YS Sharmila's banner
YS Sharmila's profile picture

YS Sharmila

@realyssharmila134,495 subscribers

President of Andhra Pradesh Congress Committee. Daughter of YSR. A true Secularist. Believes in Equality & Independence. Fights for people’s welfare.

Shorts

మహానేత, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం. కూటమి Telugu Desam Party JanaSena Party BJP ANDHRA PRADESH ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబు N Chandrababu Naidu గారి రాజకీయ కక్ష్యకు నిదర్శనం. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద YSR విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ INC Andhra Pradesh పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్య. మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని , సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీసు యంత్రాంగానికి తగదు. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలి. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. రాష్ట్రంలో YSR విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే భాద్యత వహించాలి. వెంటనే YSR విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా. Andhra Pradesh Police DGP Andhra Pradesh Anitha Vangalapudi

మహానేత, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం. కూటమి Telugu Desam Party JanaSena Party BJP ANDHRA PRADESH ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబు N Chandrababu Naidu గారి రాజకీయ కక్ష్యకు నిదర్శనం. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద YSR విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ INC Andhra Pradesh పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్య. మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని , సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీసు యంత్రాంగానికి తగదు. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలి. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. రాష్ట్రంలో YSR విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే భాద్యత వహించాలి. వెంటనే YSR విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా. Andhra Pradesh Police DGP Andhra Pradesh Anitha Vangalapudi

80,815 Aufrufe

Met Honorable Telangana CM Anumula Revanth Reddy Garu, invited him for my son YS Raja Reddy's engagement and wedding ceremonies. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి నా కుమారుడు వైయస్ రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహా వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. Revanth Reddy

Met Honorable Telangana CM Anumula Revanth Reddy Garu, invited him for my son YS Raja Reddy's engagement and wedding ceremonies. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి నా కుమారుడు వైయస్ రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహా వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. Revanth Reddy

101,297 Aufrufe

ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బతికే ఉన్నారా? బతికే ఉంటే విద్యార్థుల గోస కంటికి కనపడటం లేదా? 900 మంది చదివే కళాశాలలో ఒక్క బాత్ రూం ఉండటమా? టాయిలెట్ల కోసం విద్యాశాఖ మంత్రి ఇలాకాలోనే పిల్లలు రోడ్డెక్కడమా? పిల్లలకు కనీసం బాత్ రూంలు కట్టని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? 1/3

ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బతికే ఉన్నారా? బతికే ఉంటే విద్యార్థుల గోస కంటికి కనపడటం లేదా? 900 మంది చదివే కళాశాలలో ఒక్క బాత్ రూం ఉండటమా? టాయిలెట్ల కోసం విద్యాశాఖ మంత్రి ఇలాకాలోనే పిల్లలు రోడ్డెక్కడమా? పిల్లలకు కనీసం బాత్ రూంలు కట్టని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? 1/3

27,212 Aufrufe

Videos

realyssharmila's profile picture

From 'Vote Chori' to 'Seat Chori' ! 'The Election Commission of BJP' is now fully hand-in-glow with Modi Narendra Modi & Co. to trample upon the democratic values built over years. The rejection of Ms. Meenakshi Natarajan's Rajya Sabha nomination is yet another example of how constitutional institutions are increasingly being bent to serve political interests. Such actions only reinforce concerns that independent bodies are being pressured to act in a manner that benefits the ruling dispensation, eroding public trust in the democratic process. Democracy cannot survive without strong, independent institutions, and every attempt to undermine them must be challenged with resolve and conviction. “ఇప్పటిదాకా ఓట్ చోరీ.. ఇకపై సీట్ చోరీ.” ప్రధాని మోదీజీ చేస్తున్నది ప్రజాస్వామ్యంపై దాడి. ఎన్నికల కమీషన్ ను కీలుబొమ్మ చేసి ఆడుతున్నది రాజకీయ వికృత క్రీడ. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ బీజేపీతో కలిసి CEC చేసిన కుట్ర. ఇలాంటి చర్యలు రాజ్యాంగ విలువలను అపహాస్యం చేయడమే. మోదీ గారికి ఎన్నికల కమీషన్ తొత్తు అనడానికి నిదర్శనమే. పోరాడే ప్రజల గొంతును రాజ్యాంగ సంస్థలతో కలిసి అణచి వేయాలని చూడటమే. రాజకీయంగా ఎదుర్కోనే దమ్ములేక, కేసులని, సాంకేతిక కారణాలని ప్రతిపక్షాలను ఎన్నికల బరిలో నుంచి తప్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను ఎన్నికల సంఘం పూర్తిగా వెల్లడించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడటం కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. Congress INC Andhra Pradesh Rahul Gandhi Priyanka Gandhi Vadra Mallikarjun Kharge K C Venugopal Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப

