Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

ప్రయత్నం చేయడం . . . .

16,018 görüntüleme • 4 ay önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

రౌడీలు ఇలా కత్తిని జేబులో పెట్టుకు తిరుగుతున్నారు .. జనమంతా చూస్తుండగా ఏకంగా కానిస్టేబుల్ ని పొడుస్తానని బెదిరిస్తున్నాడు .. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ ఇష్యూ జరిగింది .. ఒక లాప్ టాప్ చోరీ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై కొండమిట్టకు చెందిన జితేంద్ర , శ్రీనివాస్ ఈ దాడి చేశారు .. ఇంకా విచిత్రం ఏమంటే ఒకే ఒక్కడు కానిస్టేబుల్ వాళ్ళతో పోరాటం చేస్తుంటే జనమంతా చూస్తూనే ఉన్నారు తప్ప కనీసం ఆపే ప్రయత్నం చేయడం లేదు బహుశా ఈ రౌడీ ముఠా కచ్చితంగా గంజాయి మత్తులోనే ఇదంతా చేసి ఉంటారనిపిస్తోంది .. అసలు కత్తి జేబులో పెట్టుకు తిరుగుతున్న ఇలాంటివాళ్లని ఏమి చేయాలి ? ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సొసైటీకి ఎంత ప్రమాదం ?

ASHOK VEMULAPALLI

18,887 görüntüleme • 1 ay önce

బండి సంజయ్ పేరు వాడొద్దని కోర్టు ఆదేశాలు ఇవ్వలేదు మరోసారి పచ్చి అబద్దం ఆడి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ GAG ఆదేశాలు ఇచ్చారని జరుగుతున్న ప్రచారాలు పచ్చి అబద్ధం తన కొడుకు POCSO కేసులో తన పేరు వాడొద్దని బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టులో కేవలం పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడని, ఇంకా కేసు నంబర్ లిస్ట్ కూడా కాలేదని అప్పుడే కోర్టు ఆదేశాలు ఇచ్చారని ప్రచారం చేయడం దుర్మార్గం కొందరు బండి సంజయ్ అభిమాన లాయర్లు సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు, ఇది న్యాయ వృత్తికే అవమానం మీకు బీజేపీ నచ్చితే అక్కడ పని చేయండి కానీ నల్ల కోటు వేసుకుని న్యాయ వృత్తికి అప్రతిష్ఠ తీసుకురాకండి ఇవ్వని ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రచారం చేసిన న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలి – అడ్వకేట్ జిలుకర శ్రీనివాస్

Telugu Scribe

29,108 görüntüleme • 4 ay önce

బ్రేకింగ్ న్యూస్ 🚨 బీఆర్ఎస్ పైన అసత్య ప్రచారాల కోసం ఇన్‌ఫ్లుయెన్సర్‌ యూట్యూబర్లను సోషల్ మీడియా పేజీలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జనాల్లో బీఆర్ఎస్ పట్ల పెరుగుతున్న ప్రేమను చూసి భయపడ్డ రౌడీ షీటర్ నవీన్ యాదవ్ ఇప్పుడు పెయిడ్ క్యాంపెయిన్‌లతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు రౌడీ షీటర్ నవీన్ యాదవ్ వీడియోలు రీల్స్, ఫేక్ సర్వేలు అన్నీ ఒకే ఉద్దేశంతో… జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయడం! ఇప్పటికే పలువురు సినిమా నటులను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను బెదిరించి తనకు మద్దతు పలికేలా ఒత్తిడి తెచ్చిన రౌడీ షీటర్ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రజలారా మీరు చూసే ప్రతి వీడియో వెనక ఎవరి డబ్బు ఉందో తెలుసుకోండి ఇది రాజకీయాలు కాదు… ఇది రౌడీయిజం మరియు మోసపూరిత ప్రచారం! జాగ్రత్త జూబ్లీహిల్స్ నిజం తెలుసుకోండి మోసపోవద్దు! #JubileeHillsWithBRS

