
Ramanath B R
@JOURNORAMNATH • 1,984 subscribers
Shorts
Videos

పిఠాపురం వర్మ ఆగ్రహం. వేదికపై పవన్ కల్యాణ్ ఫోటో పెద్దదిగా ఉంచి చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉంచడంపై ఆగ్రహం. చంద్రబాబుకు గౌరవం లేని చోట నేను కూర్చోలేను అంటూ వేదిక మీదకు వెళ్లని వర్మ. బయటకు వచ్చిన తర్వాత టీడీపీ స్థానిక నేతలపై ఆగ్రహం. ఇంతమంది ఉన్నారు... ముఖ్యమంత్రి బొమ్మ లేకుంటే చూసుకోవడం తెలియదా అంటూ వర్మ ఆగ్రహం.
Ramanath B R260,662 views • 3 months ago

ఇప్పటికిప్పుడు అమరావతిలో వ్యాపారం ఉండదు. పదేళ్లలో రాబడి అంచనాతో ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటివి కట్టాల్సి ఉంటుంది. ( ఇప్పుడు కాదు భవిష్యత్తులో వ్యాపారం, ఆదాయం ఉండొచ్చు అంటే ఏ సంస్థ అయినా రిస్క్ చేసి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కడుతుందా ?. ) అమరావతిని రెండేళ్లలో హైదరాబాద్ లా చూడాలంటే తన దృష్టిలో అత్యాశ అవుతుందంటున్న పెమ్మసాని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పటి లోపు అక్కడ నిర్మిస్తారన్న దానిపై టైం చెప్పలేను అంటున్న పెమ్మసాని. వర్షాలు ఇబ్బంది పెట్టకపోతే వేగంగానే పనులు చేస్తామంటున్న కేంద్రమంత్రి. #amaravati #mavigun
Ramanath B R56,079 views • 2 months ago

ల్యాబ్ రిపోర్టు ఆధారంగానే ఆరోజు నేను జంతువుల కొవ్వు ఉందని మాట్లాడా. వెంకటేశ్వరస్వామిని బజారుకు ఈడ్చే ఉద్దేశం నాకు లేదు. స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ను ఆయన కాపాడుకోవడంతో పాటు మనల్ని కాపాడుతాడు- సీఎం చంద్రబాబు. సిట్ దర్యాప్తు కొనసాగుతుందా అన్న ప్రశ్నకు ఇప్పుడు నేను ఏమీ మాట్లాడను అంటూ వెళ్లిపోయిన చంద్రబాబు. రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు వేసి, ఇప్పటికీ కొవ్వు కలిసిందని ప్రచారం చేస్తున్నదే టీడీపీ. అయినా చంద్రబాబు గారు మాత్రం వైసీపీనే స్వామిని బజారుకు ఈడ్చాలి అనుకుంటోంది అని ఎదురుదాడి.
Ramanath B R84,304 views • 4 months ago

ధీరూబాయ్ అంబానికి టెక్నాలజీ గురించి నేను వివరించా. తొలుత అనుభవం లేదన్నారు. నాలుగు రోజులకే 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. అలా రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటైంది. బ్రిటీష్ వాళ్లు మన సంపద దోచుకుని వెళ్తూ మనకు ఇంగ్లీష్ వదిలేశారు. అదే పెద్ద అవకాశం. లండన్ మ్యూజియం వెళ్లినప్పుడు నన్ను అనుమతించలేదు. కొహినూర్ వజ్రం ఇక్కడి నుంచే తీసుకెళ్లారు. దాన్ని తిరిగి అడగుతానని సందర్శనకు అనుమతి ఇవ్వలేదు.
Ramanath B R140,649 views • 9 months ago