YS Sharmila

122,746 Aufrufe • vor 1 Tag

realyssharmila's profile picture

ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయుడికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ గారు అమలు చేసిన సంస్కరణల పుణ్యమే. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి,ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు. ఐటీ రంగానికి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడుగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ గారిది ఎన్నటికీ చెరగని ముద్ర. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు , యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి పాలన ఆచరణీయం. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ గారు చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. Congress INC Andhra Pradesh Rahul Gandhi Priyanka Gandhi Vadra Mallikarjun Kharge K C Venugopal

YS Sharmila

49,745 Aufrufe • vor 21 Tagen

realyssharmila's profile picture

అభివృద్ధికి నిర్వచనం, సంక్షేమానికి సంతకం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. జనహితమే ప్రజాహితం దివంగత ముఖ్యమంత్రి మూలసూత్రం. సరిగ్గా 22 ఏళ్ల క్రితం మే 14 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆనాడు YSR ప్రమాణ స్వీకారం రాష్ట్రానికి నవశకం. పెట్టిన తొలిసంతకం,అమలు చేసిన పథకాలు నేటికి రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. ప్రజల మనసులు గెలిచి, ప్రేమాభిమానాలు చూరగొని, దేవుడి పటాల పక్కన స్థానం పొందిన ఏకైక నాయకుడు కాంగ్రెస్ నేత YSR. కోట్లాది మంది జనం నేటికి YSR ను మరవలేదంటే ఆయన 5 ఏళ్ల పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బెంచ్ మార్క్. YSR బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, రాజశేఖర్ రెడ్డి అభిమానులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. YSR ఐడియాలజీ ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే. YSR వారసత్వం కొనసాగేది కాంగ్రెస్ లోనే. YSR ఆశయ సాధన జరిగేది కాంగ్రెస్ తోనే. YSR ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి. YSR అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే YSR. ఆనాటి సువర్ణ యుగాన్ని మళ్లీ సాకారం చేసేందుకు మహానేత కడదాకా బ్రతికిన కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తెద్దాం. దివంగత నేత ఆశయాలను అమలు చేసేలా చేయి చేయి కలుపుదాం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేద్దామని నాన్న అభిమానులను కోరుకుంటున్నా. Congress INC Andhra Pradesh #YSR

YS Sharmila

39,927 Aufrufe • vor 28 Tagen

realyssharmila's profile picture

Dear Pawan Kalyan Pawan Kalyan garu, one swallow does not make a summer, and one stroke of victory cannot be an eternal measure to your power and authority. Your remarks in Tirupati, yesterday, targeting Rahul Gandhi Shri Rahul Gandhi ji, is baseless and unacceptable. The Congress condemns these remarks, unwarrantedly bringing Rahul Gandhi into your religious politics. This is yet another facet of your diversion politics, since people are slowly beginning to feel the discontent brewing out of your failure to keep poll promises. The Congress demands that you tender an unconditional apology to Shri Rahul Gandh ji. We also advise you to exercise restraint, not pitting people of one religion against another, and widen the chasm further. Please focus on bringing more funds to the state and fulfil the poll promises at the earliest. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వేషం, భాషా రెండు మారాయి. సెక్యూలర్ పార్టీగా ఉన్న JanaSena Party జనసేన కాస్త రైటిస్ట్ పార్టీగా మారిందా..? బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే... ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా..? ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా..? ఇతర మతాల వాళ్ళకు మనోభావాలు ఉండవా..? మతం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం RSS సిద్ధాంతమైతే.. అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడు. ప్రధాని మోడీ Narendra Modi దర్శకత్వంలో యాక్టింగ్ చేసే మీకు శ్రీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే నైతికత లేదు. మణిపూర్ , గోద్రాలలో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా..? అటువంటి పార్టీకి మద్దతు ఇచ్చిన మీరు లౌకికవాదం పాటించాలని చెప్తే నమ్మమంటారా..? ఈ దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. Congress INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப Dr.Palak Verma