DIG TV Parody

30,059 görüntüleme • 10 ay önce

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవాలయ పునర్ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా తీసిన వీడియోలతో ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే… దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం డిపార్ట్మెంట్ ప్లాన్, ఎస్టిమేషన్ ప్రకారం రాయచూర్ కు చెందిన శ్రీ ఎస్. రాజేంద్రారెడ్డి, క్లోజ్డ్ మండపం చల్లా అంజనీ ప్రసాద్ (హైదరాబాద్) వారు తమ స్వంత ఖర్చుతో నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాతి నిర్మాణపు పనులు 60% పూర్తి అయినందున దేవస్థానం వైదిక కమిటి సభ్యుల తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారులు లిఖిత పూర్వక సూచనల మేరకు దేవాదాయ శాఖ కమీషనర్ వారికి నివేదిక రూపంలో తెలియపరచి 28.02.2026 ఉదయం శాస్ట్రోక్తముగా స్థానిక శాసన సభ్యులు, కసాపురం గ్రామస్తులు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ స్థపతి, రెవిన్యూ, పోలీస్ వారి సమక్షంలో బాలాలయం ఏర్పాట్లు చేసి అదే రోజు మధ్యాహ్నం పై అధికారుల సమక్షంలో పంచనామా చేసి పాత ఆలయమును తొలగించారు. 27.06.2026 న ఉత్తరాయణ పుణ్య కాలంలో నూతన దేవాలయ పునః ప్రతిష్ట చేసేందుకు ఆగమ సలహాదారులు, వైదిక సభ్యులు నిర్ణయించారు కూడా. వాస్తవాలు ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం, సున్నితమైన మతపరమైన అంశాలలో ఆవేశకావేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చట్టరీత్యా నేరం. #FactCheck #AndhraPradesh

FactCheck.AP.Gov.in

54,904 görüntüleme • 6 ay önce

నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. ​గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ​కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసిందే. ​ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు ఎరువులు దొరకక రైతులు గోస పడుతుంటే, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ​కేసీఆర్ గారి కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోంది. ​ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే మా దృష్టి అంతా ఉంటుంది. ​కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. - ​మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

BRS Party

46,946 görüntüleme • 1 yıl önce

చెప్పకుండా బైటకి ఎందుకు వెళ్లారే దొంగ ము*డా అంటూ విద్యార్థినులను కొట్టి, బూతులు తిట్టిన ప్రిన్సిపాల్ వికారాబాద్‌లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినులను కొట్టి, బూతులు తిట్టిన ప్రిన్సిపాల్ వరుస వివాదాల్లో ప్రిన్సిపాల్.. గత నెలలో ఈ బడి పై నుంచి ఓ బాలిక దూకిన ఘటనను మరువక ముందే.. తాజాగా పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులను ప్రిన్సిపాల్ బూతులు తిడుతూ, కొట్టడంతో చర్చనీయాంశంగా మారిన ఘటన మీరు బయటకు వెళ్లడానికి కారణం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్.. తాము వెళ్లడం తప్పేనంటూ విద్యార్థినులు చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. ఓ విద్యార్థినిని పలుమార్లు చెంప దెబ్బలు కొట్టిన ప్రిన్సిపాల్ ఆ బాలికపై దొంగ ము**డా అంటూ నోరు పారేసుకొని.. విద్యార్థినులపై చేయి చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా తిట్టిన ప్రిన్సిపాల్ కాగా, ప్రిన్సిపాల్ ఇలా చేయడం కొత్తేమీ కాదని.. బడిలో టీచర్లు తమపై ఇష్టానుసారం చేయి చేసుకుంటున్నా, బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని వాపోతున్న విద్యార్థినులు గత నెలలో ఈ పాఠశాల భవనం పై నుంచి ఓ విద్యార్థిని కిందకు దూకిన ఘటనపై స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రిన్సిపాల్‌ను మందలించినప్పటికీ ప్రిన్సిపాల్, సిబ్బంది తీరు మారలేదు

Telugu Scribe

388,157 görüntüleme • 1 yıl önce

పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి గారివి పరిణితి లేని వ్యాఖ్యలు. మీరు గతం మరిచిపోయినట్టున్నారు! నాడు...గ్రూప్ 2, టెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చెయ్యాలని అభ్యర్థులు అడిగితే మద్దతు తెలపలేదా మీరు? అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మీరు ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదు? ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా? ఊసరవెల్లి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసింది మీరు. అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేసింది మీరు. డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నది మీరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యం. పార్టీల బలోపేతానికే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు సన్నాసులు అంటున్న రేవంత్.. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయం కోసమే వాయిదా కోరినారా? రాత్రి, పగలు కూడా లెక్కచేయకుండా అభ్యర్థులు, పోరాటం చేస్తుంటే సానుభూతి చూపాల్సింది పోయి, రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మీరు వ్యవహరిస్తున్న తీరును, మీ రెండు నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక బుద్ధి చెబుతారు. #CongressFailedTelangana

