
YS Sharmila
@realyssharmila • 134,544 subscribers
President of Andhra Pradesh Congress Committee. Daughter of YSR. A true Secularist. Believes in Equality & Independence. Fights for people’s welfare.
Shorts
Videos

My Dad- my Hero ! Happy Father’s Day to every valuable father!!
YS Sharmila219,030 views • 1 month ago

On the occasion of Shri Rahul Gandhi ji's birthday, I extend my heartfelt wishes to him. I have always admired Rahul ji for his honesty, sincerity, and unwavering commitment to the values of democracy, social justice, and inclusive development. In an era where politics often demands courage and conviction, he has consistently stood by what he believes is right, irrespective of the challenges. Coming from a family that has made extraordinary sacrifices for the nation, Rahul ji carries forward a legacy of public service with humility and dedication. I am reminded of the words of the late Dr. YSR, who believed Rahul Gandhi as the ideal leader to guide India towards a brighter future. As Rahul ji celebrates another year of life, I wish him good health, happiness, strength, and continued success in the journey of serving the people of India. Happy birthday, Rahul Gandhi ji. Rahul Gandhi Congress #rahulgandhi
YS Sharmila191,549 views • 1 month ago

“తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వారసుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గత YCP మోసాలను తూచ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ Telugu Desam Party JanaSena Party BJP ANDHRA PRADESH విధానం. అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి YCP ప్రభుత్వం తల్లులను పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు చంద్రబాబు గారు N Chandrababu Naidu తల్లులను నయవంచన చేస్తున్నారు. కోతల రాయుడు కోతలని ఎద్దేవా చేసిన బాబుగారే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. జూన్ 29,2023 న నాడు ప్రతిపక్షంలో ఉండగా, ఆనాడు YCP ప్రభుత్వానికి మీరు సంధించిన ప్రశ్నలు.( మీకు గుర్తు చేయడం కోసం ) 1) రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ? 2) 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల చొప్పున ఎందుకు కోతలు పెడుతున్నారు ? 3) 300 యూనిట్లు కరెంట్ వాడారని పథకానికి అనర్హులు చేస్తారా ? 4) కారు( జీవనోపాధి కోసం) ఉందని బిడ్డలకు పథకం నుంచి దూరం చేస్తారా ? 5) అమ్మఒడి అంటూ నాన్న బుడ్డీ దోపిడీనా ? “ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం”. 1) అమ్మఒడి పేరుతో నాడు చేసిన మోసానికి YCP ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, కూటమికి పట్టం కడితే మీరు చేసేది ఏమిటి ? 2) మీ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎక్కడి న్యాయం ? సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ? 3) ఇచ్చే 15 వేలల్లో కోతలు లేకుండా జమ చేస్తామని 2 వేలు కోత పెట్టడం ఏంటి ? పాఠశాల అభివృద్ధి పేరుతో ఈ దోపిడీ ఎందుకు ? 4) సవాలక్ష కారణాలతో పథకాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహించిన మీరే .. 300 యూనిట్లు విద్యుత్, పొలాలు, కార్లు అంటూ మీరు సైతం కొర్రీలు పెట్టడం ఎందుకు ? 5) నాన్న బుడ్డీని జగన్ గారు దోచుకున్నారు సరే.. మీరు ఏకంగా బుడ్డీనే మాయం చేస్తున్నారు కదా ? కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తల్లికి వందనంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 87( యూడైస్ లెక్కల ప్రకారం ఈ మూడేళ్ళలో పెరిగిన 4 లక్షల మంది బిడ్డలను కలుపుకొని) లక్షల మంది బిడ్డలకి, ఇవ్వాలి. కోతలు పెట్టకుండా ప్రతి బిడ్డకు 15 వేలు జమ చేయాలి. కొర్రీలు పెట్టకుండా మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. INC Andhra Pradesh
YS Sharmila56,785 views • 12 days ago

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 77 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. కాలం మారినా తెలుగు నేలపై నాన్నది ఎప్పటికీ చెరగని సంతకం. మరణం లేని మహానాయకుడు YSR. సంక్షేమానికి, అభివృద్ధికి శాశ్వత చిరునామా YSR. రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నా.
YS Sharmila68,175 views • 21 days ago