YS Sharmila

424,110 Aufrufe • vor 1 Jahr

realyssharmila's profile picture

దళిత క్రిస్టియన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. ఈ తీర్పు దళిత క్రిస్టియన్ల మనోభావాలను, వారి జీవితాలను దెబ్బతీసిన తీర్పు. గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో న్యాయం కన్నా .. కోర్టుకి ఉత్సాహం కనిపించింది. అణగారిన వర్గాలకు న్యాయం దక్కాలనే తపన కంటే,ఆర్డర్ 1950 పేరాగ్రాఫ్ 3 ని అప్లై చేయాలనే ఉత్సాహం కనిపించింది. ఈ తీర్పు చూస్తే కోర్టులకు భాద్యత ఉండదా అని బాధ కలిగింది. చాలా తొందరపడి ఇచ్చిన తీర్పు ఇది. కేవలం ఇద్దరు న్యాయమూర్తులతో దళిత క్రిస్టియన్లకు అన్యాయం చేసేలా తీర్పు ఇవ్వడం దురదృష్టకరం. సుప్రీం కోర్టు అంటే రాజ్యాంగానికి గార్డియన్ గా ఉండాలి. కానీ ఈ తీర్పు చూస్తే అలా అనిపించలేదు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటి తీర్పులు విఘాతమే. ఆర్టికల్ 14, 15, 25 ఇవేమీ గౌరవ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కులం అనేది పుట్టుకతో వచ్చేది. కులం అనేది సామాజిక వ్యాధి. కులం అనేది ఒక వివక్ష . సమాజంలో కుల వివక్షకు అంతులేదు. దళితులు క్రిస్టియన్స్ గా మారితే వారి ఆర్ధిక స్థితి మారలేదు. ఒక దళితుడు క్రిస్టియన్ గా మారితే ఆయన సామాజిక స్థితి, జరిగే అవమానాలు, దాడులు తగ్గడం లేదు. దళితులను దళితులుగానే చూస్తున్నారు. దళితుల మీద దాడులు అరికట్టడానికే కొన్ని చట్టాలు ,ఎట్రాసిటీ యాక్ట్ లు ఉన్నాయి. ఇలా ఒక చేత చట్టాలు చేసి , మరో చేత్తో ఇలాంటి తీర్పులతో లాగేసుకుంటే ఎలా ? ST మతం మారితే ST గానే ఉన్నాడు. BC మతం మారినా బీసీ గానే ఉన్నాడు. OC మతం మారినా ఓసీ గానే ఉన్నాడు. ఒక్క SC లోనే మతం మారితే కులం ఎలా మారుతుంది ? ఇది చాలా అన్యాయం. ఇలాంటి వ్యవస్థను ఎవరు అంగీకరించరు. ఆర్డర్ 1950 పేరాగ్రాఫ్ 3 లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే ఉంటే ఎలా ? SC లను చేర్చకపోవడం ఇదెక్కడి న్యాయం ? క్రిస్టియన్ మతంలో ఉన్న నాస్తికులు హక్కు లేకుండా పోతారా ? వారి చట్టాలు వారికి కాకుండా పోతాయా ? సుప్రీం ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత క్రిస్టియన్ల జీవితాలు అగమ్యగోచరం. Congress INC Andhra Pradesh

YS Sharmila

50,060 Aufrufe • vor 2 Monaten

realyssharmila's profile picture

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇంధన ధరల పెంపుతో సామాన్యుడి నడుం విరుగుతుంటే, మన రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ, జనసేన మాత్రం కేంద్రానికి వంతపాడుతున్నాయే తప్ప నిలదీయడం లేదు. పెంచిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ Congress డిమాండ్ చేస్తోంది. మరోవైపు, మోదీ గారు Narendra Modi మన దేశ పరువును దిగజార్చారు. ఆనాడు ఇందిరా గాంధీ గారు ఒక మహిళగా అగ్రరాజ్యం అమెరికాను ఎదుర్కొన్నారు. ‘మా దేశంపై మీ జోక్యం అనవసరం’ అని ధైర్యంగా చెప్పగలిగారు. కానీ నేడు మోదీ ట్రంప్ దగ్గర సాగిలపడ్డారు. అదానీ కోసం ట్రంప్‌కు మోదీ బానిస అయ్యారు. దేశాన్ని మళ్లీ నిలబెట్టాలంటే రాహుల్ గాంధీ గారితోనే సాధ్యం.

YS Sharmila

17,757 Aufrufe • vor 23 Tagen

realyssharmila's profile picture

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు TDP Telugu Desam Party ఎంపీ దొరకడం సిగ్గుచేటు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం ? డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా.. ఇప్పుడు చంద్రబాబు N Chandrababu Naidu ఏం చర్యలు తీసుకుంటారు ? డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ? యువత డ్రగ్స్ వాడాలని నేరుగా ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా? ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ? ఎంపీగా పుట్టా మహేష్ పై అనర్హత వేటు వేయాలి. పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలి. డ్రగ్స్ వాడకంపై నిజంగా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే ఏలూరు ఎంపీపై చర్యలు తీసుకొని చంద్రబాబు గారుచిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

