Loading video...

Video Failed to Load

Go Home

ఆడాళ్ళు అండాలు దాచుకోవాలా?

84,412 views • 7 months ago •via X (Twitter)

0 Comments

No comments available

Comments from the original post will appear here

Related Videos

🔷 ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది 🔷 పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఒకవైపు. గత రెండు దశాబ్దాలుగా.. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఒక క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడు మరోవైపు 🔹మన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారు 🔹Dr.sudheerKumar బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడు.. 2001 నుండి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సుధీర్ కుమార్.. ఉద్యమ సమయంలో జైలు జీవితాన్ని కూడా గడిపారు 🔹ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా సేవలందిస్తున్న సుధీర్ కుమార్.. తన నర్సింగ్ హోమ్ ద్వారా అనేక మంది పేదలకు వైద్య సేవలు కూడా అందించారు 🔹విద్యావేత్త డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ వరంగల్ ఎంపీగా గెలిస్తే.. వరంగల్ పార్లమెంట్ ప్రజల సమస్యలపై గళమెత్తుతారు.. హక్కుల కోసం గట్టిగా పోరాడుతారు ✊ సుధీర్ కుమార్ గెలుపు.. వరంగల్ పార్లమెంట్‌కు మలుపు 🚗 కారు గుర్తుకే మన ఓటు!

KTR

103,064 views • 2 years ago

అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా? రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. N Chandrababu Naidu గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. English Version-

YS Jagan Mohan Reddy

187,890 views • 1 day ago