Ponguleti Srinivasa Reddy's banner
Ponguleti Srinivasa Reddy's profile picture

Ponguleti Srinivasa Reddy

@INC_Ponguleti25,071 subscribers

Minister for Revenue and Housing, Information & Public Relations, Govt. of Telangana | MLA- Palair | Indian National Congress

Shorts

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మన ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న మీ శీనన్న నుండి ఇదే హార్దిక ఆహ్వానం #Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మన ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న మీ శీనన్న నుండి ఇదే హార్దిక ఆహ్వానం #Telangana

46,604 次观看

Videos

INC_Ponguleti's profile picture

అదృష్టం అంటే ఇదేనేమో.. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా టోకెన్ ను ఒక చిన్నోడితో తీపించినపుడు ఆ చిన్నోడి కుటుంబానికే వరించిన ఇల్లు. పేదల సొంతింటి కల తీర్చాలనే ఈ ప్రభుత్వ సంకల్పానికి, దేవుడి ఆశీస్సులు తోడైనట్టు చిన్నోడు తీసిన లక్కీ డ్రాలో వారి కుటుంబానికే (జరపుల లక్ష్మీ) గారికి టోకెన్ రావడం మా అందరిని ఆనందానికి మరియు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి సందర్భాలు చాల అరుదు. చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం..చిన్నారులు స్వచ్ఛమైన మనసుగల్గిన వారు. దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కల నేరవేరుతున్నందున ఆ కుటుంబం సొంతింటిలో జీవితాంతం చల్లగా బ్రతకాలని ఆ ఆడబిడ్డను మనసారా ఆశీర్వదించడం జరిగింది.

Ponguleti Srinivasa Reddy

71,233 次观看 • 19 天前

INC_Ponguleti's profile picture

ప్రభుత్వ భూమిని సొంత మామకు కట్టబెట్టిన హరీష్ రావు Harish Rao Thanneeru .. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామం సర్వేనెంబర్ 271 లో 327 ఎకరాల 9 గుంటల ప్రభుత్వం భూమి. . ఈ భూమిని ఆనాడు ఇందిరా గాంధీ గారు పి ఓ టి యాక్ట్ లో పట్టాలు ఇచ్చారు ఈ అగ్గిపెట్ట అబద్ధాల రావు గారికి పిల్లనిచ్చిన మామగారి పేరు హనుమంతరావు గారు .. పి ఓ టి ల్యాండ్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇది 22ఏలో ఉంటుంది. 22ఏ లో ఉన్నదాన్ని 1-8-2023 నాడు... అగ్గిపెట్టల అబద్ధాల రావు గారు అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా పట్టా భూమి కింద కన్వర్ట్ చేసి పాస్ బుక్కులు ఇచ్చారు. ఎంత పిల్లనిచ్చిన మామ అయినా.. పేదల భూమి అక్రమంగా ఇవ్వడం న్యాయమేనా...?

Ponguleti Srinivasa Reddy

11,856 次观看 • 4 天前

INC_Ponguleti's profile picture

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంకు చెందిన నర్సు శిరీష ఇటీవల హైదరాబాద్ లో ఘోర హత్యకు గురైన నేపథ్యంలో ఆమె స్వగ్రామానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు. ఈ సందర్భంగా శీరిష కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం రూ. 5 లక్షల చెక్కు, మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేసి, ఆదివాసీ కుటుంబానికి చెందిన నర్సు శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా నిచ్చారు. హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన నర్సింగ్ శిరీష హత్య ఉదంతం అమానుషం, మానవ రూపంలో ఉన్న మృగం చేసిన హత్య, సభ్యసమాజం తలదించుకునే ఘటన అని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గారు సీపీ తో ఫోన్ లో మాట్లాడి ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా శీరిష నివాసం ఉన్న హస్పిటల్ వసతి గృహంలో ఎంక్వైరీ చేసి, నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తిస్తే హాస్పిటల్ ను సీజ్ చేయాలని మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేసేలా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు భరోసానిచ్చారు. #Adminpost

