正在加载视频...

视频加载失败

ఆయన పడ్డ కష్టాల ముందు మన కష్టాలు ఎంత !

13,474 次观看 • 1 年前 •via X (Twitter)

0 条评论

暂无评论

原始帖子的评论将显示在这里

相关视频

దిల్ రాజ్ గారు రూల్స్ పెడతారు, కానీ ఆయన ఫాలో అవ్వరు🙏🏻 #TheRajaSaab #ManaShankaraVaraPrasadGaru #BharthaMahasayulakuWignyapthi ఈ మూడు పెద్ద సినిమాలు ఉంచుకొని కూడా అన్ని థియేటర్స్ ఇచ్చారు #JanaNayagan కి? #JanaNayakuduTrailer ట్రైలర్ చూశాక అయినా నిద్రలేవండ్రా, re-remake సినిమా ని తెలుగు వాళ్ళు చూడరు దానికి ప్లేసులో మన తెలుగుని తీసుకోండి ముందే. ఇంకా చాలా టైం ఉంది ఆలోచించుకోండి వాళ్ళ రాష్టంలో మన సినిమాలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఇస్తారు. మనం ఎందుకు ఇన్నీ థియేటర్స్ ఇవ్వాలి ? వారిసుడు సమయంలో కూడా ఇలాగే జరిగింది. తెలుగు సినిమా నే రీమేక్ చేసి వాళ్ళకే అన్ని థియేటర్స్ ఇస్తుంటే తమిళ్ వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారు మన సినిమాని మనం పెట్టించుకోవడం లేదు అని, సిగ్గు తెచ్చుకోండి కొంచమైనా డిస్ట్రిబ్యూటర్స్. తెలుగు సినిమాకి థియేటర్స్ ఇప్పించండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Swaasthi

91,633 次观看 • 7 个月前

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు నిండు సభలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సభలో ఉన్నప్పుడు ఎంత హుందాతనంతో మాట్లాడారో చూడండి… పెద్దాయన రాజశేఖర్ రెడ్డి గారు తొలి సారి ఎమ్మెల్యే గాఎన్నికైన రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వింటున్న విధానం చూస్తే అర్థం అవుతుంది. సబ్జెక్ట్ ఉన్నవాడు మాట్లాడితే చిన్న పెద్ద అని చూడకుండా వింటారు. ఇండిపెండెంట్ ఎంఎల్సీ గా నెగ్గి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆహ్వానిస్తే కూడా అప్పుడు చేరా లేదు. కేవలం 14 రోజులు ప్రచారం చేసి ఎమ్మెల్యే గా నెగ్గి అసెంబ్లీలో పెద్దాయన రాజశేఖర్ రెడ్డి గారి ముందు మాట్లాడటం జరిగింది.

Vennela Kishore Reddy

76,178 次观看 • 6 个月前

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, 'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏 తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!! Narendra Modi Pawan Kalyan

Chiranjeevi Konidela

1,087,891 次观看 • 2 年前

రాజకీయాల్లో కృతజ్ఞత అంటే ఇదే కదా! 🤝 ​ నిన్న మిథున్ చక్రవర్తి గారు బెంగాల్ ముఖ్యమంత్రి Suvendu Adhikari గారికి ఫోన్ చేసి, "మిమ్మల్ని ఒకసారి కలవాలి, నేను ఎప్పుడు రావాలి?" అని అడిగారు. ​కానీ ఈరోజు ఉదయం మిథున్ చక్రవర్తి గారు చూసేసరికి.. స్వయంగా ముఖ్యమంత్రే ఆయన ఇంటి ముందు నిలబడి ఉన్నారు! ​ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ​"బీజేపీ నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో మిథున్ చక్రవర్తి గారు ఒకరు. నిన్న 'మిథున్ గారు నాతో మాట్లాడుతూ.. 'నేను నిన్ను ఒకసారి కలవాలి' అన్నారు. అప్పుడు నేను ఆయనతో.. 'మీరు నన్ను కలవడానికి రానవసరం లేదు. మీరు ఎవరినైతే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో, ఆ వ్యక్తే స్వయంగా మీ దగ్గరకు వస్తాడు' అని చెప్పాను." ​తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంలో మిథున్ గారు పోషించిన పాత్రను సువేందు అధికారి ఎంతగానో అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు. ​తన మనిషి ముఖ్యమంత్రిగా తన ఇంటికి వచ్చేసరికి మిథున్ చక్రవర్తి ఆనందానికి అవధులు లేవు! 🤗

