
Dr. Chandra Sekhar Pemmasani
@PemmasaniOnX • 42,774 subscribers
Minister of State for Rural Development and Communications, Govt. of India | Member of Parliament, Guntur, Andhra Pradesh | Telugu Desam Party
Shorts
Videos

I am really thankful to Andhra Pradesh CM N Chandrababu Naidu and also PM Modi and all the BJP leadership for giving me this opportunity and trusting me to do well. In addition, I am thankful to God for giving me two dynamic people Shivraj Singh Chouhan and Jyotiraditya Scindia, for mentorship and helping take the nation forward. #pemmasaniforguntur #pemmasanichandrasekhar #manapemmasani #guntur
Dr. Chandra Sekhar Pemmasani797,877 Aufrufe • vor 2 Jahren

శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు - సమన్వయంతో సాధించిన రికార్డు విజయం గుంటూరు రైల్వే ట్రాక్పై ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన వంతెన తొలగింపు పనులు విజయవంతంగా పూర్తికావడం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని కేవలం 21–22 రోజుల్లోనే సాధించడం ఆనందంగా ఉంది. అత్యంత జాగ్రత్తతో, సమన్వయంతో పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, కార్మికులకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయానికి తోడ్పడిన అనూర్ గ్రూప్స్ మరియు ACTS డిజైన్స్ & సొల్యూషన్స్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు.
Dr. Chandra Sekhar Pemmasani55,049 Aufrufe • vor 5 Monaten

పూర్తి వీడియో లింక్ (Full video link) 1)నెలవారీ ఖర్చుల పిడిఎఫ్ లింక్ : తెలుగు - English - . 2)50-30-20 నియమం పిడిఎఫ్ లింక్ : 3)భవిష్యత్తు భద్రత కోసం ప్రయోజనకరమైన మార్గదర్శకాల పిడిఎఫ్ లింక్ : సంపాదించే ప్రతీ చేతికీ పొదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నెలకు రూ.30 వేలు మొదలు రూ. 2 లక్షలు దాకా సంపాదించే ప్రతీ ఒక్కరూ రూ.6 - 45 వేల వరకు పొదుపు చేయవచ్చు. నేను నా నెలవారీ ఇంటి బడ్జెట్ ప్రణాళికలను ఏ విధంగా నిర్వహించుకుం టున్నానో మీరూ తెలుసుకునేలా ఈ కింద లింక్లను క్లిక్ చేయడం ద్వారా ఇంటి ఆదాయ వ్యయాల ఇతర సమాచారాలను పీడీఎఫ్ రూపంలో పొందవచ్చు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది. మీ అందరూ ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా షేర్ చేయగలరని మనవి. ముఖ్యంగా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత మందికి చేరువ చేయగలరని ఆశిస్తున్నాను
Dr. Chandra Sekhar Pemmasani115,586 Aufrufe • vor 1 Jahr

“డిజిటల్ అరెస్ట్” మోసాలతో జాగ్రత్త! 🚨 ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత కాల్స్, సందేహాస్పద లింకులు, OTPలు - ఎప్పటికీ షేర్ చేయకండి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి లేదా 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయండి. స్మార్ట్గా ఉండండి… సురక్షితంగా ఉండండి. ఒక్క క్లిక్ మీ భవిష్యత్తును మార్చొచ్చు - జాగ్రత్తగా ఆలోచించండి.
Dr. Chandra Sekhar Pemmasani22,120 Aufrufe • vor 2 Monaten

ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న వందనా దేవి గారికి, సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. కార్యకర్తను గద్దెను ఎక్కించగల సత్తా కలిగిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. పార్టీ కోసం శ్రమించిన వారిని టిడిపి గుర్తిస్తుందనడానికి వందనా దేవి గారు ఒక ఉదాహరణ. నియోజకవర్గం మొదలు రాష్ట్రస్థాయి వరకు గ్రంథాలయాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నడుము కట్టింది. #pemmasani #tdp
Dr. Chandra Sekhar Pemmasani23,799 Aufrufe • vor 5 Monaten

ఆంధ్రప్రదేశ్ లోనే తొలి ఉచిత PET-SCAN యంత్రాన్ని రూ. 18 కోట్ల విలువ తో గుంటూరు GGH - NATCO క్యాన్సర్ సెంటర్లో... వైద్య & ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యేలు శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్, రామాంజనేయులు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు PET-SCAN కోసం పేదకుటుంబాలకు చెందిన రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.25 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అదే సేవ NATCO క్యాన్సర్ సెంటర్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. క్యాన్సర్ను ముందుగానే గుర్తించడంలో PET-SCAN కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం. “ఆరోగ్య ఆంధ్ర – అందరికీ నాణ్యమైన వైద్యం” అనే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.
Dr. Chandra Sekhar Pemmasani12,750 Aufrufe • vor 2 Monaten

