ASHOK VEMULAPALLI's banner
ASHOK VEMULAPALLI's profile picture

ASHOK VEMULAPALLI

@ashuvemulapalli9,525 subscribers

JOURNALIST (Two times national telivision(NT) awardee (BEST news Reporter)// delhi telugu academy awarded…tweets are truly personnel

Shorts

పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ ఎందుకంటే ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో భుజానికి శాస్త్ర చికిత్స ఎందుకు చేశారంటే .. రెండు భుజాలకూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలు, Muscle టీర్, కుడి భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ (Avulsion Fracture) ఉండటం వల్ల ఆయనకు ఈ శస్త్రచికిత్స అవసరమైంది. దీనికి ప్రధాన కారణం .. ప్రజా యాత్రల్లో ఒత్తిడి: 2018 నాటి 'పోరాట యాత్ర', ఆ తర్వాత 'వారాహి యాత్ర' మరియు 2024 ఎన్నికల ప్రచార సమయాల్లో అభిమానులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి మరియు అభివాదం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. ఆ ఉత్సాహంలో ఆయన చేతులను పట్టి బలంగా లాగడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇలా చేతులు పట్టుకుని పదేపదే లాగేయడం వల్ల మజిల్ టియర్స్ వచ్చేశాయని గతంలో ఆయనే స్వయంగా చెప్పారు .. దీనికి తోడు పాత గాయం తీవ్రమయింది ..పవన్ కళ్యాణ్‌కు మొదట 2016లోనే భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో వైద్యులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆయన తన రాజకీయ, ప్రజా కార్యక్రమాల్లో నిరంతరాయంగా పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు ముక్కుకు సంబంధించిన (సైనస్) శస్త్రచికిత్స జరిగినప్పుడు నిర్వహించిన ముందస్తు వైద్య పరీక్షల్లో భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ అవసరమని సూచించినప్పటికీ, ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. రెండు భుజాలకూ ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి, కదలికలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో వైద్యులు ముందుగా కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. రెండు నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. మనకే కాదు .. సెలబ్రిటీలకు కష్టాలు ఉంటాయి .. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ అభిమానంతో చేసిన గాయం …

పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ ఎందుకంటే ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో భుజానికి శాస్త్ర చికిత్స ఎందుకు చేశారంటే .. రెండు భుజాలకూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలు, Muscle టీర్, కుడి భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ (Avulsion Fracture) ఉండటం వల్ల ఆయనకు ఈ శస్త్రచికిత్స అవసరమైంది. దీనికి ప్రధాన కారణం .. ప్రజా యాత్రల్లో ఒత్తిడి: 2018 నాటి 'పోరాట యాత్ర', ఆ తర్వాత 'వారాహి యాత్ర' మరియు 2024 ఎన్నికల ప్రచార సమయాల్లో అభిమానులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి మరియు అభివాదం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. ఆ ఉత్సాహంలో ఆయన చేతులను పట్టి బలంగా లాగడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇలా చేతులు పట్టుకుని పదేపదే లాగేయడం వల్ల మజిల్ టియర్స్ వచ్చేశాయని గతంలో ఆయనే స్వయంగా చెప్పారు .. దీనికి తోడు పాత గాయం తీవ్రమయింది ..పవన్ కళ్యాణ్‌కు మొదట 2016లోనే భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో వైద్యులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆయన తన రాజకీయ, ప్రజా కార్యక్రమాల్లో నిరంతరాయంగా పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు ముక్కుకు సంబంధించిన (సైనస్) శస్త్రచికిత్స జరిగినప్పుడు నిర్వహించిన ముందస్తు వైద్య పరీక్షల్లో భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ అవసరమని సూచించినప్పటికీ, ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. రెండు భుజాలకూ ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి, కదలికలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో వైద్యులు ముందుగా కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. రెండు నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. మనకే కాదు .. సెలబ్రిటీలకు కష్టాలు ఉంటాయి .. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ అభిమానంతో చేసిన గాయం …