JSP Naresh

69,760 次观看 • 3 个月前

ఈ రోజు మనం 1 రూపాయి దానం చేసి 100 రూపాయలతో పబ్లిసిటీ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం, కానీ తనను నమ్ముకున ప్రజల కోసం ఎన్నో గుప్త దానాలు చేసి ఏ రోజు ఏది కూడా బయటకి చెప్పుకొని మా నాయకుడు, గుడివాడ పేద ప్రజల గుండె చప్పుడు, గుడివాడ ముద్దుబిడ్డ కొడాలి నాని గారు సుమారు 8 ఏళ్ల క్రితం గుడివాడ పట్టణము 11 వార్డు నివాసి షేక్ సయ్యద్. షేక్ జానీబి గార్ల రెండో (2) కుమారుడు పుట్టు ముగా దిగువ మధ్య తరగతిలో జీవన సాగించే వీరు, 2018 సంవత్సరంలో అప్పటి మన శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి దృష్టికి తీసుకురాగా వారి పరిస్థితి గమనించిన ఆయన తక్షణమే విజయవాడ పంట కాలవ రోడ్లు తన్మయి పిల్లల ఆస్పత్రిలో గొంతు సర్జరీ చేయించి పూర్తి మెడికల్ ఖర్చులు కూడా ఆయనే భరించి తన సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించడం జరిగింది ఆ సహాయం పొందిన బాబు, అతని కుటుంబ సభ్యులు వచ్చి గత రాత్రి కొడాలి నాని గారిని కలిసి, తమ బిడ్డ ఈ రోజు ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం మీరే అంటూ నాని గారికి కృతజ్ఞతలు తెలియజేశారు (అప్పటి వరకు ఆ బాబు విషయం అక్కడ ఉన్న మా ఎవరికి తెలియదు) ఇప్పుడు ఆ బాలుడు చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రస్తుతం ఆరవ తరగతి చదువుతున్నాడు

వై.యస్.‌ఆర్‌ కుటుంబం™

14,513 次观看 • 7 个月前

నిరుద్యోగ సోదరులారా, కేసీఆర్ పాలన బెటరా, రేవంత్ రెడ్డి పాలన బెటరా, ఒక సారి చూద్దాం…. ముందుగా ఈ రోజు తెలంగాణ నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ నిర్భందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. అరెస్ట్ చేసిన వేల మంది విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ముందు బారికేడ్లు ముళ్లకంచెలు అంతర్జాతీయ సరిహద్దును తలపిస్తున్నయి. నిరుద్యోగుల న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి & ఆయన మంత్రి వర్గం కేవలం పోలీసులను, బౌన్సర్లను, అబద్దాలను నమ్ముకున్నరు. వీళ్లకు చరిత్ర త్వరలోనే తగిన గుణ పాఠం చెప్తది. కాంగీయులను నమ్మి ఘోరంగా మోసపోయిన నిరుద్యోగ సోదరులు కొన్ని నిప్పులాంటి నిజాలను ఇపుడైనా గమనిస్తారని ఆశిస్తున్న… కేసీఆర్ గారి పాలనలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అంటే ఏడాదికి దాదాపుగా సగటున 16,000 ప్రభుత్వ ఉద్యోగాలన్న మాట! ఇక ప్రైవేటు రంగంలో భర్తీ అయిన ఉద్యోగాలు లక్షల్లో ఉంటవి. మరోవైపు మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్న రేవంత్ రెడ్డి గారు 7 నెలల్లో కేవలం 6063 ఉద్యోగాలకు నోటిఫై చేసిండు! 2016-17 లో గురుకుల ఉపాధాయ పోస్టులకు అర్హత విషయంలో నిరుద్యోగులు ఒక్క రోజు ఆందోళన చేస్తే అర్హత మార్కులను ఒక మెమోతో కేసీఆర్ గారు మరుసటి రోజే సవరించారు. Prof. Chakrapani Ghanta 2023 లో గ్రూప్ -1 లీకేజి విషయం లో నిరుద్యోగుల March-15, 2023 న ఆందోళన చేస్తే, కేసీఆర్ గారు March-17 న నే ప్రిలిమ్స్ ను రద్దు చేయించి సిట్ వేసి ఎంతో మంది నిందితులను అరెస్టు చేయించారు. 10 వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకైతే బాధ్యుడైన బండి సంజయ్, ఎంపీ, (నేడు కేంద్ర మంత్రి) ని కూడా అరెస్టు చేయడానికి వెనకాడ లేదు కేసీఆర్. ఆనాడు టీఎస్పీయస్సీ (TSPSC) ఛైర్మన్ చేతకానితనం వల్ల రెండవసారి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ను కోర్టు రద్దు చేసింది. 2023 లో గ్రూప్-2 ఎగ్జాం చాలా పరీక్షలతో క్లాష్ అవుతుందని ఒక్క సారి నిరుద్యోగులందరూ రెప్రజెంట్ చేస్తే ఆ పరీక్ష కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు వాయిదా వేయించారు. వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాకు చాలా కాలంనుండి అన్యాయం జరుగుతున్నదంటే వాళ్లందరిని ఒక్క జీవోతో రెగ్యులరైజ్ చేశారు. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 10 రోజులు నిరవధిక సమ్మె చేస్తే వాళ్లందరి డిమాండ్లను సావధానంగా విని ఒక్క కేసు లేకుండా రెగ్యులరైజ్ చేశారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు సమ్మె చేస్తే వాళ్ల సమస్యలను పరిష్కరించారు. ఒక్కరి మీద కూడా పోలీసులను ప్రయోగించలేదు. నిరవధిక సమ్మెలు చేసినా ఆర్టీసి కార్మికులనందరిని చేరదీసి వాళ్లను గవర్నమెంటు డిపార్టుమెంటుగా మార్చారు, కేసీఆర్. ఆషా వర్కర్లకు ఏఎన్ యం/జీయన్ఎం లకు నర్సుల పోస్టుల్లో వెయిటేజ్ ఇచ్చి వాళ్ల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్. చాలా ప్రభుత్వ శాఖల్లో సమ్మెలకు అవకాశం లేకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని గుండెలో పెట్టుకొని పరిపాలించిన నాయకుడు కేసీఆర్. ఉదా: ట్రాఫిక్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు. ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు . నాకు తెలిసి కేసీఆర్ గారి పాలనలో ఏ నిరుద్యోగికి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసే అవసరం రాలేదు. ఒక వేళ వచ్చినా ఒకటి రెండు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడేమో ఒకటే డిమాండ్ మీద అశోక్ సార్(రెండు సార్లు), మోతిలాల్, బక్క జడ్సన్ లు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. తెలిసి తెలిసి గురుకులాల్లో బాక్లాగ్ పోస్టులు సృష్టించింది నేటి ప్రభుత్వం. వీటన్నిటిపై కాంగీయులు స్పందించాల్సింది పోయి గాంధీ భవన్ నుండి గూండాలను బౌన్సర్లను పంపించి అమాయక నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసలు ఇంతవరకు నేటి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల సమస్యలపై ఒక్కసారికూడా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడలేదు. బహుశా ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల కొనుగోలు-ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నరేమో..! ప్రజాస్వామ్యంలో సమ్మెలు సర్వసాధారణం..కానీ ప్రజలను ప్రేమించే నాయకులు పట్టువిడుపు ప్రదర్శిస్తారు. తెగేదాకా లాగరు. ప్రజలను కేవలం ఓటర్లుగా, ప్రేక్షకులుగా చులకనగా చూసే నాయకులు విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తరు. వాళ్లను చంపడానికి కూడా వెనకాడరు.. వీళ్లు పోలీసు నిర్భందాన్నే నమ్ముకుంటరు. ఉదా: బషీర్ బాగ్, ముదిగొండ కాల్పులు.. తెలంగాణకు కేసీఆరే సీయంగా ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది కదా.. అందుకే ద్రోహులను పాతర పెట్టనీకె, మన తెలంగాణను ఢిల్లీ నుండి మళ్లీ కాపాడుకోనీకె పల్లె పల్లెనా, గల్లీ గల్లినా ప్రజలను చైతన్యవంతం చేయడమే మన తక్షణ కర్తవ్యం. జై తెలంగాణ. #CongCheatedUnemployed #LiberateTelanganaFromCongress #BRS4Jobs BRS Party KTR

