Konatham Dileep's banner
Konatham Dileep's profile picture

Konatham Dileep

@KonathamDileep51,918 subscribers

#JaiTelangana ✊

Shorts

గత రెండేళ్లలో ఎవరైనా ప్రగతి భవన్ అనే భవంతిని "గడీ" అని పిలవడం విన్నారా? అందులో ఉన్న "బంగారు బాత్‌రూముల గురించీ, 200 బెడ్‌రూముల గురించి ఎవరన్నా యూట్యూబర్లు వీడియోలు చేయగా చూశారా? ఒకప్పుడంటే అందులో కేసీఆర్ అనే "దొర" ఉండేవాడు కాబట్టి వీటన్నిటి వీడియోలు తీయలేదు అనుకుందాం. ఇప్పుడైతే వారికి ఇష్టమైన దళిత కాంగ్రెస్ నాయకుడే అందులో కొలువుదీరాడు కదా. మరి ఇప్పుడైనా అందులోకి దర్జాగా వెళ్లి ఆ బంగారు బాత్‌రూములూ, 200 బెడ్‌రూములూ ఒక హౌస్ టూర్‌లాగా వీడియో చేసి చూపించొచ్చు కదా? వాళ్లు చూపించరు. ఎందుకంటే అక్కడ అవేమీ లేవు కాబట్టి! మరీ ముఖ్యంగా ఇప్పుడు అందులో కేసీఆర్ లేడు కాబట్టి! పదేళ్ల పాటు కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద వ్యక్తిగత ద్వేషంతో కొందరు సాగించిన అబద్ధాల జాతర అంతా ఇంతా కాదు. నిజానికి తెలంగాణలో ఇప్పుడు దొరలు లేరు. తెలంగాణ సాయుధ పోరాటం దొరలను ఊళ్ల నుండి తరిమితే, పటేల్ పోలీస్ యాక్షన్ తరువాత ఇదే దొరలు గాంధీ టోపీ, ఖద్దరు బట్టలు వేసుకుని ఊళ్లలోకి తిరిగొచ్చి కాంగ్రెస్ నాయకులు అయ్యారు అనేది చరిత్ర చెబుతున్న సత్యం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలెక్కించి, దాన్ని పతాక స్థాయికి తీసుకుపోతున్న వేళ, ఉద్యమ వ్యతిరేకులు ఆయనను విమర్శించడానికి వేసిన ఒకానొక అపవాదు ఆయనను "దొర" అని సంబోధించడం. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, ఒక్కో రంగంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నప్పుడు, విమర్శించడానికి వాడిన అపవాదు కూడా అదే "దొర" బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయనను “దొర” అని అతి ఎక్కువగా విమర్శించింది దళిత బహుజనులు కాదు. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ తదితర అగ్రకులాల నాయకులు, మేధావులు, బుద్ధిజీవులే ఆయనకు ఆ ట్యాగ్ తగిలించింది. ప్రగతి భవన్ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం అని, అది కేసీఆర్ స్వంతానికి ఉంచుకునే ఇల్లు కాదు, రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా అందులోనే ఉంటారు, అని ఎన్నిమార్లు చెప్పినా, విననట్టు నటిస్తూ టన్నులు టన్నులు విషం చిమ్మారు కొందరు. తెలంగాణ ప్రజలను అదొక "గడీ" అని నమ్మించి తప్పుదోవ పట్టించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ వచ్చినంక అదే ప్రగతిభవన్‌లో ఉప-ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేరారు. ఆయన కుటుంబంతో కలిసి అందులో హాయిగా ఉంటున్నారు. అన్ని వేడుకలూ చేసుకుంటున్నారు. అప్పటిదాకా ప్రగతి భవన్ మీద నోటికొచ్చిన అబద్ధాలూ చెప్పిన మూక సైలెంట్ అయ్యింది. కేసీఆర్ గారికి హైదరాబాదులో ఈనాటికీ ఉన్నది నందినగర్‌లోని మామూలు నివాసం మాత్రమే. అది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టుకున్న సామాన్యమైన ఇల్లే. ఆ మధ్య కేసీఆర్ గారిని కలవడానికి ఇతర రాష్ట్రం నుండి వచ్చిన ఒక ప్రముఖ నాయకుడు నందినగర్ నివాసం చూసి షాక్ అయ్యాడు. కేసీఆర్ స్థాయి నాయకుడు ఇంత సామాన్యమైన ఇంట్లో ఉంటున్నారా అని. కేసీఆర్ డబ్బు వెనుకనో, పదవుల వెంటనో పరిగెత్తే మనిషి అయ్యుంటే తెలంగాణ ఎప్పటికీ సిద్ధించేది కాదనే సత్యం కొందరికి ఎప్పటికి అర్థమవుద్దో ఏమో! ఆనాడు ఆయన కాంప్రమైజ్ అయితే అవన్నీ ఇవ్వడానికి సమైక్యాంధ్ర లాబీయింగ్ గ్రూపులు సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన లొంగలేదు కాబట్టే తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. పదవులను పూచికపుల్లలా విసిరేశాడు, ప్రాణాలను ఫణంగా పెట్టాడు కాబట్టే తెలంగాణ వచ్చింది. లక్షల కోట్లు పెట్టినా రాని కీర్తి ఆయనకు తెలంగాణ సాధకుడిగా వచ్చింది! ఆనాడైనా, ఏనాడైనా కేసీఆర్ తపన తెలంగాణ కోసమే! కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషంతో ఒక మూక సాగించిన విషప్రచారం తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థంచేసుకోవాలె. (Belated Birthday wishes to Nandini Mallu Garu)