Ponguleti Srinivasa Reddy

13,155 次观看 • 12 天前

INC_Ponguleti's profile picture

కక్ష్య కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని మోసం చేసిన బీఆర్ఎస్ పాలకులు వారి జిల్లాలకు, వారి ఫాం హౌజ్ లకు నీళ్లిచ్చే ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ సీతారామ ప్రాజెక్టు మీద పెట్టలేదు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం లో మొదలుపెట్టిన ప్రాజెక్టుకు పేరు మార్చి, అంచనాలు పెంచి, కమీషన్ల కక్కుర్తితో మోటర్లు కొన్నారే తప్ప, పంపులు నడిపించడానికి కావాల్సిన వ్యవస్థను తయారు చేయలేదు..ప్రాజెక్టు బ్యారేజీని కూడ పూర్తి చేయలేదు. పదేండ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లిచ్చే ప్రాజెక్టుల పనులను నత్తనడకన నడిపించారు..గోదావరిలో నిలువునా నీరు కిందకు పోతుంటే చూస్తూ ఊరుకున్నారే తప్ప, ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని ఎత్తిపోద్దాం, ఖమ్మం రైతాంగానికి సాగునీళ్లిద్దామనే సోయిలేని ఘత పాలకులు ఈ రోజు అవాకుల చెవాకులు పేలుతున్నారు.. రెండేండ్లలోనే సీతారామ ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు నిధుల విడుదల చేసి, ఉన్న మోటర్‌లకు ఎలక్ట్రిక్ పనులను, ఇతరత్రా పూర్తి చేసుకుని ఒక్కో మోటరును నడుపుతూ, నీటిని ఎత్తిపోస్తూ, సుమారు 1 లక్ష 25 వేల ఎక‌రాల‌కు సాగునీటిని విడుద‌ల చేస్తున్నాం. ఈ తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగాన్ని కాపాడుకోవడానికి గోదావరి నదిలో కొద్దిగా ప్రవహించే నీటిని కూడ వృధాగా కిందకు పోనివ్వకుండా ప్రతి నీటి చుక్కను ఎత్తిపోసేలా కార్యాచరణ చేస్తున్నాం. #BRSFailedInTelangana

Ponguleti Srinivasa Reddy

11,905 次观看 • 2 个月前

INC_Ponguleti's profile picture

ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండం... సవాల్ ను స్వీకరించే దమ్ముందా లేదా కేటీఆర్...? KTR గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక... హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావ్ ! అదే హైదరాబాద్‌లో ఇండ్ల అంశంపై సవాల్ చేస్తే... ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావ్! చేతల ప్రభుత్వం కాబట్టే, చిత్తశుద్ధి, సత్తా ఉన్నాయి కాబట్టే... తొలి రెండున్నర సంవత్సరాలలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాం. జూన్ 1 న మరో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నాం. అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది మీరు. ఈ విషయం స్వయంగా ప్రధాని మోదీ గారు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు, మీ సోదరి కవిత గారు సైతం ప్రస్తావించారు. కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న మీకు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదు. దళిత ముఖ్యమంత్రి నుండి డబుల్ బెడ్ రూం ఇండ్ల వరకు.. అన్నీ మాటలు తప్ప, చేతలు ఎక్కడైనా ఉన్నాయా డ్రామారావు...? అవినీతి, అక్రమాల గురించి కేటీఆర్ గారు మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు.. 2014 కు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి..? పదేండ్లు అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. గ్రామాల్లో మీరు పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే, కేవలం రెండున్నర సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఇండ్లు నిర్మించింది. హైదరాబాద్ లో ఇండ్ల నిర్మాణంపై మరొక్కసారి సవాల్ విసురుతున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే, ఎన్నికల్లో పోటీ చేస్తా.. కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే పోటీకి మీరు దూరంగా ఉంటారా..? దమ్ముంటే సవాల్ ను స్వీకరించు కేటీఆర్..

Ponguleti Srinivasa Reddy

14,519 次观看 • 3 个月前

INC_Ponguleti's profile picture

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం సిటీ సెంటర్లో 200 కోట్ల ప్రాపర్టీ కబ్జా పెట్టారు. దీనిపై ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆధారాలు తెచ్చి మాట్లాడుతున్నాను. నేను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే 24 గంటల్లో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. హరీశ్ రావు, కేటీఆర్ లకు దమ్ముంటే ఇది నిజం కాదని నిరూపించాలి, లేదంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేనిప్పుడే నా రాజీనామా పత్రం ఇస్తున్నా.. దమ్ముంటే వారు కూడా తమ రాజీనామా పత్రం ఇచ్చి సవాల్ స్వీకరించాలి. కోట్లు కోట్లు కొల్లగొట్టిన దొంగలే దొంగ అని మొత్తుకుంటున్నారు, ఎందకు వారిని జైల్లో వేయకూడదు. పార్టీ కార్యాలయాల పేరిట కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నవారు ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. -అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి #AdminPost #tgassembly Telangana CMO Telangana Congress

Ponguleti Srinivasa Reddy

17,204 次观看 • 5 个月前

没有更多内容可加载