144,577 次观看

భారీ వర్షాల తో భారతదేశంలోని ముంబై సమీపంలోని వసాయ్‌లోని మధుబన్ ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. వర్షాలతో మునిగిన ముంబయిని చూస్తే హైదరాబాద్ లక్ష రేట్లు బెటర్ అనిపిస్తుంది .. ఇక్కడా వరద నీరు నిలిచిపోతుంది కాని మరీ ఈ స్థాయిలో అయితే ఉండదు

భారీ వర్షాల తో భారతదేశంలోని ముంబై సమీపంలోని వసాయ్‌లోని మధుబన్ ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. వర్షాలతో మునిగిన ముంబయిని చూస్తే హైదరాబాద్ లక్ష రేట్లు బెటర్ అనిపిస్తుంది .. ఇక్కడా వరద నీరు నిలిచిపోతుంది కాని మరీ ఈ స్థాయిలో అయితే ఉండదు

137,563 次观看

బూతు పాటల్ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరిస్తున్న చంద్రహాస్ అనబడే జూనియర్ యాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను .. కేసు నమోదు అయింది

బూతు పాటల్ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరిస్తున్న చంద్రహాస్ అనబడే జూనియర్ యాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను .. కేసు నమోదు అయింది

212,354 次观看

ఒక శాటిలైట్ ఛానెల్ వారు.. వాళ్ల యూట్యూబ్ ఛానెల్లో పెట్టిన థంబ్ నెయిల్ ఇది .. ఇందులో వల్గారిటీ స్పష్టంగా జనానికి అర్థమైపోతోంది .. ఇప్పటికే తెలుగు మీడియా జనాల్లో పలచన అయిపోయింది .. విలువ, గౌరవం లేకుండా మనమే చేసుకున్నాం .. ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ జనాల ఆలోచన తప్పని మనం ఇలాంటి థంబ్ నెయిల్స్ తో ప్రూవ్ చేసుకుంటున్నాం .. ఒక జర్నలిస్ట్ గా .. ఇది చూడగానే కరెక్ట్ కాదనిపించింది .. ఇందులో తప్పేముంది అని అడ్డంగా వాదించవచ్చు … కానీ ఈ థంబ్ నెయిల్ ఇంటెన్షన్ జనానికి చాలా క్లారిటీగా తెలిసిపోతోంది .. నేను ఒక న్యూస్ ఛానెల్లోనే పని చేస్తున్నాను .. మా దగ్గర కూడా కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ విషయంలో కచ్చితంగా ఇలాంటి పొరబాట్లు చేస్తే నేనే సరిదిద్దాను కూడా .. ఇది వేరే ఛానెల్ ఇష్యూ అయినప్పటికీ ఎందుకో మనసొప్పక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.. ప్రజల్లో మన గౌరవం కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మీడియాలు సెల్ఫ్ కంట్రోల్ కావాలి .. మన ఎడిటింగ్ సరిగా లేకపోతే జనాలు మనల్ని ఎడిట్ చేస్తారు .. ఎరేజ్ కూడా చేస్తారు అనేది నా ఉద్దేశం 🙏🙏అక్కడ అభిమాని అన్నదే కదా .. మేము పోస్ట్ చేసాము .. ఇందులో నీకు తప్పేం కనిపించింది అని కూడా నన్ను అడగొచ్చు .. అంతా మీ ఇష్టం .. సరిదిద్దుతారని ఆశతో … 🙏🙏🙏