గుంటూరు మరియు ఏపీ నుంచి ఢిల్లీకి వచ్చిన #SHG మహిళలతో ఆత్మీయంగా సమావేశం అవడం ఆనందం కలిగించింది. వారి జీవిత ప్రయాణాలు ఇబ్బందులు పట్టుదల సాధించిన విజయాలు తెలుసుకోవడం మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. #LakhpatiDidi కార్యక్రమం, డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని SHG మహిళలు స్థిరమైన ఉపాధి మార్గాలతో తమ కుటుంబాల భవిష్యత్తును మలుచుకునే అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి, ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Dr. Chandra Sekhar Pemmasani20,238 Aufrufe • vor 5 Monaten

ప్రజారోగ్యంలో ఇది గొప్ప ముందడుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని నడింపాలెం గ్రామంలో రూ.94 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి మరియు కేంద్ర యోగా, సహజ చికిత్స పరిశోధన సంస్థను కేంద్రం నుండి మంజూరు చేయించుకోవడం సంతోషంగా ఉంది. 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు నిధుల వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే సమకూర్చనుంది. ఇందులో వైద్య సదుపాయాలతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా నివాస గృహాలు వుంటాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి (I/C) శ్రీ Prataprao Jadhav గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ N Chandrababu Naidu గారి దృఢ నాయకత్వంలో అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు, ఈ ప్రాజెక్టు మరొక మైలురాయి గా నిలవనుంది.
Dr. Chandra Sekhar Pemmasani31,217 Aufrufe • vor 1 Jahr

Hornbill — the heartbeat of Nagaland in one frame.
Dr. Chandra Sekhar Pemmasani20,566 Aufrufe • vor 7 Monaten

ఉగాది పండుగకు ముందే గుంటూరు పార్లమెంటు ప్రజలకు షడ్రసోపేతమైన మరో శుభవార్త చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మంగళగిరి - నిడమర్రు గ్రామాల మధ్య రూ.129.18 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు వరసల ఆర్ఓబిని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించగలిగాం. ఈ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం సంతోషంగా ఉంది. #NarendraModi #ChandrababuNaidu #AshwiniVaishnaw #PawanKalyan #NaraLokesh #pemmasani #mangalagiri #railway #development #guntur #amaravathi #TDP
Dr. Chandra Sekhar Pemmasani34,001 Aufrufe • vor 1 Jahr

A moment that will stay etched in my soul forever. Standing in the Lok Sabha today, I could feel the weight of 1,631 days of sacrifice… the silent tears, the unbreakable resolve, and the extraordinary courage of our farmers who never gave up on Amaravati. As a son of this sacred soil, speaking on behalf of the people of Amaravati was not just an honour — it was deeply personal. It felt like giving voice to a dream that refused to die. My deepest gratitude to Hon’ble PM Shri Narendra Modi ji, Hon’ble CM Shri N Chandrababu Naidu Garu, and Hon’ble Dy CM Shri Pawan Kalyan Garu for standing firm and securing the future of Andhra Pradesh. Heartfelt thanks to Hon’ble HM Shri Amit Shah ji, Shri Nityanand Rai ji, and Shri Lokesh Nara Garu for their relentless efforts in turning this dream into reality. Today, uncertainty ends. Hope triumphs. Amaravati is not just a capital — it is our pride, our identity, our destiny. Jai Hind! Jai Andhra! Jai Amaravati! అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే ఈ చారిత్రక ఘట్టంలో భాగమవడం గర్వంగా భావిస్తున్నాను. 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన 29 గ్రామాల రైతుల విశ్వాసం, 1631 రోజుల పోరాటం… ఇవే ఈ రాజధానికి పునాది రాళ్లు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మద్దతు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కట్టుబాటు… ఈ మూడు శక్తులు కలిసి అమరావతిని భవిష్యత్ అభివృద్ధి కేంద్రంగా నిలబెడుతున్నాయి. రాజధానులు ఎన్నికల కోసం కాదు… తరతరాల భవిష్యత్తు కోసం నిర్మించబడతాయి. జై అమరావతి. జై ఆంధ్రప్రదేశ్.
Dr. Chandra Sekhar Pemmasani11,663 Aufrufe • vor 3 Monaten

నా సొంత మనుషుల్లా భావించే మా ఉద్యోగులతో కలిసి ఉగాది వేడుకలను గుంటూరులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అనునిత్యం ఎదురయ్యే పరుగులు, శ్రమ, ఒత్తిడిని కాసేపు పక్కన పెట్టి - ఒక నమ్మకం, అనుబంధంతో నిండిన ఆత్మీయ కలయికలాగా ఈ వేడుకను ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం కనువిందు కలిగించింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. #ugadi2026
Dr. Chandra Sekhar Pemmasani12,460 Aufrufe • vor 4 Monaten