గత రెండేళ్లలో ఎవరైనా ప్రగతి భవన్ అనే భవంతిని "గడీ" అని పిలవడం విన్నారా? అందులో ఉన్న "బంగారు బాత్‌రూముల గురించీ, 200 బెడ్‌రూముల గురించి ఎవరన్నా యూట్యూబర్లు వీడియోలు చేయగా చూశారా? ఒకప్పుడంటే అందులో కేసీఆర్ అనే "దొర" ఉండేవాడు కాబట్టి వీటన్నిటి వీడియోలు తీయలేదు అనుకుందాం. ఇప్పుడైతే వారికి ఇష్టమైన దళిత కాంగ్రెస్ నాయకుడే అందులో కొలువుదీరాడు కదా. మరి ఇప్పుడైనా అందులోకి దర్జాగా వెళ్లి ఆ బంగారు బాత్‌రూములూ, 200 బెడ్‌రూములూ ఒక హౌస్ టూర్‌లాగా వీడియో చేసి చూపించొచ్చు కదా? వాళ్లు చూపించరు. ఎందుకంటే అక్కడ అవేమీ లేవు కాబట్టి! మరీ ముఖ్యంగా ఇప్పుడు అందులో కేసీఆర్ లేడు కాబట్టి! పదేళ్ల పాటు కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద వ్యక్తిగత ద్వేషంతో కొందరు సాగించిన అబద్ధాల జాతర అంతా ఇంతా కాదు. నిజానికి తెలంగాణలో ఇప్పుడు దొరలు లేరు. తెలంగాణ సాయుధ పోరాటం దొరలను ఊళ్ల నుండి తరిమితే, పటేల్ పోలీస్ యాక్షన్ తరువాత ఇదే దొరలు గాంధీ టోపీ, ఖద్దరు బట్టలు వేసుకుని ఊళ్లలోకి తిరిగొచ్చి కాంగ్రెస్ నాయకులు అయ్యారు అనేది చరిత్ర చెబుతున్న సత్యం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలెక్కించి, దాన్ని పతాక స్థాయికి తీసుకుపోతున్న వేళ, ఉద్యమ వ్యతిరేకులు ఆయనను విమర్శించడానికి వేసిన ఒకానొక అపవాదు ఆయనను "దొర" అని సంబోధించడం. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, ఒక్కో రంగంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నప్పుడు, విమర్శించడానికి వాడిన అపవాదు కూడా అదే "దొర" బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయనను “దొర” అని అతి ఎక్కువగా విమర్శించింది దళిత బహుజనులు కాదు. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ తదితర అగ్రకులాల నాయకులు, మేధావులు, బుద్ధిజీవులే ఆయనకు ఆ ట్యాగ్ తగిలించింది. ప్రగతి భవన్ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం అని, అది కేసీఆర్ స్వంతానికి ఉంచుకునే ఇల్లు కాదు, రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా అందులోనే ఉంటారు, అని ఎన్నిమార్లు చెప్పినా, విననట్టు నటిస్తూ టన్నులు టన్నులు విషం చిమ్మారు కొందరు. తెలంగాణ ప్రజలను అదొక "గడీ" అని నమ్మించి తప్పుదోవ పట్టించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ వచ్చినంక అదే ప్రగతిభవన్‌లో ఉప-ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేరారు. ఆయన కుటుంబంతో కలిసి అందులో హాయిగా ఉంటున్నారు. అన్ని వేడుకలూ చేసుకుంటున్నారు. అప్పటిదాకా ప్రగతి భవన్ మీద నోటికొచ్చిన అబద్ధాలూ చెప్పిన మూక సైలెంట్ అయ్యింది. కేసీఆర్ గారికి హైదరాబాదులో ఈనాటికీ ఉన్నది నందినగర్‌లోని మామూలు నివాసం మాత్రమే. అది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టుకున్న సామాన్యమైన ఇల్లే. ఆ మధ్య కేసీఆర్ గారిని కలవడానికి ఇతర రాష్ట్రం నుండి వచ్చిన ఒక ప్రముఖ నాయకుడు నందినగర్ నివాసం చూసి షాక్ అయ్యాడు. కేసీఆర్ స్థాయి నాయకుడు ఇంత సామాన్యమైన ఇంట్లో ఉంటున్నారా అని. కేసీఆర్ డబ్బు వెనుకనో, పదవుల వెంటనో పరిగెత్తే మనిషి అయ్యుంటే తెలంగాణ ఎప్పటికీ సిద్ధించేది కాదనే సత్యం కొందరికి ఎప్పటికి అర్థమవుద్దో ఏమో! ఆనాడు ఆయన కాంప్రమైజ్ అయితే అవన్నీ ఇవ్వడానికి సమైక్యాంధ్ర లాబీయింగ్ గ్రూపులు సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన లొంగలేదు కాబట్టే తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. పదవులను పూచికపుల్లలా విసిరేశాడు, ప్రాణాలను ఫణంగా పెట్టాడు కాబట్టే తెలంగాణ వచ్చింది. లక్షల కోట్లు పెట్టినా రాని కీర్తి ఆయనకు తెలంగాణ సాధకుడిగా వచ్చింది! ఆనాడైనా, ఏనాడైనా కేసీఆర్ తపన తెలంగాణ కోసమే! కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషంతో ఒక మూక సాగించిన విషప్రచారం తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థంచేసుకోవాలె. (Belated Birthday wishes to Nandini Mallu Garu)