From 'Vote Chori' to 'Seat Chori' ! 'The Election Commission of BJP' is now fully hand-in-glow with Modi Narendra Modi & Co. to trample upon the democratic values built over years. The rejection of Ms. Meenakshi Natarajan's Rajya Sabha nomination is yet another example of how constitutional institutions are increasingly being bent to serve political interests. Such actions only reinforce concerns that independent bodies are being pressured to act in a manner that benefits the ruling dispensation, eroding public trust in the democratic process. Democracy cannot survive without strong, independent institutions, and every attempt to undermine them must be challenged with resolve and conviction. “ఇప్పటిదాకా ఓట్ చోరీ.. ఇకపై సీట్ చోరీ.” ప్రధాని మోదీజీ చేస్తున్నది ప్రజాస్వామ్యంపై దాడి. ఎన్నికల కమీషన్ ను కీలుబొమ్మ చేసి ఆడుతున్నది రాజకీయ వికృత క్రీడ. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ బీజేపీతో కలిసి CEC చేసిన కుట్ర. ఇలాంటి చర్యలు రాజ్యాంగ విలువలను అపహాస్యం చేయడమే. మోదీ గారికి ఎన్నికల కమీషన్ తొత్తు అనడానికి నిదర్శనమే. పోరాడే ప్రజల గొంతును రాజ్యాంగ సంస్థలతో కలిసి అణచి వేయాలని చూడటమే. రాజకీయంగా ఎదుర్కోనే దమ్ములేక, కేసులని, సాంకేతిక కారణాలని ప్రతిపక్షాలను ఎన్నికల బరిలో నుంచి తప్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను ఎన్నికల సంఘం పూర్తిగా వెల్లడించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడటం కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. Congress INC Andhra Pradesh Rahul Gandhi Priyanka Gandhi Vadra Mallikarjun Kharge K C Venugopal Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப
YS Sharmila124,427 views • 1 month ago

YSR లెజెండరీ లీడర్. ఆయనకు మరణం లేదు. మహానేత ముఖ్యమంత్రిగా పని చేసింది కేవలం 5 ఏళ్ళు మాత్రమే. ఆయన పథకాలు, చేసిన అభివృద్ధి అందని గడప రెండు తెలుగు రాష్ట్రాల్లో లేనే లేదు. ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్ , ఉచిత విద్యుత్ , జలయజ్ఞం లాంటి ప్రతి పథకం మనసు పెట్టి అమలు చేశారు. YSR చనిపోతే ఆయన వెంటే 700 వందల మంది వెళ్లిపోయారంటే ప్రజల గుండెల్లో దివంగత నేతపై పెట్టుకున్న అభిమానం ఏంటో అర్థమవుతుంది. YSR ను స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరుపున మనస్పూర్తిగా కృతజ్ఞతలు.
YS Sharmila47,980 views • 21 days ago

నేడు రాజమండ్రిలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూధర్ గారి కుమార్తె శాంతి- రాజీవ్ ల వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. వారిద్దరూ నిండు నూరేళ్ళు సంతోషంగా, అన్యోన్యంగా, ఒకరికొకరు తోడుగా, జీవితాంతం ప్రేమతో జీవించాలని కోరుకుంటూ నవ దంపతులకు మనస్పూర్తిగా వివాహ శుభాకాంక్షలు.
YS Sharmila39,597 views • 1 month ago

VB G- RAM G చట్టాన్ని రద్దు చేస్తూ, మన్రేగా పథకం (MGNREGA) పునరుద్ధరణ కోసం చేపట్టిన పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో, 50 రోజుల పాటు 4866 KM మేర సాగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 కు పైగా నియోజక వర్గాల్లో ఉపాధి హామీ శ్రామికులను కలవడం జరిగింది. 45 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, కొన్ని నియోజక వర్గాల్లో బహిరంగ సభలు, మరికొన్ని చోట్ల నేరుగా కరువు పని జరిగే ప్రాంతాలను సందర్శించి, కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేలా లక్షల మంది ప్రజల మద్దతు కూడగట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ఎలా నిర్వీర్యం చేసిందో, బీజేపీ BJP చేసిన కుట్రకు చంద్రబాబు N Chandrababu Naidu గారు, జగన్ YS Jagan Mohan Reddy గారు ఎలా ఆజ్యం పోశారో ప్రజలు చెప్పిన పలు అంశాలను నేడు మీడియా ముందు ఉంచడం జరిగింది. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్ర దిగ్విజయానికి శ్రమించిన పార్టీ క్యాడర్ కు , మారుమూల పల్లెకు సైతం నాతో పాటు కలిసి నడిచి,పతాక శీర్షికల్లో కవరేజ్ ఇచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పార్టీ పక్షాన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. Congress Congress Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப
YS Sharmila104,175 views • 4 months ago

