థితులా ? అసలు ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫేనా ? లేక రక్తం తాగే పిశాచులా ? ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ అదే అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు .. ఇది మీ దృష్టికి వచ్చిందా ? Satya Kumar Yadav గారు ? అలాగే నిధులు ఇచ్చే ఫైనాన్స్ శాఖామంత్రి కూడా అదే జిల్లాకు చెందినవారు .. ఇది మీ దృష్టికి వచ్చిందా ? Payyavula Keshav గారు ? Lokesh Nara గారు .. ఇది మీరు కూడా పరిశీలించండి ప్లీజ్ .. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేద ప్రజల్ని పీక్కు తింటున్న ఇలాంటివారిని ఏరిపారేయండి ..

ASHOK VEMULAPALLI

32,984 次观看 • 1 个月前

ashuvemulapalli's profile picture

పులుసు మరిగిపోతోందిరా .. కోటయ్యా .. అంటూ సిల్క్ స్మిత బాధ -కోపం -ఆవేదన -సిగ్గు తో చెప్పే ఈ డైలాగ్ సీతాకోకచిలుక సినిమాకి హైలెట్ .. తప్పు చేసిన భర్త నిర్వాకం పనివాడికి తెలియకూడదని ఆమె పదే తాపత్రయం , రహస్యాన్ని దాటాలనే ప్రయత్నం అన్నీ ఆ మాటల్లో కనిపిస్తాయి .. తీరా తప్పు చేసిన భర్త కళ్ళముందే దొరికిపోవడంతో పనివాడు రాళ్ళపల్లి చూసిన చూపుకి సిగ్గుతో చచ్చిపోతూ అతన్ని క్షమించమని ప్రాధేయపడుతున్నట్టుగా , నా భర్తను కాపాడేందుకు నేను కూడా తప్పు చేసాను అనే భావన , భర్తవైపు రౌద్రంతో చూసే చూపు .. అన్నీ ఏకకాలంలో సిల్క్ స్మిత ముఖంలో మనం చూస్తాము ..ఆమె బాధతో ఏడుస్తూ నేలమీద కూర్చుంటే ..శరత్ బాబు తప్పుచేసినట్టు భార్యకు ముఖం చూపించలేని స్థితిలో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్లడం , అదే సమయంలో కుమిలిపోతూ తన గుడిసెలో భార్యని చూడడానికి వెళ్తున్న కోటయ్య ఇవన్నీ లాంగ్ ఫ్రేమ్ లో చూపిస్తారు భారతీరాజా ..దీనికి కరెక్ట్ గా సింక్ అయ్యే మ్యూజిక్ తోడై భావోద్వేగాలను రగిలించే ఈ సీన్ ఆ దర్శక ప్రతిభకు నిదర్శనం .. అలాంటి గ్రేట్ డైరెక్టర్ ఇవాళ శాశ్వతంగా ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు 🙏🙏🙏🙏

ASHOK VEMULAPALLI

51,575 次观看 • 1 个月前