Dr.RS Praveen Kumar

29,571 次观看 • 2 年前

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్న ఈ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం! కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదు చేతగాని సీఎం ఉంటే ఒక రాష్ట్రం ఎలా నష్టపోతుందో కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న సాగర్ డ్యామ్ నుంచి కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఏపీ వైపు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడం దౌర్జన్యం కాదా? ఏపీ 47 టీఎంసీల నీటిని కోరింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశమే వాయిదా పడింది. నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం రాకముందే ఏపీ అధికారులు నీటిని తరలించడం ఏమిటి? కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీటిని తీసుకెళ్లేంత ధైర్యం ఏపీ అధికారులకు ఎలా వచ్చింది? త్రిసభ్య కమిటీ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా నీటిని తరలించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉంటోంది? అసలు ఇంత జరుగుతుంటే తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఒకవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని తరలించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలా ఇష్టారీతిన నీటిని తరలించడం దుర్మార్గం. ఇప్పటికే గత రెండేళ్లుగా కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటాను సైతం వినియోగించుకోలేక మన నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ నీటి వినియోగం చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. ఈ ఏడాది కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను కాపాడాల్సిన సీఎం Revanth Reddy .. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారు. కేఆర్ఎంబీని లెక్కచేయకుండా, త్రిసభ్య కమిటీని పట్టించుకోకుండా ఏపీ వ్యవహరిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మౌనం తెలంగాణ తాగు, సాగునీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోంది. ఇదే వైఖరిని కొనసాగిస్తే తెలంగాణ ప్రజల ముందు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటినీ కాపాడాలి. తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్న ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. G Kishan Reddy గారు.. కేంద్ర మంత్రిగా తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? ఏపీ నీటి అక్రమ తరలింపు విషయంలో KRMB పై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO Uttam Kumar Reddy

Harish Rao Thanneeru

47,582 次观看 • 1 天前