Dear Pawan Kalyan Pawan Kalyan garu, one swallow does not make a summer, and one stroke of victory cannot be an eternal measure to your power and authority. Your remarks in Tirupati, yesterday, targeting Rahul Gandhi Shri Rahul Gandhi ji, is baseless and unacceptable. The Congress condemns these remarks, unwarrantedly bringing Rahul Gandhi into your religious politics. This is yet another facet of your diversion politics, since people are slowly beginning to feel the discontent brewing out of your failure to keep poll promises. The Congress demands that you tender an unconditional apology to Shri Rahul Gandh ji. We also advise you to exercise restraint, not pitting people of one religion against another, and widen the chasm further. Please focus on bringing more funds to the state and fulfil the poll promises at the earliest. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వేషం, భాషా రెండు మారాయి. సెక్యూలర్ పార్టీగా ఉన్న JanaSena Party జనసేన కాస్త రైటిస్ట్ పార్టీగా మారిందా..? బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే... ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా..? ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా..? ఇతర మతాల వాళ్ళకు మనోభావాలు ఉండవా..? మతం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం RSS సిద్ధాంతమైతే.. అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడు. ప్రధాని మోడీ Narendra Modi దర్శకత్వంలో యాక్టింగ్ చేసే మీకు శ్రీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే నైతికత లేదు. మణిపూర్ , గోద్రాలలో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా..? అటువంటి పార్టీకి మద్దతు ఇచ్చిన మీరు లౌకికవాదం పాటించాలని చెప్తే నమ్మమంటారా..? ఈ దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. Congress INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப Dr.Palak Verma
YS Sharmila424,292 views • 1 year ago

Remembering Bharat Ratna Shri Rajiv Gandhi ji , on his death anniversary . A visionary leader who dreamt of a modern and inclusive India. My father , Dr. Y S Rajasekhara Reddy , always held Shri Rajiv Ji in the highest regard and often said he drew immense inspiration from his leadership , compassion , and commitment to the people of this country . Humble tributes to a leader who gave his life in service of the nation 🙏 #Rajivgandhi #Ysr Congress Rahul Gandhi
YS Sharmila51,281 views • 2 months ago

ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయుడికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ గారు అమలు చేసిన సంస్కరణల పుణ్యమే. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి,ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు. ఐటీ రంగానికి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడుగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ గారిది ఎన్నటికీ చెరగని ముద్ర. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు , యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి పాలన ఆచరణీయం. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ గారు చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. Congress INC Andhra Pradesh Rahul Gandhi Priyanka Gandhi Vadra Mallikarjun Kharge K C Venugopal
YS Sharmila49,971 views • 2 months ago

అభివృద్ధికి నిర్వచనం, సంక్షేమానికి సంతకం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. జనహితమే ప్రజాహితం దివంగత ముఖ్యమంత్రి మూలసూత్రం. సరిగ్గా 22 ఏళ్ల క్రితం మే 14 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆనాడు YSR ప్రమాణ స్వీకారం రాష్ట్రానికి నవశకం. పెట్టిన తొలిసంతకం,అమలు చేసిన పథకాలు నేటికి రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. ప్రజల మనసులు గెలిచి, ప్రేమాభిమానాలు చూరగొని, దేవుడి పటాల పక్కన స్థానం పొందిన ఏకైక నాయకుడు కాంగ్రెస్ నేత YSR. కోట్లాది మంది జనం నేటికి YSR ను మరవలేదంటే ఆయన 5 ఏళ్ల పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బెంచ్ మార్క్. YSR బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, రాజశేఖర్ రెడ్డి అభిమానులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. YSR ఐడియాలజీ ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే. YSR వారసత్వం కొనసాగేది కాంగ్రెస్ లోనే. YSR ఆశయ సాధన జరిగేది కాంగ్రెస్ తోనే. YSR ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి. YSR అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే YSR. ఆనాటి సువర్ణ యుగాన్ని మళ్లీ సాకారం చేసేందుకు మహానేత కడదాకా బ్రతికిన కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తెద్దాం. దివంగత నేత ఆశయాలను అమలు చేసేలా చేయి చేయి కలుపుదాం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేద్దామని నాన్న అభిమానులను కోరుకుంటున్నా. Congress INC Andhra Pradesh #YSR
YS Sharmila39,927 views • 2 months ago

