
Dr. Chandra Sekhar Pemmasani
@PemmasaniOnX • 43,138 subscribers
Minister of State for Rural Development and Communications, Govt. of India | Member of Parliament, Guntur, Andhra Pradesh | Telugu Desam Party
Shorts
Videos

110 ఏళ్ల చరిత్రకు ఆధునిక రూపం… గుంటూరులోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆధునికీకరించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రూ.20 కోట్ల వ్యయంతో సెల్లార్ + G+2 అంతస్తులతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి CCL చైర్మన్ శ్రీ చల్లా రాజేంద్రప్రసాద్ గారి సహకారంతో MOU చేసుకున్నాం. 1915లో ప్రారంభమైన ఈ గ్రంథాలయం దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు జ్ఞాన కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో మరింత మెరుగైన వాతావరణాన్ని విద్యార్థులకు అందించేందుకు నూతన భవనం నిర్మించబోతున్నాం. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తూ, గుంటూరును విద్యా కేంద్రంగా మరింత బలోపేతం చేయడం మా లక్ష్యం
Dr. Chandra Sekhar Pemmasani51,333 görüntüleme • 1 ay önce

I am really thankful to Andhra Pradesh CM N Chandrababu Naidu and also PM Modi and all the BJP leadership for giving me this opportunity and trusting me to do well. In addition, I am thankful to God for giving me two dynamic people Shivraj Singh Chouhan and Jyotiraditya Scindia, for mentorship and helping take the nation forward. #pemmasaniforguntur #pemmasanichandrasekhar #manapemmasani #guntur
Dr. Chandra Sekhar Pemmasani797,877 görüntüleme • 2 yıl önce

పెదనందిపాడు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.1.90 కోట్లతో ఆధునిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. ఆపరేషన్ థియేటర్, ల్యాబొరేటరీ, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ సదుపాయాలతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకువచ్చి, గ్రామీణ ప్రాంతాల్లోనే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ భవనం కనీసం 50 ఏళ్ల పాటు నాణ్యతతో ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించాము.
Dr. Chandra Sekhar Pemmasani10,760 görüntüleme • 15 gün önce

శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు - సమన్వయంతో సాధించిన రికార్డు విజయం గుంటూరు రైల్వే ట్రాక్పై ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన వంతెన తొలగింపు పనులు విజయవంతంగా పూర్తికావడం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని కేవలం 21–22 రోజుల్లోనే సాధించడం ఆనందంగా ఉంది. అత్యంత జాగ్రత్తతో, సమన్వయంతో పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, కార్మికులకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయానికి తోడ్పడిన అనూర్ గ్రూప్స్ మరియు ACTS డిజైన్స్ & సొల్యూషన్స్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు.
Dr. Chandra Sekhar Pemmasani55,049 görüntüleme • 7 ay önce

పూర్తి వీడియో లింక్ (Full video link) 1)నెలవారీ ఖర్చుల పిడిఎఫ్ లింక్ : తెలుగు - English - . 2)50-30-20 నియమం పిడిఎఫ్ లింక్ : 3)భవిష్యత్తు భద్రత కోసం ప్రయోజనకరమైన మార్గదర్శకాల పిడిఎఫ్ లింక్ : సంపాదించే ప్రతీ చేతికీ పొదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నెలకు రూ.30 వేలు మొదలు రూ. 2 లక్షలు దాకా సంపాదించే ప్రతీ ఒక్కరూ రూ.6 - 45 వేల వరకు పొదుపు చేయవచ్చు. నేను నా నెలవారీ ఇంటి బడ్జెట్ ప్రణాళికలను ఏ విధంగా నిర్వహించుకుం టున్నానో మీరూ తెలుసుకునేలా ఈ కింద లింక్లను క్లిక్ చేయడం ద్వారా ఇంటి ఆదాయ వ్యయాల ఇతర సమాచారాలను పీడీఎఫ్ రూపంలో పొందవచ్చు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది. మీ అందరూ ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా షేర్ చేయగలరని మనవి. ముఖ్యంగా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత మందికి చేరువ చేయగలరని ఆశిస్తున్నాను
Dr. Chandra Sekhar Pemmasani115,607 görüntüleme • 1 yıl önce

“డిజిటల్ అరెస్ట్” మోసాలతో జాగ్రత్త! 🚨 ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత కాల్స్, సందేహాస్పద లింకులు, OTPలు - ఎప్పటికీ షేర్ చేయకండి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి లేదా 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయండి. స్మార్ట్గా ఉండండి… సురక్షితంగా ఉండండి. ఒక్క క్లిక్ మీ భవిష్యత్తును మార్చొచ్చు - జాగ్రత్తగా ఆలోచించండి.
Dr. Chandra Sekhar Pemmasani22,120 görüntüleme • 4 ay önce

ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న వందనా దేవి గారికి, సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. కార్యకర్తను గద్దెను ఎక్కించగల సత్తా కలిగిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. పార్టీ కోసం శ్రమించిన వారిని టిడిపి గుర్తిస్తుందనడానికి వందనా దేవి గారు ఒక ఉదాహరణ. నియోజకవర్గం మొదలు రాష్ట్రస్థాయి వరకు గ్రంథాలయాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నడుము కట్టింది. #pemmasani #tdp
Dr. Chandra Sekhar Pemmasani23,846 görüntüleme • 7 ay önce