గుంటూరు జిల్లాతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, అమెరికాలో కష్టపడి సంపాదించిన సంపదను సమాజం కోసం సహాయం చేస్తున్న డా. సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి కళ్యాణి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు ఇచ్చిన విరాళంతో పెదపరిమిలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను వారితో కలిసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా పాల్గొనడం సంతోషంగా ఉంది.
Dr. Chandra Sekhar Pemmasani13,368 Aufrufe • vor 4 Monaten

ఆంధ్ర ప్రదేశ్లో జగన్ లిక్కర్ బ్రాండ్స్ వల్ల ఎంతటి అనర్థం జరుగుతోందో ఒక డాక్టర్గా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ప్రజల ప్రాణాలతో జగన్ చలగాటం ఆడుతున్నారు. నకిలీ లిక్కర్తో జగన్ చేసిన ఈ ఘోరం ప్రజలంతా తెలుసుకోవాలి. #pemmasaniforguntur #VoteForTDP #VoteForDevelopment #pemmasani #manapemmasani #voteforpemmasani #AndhraPradesh #Guntur
Dr. Chandra Sekhar Pemmasani43,539 Aufrufe • vor 2 Jahren

స్వదేశ దర్శన్ 2.0 క్రింద ₹97.52 కోట్లతో సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను ఆమోదించిన ప్రధాని శ్రీ Narendra Modi గారికి మరియు కేంద్ర పర్యాటక మంత్రి శ్రీ Gajendra Singh Shekhawat గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారికి మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి శ్రీ Kandula Durgesh గారికి నా కృతజ్ఞతలు. Grateful to Hon’ble PM Shri Narendra Modi ji and Union Tourism Minister Shri Gajendra Singh Shekhawat ji for approving the ₹97.52 Cr Suryalanka Beach Front Development Project under Swadesh Darshan 2.0. I also thank Hon’ble CM Shri Nara Chandrababu Naidu garu, Deputy CM Shri Pawan Kalyan garu, and AP Tourism Minister Shri Kandula Durgesh garu for their relentless efforts in making this vision a reality. #NarendraModiji #ChandrababuNaidu #Gajendrasinghshekhawat #pemmasani #PawanKalyan #Kanduladurgesh #TDP #Suryalankabeach
Dr. Chandra Sekhar Pemmasani29,068 Aufrufe • vor 1 Jahr

6 ఏళ్ల నిరీక్షణకు న్యాయం! 2019లో నరేగా కింద పనులు చేసిన 3.5 లక్షల మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరట. రూ.180 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదలకు కేంద్రం అనుమతించింది. కూటమి ప్రభుత్వం కేంద్రంతో కలిసి పాత వర్కులను తిరిగి ఓపెన్ చేసి, వచ్చే 30 రోజుల్లోగా బిల్లుల చెల్లింపుకు చర్యలు ప్రారంభించింది. ఇది చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం, ధర్మబద్ధ పాలనకు నిదర్శనం. A big day for small material suppliers in Andhra Pradesh! Pending payments worth ₹180 Cr under NREGS (2019) — unjustly closed by YS Jagan Mohan Reddy’s govt — have now been reopened by the new coalition govt. Today’s decision brings a sigh of relief to those who suffered for over 6 years due to YS Jagan Mohan Reddy’s politics of vendetta and harassment. This was made possible only through the decisive leadership and relentless efforts of CM N Chandrababu Naidu Garu, the cooperation of Dy CM Pawan Kalyan Garu, and strong Centre–State coordination. Gratitude to PM Narendra Modi Ji & RD Minister Shivraj Singh Chouhan Ji for standing by justice. 🙏 #JusticeForSmallMaterialSuppliers #NDAWorks #NarendraModi #NaraChandrababuNaidu #Pawankalyan #NaraLokesh #Pemmasani #pemmasanichandrasekhar #AndhraPradesh
Dr. Chandra Sekhar Pemmasani24,152 Aufrufe • vor 1 Jahr

Great News for Gunturu! The new Rail Over Bridge between Guntur and Nambur stations will transform the region by eliminating level crossing stops, reducing train-vehicle accidents and improving traffic flow and safety. We thank the Hon'ble Minister of Ministry of Railways Shri Ashwini Vaishnaw Ji and MoS Railways Shri V. Somanna Ji for their support. This project demonstrates the NDA Government's commitment, under Hon'ble PM Shri Narendra Modi Ji, Hon’ble CM Shri N Chandrababu Naidu Garu, and Hon’ble Deputy CM Shri Pawan Kalyan Garu, to prioritize citizen safety and development in #Guntur district, Andhra Pradesh.
Dr. Chandra Sekhar Pemmasani30,574 Aufrufe • vor 1 Jahr