దళిత క్రిస్టియన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. ఈ తీర్పు దళిత క్రిస్టియన్ల మనోభావాలను, వారి జీవితాలను దెబ్బతీసిన తీర్పు. గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో న్యాయం కన్నా .. కోర్టుకి ఉత్సాహం కనిపించింది. అణగారిన వర్గాలకు న్యాయం దక్కాలనే తపన కంటే,ఆర్డర్ 1950 పేరాగ్రాఫ్ 3 ని అప్లై చేయాలనే ఉత్సాహం కనిపించింది. ఈ తీర్పు చూస్తే కోర్టులకు భాద్యత ఉండదా అని బాధ కలిగింది. చాలా తొందరపడి ఇచ్చిన తీర్పు ఇది. కేవలం ఇద్దరు న్యాయమూర్తులతో దళిత క్రిస్టియన్లకు అన్యాయం చేసేలా తీర్పు ఇవ్వడం దురదృష్టకరం. సుప్రీం కోర్టు అంటే రాజ్యాంగానికి గార్డియన్ గా ఉండాలి. కానీ ఈ తీర్పు చూస్తే అలా అనిపించలేదు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటి తీర్పులు విఘాతమే. ఆర్టికల్ 14, 15, 25 ఇవేమీ గౌరవ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కులం అనేది పుట్టుకతో వచ్చేది. కులం అనేది సామాజిక వ్యాధి. కులం అనేది ఒక వివక్ష . సమాజంలో కుల వివక్షకు అంతులేదు. దళితులు క్రిస్టియన్స్ గా మారితే వారి ఆర్ధిక స్థితి మారలేదు. ఒక దళితుడు క్రిస్టియన్ గా మారితే ఆయన సామాజిక స్థితి, జరిగే అవమానాలు, దాడులు తగ్గడం లేదు. దళితులను దళితులుగానే చూస్తున్నారు. దళితుల మీద దాడులు అరికట్టడానికే కొన్ని చట్టాలు ,ఎట్రాసిటీ యాక్ట్ లు ఉన్నాయి. ఇలా ఒక చేత చట్టాలు చేసి , మరో చేత్తో ఇలాంటి తీర్పులతో లాగేసుకుంటే ఎలా ? ST మతం మారితే ST గానే ఉన్నాడు. BC మతం మారినా బీసీ గానే ఉన్నాడు. OC మతం మారినా ఓసీ గానే ఉన్నాడు. ఒక్క SC లోనే మతం మారితే కులం ఎలా మారుతుంది ? ఇది చాలా అన్యాయం. ఇలాంటి వ్యవస్థను ఎవరు అంగీకరించరు. ఆర్డర్ 1950 పేరాగ్రాఫ్ 3 లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే ఉంటే ఎలా ? SC లను చేర్చకపోవడం ఇదెక్కడి న్యాయం ? క్రిస్టియన్ మతంలో ఉన్న నాస్తికులు హక్కు లేకుండా పోతారా ? వారి చట్టాలు వారికి కాకుండా పోతాయా ? సుప్రీం ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత క్రిస్టియన్ల జీవితాలు అగమ్యగోచరం. Congress INC Andhra Pradesh
YS Sharmila50,231 views • 4 months ago

It gives me great delight on merging YSR Telangana Party with the Congress party! The party that my father belonged to, the party that he lived in, that he served tirelessly, and breathed his last in. This moment would make him most ecstatic and nothing can be more heartening than this homecoming for me. Back to the party that is the biggest secular party in the country and upholds the pluralistic and true culture of India and had built this nation from its foundation, unwaveringly serving all communities, uniting all. It was my late father’s dream to see Shri Rahul ji as the prime minister. I would work hard towards realising this. As much as the daughter of YSR I will perform as the soldier of Congress for the people of the country, to uphold democratic values, protect constitutional rights and preserve unity and brotherhood amid current disturbing trends perpetrated from divisive forces. I thank Shri Kharge ji, Smt Sonia ji and Shri Rahul ji and all those who stood with me. I will give my best and work towards the victory of the party and the people of the country. Rahul Gandhi Mallikarjun Kharge
YS Sharmila259,867 views • 2 years ago