111,477 просмотров

డియర్ DGP TELANGANA POLICE గారూ! మీరు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తెలంగాణ పోలీస్ శాఖ ఘోరమైన తప్పిదం చేసింది. గత వారం ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జైలులో ఉన్న సోదరుడు క్రిశాంక్ ను ఇవ్వాళ ఇంకొక అక్రమ కేసులో (353/2025, నిర్మల్ పోలీస్ స్టేషన్) పీటీ వారెంట్ వేసి నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో జరుగుతున్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మిస్ ఇంగ్లాండ్ ను వేధించారు అనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 14 జూలై 2025 నాడు ఇదే కేసుపై నేను వేసిన పిటిషన్ విచారిస్తూ సదరు ఎఫ్ఐఆర్ లో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ మీ పోలీసులు చట్టవిరుద్ధంగా క్రిశాంక్ ను పీటీ వారెంట్ వేసి నిర్మల్ కోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారు? అయినా సోషల్ మీడియా కేసుల్లో యాంత్రిక అరెస్టులు, రిమాండ్ చేయొద్దు అని హైకోర్టు, సుప్రీమ్ కోర్టు తెలంగాణ పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా మీ శాఖ ఎందుకు ఈ విధంగా చేస్తున్నది? హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తే పర్యవసానాలు మీకు తెలియవు అనుకోను. రాజకీయ వత్తిడికి లోనై మీ పోలీసు శాఖ చేసే ప్రతి చట్టవిరుద్ధమైన చర్యకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని మరచిపోకండి వెంటనే Dr.Krishank మీద వేధింపులు ఆపండి!

డియర్ DGP TELANGANA POLICE గారూ! మీరు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తెలంగాణ పోలీస్ శాఖ ఘోరమైన తప్పిదం చేసింది. గత వారం ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జైలులో ఉన్న సోదరుడు క్రిశాంక్ ను ఇవ్వాళ ఇంకొక అక్రమ కేసులో (353/2025, నిర్మల్ పోలీస్ స్టేషన్) పీటీ వారెంట్ వేసి నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో జరుగుతున్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మిస్ ఇంగ్లాండ్ ను వేధించారు అనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 14 జూలై 2025 నాడు ఇదే కేసుపై నేను వేసిన పిటిషన్ విచారిస్తూ సదరు ఎఫ్ఐఆర్ లో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ మీ పోలీసులు చట్టవిరుద్ధంగా క్రిశాంక్ ను పీటీ వారెంట్ వేసి నిర్మల్ కోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారు? అయినా సోషల్ మీడియా కేసుల్లో యాంత్రిక అరెస్టులు, రిమాండ్ చేయొద్దు అని హైకోర్టు, సుప్రీమ్ కోర్టు తెలంగాణ పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా మీ శాఖ ఎందుకు ఈ విధంగా చేస్తున్నది? హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తే పర్యవసానాలు మీకు తెలియవు అనుకోను. రాజకీయ వత్తిడికి లోనై మీ పోలీసు శాఖ చేసే ప్రతి చట్టవిరుద్ధమైన చర్యకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని మరచిపోకండి వెంటనే Dr.Krishank మీద వేధింపులు ఆపండి!