ఒక శాటిలైట్ ఛానెల్ వారు.. వాళ్ల యూట్యూబ్ ఛానెల్లో పెట్టిన థంబ్ నెయిల్ ఇది .. ఇందులో వల్గారిటీ స్పష్టంగా జనానికి అర్థమైపోతోంది .. ఇప్పటికే తెలుగు మీడియా జనాల్లో పలచన అయిపోయింది .. విలువ, గౌరవం లేకుండా మనమే చేసుకున్నాం .. ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ జనాల ఆలోచన తప్పని మనం ఇలాంటి థంబ్ నెయిల్స్ తో ప్రూవ్ చేసుకుంటున్నాం .. ఒక జర్నలిస్ట్ గా .. ఇది చూడగానే కరెక్ట్ కాదనిపించింది .. ఇందులో తప్పేముంది అని అడ్డంగా వాదించవచ్చు … కానీ ఈ థంబ్ నెయిల్ ఇంటెన్షన్ జనానికి చాలా క్లారిటీగా తెలిసిపోతోంది .. నేను ఒక న్యూస్ ఛానెల్లోనే పని చేస్తున్నాను .. మా దగ్గర కూడా కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ విషయంలో కచ్చితంగా ఇలాంటి పొరబాట్లు చేస్తే నేనే సరిదిద్దాను కూడా .. ఇది వేరే ఛానెల్ ఇష్యూ అయినప్పటికీ ఎందుకో మనసొప్పక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.. ప్రజల్లో మన గౌరవం కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మీడియాలు సెల్ఫ్ కంట్రోల్ కావాలి .. మన ఎడిటింగ్ సరిగా లేకపోతే జనాలు మనల్ని ఎడిట్ చేస్తారు .. ఎరేజ్ కూడా చేస్తారు అనేది నా ఉద్దేశం 🙏🙏అక్కడ అభిమాని అన్నదే కదా .. మేము పోస్ట్ చేసాము .. ఇందులో నీకు తప్పేం కనిపించింది అని కూడా నన్ను అడగొచ్చు .. అంతా మీ ఇష్టం .. సరిదిద్దుతారని ఆశతో … 🙏🙏🙏

131,932 次观看

ఈ వీడియో ఎంత బావుందో.. ఆ బుజ్జిగాడి క్యూట్ నెస్ అదుర్స్ అన్నమాట 😀😀😀😀

ఈ వీడియో ఎంత బావుందో.. ఆ బుజ్జిగాడి క్యూట్ నెస్ అదుర్స్ అన్నమాట 😀😀😀😀

30,560 次观看

ఈ దృశ్యం చూడగానే .. ఎప్పుడూ రాయిలాగా ఉండే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి .. జీవితం కొందరి పట్ల ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనిపిస్తుంది 😢😢😢

ఈ దృశ్యం చూడగానే .. ఎప్పుడూ రాయిలాగా ఉండే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి .. జీవితం కొందరి పట్ల ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనిపిస్తుంది 😢😢😢