విలేకరి - సర్ ఫైనల్ గా తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా సూటిగా చెప్పండి. మంత్రి పయ్యావుల- మీ ఒక్కరికే సమాధానం చెప్పేందుకు మేం ఇక్కడ లేం. మీరు ఎక్కడి నుంచి ( ఏ మీడియా సంస్థ నుంచి). విలేకరి- SAKSHI. పయ్యావుల- అర్థమైంది. SAKSHI పేపరా. తర్వాత సమాధానం చెబుతాం. ( ప్రశ్న అడిగింది ఏ సంస్థ విలేకరి అయినా జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సమాధానం చెప్పడానికి ఇబ్బంది ఏంటి. అంటే సమాధానం లేదు. జంతువుల కొవ్వు కలవలేదని అంగీకరిస్తే ఇక నెయ్యితో రాజకీయం చేయడం సాధ్యం కాదు. అందుకేనా ?. ) విలేకరి- బోలేబాబా హర్ష్ డెయిరీ పేరుతో ఎంటరైంది మీ హయాంలోనే అని సిట్ తేల్చింది కదా. మంత్రి పయ్యావుల- హర్ష్ డెయిరీ ఏప్రిల్ 2019లో టెండర్ దక్కించుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీనే ఆ సప్లయ్ ని పరిశీలించాలి. ( నిజానికి హర్ష్ డెయిరి 2018లోనే టీటీడీలోకి ఎంటరైంది. 2018 ఫిబ్రవరిలో టీటీడీ బృందం హర్ష్ డెయిరీకి నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం ఉందని ఒక తప్పుడు ధృవీకరణ ఇచ్చింది. దాంతోనే టీడీపీ హయాంలోనే 82వేల కి.లో నెయ్యి సరఫరాను దక్కించుకుంది. మంత్రి గారు మాత్రం వైసీపీనే చూసుకోవాల్సింది అంటున్నారు.) అసలు జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు గారు ఆరోపించిన ఆ నాలుగు ట్యాంకర్లను కొండ మీదకు పంపి లడ్డులు తయారు చేయించారని సిట్ తేల్చింది. దీనికి ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎందుకు సమాధానం లేదు!. #TIRUMALAGHEE #TTD
Ramanath B R67,541 views • 4 months ago

జగన్ కామెడీ చేయలేదు. ఆయన కాదు పిచ్చోడు.. అలా అనుకున్న వాళ్లు పిచ్చోళ్లు...
Ramanath B R33,484 views • 2 months ago

రోడ్లన్నీ అవుట్ సోర్సింగ్ కు ఇస్తాం. కార్లు, బస్సులు, లారీల నుంచి టోల్ వసూలు చేస్తాం. వద్దు అని వ్యతిరేకించి గుంతల రోడ్లు మీదే తిరుగుతాం అంటే అభ్యంతరం లేదు. డబ్బులు లేకున్నా చేయాల్సిందే అంటే మంత్రం దండం లేదు. ఆలోచనలు మాత్రమే ఉన్నాయి -ముఖ్యమంత్రి చంద్రబాబు.. #APROADS #APAssembly
Ramanath B R192,813 views • 1 year ago

ఈ ప్రభుత్వంలో నాకు, నా కుమారుడికి అవమానం.నేను నా కుమారుడు ( ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి) గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినా పని అవడం లేదు. హోంమంత్రి అనితకు ఎన్నోసార్లు లెటర్ రాశా. ఇది నన్ను అవమానించడమే, ఎమ్మెల్యేను అవమానించడమే!. ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే, ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటి?. ఇది చెబితే ఎవరికైనా బాధ కలగొచ్చు. కానీ మాకూ ఉన్నాయి సొంత బాధలు. జైలుకు వెళ్లాం, ఐదేళ్లు కష్టపడ్డాం. -జేసీ ప్రభాకర్ రెడ్డి #jcprabhakarreddy #homeministeranitha
Ramanath B R60,677 views • 4 months ago

రాజకీయ నాయకుడి పదవి కాలం ఐదేళ్లే.. అదే ఐఏఎస్ , ఐపీఎస్ లు 35ఏళ్లు ఉంటారు. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ లుగా మన వారు ఉంటే మనకెంతో ధైర్యం. వడ్డించేవాడు మనవాడు అయితే మూలన కూర్చున్న బాగానే వడ్డిస్తారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నారా లోకేష్ ఢిల్లీలో నెల పాటు తిరిగినా ఎవడూ స్పందించలేదు. అందుకే కేజీఎఫ్ స్థాపించాం. ఈ ప్రపంచంలో ఒక్క యూదుల జాతి మాత్రమే మనతో పోల్చుకునే స్థాయి ఉన్న జాతి. - కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్.
Ramanath B R44,929 views • 4 months ago

మీడియాకు ఇంతకు మించి అవమానం ఉండదు. మాజీ మంత్రులు రోజా, జోగి రమేష్ తిరుమల నెయ్యి విషయంలో టీడీపీ భయపడుతోందని మాట్లాడుకున్నారు. కానీ టీవీ5, మహా టీవీలు నేరుగా రోజా వైసీపీ నేతలే భయపడుతున్నారని చెప్పారంటూ వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఆమె టీడీపీ వారి గురించే మాట్లాడారు అన్నది క్లియర్ గా అర్తమవుతోంది.
Ramanath B R41,267 views • 4 months ago