Harish Rao Thanneeru

48,383 görüntüleme • 2 yıl önce

Revanth Reddy DGP TELANGANA POLICE Ponguleti Srinivasa Reddy Collector Rangareddy Dr. M. Ramesh, IPS CP Hyderabad City Police Telangana Police HYDRAA Secretary MAUD. భూమి ప్రభుత్వ భూమా, పట్టా భూమా, శికం భూమా, FTL పరిధిలో ఉందా లేదా అనే విషయాలు యూట్యూబ్ స్టూడియోలలో, ప్రెస్ మీట్లలో లేదా సోషల్ మీడియా ట్రయల్స్‌లో తేలే అంశాలు కావు. వాటిని నిర్ణయించే అధికారం సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, HMDA, HYDRAA రిజిస్ట్రేషన్ శాఖలు మరియు చివరికి చట్టబద్ధ న్యాయస్థానాలకే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో కొందరు స్వయంఘోషిత జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, యూట్యూబ్ వ్యాఖ్యాతలు తామే రెవెన్యూ అధికారులు, తామే విచారణాధికారులు, తామే కోర్టులు అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కోడి చెరువు (Lake ID: 1600/E/02)కు సంబంధించి అధికారికంగా సిద్ధం చేసిన Revenue/FTL Statement ప్రకారం Survey No.706 మొత్తం Ac.13-13 విస్తీర్ణంలో "Ownership" కాలమ్‌లో స్పష్టంగా "Patta" అని నమోదు చేయబడింది. అదే పట్టికలో Survey No.707 మాత్రమే "Sarkari"గా చూపబడింది. అయినప్పటికీ ఎటువంటి తుది న్యాయ నిర్ణయం లేకుండా "100% కబ్జా", "100% ఆక్రమణ", "ప్రభుత్వ భూమి దోపిడీ" అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, ప్రభుత్వ రికార్డుల్లో పట్టాదారుగా నమోదై, పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డాక్యుమెంట్లు పొందిన తర్వాత, ఆ హక్కులను యూట్యూబ్ వీడియోల ద్వారా రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. నిజంగా ప్రభుత్వ భూమి, చెరువు, కుంట లేదా FTL ఆక్రమణ జరిగి ఉంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలి. అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టులను ఆశ్రయించాలి. అదే Rule of Law. కానీ ప్రైవేట్ ఆస్తులలోకి ప్రవేశించి "ఇది నీ భూమి కాదు", "ఇది చెరువు", "నీకీ పట్టా ఎలా వచ్చింది?", "నువ్వు అక్రమంగా తెచ్చుకున్నావు" అంటూ వీడియోలు తీసి లక్షలాది మందికి ప్రసారం చేయడం, వ్యక్తులను ముందుగానే నేరస్థులుగా చిత్రీకరించడం ఏ చట్టం అనుమతిస్తోంది? భారత రాజ్యాంగం Article 19(1)(a) కింద భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. కానీ అదే రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి Article 19(1)(d) కింద దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే హక్కు, Article 19(1)(e) కింద దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా నివసించే మరియు స్థిరపడే హక్కు, Article 19(1)(g) కింద చట్టబద్ధమైన వృత్తి, వ్యాపారం లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించే హక్కును కూడా కల్పించింది. కాబట్టి ఒక భారత పౌరుడు మరో రాష్ట్రంలో చట్టబద్ధంగా ఆస్తి కొనుగోలు చేయడాన్ని కేవలం అతని ప్రాంతీయ గుర్తింపును ఆధారంగా చేసుకొని అనుమానాస్పదంగా చిత్రీకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటువంటి వ్యాఖ్యలు జాతీయ సమైక్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల సంబంధిత వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు మరియు ప్రచారాలను పరిశీలించి, అవి Bharatiya Nyaya Sanhita, 2023లోని Section 196 (వివిధ వర్గాల మధ్య విద్వేషాలను ప్రోత్సహించడం), Section 197 (జాతీయ సమైక్యతకు హానికరమైన వ్యాఖ్యలు), Section 353 (ప్రజల్లో భయం, అపోహలు లేదా ప్రజా అశాంతికి దారితీసే తప్పుడు సమాచారం ప్రచారం) తదితర వర్తించే నిబంధనలను ఆకర్షిస్తున్నాయా అనే అంశాన్ని దర్యాప్తు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో విమర్శలు స్వాగతించదగినవే. కానీ సోషల్ మీడియా ట్రయల్స్, నిర్ధారణ కాని ఆరోపణలను నిజాలుగా ప్రచారం చేయడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. Rule of Law ఉందా? లేక YouTube తీర్పులే చట్టమా?