25,432 次观看

Videos

ashuvemulapalli's profile picture

లడఖ్ కొండల్లో అమరావతి స్వరం హిమాలయాల మంచు తెరల నుంచి కృష్ణా తీరం వరకు:..ఒక ఆశల రాజధాని ‘అమరావతి’ సరిహద్దుల్లో ఎత్తైన కొండలు, శ్వేత వర్ణపు మంచు పర్వతాలు, దేశానికి ఉత్తర కొసన ఉండే లడఖ్ ప్రాంతం. అక్కడ జీవనం సాగే చల్లని లోయల్లో ఓ తెలుగోడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా స్థానిక పిల్లలు పలకరించారు. "ఎక్కడి నుంచి వచ్చారు?" అన్న అమాయకమైన ప్రశ్నకు "ఆంధ్రప్రదేశ్" అన్న సమాధానం రాగానే, ఏమాత్రం తడుముకోకుండా ఆ చిన్నారుల పెదవుల నుంచి వెలువడిన ఒకే ఒక్క పదం — "అమరావతి!" ఆ పలకరింపు కేవలం ఒక సాధారణ సమాధానం మాత్రమే కాదు; భౌగోళిక సరిహద్దులు, భాషా భేదాలను దాటి దేశపు నలుమూలలకూ చేరిన ఒక నవ నగరం పేరు. ఆశల రూపం.. ప్రజా సంకల్పం ఒక రాష్ట్రానికి రాజధాని అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక భవనాలు మాత్రమే కాదు. అది కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు, వారి భవిష్యత్ తరాల కలలకు ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ క్రమంలో అమరావతిని ఎంచుకున్నది కేవలం నేల కోసం కాదు; శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, బౌద్ధ నాగరికత వెల్లివిరిసిన పవిత్ర కృష్ణా తీరపు వారసత్వానికి ప్రాణం పోసేందుకు. వేలాది మంది రైతులు తమ సారవంతమైన భూములను నవ సమాజ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా సమర్పించిన విధానం భారతదేశ చరిత్రలోనే అపూర్వమైన ప్రజా భాగస్వామ్య గాథగా నిలిచింది. ఆటుపోట్లను అధిగమిస్తూ.. అలుపెరుగని ప్రయాణం ఏ మహత్తర నగర నిర్మాణమూ పూలబాటపై సాగదు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలైనా, చారిత్రక రాజధానులైనా ఎన్నో సవాళ్లు, ఆటంకాలు, ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచినవే. అమరావతి ప్రయాణం కూడా కాల పరీక్షకు నిలబడింది. అనిశ్చితులు చుట్టుముట్టినా, ప్రకృతి సహకరించకపోయినా, నిర్మాణ పనుల్లో వేగం మారినా... ఆ నేలపై ఆధారపడిన ప్రజల నమ్మకం మాత్రం చెక్కుచెదరలేదు. ఆశావహ దృక్పథం, దృఢ సంకల్పం ఉంటే ఎంతటి సంక్షోభాల నుంచైనా మళ్ళీ లేచి నిలబడొచ్చని అమరావతి నిరూపిస్తోంది. దేశానికి చివర వినిపించిన గుర్తింపు లడఖ్‌లోని చిన్నారి నోట ‘అమరావతి’ ధ్వనించడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. భారతీయ చిత్రపటంలో అమరావతి ఒక రాజధానిగా తన ముద్రను ఇప్పటికే వేసింది. పాఠ్యపుస్తకాల్లోనో, వార్తల్లోనో విని ఆ పసిమనసులు గుర్తుపెట్టుకున్నారంటే, ఆ పేరు దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. శిలాఫలకాలు, గగనతల భవనాలు సమయంతో పాటు వాటంతట అవే రూపుదిద్దుకుంటాయి. కానీ ఒక నగరం ప్రజల హృదయాల్లో, దేశపు భావనలో సజీవంగా ఉన్నంత కాలం దాని అభివృద్ధిని ఏదీ ఆపలేదు. చరిత్రను పుణికిపుచ్చుకుని, రేపటి తరం ఆధునికతను ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్న అమరావతి... తెలుగుజాతి ఆత్మగౌరవానికి, సమష్టి సంకల్పానికి శాశ్వత ప్రతీక. అమరావతి .. అజరామరం ..అశోక్ వేములపల్లి

ASHOK VEMULAPALLI

69,852 次观看 • 7 天前

ashuvemulapalli's profile picture

కూతురు -పరువు -హత్య అత్యంత బాధాకర ఘటన ఇది పరువు కోసం కన్నకూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు గుండెనొప్పితో చనిపోయిందని సీన్ క్రియేట్ చేసి అంత్యక్రియలు కూడా చేసేసిన పేరెంట్స్ వేరే పెళ్లి చేసుకున్న కూతుర్ని హైదరాబాఫ్ నుంచి శ్రీకాకుళంజిల్లా టెక్కలి పిలిపించి మరీ చంపిన అమ్మానాన్న ముందుగానే ప్రమాదం ఊహించి వీడియో రికార్డ్ చేసి శక్తియాప్ ద్వారా పోలీసులకి పంపిన బాధితురాలు దురదృష్టం ఆమె చనిపోయాక ఆ వీడియోని పోలీసులు గుర్తించారు శ్రీకాకుళం జిల్లా సొర్లి గ్రామానికి చెందిన గ్రూప్-1 అభ్యర్థి దుంపల హరిణి (24) హత్య కేసు సంచలనం రేపుతోంది.భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్న హరిణిని ఆమె తల్లి, భర్త, తాత కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముందుగానే ప్రమాదాన్ని ఊహించిన హరిణి రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఆమె స్నేహితుడు 'శక్తి యాప్' ద్వారా పోలీసులకు పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టెక్కలి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్లేముందు రికార్డ్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా బాధతో కళ్లు చెమ్మగిల్లుతాయి . మానవ సంబంధాలు చివరికి ఏ దారికి వెళ్తున్నాయి అర్ధం కావడం లేదు 🤦🤦🤦🤦