YS Sharmila

52,246 Aufrufe • vor 2 Monaten

realyssharmila's profile picture

కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడుతున్న ఆక్వా రైతన్న కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపం. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు అంతులేని కష్టం. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బ్రతికించేందుకు ఓ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతం. రూ. 500 డీజిల్ కోసం ఆ రైతు రోదించిన తీరు చూసి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. "అన్నా నాకు ఫ్యాన్ సీట్లు తిరగాలన్నా .. అప్పుచేసి రొయ్య పిల్ల వేశాను.. ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోద్ది అన్న" రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? చంద్రబాబు గారి ఛాతిలో ఉన్నది గుండెనా ? బండనా? ఇది రైతన్నను రక్షించే ప్రభుత్వమా ? భక్షించే ప్రభుత్వమా ? ఇదేనా చంద్రబాబు N Chandrababu Naidu గారి విజినరీ ? దీన్నే అంటారా అద్భుతమైన గుడ్ గవర్నెన్స్ ? రైతులతో కాళ్లు పట్టించుకున్న పాపం ఈ కూటమి ప్రభుత్వానికి తగలకపోదు. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చింది ? NDA BJP పాలిత రాష్ట్రంలో ఫ్యూయల్ కోసం ప్రజల పడిగాపులా? పెట్రోల్ బంకుల దగ్గర మల్లయుద్ధాలా? రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా ? సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో No Stock బోర్డులు ఇవ్వాళ్టికి ఎందుకున్నాయి ? ఇదేనా రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి ? ఇందుకేనా పడి పడి మోదీజీకి మద్దతు ఇచ్చేది ? బంకుల దగ్గర జనాలు అవస్థలు పడుతుంటే, ప్రత్యక్షంగా అన్నీ రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామాలు చూపిస్తుంటే, ఇంకా బీజేపీ భజన చేయడానికి, మోదీగారి తొత్తుగా ఉండటానికి చంద్రబాబు గారు సిగ్గుపడాలి. రాష్ట్రంపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం ఒక నిదర్శనం. వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు .. ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు గారు. INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப

YS Sharmila

23,157 Aufrufe • vor 1 Monat

realyssharmila's profile picture

నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా YSR గారు నామకరణం చేశారు. నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS వాదికి మద్దతు ఇచ్చారు? YCP అద్యక్షుడు జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా BJP అభ్యర్థికి జగన్ గారు మద్దతు ఇవ్వడం అవమానకరం. టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు. జగన్ గారిది తెరవెనుక పొత్తు. జగన్ గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో BRS పార్టీ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారు. YCPకి YSR Congress Party ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. YSR వారసుడు అయి ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటు. YSR తన జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. YSR బతికి ఉంటే జగన్ గారు చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునే వారు. చరిత్రలో YSR ఛాతీలో కత్తితో పొడిచిన వాడుగా జగన్ గారు మిగిలిపోతారు. మీకు దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని ఒప్పుకోండి. చెయ్యెత్తితే కనిపించేలా బీజేపీ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోండి.

YS Sharmila

94,514 Aufrufe • vor 9 Monaten

realyssharmila's profile picture

VB G- RAM G చట్టాన్ని రద్దు చేస్తూ, మన్రేగా పథకం (MGNREGA) పునరుద్ధరణ కోసం చేపట్టిన పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో, 50 రోజుల పాటు 4866 KM మేర సాగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 కు పైగా నియోజక వర్గాల్లో ఉపాధి హామీ శ్రామికులను కలవడం జరిగింది. 45 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, కొన్ని నియోజక వర్గాల్లో బహిరంగ సభలు, మరికొన్ని చోట్ల నేరుగా కరువు పని జరిగే ప్రాంతాలను సందర్శించి, కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేలా లక్షల మంది ప్రజల మద్దతు కూడగట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ఎలా నిర్వీర్యం చేసిందో, బీజేపీ BJP చేసిన కుట్రకు చంద్రబాబు N Chandrababu Naidu గారు, జగన్ YS Jagan Mohan Reddy గారు ఎలా ఆజ్యం పోశారో ప్రజలు చెప్పిన పలు అంశాలను నేడు మీడియా ముందు ఉంచడం జరిగింది. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్ర దిగ్విజయానికి శ్రమించిన పార్టీ క్యాడర్ కు , మారుమూల పల్లెకు సైతం నాతో పాటు కలిసి నడిచి,పతాక శీర్షికల్లో కవరేజ్ ఇచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పార్టీ పక్షాన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. Congress Congress Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப

YS Sharmila

26,131 Aufrufe • vor 2 Monaten

realyssharmila's profile picture

దళిత క్రిస్టియన్లపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మా స్టాండ్ ఒకటే. 1996 లో ఆనాడు PV గారు ప్రధానిగా ఉన్నప్పుడే పార్లమెంట్ లో బిల్లును టేబుల్ చేశారు. 2005 లో రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా కాంగ్రెస్ వేసింది. ఈ కమిషన్ సైతం దళిత క్రిస్టియన్లను SC లను పరిగణించాలని చెప్పింది. కులానికి మతానికి లింక్ లేదని చెప్పింది. దళితులు క్రిస్టియన్లుగా మారినా వారి ఆర్ధిక,సామాజిక స్థితి మారలేదని చెప్పింది. ఆర్థర్ 1950 పేరాగ్రాఫ్ 3 ని రద్దు చేయాలని చెప్పింది. 2009 లో దళిత క్రిస్టియన్లను SC లు కొనసాగించాలని దివంగత ముఖ్యమంత్రి YSR అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆనాడు YSR గారు నాతో స్వయంగా చెప్పారు. దళిత క్రిస్టియన్లను SC లుగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, వారికి న్యాయం జరిగేలా సోనియా,మన్మోహన్ సింగ్ లతో మాట్లాడి న్యాయం చేయాలని అన్నారు. YSR బ్రతికి ఉంటే ఈ అంశం ఆనాడే పరిష్కారం అయ్యేది. YSR బిడ్డగా నేను మాట ఇస్తున్నా .. దళిత క్రిస్టియన్ల పక్షాన భాద్యతగా నిలబడతా. నిలబడి పోరాటం చేస్తా. అజెండాగా ఎత్తుకుంటా. దళిత క్రిస్టియన్లు SC హోదా కలిగి ఉండాలి. పెరాగ్రాఫ్ 3 ని రద్దు చేయాలి. కులానికి మతానికి సంబంధం ఉండకూడదు. రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ను పార్లమెంట్ లో టేబుల్ చేయాలి. రంగనాథ్ మిశ్రా రిపోర్ట్ పై చర్చ జరగాలి. సుప్రీం కోర్టు తీర్పు ఏ రాష్ట్రంలో అమలు కాకుండా కేంద్రం చూడాలి. సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రీ అప్పీల్ కి వెళ్ళాలి. Congress Rahul Gandhi INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப

YS Sharmila

21,668 Aufrufe • vor 2 Monaten

realyssharmila's profile picture

మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు N Chandrababu Naidu గారు దురంధర్ అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కల్నాయక్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై తల్లి ప్రేమ చూపిస్తూ, విశాఖ స్టీల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మిట్టల్ స్టీల్ కోసం భారీగా వరాలు ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయంటే ఎవరు కాదనరు. కానీ మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ? 15 ఏళ్ల పాటు రాష్ట్ర వాటా కింద GST మినహాయింపులా? ఎలక్ట్రిసిటీ కింద యూనిట్‌కు 1 రూపాయి మాఫీనా? ఛత్తీస్ గడ్ లోని బైలడిల్లాలో ఐరన్ ఓర్ కేటాయింపులు, రవాణాకు సొంత పోర్ట్ , పైప్ లైన్ కి అన్ని అనుమతులు , వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెళ్లే నీళ్లను మళ్లింపులు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌పై ఇంత శ్రద్ధ ఉంది కానీ.. అదే ప్రేమ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ పైన ఎందుకు లేదు? బైలడిల్లా నుంచి మిట్టల్ ప్లాంట్ కి ముడిసరుకు పంపిస్తే విశాఖ స్టీల్ పరిస్థితి ఏంటి ? విద్యుత్ సబ్సిడీలు, సొంత పోర్ట్ లు విశాఖ ఉక్కుకు వద్దా? దాదాపు 35 వేల మంది ఉద్యోగాలు చేసే మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై ఎందుకు అంత చిన్న చూపు? విశాఖ ఉక్కుమీద ఇంకా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదు అని ఒక్కరంటే ఒక్కరు కూడా హామీ ఇవ్వలేదు.మిట్టల్ అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? వైజాగ్ స్టీల్‌పై ఎందుకంత కోపం?కేంద్రంలో బీజేపీ వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వెంటనే SAIL‌లో విలీనం చేయండి. లేదంటే మిట్టల్‌కు కల్పించిన రాయితీలు మన స్టీల్ ప్లాంట్‌కూ కూడా ఇవ్వండి. తొలగించిన 17 వేల మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోండి. INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப #vizagsteelplant

YS Sharmila

18,706 Aufrufe • vor 2 Monaten