Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

గంభీరా గంభీరా, విశ్వాన్ని వణికించే ధీవర

56,973 görüntüleme • 6 ay önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

జీవో 97 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా... కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇకముందు కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.

KTR

46,351 görüntüleme • 13 saat önce

సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారి పేరును ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో సీఎం గారికి నాదొక విజ్ఞప్తి... తెలంగాణ కోసం తన మంత్రి పదవిని సైతం వదులుకుని, 94 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో దీక్ష చేసిన మహనీయుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఎల్బీనగర్ టిమ్స్ కు పెట్టాలని కోరుతున్నాను. అలాగే, అల్వాల్ టిమ్స్ కు స్వర్గీయ శ్రీ అంజయ్య గారి పేరును, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ సార్ పేరును కూడా పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల పేర్లను ప్రజలకు సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టడం వారికి అందించే గౌరవమైన నివాళి.

Komatireddy Venkat Reddy

47,026 görüntüleme • 3 gün önce

నిన్న గ్రూప్ వన్ తెలంగాణ అభ్యర్థులను కలిసి వాళ్ల డిమాండ్ల పై చర్చించడం జరిగింది. అక్టోబర్ లో రానున్న మెయిన్స్ పరీక్షకు ఒక పోస్టుకు వంద మంది ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు (1:100) అవకాశమివ్వాలని వారి ప్రధాన మైన డిమాండు. ఈ డిమాండు ఆచరణ సాధ్యమైనదే. కేవలం CM గారు GAD నుండి ఒక మెమో TGPSC కి పంపించి, వారిని 1:50 ను 1:100 గా మారుస్తూ corrigendum లాంటిది విడుదల చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు. దీని వల్ల ప్రభుత్వానికి ఏలాంటి ఆర్థిక పరమైన నష్టం కూడా లేదు. డిప్యూటీ సీయం బట్టి గారు గత సం.లో అసెంబ్లీలో ప్రస్తావించిన వీడియోను ఇక్కడ అటాచ్ చేస్తున్న. Revanth Reddy గారు, కొంచెం టైం తీసుకొని కింది కారణాలను కూడా చదవండి: 1. 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇది. దీనిపై వేలాది మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. 2. గత రెండు ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయిన మెరిట్ అభ్యర్థులు , అవి రెండు రద్దు అవడం వల్ల మానసికంగా తీవ్రంగా కృంగిపోయి ఆందోళన కరమైన వాతావరణంలో మూడవసారి జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు అవడం జరిగింది. 3. గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం గ్రూప్ వన్ కి మాత్రమే సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు ,ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు సైతం ఎక్కువ మొత్తంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవడం వలన ఒక కృత్రిమ పోటీ వాతావరణం ప్రిలిమ్స్ పరీక్షలో పెరిగి నిజంగా మెయిన్స్ రాయగలిగిన సామర్థ్యం గల అభ్యర్థులు తము మెయిన్స్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 4. 2011 అనంతరం 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఆశావాహుల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉండడము , చాలామంది సీనియర్ సిన్సియర్ అభ్యర్థులకి ఇదే చివరి అవకాశం కానుండడం వల్ల వారికి మెయిన్స్ కి అర్హత సాధించే అవకాశాలు పెంచాలి. 5. మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులని ఎంపిక చేయడం ఇది కొత్తేమీ కాదు . గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అభ్యర్థుల కోరిక మేరకు అప్పటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలోఎంపిక చేశారు. There is a safe precedent here. 6. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ లో 1:15 గా నోటిఫికేషన్ లో ఇచ్చినప్పటికీ తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు దానిని 1:100 గా మెయిన్స్ కి ఎంపిక చేశారు. 7. గ్రూప్ 1 పరీక్ష అనేది upsc మాదిరిగా ప్రతి సంవత్సరం పడక పోవడం, రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష అవ్వడం, ఎక్కువ మంది ఆశవహులు ఉండటం వల్ల 1:100 నిష్పత్తి లొ మెయిన్స్ కి ఎంపిక చేయడం తెలంగాణ గ్రామీణ ప్రాంతం లోని విద్యార్థులకి తమ కలల ఉద్యోగం అయిన గ్రూప్ 1 ని సాధించే అవకాశాల సంఖ్య పెరుగుతుంది. 8. తెలంగాణ లొ ప్రస్తుతం 563 ఉద్యోగ ఖాళీలతో వచ్చిన ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది గత 50 సంవత్సరాలలొ అతి పెద్దది, మరియు ఇది దాదాపు ఒక సివిల్స్ నోటిఫికేషన్ కి సమానంగా ఉండటం వల్ల, లక్షల సంఖ్యలో గ్రామీణ అభ్యర్థులు, పోటీపడటం, అరుదు గా ఇలాంటి భారీ నోటిఫికేషన్ లు రావడం, తెలంగాణ ఉద్యమం సమయంలొ అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్1 మెయిన్స్ పరీక్ష ని బహిష్కరణ చేసిన మన తెలంగాణ అభ్యర్థులకు ప్రస్తుత నోటిఫికేషన్ లొ అవకాశాల సంఖ్యను పెంచి, వారి త్యాగాలను గుర్తించి,వారికి న్యాయం చేయాలి. పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గతంలో ప్రతిపక్షంగా ఉండి 1:100 ని సమర్ధించిన ప్రస్తుతం అధికారం లో వున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వేల మంది తెలంగాణ గ్రూప్ - 1 ఆశావహుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని మానవతా దృక్పథంతో 1:100 చొప్పున మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తూ తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 జాబులను సాధించే అవకాశాలను మరింత పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నం. గమనిక: ఇక్కడ అభ్యర్థులు పరీక్షను వాయిదా వెయ్యమని అడగడం లేదు, ఎక్కువ మంది అర్హులకు మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వమని మాత్రమే అడుగుతన్నరు. I think this is very much doable, CM garu. Please do justice to the unemployed youth of Telangana. Office of Chief Secretary, Telangana Govt. Telangana CMO BRS Party #BRS4Jobs