16,757 просмотров

నిండు సభలో రేవంత్ బేరసారాలు! తనకు మద్దతు ఇస్తే, “మంచి- చెడు చూసుకుంటా” అంటూ శాసనసభలోనే బేరసారాలు చేస్తున్న రేవంత్. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజు!

నిండు సభలో రేవంత్ బేరసారాలు! తనకు మద్దతు ఇస్తే, “మంచి- చెడు చూసుకుంటా” అంటూ శాసనసభలోనే బేరసారాలు చేస్తున్న రేవంత్. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజు!

32,431 просмотров

Telangana kids dying as Revanth Reddy busy with football match! Its heartbreaking to watch this kid writhing in pain due to food poisoning. 70 such kids from two Government Residential Schools were hospitalised with food poisoning in last 24 hours. A total of 102 food poisoning incidents reported in government schools of Telangana and 2161 students were hospitalised in the last two years after Revanth assumed power. Shockingly 117 kids died in Government Schools due to various reasons. Rampant corruption ever since Congress came into power, coupled with official apathy is leading to these sad incidents. Like modern day Nero, Revanth is busy splurging thousands of crores to useless events like Miss World Contest, Global Summit and now a football match with Messi. And the kids of Telangana are paying the price! Rahul Gandhi there is blood on your hands!

Telangana kids dying as Revanth Reddy busy with football match! Its heartbreaking to watch this kid writhing in pain due to food poisoning. 70 such kids from two Government Residential Schools were hospitalised with food poisoning in last 24 hours. A total of 102 food poisoning incidents reported in government schools of Telangana and 2161 students were hospitalised in the last two years after Revanth assumed power. Shockingly 117 kids died in Government Schools due to various reasons. Rampant corruption ever since Congress came into power, coupled with official apathy is leading to these sad incidents. Like modern day Nero, Revanth is busy splurging thousands of crores to useless events like Miss World Contest, Global Summit and now a football match with Messi. And the kids of Telangana are paying the price! Rahul Gandhi there is blood on your hands!

15,657 просмотров

Videos

KonathamDileep's profile picture

డియర్ మురళి, ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది. "Better to remain silent and be thought a fool than to speak and remove all doubt" నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత సేఫ్. ఎందుకంటే నువ్వు ట్వీట్ వేసినా, నోరు తెరిచినా నీకంటే పెద్ద వెధవ తెలంగాణలోనే ఎవరూ లేరని ఇంకొంత మందికి తెలుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ వంటి పనుల వల్ల ఏకంగా 89 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందింది అని కేంద్ర ప్రభుత్వ “ఎకనామిక్ సర్వే 2026” మొన్ననే ప్రకటించింది. మీరు కళ్ళుండి చూడ నిరాకరించినా, ఈరోజు కూడా మీ అబద్ధాల బురదను కాళేశ్వరం పంపుల నుండి వస్తున్న జలధారలు కడిగేస్తున్నాయి. సాగునీటి లభ్యత గణనీయంగా పెరగడం, రైతుబంధు పంట పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల లభ్యత, నూతన గోడౌన్ల నిర్మాణం, పండించిన ధాన్యం ఊరిలోనే కొనుగోలు చేయడం వల్ల తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆహారధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచింది అని “తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ 2024” ప్రకటించింది. 420 దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసగించిన దొంగల ముఠాలో సభ్యుడివి నువ్వు. సిగ్గు, లజ్జా అన్ని వదిలేసి ఇంకా బీఆర్ఎస్ మీద ఏడుపులేనా? ఈ పిచ్చి ట్వీట్లు ఆపి నీ బాస్ రేవంత్ ను ప్రజలు ఏ భాషలో తిడుతున్నారో జర ప్రజల్లోకి వెళ్లి చూడు.

