#teamapinaction

#TeamAPInAction #CycloneMontha నెల్లూరు జిల్లా, సంగం బ్యారేజీ వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువున్న ఇసుక బోటు గేట్ల వరకూ వచ్చింది. బ్యారేజీ నీటి నిల్వకు తోడు మొంథా తుఫాన్ వరద పోటెత్తింది. భారీ బోటు బ్యారేజీ గేట్లకు తగిలి ఉంటే భారీ డ్యామేజీ జరిగేది. సమాచారం అందుకున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ పరిస్థితిని సమీక్షించి.. బోటు తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. NDRF, SDRF , పోలీసులు, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం అంతా కలిసి..30 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. టీం వర్క్తో అతిపెద్ద జలగండాన్ని తప్పించిన మీ కృషికి హ్యాట్సాఫ్.
Lokesh Nara38,456 views • 9 months ago

#TeamAPInAction #CycloneMontha మొంథా తుఫాను అలెర్ట్ వచ్చిన వెంటనే మా ప్రభుత్వం చేపట్టిన సహాయకచర్యలను హేళన చేసిన వారున్నారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉంటూ ప్రతీ అంశాన్నీ ట్రోల్ చేసిన వారూ ఉన్నారు. Bro we don`t care. ప్రజల ప్రాణాల రక్షణ మాకు ముఖ్యం. ప్రతీ మూగజీవినీ కాపాడటమే మా లక్ష్యం. అంతా కలిసి అవిశ్రాంతంగా పనిచేశాం. ధన, జన నష్టం లేకుండా చూడగలిగాం. మా డేటా, మా అలెర్ట్ సిస్టమ్, మా ప్రభుత్వ యంత్రాంగం కాపాడిన ప్రాణాలు ఇవి.. కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం ఎలచెట్లదిబ్బలో చిక్కుకుపోయిన గొర్రెల కాపరులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది అధికార యంత్రాంగం. నలుగురి ప్రాణాలు కాపాడిన బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Lokesh Nara18,649 views • 9 months ago
No more content to load
