
ETV Andhra Pradesh
@etvandhraprades • 81,110 subscribers
ETV Andhra Pradesh is part of Ramoji group which is a diversified group with substantial business interests in Media (print as well as electronic)
Videos

తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వర్తించనున్న పథకం పథకానికి రూ.10,120.78 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతి పథకం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు జమకానున్న మొత్తం ఈనెల 22 నాటికి 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ ఈనెల 22న స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రకటన #etvapnews #TallikiVandanam #AndhraPradesh #APGovernment #Education #Students #Mothers #Scholarship #APNews #ChandrababuNaidu #EducationScheme #BreakingNews #TeluguNews #LatestNews #WelfareScheme #AndhraNews
ETV Andhra Pradesh74,406 次观看 • 8 天前

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినా...పలాసలో మాత్రం సీదిరి అప్పలరాజు హవానే నడుస్తోంది. నియోజకవర్గంలో YCP ప్రభుత్వమే ఉన్నట్లు.. సీదిరే జిల్లా మంత్రిగా చలామణి అవుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి...తప్పు చేసిన సీదిరి కుమారుడిని తప్పించేందుకు పోలీసుల నుంచి.. ప్రభుత్వాసుపత్రి వైద్యుల వరకు ...మాజీ మంత్రి అడుగులకు మడుగులొత్తారు. స్థానిక ఎమ్మెల్యే TDPకి చెందిన వారే అయినా..అధికారుల తీరు చూస్తుంటే ...పలాసలో ఇంకా Y.C.P.రాజ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ETV Andhra Pradesh47,255 次观看 • 8 天前

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను ముందు పెట్టి... గమన, వైసీపీ నేత ఇంద్రసేన... యూట్యూబ్ ఛానళ్లు నడిపించినట్లు... దర్యాప్తులో బయటకు వస్తోంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. వీరి పాత్రపై ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఇద్దరినీ ఇప్పటికే ఓ విడత విచారించారు. మరోసారి ఈ నెల 17న రమ్మని పోలీసులు పిలిచారు. విచారణలో వీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా... అరెస్టును నిర్ణయించే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి వచ్చే అంశాల ఆధారంగా... వీరు వీడియోలను వండి వార్చేవారని తెలుస్తోంది. వీటికి సంబంధించి స్క్రిప్టు కూడా అందేదని.., ఆ మేరకు ఉమ్మడిగా విద్వేషపూరిత వీడియోలు రూపొందించి అప్ లోడ్ చేసేవారని తెలిసింది. గిట్టనివారి పట్ల అక్కసు వెళ్లగక్కేవారని సమాచారం. 'ప్రశ్న'తో పాటు.. మొత్తం మూడు యూట్యూబ్ ఛానళ్లను గమన నడుపుతున్నారు
ETV Andhra Pradesh42,923 次观看 • 9 天前

అమెరికాలో ఏటా రెండుసార్లు గడియారాల సమయాన్ని మార్చే సాంప్రదాయానికి.... స్వస్తి పలికే దిశగా అడుగులు పడ్డాయి. డేలైట్ సేవింగ్ టైమ్ ని శాశ్వతం చేస్తూ రూపొందించిన ప్రతిపాదనకు.... US ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. వేసవి సమయంలో గడియారాలను ఓ గంట ముందుకు జరిపే విధానమే డేలైట్ సేవింగ్ టైమ్. శీతాకాలం రాగానే మళ్లీ గడియారం ముళ్లను వెనక్కి జరుపుతారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఇకపై అమెరికన్లు ఏడాదికి రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏడాది పొడవునా ఒకే సమయం అమల్లో ఉంటుంది
ETV Andhra Pradesh43,923 次观看 • 9 天前

చదువుకున్న చదువు, సంపాదించుకున్న అనుభవం.... ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ -AI ముందు పనికిరాకుండా పోతాయా...? అవుననే అంటున్నాయి టెక్ వర్గాలు. వచ్చే 12 నుంచి 18 నెలల్లోనే.... ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వైట్ కాలర్ ఉద్యోగాలు అంతరించిపోతాయని లేదా పూర్తిగా ఆటోమేట్ అవుతాయని.... మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. అకౌంటెంట్లు, లాయర్లు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు కాలం చెల్లిపోతుందన్నారు. సులేమాన్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
ETV Andhra Pradesh139,045 次观看 • 2 个月前