Dr.RS Praveen Kumar

36,165 görüntüleme • 2 yıl önce

అయ్యా Ganta Srinivasa Rao గారు 2004 (22 సంవత్సరాలు)నుంచి వైజాగ్ ప్రజలు మిమ్మల్ని వివిధ హోదాల్లో పెడుతుంటే పొల్యూషన్ కంట్రోల్ చెయ్యకుండా నిద్రపోయారా? ఎంపీగా చేశారు- ఢిల్లీలో మాట్లాడారా అంటే లేదు .. మంత్రిగా చేశారు కేబినెట్లో మాట్లాడారా అంటే లేదు.. MLA గా చేసినప్పటికీ మొట్ట మొదటిసారి నిద్ర లేచారు … ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రాతిపదికన కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మాట్లాడతారా? 2024 లోనే వైజాగ్ కాలుష్యం కోసం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు.green vizag గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తరువాత pollutuon control board తో రివ్యూ చేశారు. తాడి గ్రామం గురించి మీ జీవితంలో ఎప్పుడైనా పని చేశారా? పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు APPCB ని బలోపేతం చేశారు , పరిశ్రమలకు 33% గ్రీన్ బెల్ట్ తప్పనిసరి అని చెప్పి వదిలేయకుండా ఖటినంగా అమలు పరుస్తున్నారు , 2047 నాటికి 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పని చేస్తున్నారు , గ్రేట్ గ్రీన్ వాల్ (విజాగ్ సర్కిల్‌తో సహా) అమలు చేస్తున్నారు. మీరు వైజాగులో ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అని ఒక్కసారి కూడా మానిటర్ చెయ్యకుండా,స్థానికంగా ఒక్క రోజు కూడా ఆ దిశగా పని చెయ్యకుండా అసెంబ్లీలో క్వశ్చన్ ఎలా అడుగుతారు గంటా శ్రీనివాసరావుగారు

Political Missile

58,792 görüntüleme • 20 saat önce

అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా? రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. N Chandrababu Naidu గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. English Version-

YS Jagan Mohan Reddy

231,374 görüntüleme • 1 ay önce