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు TDP Telugu Desam Party ఎంపీ దొరకడం సిగ్గుచేటు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం ? డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా.. ఇప్పుడు చంద్రబాబు N Chandrababu Naidu ఏం చర్యలు తీసుకుంటారు ? డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ? యువత డ్రగ్స్ వాడాలని నేరుగా ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా? ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ? ఎంపీగా పుట్టా మహేష్ పై అనర్హత వేటు వేయాలి. పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలి. డ్రగ్స్ వాడకంపై నిజంగా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే ఏలూరు ఎంపీపై చర్యలు తీసుకొని చంద్రబాబు గారుచిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
YS Sharmila52,722 views • 4 months ago

నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా YSR గారు నామకరణం చేశారు. నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS వాదికి మద్దతు ఇచ్చారు? YCP అద్యక్షుడు జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా BJP అభ్యర్థికి జగన్ గారు మద్దతు ఇవ్వడం అవమానకరం. టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు. జగన్ గారిది తెరవెనుక పొత్తు. జగన్ గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో BRS పార్టీ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారు. YCPకి YSR Congress Party ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. YSR వారసుడు అయి ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటు. YSR తన జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. YSR బతికి ఉంటే జగన్ గారు చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునే వారు. చరిత్రలో YSR ఛాతీలో కత్తితో పొడిచిన వాడుగా జగన్ గారు మిగిలిపోతారు. మీకు దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని ఒప్పుకోండి. చెయ్యెత్తితే కనిపించేలా బీజేపీ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోండి.
YS Sharmila94,553 views • 10 months ago

అమ్మ ప్రార్థన, నాన్న ఆశీస్సులు, కడప ప్రజలు నన్ను గెలిపిస్తారనే ధృడమైన విశ్వాసంతో ఉన్నాను. కడప ప్రజలకు అమ్మ విన్నపం : వైఎస్సార్ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు షర్మిలమ్మను కూడా ఆదరించాలని కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ముద్దుల బిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. షర్మిలమ్మను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపించాలని కోరుతున్నాను.
YS Sharmila155,422 views • 2 years ago

ఉగాది పండుగకు కూటమి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చూస్తే, కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఉంది. రాష్ట్రంలో 1.80 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, ఈ క్యాలెండర్ చూస్తే అంతా తుస్సు అనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ఎందుకు యువతను మోసం చేస్తున్నారు? 1.80 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే, 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే ఎలా న్యాయం జరుగుతుంది? రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం ఇవ్వాలి. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. N Chandrababu Naidu INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப
YS Sharmila31,405 views • 4 months ago

కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడుతున్న ఆక్వా రైతన్న కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపం. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు అంతులేని కష్టం. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బ్రతికించేందుకు ఓ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతం. రూ. 500 డీజిల్ కోసం ఆ రైతు రోదించిన తీరు చూసి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. "అన్నా నాకు ఫ్యాన్ సీట్లు తిరగాలన్నా .. అప్పుచేసి రొయ్య పిల్ల వేశాను.. ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోద్ది అన్న" రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? చంద్రబాబు గారి ఛాతిలో ఉన్నది గుండెనా ? బండనా? ఇది రైతన్నను రక్షించే ప్రభుత్వమా ? భక్షించే ప్రభుత్వమా ? ఇదేనా చంద్రబాబు N Chandrababu Naidu గారి విజినరీ ? దీన్నే అంటారా అద్భుతమైన గుడ్ గవర్నెన్స్ ? రైతులతో కాళ్లు పట్టించుకున్న పాపం ఈ కూటమి ప్రభుత్వానికి తగలకపోదు. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చింది ? NDA BJP పాలిత రాష్ట్రంలో ఫ్యూయల్ కోసం ప్రజల పడిగాపులా? పెట్రోల్ బంకుల దగ్గర మల్లయుద్ధాలా? రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా ? సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో No Stock బోర్డులు ఇవ్వాళ్టికి ఎందుకున్నాయి ? ఇదేనా రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి ? ఇందుకేనా పడి పడి మోదీజీకి మద్దతు ఇచ్చేది ? బంకుల దగ్గర జనాలు అవస్థలు పడుతుంటే, ప్రత్యక్షంగా అన్నీ రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామాలు చూపిస్తుంటే, ఇంకా బీజేపీ భజన చేయడానికి, మోదీగారి తొత్తుగా ఉండటానికి చంద్రబాబు గారు సిగ్గుపడాలి. రాష్ట్రంపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం ఒక నిదర్శనం. వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు .. ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు గారు. INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப
YS Sharmila23,458 views • 3 months ago