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ...... హస్తకళాకారులకు ఇచ్చిన హామీని మరుసటి రోజుకే నిలబెట్టుకున్నారు. ఏపీ హస్తకళా మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని...... పవన్ మాట ఇచ్చారు. దానికి అనుగుణంగా బుధవారం క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులకు ప్రత్యేక పరీక్షలు చేశారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా....... 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళజోళ్లు ఇచ్చారు. శ్రీకాళహస్తిలో 53 మంది కలంకారీ కళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు హస్తకళ మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం పసలదీవికి చెందిన మహాలక్ష్మీ...... తనకు నేత్ర సంబధిత ఇబ్బందులు వస్తున్నాయని..... పవన్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం మహాలక్ష్మితో పాటు అందే లక్ష్మీ అనే మరో కళాకారిణిని.... పవన్ ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి.... వైద్య పరీక్షలు చేయించారు. ఇద్దరికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు... కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్ , మందులు ఇచ్చారు
ETV Andhra Pradesh15,616 次观看 • 16 天前

అర్థరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతి............... శక్తి యాప్ ద్వారా పోలీస్ లను అలెర్ట్ చేసి తనను తాను రక్షించుకుంది. గురువారం రాత్రి... బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన యువతిని ఇంట్లో దింపుతానంటూ...... ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు. యువతితో.... సంబంధం లేని మాటలు మట్లాడుతున్నాడు. ఏదో తేడా కొడుతుందని భయపడిన యువతి.... అప్పటికే తన మొబైల్ లో ఉన్న శక్తియాప్ లోని బటన్ నొక్కింది. అప్పటికే ఆటో వారధి దాటింది. మంగళగిరి గ్రామీణ ఎస్సై వెంకట్...... తన సిబ్బందితో చిన్న కాకాని సమీపంలోని ఆటోను పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని... యువతిని అర్ధరాత్రి తన స్వస్థలానికి చేర్చారు.
ETV Andhra Pradesh63,973 次观看 • 3 个月前

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగి అమెరికాను వెనక్కి నెట్టేయాలన్న చైనా ఆశలు అడియాసలు కానున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి ఫ్యాక్టరీలా వెలుగొందిన కమ్యూనిస్ట్ దేశం....అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చైనా మొత్తం అప్పులు ఏకంగా జీడీపీలో 300శాతాన్ని దాటేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. స్థిరాస్తి రంగం కుప్పకూలడంతోపాటు నిరుద్యోగం, వేగంగా పడిపోతున్న జనాభా....వెరసి చైనా ఆర్థిక మోడల్ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబులా మారింది. #internationaletv #InternationalEtvNews #China #ChinaEconomy #DebtCrisis #GlobalEconomy #EconomicCrisis #GDP #USvsChina #RealEstateCrisis #WorldEconomy #BreakingNews #FinancialCrisis #EconomicSlowdown #Unemployment #BusinessNews
ETV Andhra Pradesh40,997 次观看 • 1 个月前

హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై..... అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిట్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని..., దీని వెనుక ఒక పెద్ద వీసా మాఫియా నడుస్తోందని............... ఆరోపించారు. ఈ మాఫియాకు హైదరాబాద్ లో ఒక వీసాల దేవాలయం ఉందంటూ చిలుకూరు బాలాజీ ఆలయంపై విషం చిమ్మారు. ఇది వీసాల దేవాలయమని అమెరికా వీసాల కోసం భారతీయులు....... ఇక్కడ పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు...
ETV Andhra Pradesh46,839 次观看 • 2 个月前

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ SC సర్టిఫికెట్ రద్దు చేస్తూ... కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులు, జేసీ నేతృత్వంలోని జిల్లా స్క్రూట్నీ కమిటీ, RDO అందజేసిన నివేదికలను పరిగణలోకి తీసుకుని.....పాస్టర్ ఆనంద్ SC సర్టిఫికెట్ ను కలెక్టర్ రద్దు చేశారు.
ETV Andhra Pradesh37,234 次观看 • 2 个月前

అట్టహాసంగా నిశ్చితార్థం జరిగింది..!. కాబోయే వధూవరులిద్దరూ రోజూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు...!. అభిరుచులు పంచుకుంటున్నారు..!. ఇక్కడివరకు కథ అంతా బాగానే ఉంది..!. ఇంతలోనే నువ్వు నాకు నచ్చలేదు.. నాకు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ... అబ్బాయి చెప్పాడు. అంతే అమ్మాయి తట్టుకోలేకపోయింది. తీవ్రంగా మనస్తాపం చెంది..... చివరికి ప్రాణాలు వదిలింది. #EtvApNews #EtvSpecial #LoveStory #TragicNews #RelationshipNews #BreakingNews #EmotionalStory #IndiaNews #SadNews #TrueStory #MentalHealthAwareness #LatestNews #Heartbreaking
ETV Andhra Pradesh41,295 次观看 • 3 个月前