మరో సంచలన విషయం బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి. 2018లో తిరుమల లడ్డులను ముద్దలుగా మార్చే సమయంలో మంచి సువాసన అద్దేందుకు ప్రత్యేకంగా టిన్ ల ద్వారా నెయ్యి కొన్న టీటీడీ. లడ్డుల తయారీకి వాడిన మొత్తం నెయ్యి నాణ్యమైనదే అయినప్పుడు తిరిగి మంచి వాసన కోసం, ఆఖరిలో లడ్డుల మీద వాడేందుకు ప్రత్యేకంగా ఎందుకు సువాసన పెంచే పేరుతో నెయ్యిని కొన్నారో సమాధానం చెప్పాలి. - భూమన . అంటే మీరు వాడిన నెయ్యి కల్తీదే కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఆఖరిలో మంచి సువాసన వచ్చేందుకు ప్రత్యేకంగా టిన్ ల ద్వారా కొద్ది మేర మంచి నెయ్యిని కొన్నారు. - భూమన కరుణాకర్ రెడ్డి.
Ramanath B R41,763 views • 4 months ago

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు. ఆర్ఎంపీ వైద్యుడుపై దాడి. పోలీసుల సమక్షంలోనే బెదిరింపులు, మోకాళ్లపై నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన జనసేన నేతలు, కార్యకర్తలు. పవన్ కల్యాణ్ను విమర్శించిందుకు వైసీపీ కార్యకర్త , ఆర్ఎంపీ వైద్యుడు గిరిపై జనసేన నాయకులు, కార్యకర్తల దాడి. ఇల్లు, షాపు ధ్వంసం. అనంతరం మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించిన జనసేన కార్యకర్తలు . గిరి ఇంటిపై దాదాపు 50 మంది కార్యకర్తలు దాడి. సుగాలీ ప్రీతి కేసు, 33వేల మంది మహిళల అదృశ్యం అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక చానల్ వద్ద విమర్శలు చేసిన గిరి. గురువారం రాత్రి 10.30 సమయంలో దాడి చేసిన జనసేన శ్రేణులు. విచక్షణారహితంగా కొట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించిన వైనం. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు. పోలీసుల సమక్షంలోనే బెదిరిస్తూ గిరితో క్షమాపణలు చెప్పించిన జనసేన నాయకులు, కార్యకర్తలు. కృష్ణా జిల్లా బందరు మండలం మంగినపూడి గ్రామంలో ఘటన. రాజకీయాల్లో ఉన్న వారు, పదవుల్లో ఉన్న వారు విమర్శలను స్వీకరంచలేకపోతే ఎలా?. ఒకవేళ గిరి తప్పు చేశారు అని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కోర్టుల ద్వారా శిక్ష వేయించాలి. అదే కదా చట్టం చెబుతోంది. కానీ పోలీసుల సమక్షంలోనే బెదిరించి క్షమాపణ చెప్పించడం, దాడి చేయడం ఏంటి?.
Ramanath B R69,088 views • 9 months ago

హిందూమతంలో వివాహం స్వర్గంలో జరిగింది అనుకుంటాం. విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం. ఈ విలువలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. భార్యభర్తలు కలిసి ఉండాలి, విడాకులు ఇవ్వడం కాదు. - సీఎం చంద్రబాబు తిరుమల నెయ్యిపై ప్రత్యేకంగా ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, మాధవ్, పయ్యావులు,సత్యకుమార్, పార్థసారధి.
Ramanath B R26,470 views • 4 months ago

రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన ఏబీ వెంకటేశ్వరరావు. చంద్రబాబు, నారాయణను చూసి భూములు ఇస్తే మీ ఇష్టం. అది దాదాపు మీ మధ్య ఉన్న ప్రైవేట్ ఒప్పందం లాంటిదే. దానికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించరు. మీకు ఇబ్బంది వస్తే రాష్ట్ర ప్రజలు మీకు మద్దతుగా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. వెంటనే రెండు,మూడు విడత ల్యాండ్ పూలింగ్ ఆలోచన మానుకోండి.
Ramanath B R15,484 views • 2 months ago

ఎమ్మెల్యే ఏదైనా పెళ్లికి వెళ్తే... పెళ్లి కూతురు వైపు నిలబడి ఆమెను చూస్తూ ''అందమా నీ పేరేంటి అందమా'' అని పాట పాడాలి అని ఎమ్మెల్యే ఈశ్వరరావు స్కిట్. అలా పాడినా పెళ్లి కొడుకు ఏమీ అనుకోడు... పెళ్లి కూతురు అంటే ఎమ్మెల్యేకు అభిమానం అనుకుంటాడు- స్కిట్ లో ఈశ్వరరావు. ఈ సారి ఏమాత్రం నవ్వులు పూయించని డ్రామా.
Ramanath B R21,265 views • 3 months ago
No more content to load