Konatham Dileep

26,329 просмотров • 2 месяцев назад

KonathamDileep's profile picture

గౌరవనీయులైన DGP TELANGANA POLICE గారూ! మీకు నిబద్ధత గలిగిన అధికారిగా పేరున్నది. తెలంగాణలో పౌరుల హక్కులను కాలరాసే ప్రయత్నాలు మీ ఆధ్వర్యంలోని పోలీస్ శాఖ చేస్తుండటం చాలా బాధాకరం. ఇవ్వాళ ఉదయం Gowtham Pothagoni ఇంటి మీద సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు విరుచుకుపడి ఇంట్లో వాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తూ సోదాలు ఎందుకు జరిపారు? వారంట్, యూనిఫారం లేకుండా ఇట్లా ఇండ్ల మీదికి పోవద్దు అనే నిబంధన కూడా మీ పోలీసులు పాటించరా? కనీసం ఆయన మీద పెట్టిన కేసేమిటో కూడా చెప్పకుండా ఈ దౌర్జన్యం ఏమిటి? సరిగ్గా వారాంతం అయిన శుక్రవారం రోజునే ఎందుకు మీ పోలీసులు గౌతమ్ ఇంటి మీద దాడి చేశారు? ప్రజల హక్కులు కాలరాసేలా, కోర్టు నుండి ఉపశమనం పొందకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు కుట్రలో మీరెందుకు భాగస్వాములు అవుతున్నారు?

Konatham Dileep

119,603 просмотров • 1 год назад

KonathamDileep's profile picture

చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు రంగరాజన్ గారి మీద కొంతమంది మతోన్మాదులు చేసిన దాడి దుర్మార్గం. "రామ రాజ్యం" పేరుతో కొంతమంది ఉన్మాదులు ఆయన ఇంటికి వెళ్లి మరీ దాడిచేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. రంగరాజన్ గారు విద్యాధికుడు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టభద్రుడు. అనేక సంవత్సరాలు కార్పొరేట్ ఉద్యోగం చేసి, అనంతరం తండ్రి సౌందర రాజన్ బాటలో నడిచి అర్చకత్వం చేపట్టారు. గతంలో ఒక కంపెనీలో చాలా స్వల్ప కాలం నా సహోద్యోగిగా ఉన్నప్పుడు ఆయనను దగ్గరగా చూసే అవకాశం లభించింది. మృదుభాషి. మంచి కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి హిందూ మతం మీద ప్రేమతో, దేవుడి మీద అపరిమితమైన భక్తితో దేవాలయ అర్చకుడిగా పూర్తికాలం పనిచేస్తున్న రంగరాజన్ వంటి వారి మీద కూడా అతివాదులు దాడులు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారుతున్నదో అర్థమవుతోంది. హిందూ మతస్తులు మూడున్నర కోట్ల మంది దేవుళ్లను నమ్ముతారు. ఇప్పుడీ అతివాదులు రాముడి పేరు చెప్పుకుని స్వంత మతస్తుల మీదనే దాడి చేయడం చివరికి హిందూ మతానికే చేటు చేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమే మన భారత సమాజపు విశేష లక్షణం. భిన్నాభిప్రాయాన్ని సహించని ఒక అసహన సమాజం నిర్మాణం చేసే శక్తులు చివరికి స్వంత మతస్తుల మీదికే వస్తాయని మరోసారి నిరూపణ అవుతోంది. పోలీసులు వెంటనే బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. Rangarajan chilkur

Konatham Dileep

99,282 просмотров • 1 год назад

KonathamDileep's profile picture

Welcome back comrade Dr.Krishank Jai Telangana ✊

Konatham Dileep

10,766 просмотров • 1 месяц назад

KonathamDileep's profile picture

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నదో ఇదొక మచ్చుతునక! కాంగ్రెస్ మంత్రి ఒకరు మహిళా అధికారులను, జర్నలిస్టులను వేధిస్తున్నాడు అని మొన్న రాజ్ న్యూస్ ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది. వెంటనే ఆ ఛానెల్ ను బెదిరించి ఆ వీడియో డిలీట్ చేయించింది రేవంత్ రెడ్డి కార్యాలయం ఆ వీడియోను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ Dr.Krishank పోస్ట్ చేస్తే దాన్ని తొలగించాలని ట్విట్టర్ యాజమాన్యానికి సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ తో ఒక లేఖ రాయించింది కాంగ్రెస్ సర్కారు! ఇప్పుడీ వీడియోను రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి చేరేలా చూసి, ఈ కాంగ్రెస్ మంత్రుల అరాచకం లోకానికి తెలియజేయడం మన బాధ్యత.

Konatham Dileep

17,474 просмотров • 5 месяцев назад