ASHOK VEMULAPALLI

131,897 次观看 • 3 个月前

ashuvemulapalli's profile picture

Prof Dasoju Sravan Kumar దాసోజు శ్రవణ్ గారు .. నేను 22A వల్ల నేను కొనాలనుకున్న సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఆగిపోయిన మాట వాస్తవం . అలాగే నేను 40 లక్షల రూపాయలు యజమాని తరఫు అడ్వకేట్ కి చెల్లించింది వాస్తవం .. అలాగే .. మూడు నెలల నుంచి అటు రిజిస్ట్రేషన్ కాక ఇటు డబ్బులు వెనక్కి రాక మానసికంగా ఇబ్బంది పడుతుంది కూడా నిజమే .. కానీ మీరు చెప్పినట్టుగా నేను హరీష్ రావు గారిని కలవలేదు ..నేను ఎలాంటి లెటర్ ఇవ్వలేదు .. మీరు చేతిలో చూపించిన లెటర్ ఏంటో నాకు తెలీదు .. మీరు అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు .. దయచేసి వివాదంలోకి నన్ను లాగొద్దని విజ్ఞప్తి .. నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా 22A మీద ఒక బాధ అనుభవించిన వ్యక్తిగా ఆర్టికల్ రాసాను .. వార్తలు రాయడం నా డ్యూటీ .. 22 ఏళ్లుగా వార్తలు రాస్తూనే ఉన్నాను .. వార్తలు చెబుతూనే ఉన్నాను .. అందులో భాగంగానే ఈ ఆర్టికల్ రాసాను .. కానీ నేను Harish Rao Thanneeru హరీష్ రావు గారిని ఎప్పడు కలవలేదు .. ఆయనకు దగ్గరకు వచ్చి లెటర్ ఇవ్వడం అనేది వాస్తవం కాదు .. వీలైతే నేను ఇచ్చానని చెబుతున్న ఆ లెటర్ ని దయచేసి పబ్లిక్ గా పోస్ట్ చేయండి .. ఎందుకంటే ఇది అసలు నా సమస్య పక్కదారి పట్టి .. ఇది రాజకీయ వివాదం అవుతుంది .. సమాజంలోకి మెసేజ్ రాంగ్ గా ప్రాజక్ట్ అవుతుంది ..

ASHOK VEMULAPALLI

37,660 次观看 • 1 个月前

ashuvemulapalli's profile picture

వీడిని పోలీసులు కొడుతుంటే అయ్యో పావం అనిపించింది .. అతను తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్షించాలి గానీ.. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి ? అని ప్రశ్నించాలనిపించింది .. కానీ వాడు ఏమి చేశాడో తెలిసాక .. నేనే వెళ్లి వాడిని కొట్టాలనిపించింది .. రైతులు పశువుల కోసం దాచిన గడ్డి వాముల్ని తగులబెట్టిన నీచుడు వీడు .. పోలీసులు డ్రోన్ కెమెరాలతో చెక్ చేస్తుండగా అందులో గడ్డి వాములు తగులబెడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అనంతపురం జిల్లా: పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పు పెట్టిన నిందితుడు సుధాకర్ ని అరెస్ట్ చేసారు.. తనతో తో ఎవరైనా గొడవ పడితే వారికి చెందిన గడ్డివాములకు నిప్పు పెట్టేస్తాడు ఈ సైకో .. రైతులు ఇచ్చిన కంప్లయింట్ తో ఇతన్ని అరెస్ట్ చేసారు పోలీసులు ...

