
Office of Harish Rao
@HarishRaoOffice • 15,564 subscribers
Office of Former Minister, BRSLP Deputy Floor Leader Sri @BRSHarish || MLA Siddipet - Telangana State
Shorts
Videos

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఆంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ విజయవాడ అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠంలో ఘనంగా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ Harish Rao Thanneeru గారు విజయవాడలోని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠంలో, హనుమాన్ మాల రూపకర్త శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ, పునఃప్రతిష్ఠ, కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి పర్వదినాన ఇద్దరు గొప్ప పీఠాధిపతులు, గురూజీలు చిన్నజీయర్ స్వామి, దుర్గాప్రసాద్ స్వామీజీ సమక్షంలో ఈ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నాను. దేశంలో ఎక్కడ కొత్త దేవాలయం నిర్మించినా, జీర్ణోద్ధారణ జరిగినా అక్కడ తప్పకుండా చిన్నజీయర్ స్వామి వారు ఉండాల్సిందే. గతంలో మా స్వగ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు కూడా చిన్నజీయర్ స్వామి వారి స్వహస్తాల మీదుగానే ప్రాణప్రతిష్ఠ జరగడం మా అదృష్టం. సమాజాన్ని ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలి అనే గొప్ప నినాదంతో పవిత్ర యజ్ఞాన్ని చిన్నజీయర్ స్వామి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్లో వారు ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి నిలువెత్తు నిదర్శనం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సమాజంలో సమానత్వం కోసం, నిత్య లోక కల్యాణం కోసం స్వామీజీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇరువురు స్వాములు లోకరక్షకులుగా ముందుకు సాగుతున్నారు. మనకు కనిపించే దైవం చిన్నజీయర్ స్వామి వారు. దుర్గాప్రసాద్ స్వామీజీ గారితో మా సిద్దిపేట ప్రాంతానికి విడదీయరాని అవినాభావ అనుబంధం ఉంది. ఆయన వద్ద మాల వేసుకోవడానికి మా ప్రాంతం నుంచి వేలాది మంది వస్తుంటారు. భక్తుల కోరిక మేరకు, గత రెండేళ్లుగా స్వామీజీ స్వయంగా సిద్దిపేటకే వచ్చి భక్తులకు మాలాధారణ చేయించడం చాలా విశేషం. ప్రతి సంవత్సరం సిద్దిపేట కోమటి చెరువులో జరిగే తెప్పోత్సవం కార్యక్రమంలో దుర్గాప్రసాద్ స్వామీజీ పాల్గొనడం మా ప్రాంత ప్రజలకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆంజనేయ స్వామి క్రమశిక్షణకు, విశ్వాసానికి, విధేయతకు, సాహసానికి, సమానత్వానికి మారుపేరు. ఏ పనైనా వాయువేగంతో పూర్తి చేసే గొప్ప దైవం. సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడానికైనా, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికైనా వాయువేగంతో వెళ్లి ఆ దేవదేవులకే సహాయం చేసిన మహనీయుడు ఆంజనేయుడు. దేవుళ్లకే సహాయం చేసిన ఆంజనేయుడు, మానవమాత్రులైన మనకు కూడా తప్పక ఆశీస్సులు అందిస్తాడనే గొప్ప నమ్మకంతోనే నేడు లక్షలాది మంది హనుమాన్ మాలాధారణ చేస్తున్నారు. ఒకప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యతో ప్రారంభమైన ఈ మాలాధారణ.. నేడు 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల దీక్షలతో లక్షలాది మందికి చేరిందంటే, దానికి దుర్గాప్రసాద్ స్వామీజీ గారి విశేష కృషే కారణం. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమానికి తప్పక రావాలని దుర్గాప్రసాద్ స్వామీజీ గారు కోరడాన్ని ఒక ఆజ్ఞగా భావించి ఇక్కడికి వచ్చాను. ఇంతటి గొప్ప పుణ్యకార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఇరువురు స్వామీజీల పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
Office of Harish Rao32,437 次观看 • 1 个月前

ఉప్పొంగిన ఉద్వేగం.. ఉత్సాహం... ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాం.. ఆయిల్ పామ్ మొక్క ను తెచ్చింది మీరు... ఫ్యాక్టరీకి పునాది వేసింది మీరు... మీరు వస్తారా లేదా.. ఎప్పుడు వస్తావ్ అని ఎదురు చూసాం.. మిమ్మల్ని చూసాక మాలో ఎంతో సంతోషం కలిగింది... ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కి వచ్చిన సందర్బంగా Harish Rao Thanneeru గారిని చూసి ప్రజల్లో ఉద్వేగంతో... ఉప్పొంగిన ఉత్సాహం..
Office of Harish Rao20,048 次观看 • 2 个月前

దటీజ్ మన్మోహన్ సింగ్! ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని మంత్రి మండలి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రాహుల్ గాంధీ బహిరంగంగా చించివేసినా మన్మోహన్ సింగ్ గారు మౌనంగానే ఉన్నారు. అది ఆయన లాయలిటీ. వ్యక్తిత్వం !! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు
Office of Harish Rao10,531 次观看 • 1 年前
没有更多内容可加载