గుంటూరు మరియు ఏపీ నుంచి ఢిల్లీకి వచ్చిన #SHG మహిళలతో ఆత్మీయంగా సమావేశం అవడం ఆనందం కలిగించింది. వారి జీవిత ప్రయాణాలు ఇబ్బందులు పట్టుదల సాధించిన విజయాలు తెలుసుకోవడం మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. #LakhpatiDidi కార్యక్రమం, డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని SHG మహిళలు స్థిరమైన ఉపాధి మార్గాలతో తమ కుటుంబాల భవిష్యత్తును మలుచుకునే అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి, ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Dr. Chandra Sekhar Pemmasani20,238 görüntüleme • 7 ay önce

ఆంధ్రప్రదేశ్ లోనే తొలి ఉచిత PET-SCAN యంత్రాన్ని రూ. 18 కోట్ల విలువ తో గుంటూరు GGH - NATCO క్యాన్సర్ సెంటర్లో... వైద్య & ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యేలు శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్, రామాంజనేయులు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు PET-SCAN కోసం పేదకుటుంబాలకు చెందిన రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.25 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అదే సేవ NATCO క్యాన్సర్ సెంటర్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. క్యాన్సర్ను ముందుగానే గుర్తించడంలో PET-SCAN కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం. “ఆరోగ్య ఆంధ్ర – అందరికీ నాణ్యమైన వైద్యం” అనే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.
Dr. Chandra Sekhar Pemmasani12,750 görüntüleme • 4 ay önce

ప్రజారోగ్యంలో ఇది గొప్ప ముందడుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని నడింపాలెం గ్రామంలో రూ.94 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి మరియు కేంద్ర యోగా, సహజ చికిత్స పరిశోధన సంస్థను కేంద్రం నుండి మంజూరు చేయించుకోవడం సంతోషంగా ఉంది. 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు నిధుల వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే సమకూర్చనుంది. ఇందులో వైద్య సదుపాయాలతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా నివాస గృహాలు వుంటాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి (I/C) శ్రీ Prataprao Jadhav గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ N Chandrababu Naidu గారి దృఢ నాయకత్వంలో అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు, ఈ ప్రాజెక్టు మరొక మైలురాయి గా నిలవనుంది.
Dr. Chandra Sekhar Pemmasani31,240 görüntüleme • 1 yıl önce

ఆంధ్ర ప్రదేశ్లో జగన్ లిక్కర్ బ్రాండ్స్ వల్ల ఎంతటి అనర్థం జరుగుతోందో ఒక డాక్టర్గా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ప్రజల ప్రాణాలతో జగన్ చలగాటం ఆడుతున్నారు. నకిలీ లిక్కర్తో జగన్ చేసిన ఈ ఘోరం ప్రజలంతా తెలుసుకోవాలి. #pemmasaniforguntur #VoteForTDP #VoteForDevelopment #pemmasani #manapemmasani #voteforpemmasani #AndhraPradesh #Guntur
Dr. Chandra Sekhar Pemmasani43,539 görüntüleme • 2 yıl önce

స్వదేశ దర్శన్ 2.0 క్రింద ₹97.52 కోట్లతో సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను ఆమోదించిన ప్రధాని శ్రీ Narendra Modi గారికి మరియు కేంద్ర పర్యాటక మంత్రి శ్రీ Gajendra Singh Shekhawat గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారికి మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి శ్రీ Kandula Durgesh గారికి నా కృతజ్ఞతలు. Grateful to Hon’ble PM Shri Narendra Modi ji and Union Tourism Minister Shri Gajendra Singh Shekhawat ji for approving the ₹97.52 Cr Suryalanka Beach Front Development Project under Swadesh Darshan 2.0. I also thank Hon’ble CM Shri Nara Chandrababu Naidu garu, Deputy CM Shri Pawan Kalyan garu, and AP Tourism Minister Shri Kandula Durgesh garu for their relentless efforts in making this vision a reality. #NarendraModiji #ChandrababuNaidu #Gajendrasinghshekhawat #pemmasani #PawanKalyan #Kanduladurgesh #TDP #Suryalankabeach
Dr. Chandra Sekhar Pemmasani29,143 görüntüleme • 1 yıl önce

Great News for Gunturu! The new Rail Over Bridge between Guntur and Nambur stations will transform the region by eliminating level crossing stops, reducing train-vehicle accidents and improving traffic flow and safety. We thank the Hon'ble Minister of Ministry of Railways Shri Ashwini Vaishnaw Ji and MoS Railways Shri V. Somanna Ji for their support. This project demonstrates the NDA Government's commitment, under Hon'ble PM Shri Narendra Modi Ji, Hon’ble CM Shri N Chandrababu Naidu Garu, and Hon’ble Deputy CM Shri Pawan Kalyan Garu, to prioritize citizen safety and development in #Guntur district, Andhra Pradesh.
Dr. Chandra Sekhar Pemmasani30,574 görüntüleme • 1 yıl önce