ASHOK VEMULAPALLI

135,786 次观看 • 5 个月前

ashuvemulapalli's profile picture

బెజవాడలో బాగా బలిసిన బడాబాబుల కొడుకులు ఇలా రోడ్డు మీద థార్ కార్లతో గుద్దుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు .. ఒకరి కార్ ని మరొకరు రాడ్లతో అద్దాలు పగుల గొట్టుకుంటూ రౌడీయిజం చేసారు .. లింగమనేని రోహిత్ , బొల్లా ఓమ్ అనే ఈ ఇద్దరు తిన్నది అరగక ఇలా కొట్టుకున్నారు .. ఒక అమ్మాయి విషయం లో చెలరేగిన గొడవ ఇది .. ఆ అమ్మాయి కూడా ఒకరి కారులో ఉంది .. పోలీసులు ఈ బ్యాచ్ ని అదుపులోకి తీసుకున్నారు .. ఇలాంటి విషయాల్లో వీళ్ళ బెండు తీయాలి .. కాసేపటికి ఎలాగూ వీళ్ళ డాడీస్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయిపోతారు .. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు ఈ ఎంపీ తెలుసు ఆ మంత్రి తెలుసు అంటూ నానా హడావిడి చేసి లాబీయింగ్ చేసి మొత్తం మీద వీరిని బయటకు తీసుకెళ్లిపోతారు .. మళ్లీ యధావిధిగా కొత్త థార్ కార్లు కొనిచ్చి రోడ్డుమీదికెళ్లి గుద్దుకోమని ఆంబోతుల్ని వదిలినట్టు వదులుతారు ..

ASHOK VEMULAPALLI

102,036 次观看 • 4 个月前

ashuvemulapalli's profile picture

Breaking విజయనగరం భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద వృద్ధ దంపతులని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపి భయపెట్టారు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూముల స్వాధీనానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకుండా భూముల స్వాధీనం చేయరాదంటూ అడ్డుకున్న రైతులు జేసీబీని అడ్డుకొని, జేసీబీ బకెట్ లో కూర్చున్న వృద్ధ దంపతులు అక్కడ సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ ఇలా వృద్ధ దంపతులని పైగా రైతుల్ని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపడం కచ్చితంగా తప్పు ..ఇలాంటి దృశ్యాలు ప్రజల్ని ఆగ్రహానికి , ఆవేదనకి గురి చేస్తాయి ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని నేను అనను .. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారులు దగ్గర ఉండి చేయించిన ఈ నిర్వాకం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది .. ఇలాంటి అంశాల్ని లేవనెత్తిన మాలాంటి వాళ్ళని తిట్టిపోయకుండా ఇలా ఇంకోసారి జరగకుండా చూడండి .. ఆ రైతులకి న్యాయం చేయండి ప్లీజ్ 🙏🙏🙏 Lokesh Nara

ASHOK VEMULAPALLI

97,409 次观看 • 4 个月前

ashuvemulapalli's profile picture

హైదరాబాద్ లో సరైన అనుమతుల్లేకుండా .. కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొంటే చివరికి ఇలా నరకం అనుభవించాల్సి వస్తుంది .. నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికి అమీన్ పూర్ లో నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం ఇలా వరదనీటిలో నిండిపోయింది .. సెల్లార్ లో ఉన్న పదికార్లు బైక్ లు అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి .. ఆఖరికి లిఫ్ట్ అంతా నీళ్ళల్లోనే ఉంది .. ఈ అపార్ట్మెంట్ కి కేవలం పంచాయతీ పర్మిషన్ తీసుకుని కట్టేసి అమ్మేసారు .. కాస్త తక్కువ ధరకు ఫ్లాట్ వస్తోంది కదా అనే ఆశతో మధ్యతరగతి ప్రజలు కొని ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు చివరికి హైడ్రా వచ్చి నీళ్లన్నీ తోడాల్సి వస్తుంది . ఈ వర్షానికే ఇలా అయింది ఈ వర్షాకాలం ఇలా వర్షాలు కురుస్తూనే ఉంటాయి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ? అందుకే ఫ్లాట్ కొనుక్కునేవాళ్లకు ఆలోచించండి .. తక్కువ ధరకు వస్తోంది కదా అని ఇలా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ కొనకండి .. మీరు ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోయినా బిల్డర్ పట్టించుకోదు ..

ASHOK VEMULAPALLI

65,345 次观看 • 2 个月前