V. Ravikrishna

20,756 görüntüleme • 3 ay önce

విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పుచేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విద్యార్థులు, యువకులు కోసం, వారి భవిష్యత్తుకోసం గడచిన 2 నెలలుగా అన్నివర్గాల మద్దతుతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. చంద్రబాబుగారూ.. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి, ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్‌గారిని కలవడం దగ్గరనుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు, అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతగా జరిగాయి. మే 29, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు జూన్‌ 1, 2026 - జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతిపత్రాలు జూన్‌ 8-9, 2026 - నియోజకవర్గ స్థాయి టౌన్‌ హాల్ సమావేశాలు. జూన్‌ 12, 2026 - 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు జూన్‌ 18, 2026 - రాష్ట్ర గవర్నర్‌ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం జులై 28, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు జులై 31, 2026 - జిల్లా కలెక్టర్లు/జాయింట్‌ కలెక్టర్లకు వినతిపత్రాలు ఆగస్టు 3-4, 2026 - రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్‌, టౌన్‌హాల్‌ సమావేశాలు ఆగస్టు 6-8, 2026 - నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు ఆగస్టు 10, 2026 - రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబుగారు మీరు నోరుమెదపడంలేదు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ( విద్యాదీవెన), వసతిదీవెన కింద దాదాపుగా రూ.9వేల కోట్లు బకాయిలు, పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరిట నిరుద్యోగ భృతికింద నెలా నెలా రూ.3వేల చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈమూడేళ్లకు రూ.36,000X3సంవత్సరాలు = రూ.1,08,000లు చొప్పున ప్రతి నిరుద్యోగికీ పడ్డ బాకీ సహా ఏ డిమాండ్‌పైనా ఇప్పటివరకూ నోరు తెరవలేదు. మీ కుమారుడు లోకేష్‌కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రి అయిన మీ కుమారుడు నోరువిప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు చంద్రబాబుగారు. ఇది మీ తప్పులను మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1.డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ 2.దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా 3.రూ.9వేల కోట్ల బకాయి పడ్డ ఫీజురీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనల చెల్లింపు 4.ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి, బకాయిలతో కలిపి, ఈ మూడేళ్లకాలానికి చెల్లించాలి. ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా, డైవర్ట్‌ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబుగారూ.. ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా? లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు, తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వీళ్లంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది. N Chandrababu Naidu గారూ.. మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు. Gen-Z ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి. అంతవరకూ ఈ పోరాటాలు ఆగవు. English Version-

YS Jagan Mohan Reddy

68,023 görüntüleme • 1 ay önce

ఇటీవల ప్రఖ్యాత ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారి మీద విస్తృత దుష్ప్రచారం జరుగుతున్నది. దానికి ఆధారం విడిపోయినా వారి మొదటి భార్య శ్రీమతి కామేశ్వరి గారి యొక్క వీడియో కథనం. ప్రజా బాహుళ్యంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కామేశ్వరి గారు నరసింహరావు గారి ప్రథమ భార్య. వారికి ఇద్దరు సంతానం. ఆ తర్వాత వారు విడిపోయారు. విడిపోయిన తర్వాత నరసింహారావు గారు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే ముందు భార్య ద్వారా కలిగిన ఆ ఇద్దరు సంతానాన్ని నర్సింహారావు గారే పెంచి, పోషించి, వివాహాలు జరిపించి తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించారు. ఇందుకు ఆయన గారి రెండవ శ్రీమతి గారు ఎంతో సహకరించడమే కాకుండా ఆ ముందు భార్య ద్వారా కలిగిన ఇద్దరు సంతానాన్ని తన సంతానంగానే పరిగణించి తల్లి ప్రేమను ఆ పిల్లలకు పంచారు. ఈ విషయాన్ని విడిపోయినా మొదటి భార్య కామేశ్వరి గారే స్వయానా తన వీడియో ద్వారా తెలియజేశారు.👇 దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత కామేశ్వరి గారు ఇప్పుడు తన విడిపోయిన భర్త గరికపాటి నరసింహారావు గారి పైన అకస్మాత్తుగా ఈ నిందలు ఎందుకు వేస్తున్నారో ఆవిడకే తెలియాలి. ఆ కారణాలు, ఉద్దేశాలు ఏమిటో తెలియకపోయినా, ప్రస్తుతం ఉన్న హిందూ వ్యతిరేక వాతావరణాన్ని బట్టి కొంత అంచనా వేయవచ్చు. శ్రీ గరికపాటి నరసింహారావు గారితో నాకు ఎలాంటి పరిచయం లేదు. వారు హిందూ ధర్మం కోసం, హిందువులను మరియు హిందూ సమాజాన్ని పునర్హైందవీకరణ చేయడం కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. మత మార్పిడులు మరియు హిందూ ధర్మంపై జరుగుతున్న దురాక్రమణలను వారూ ఎండగడుతున్నారు. కనుక నేను వారి అభిమానిని. అందుకే నేను ఇది రాస్తున్నాను. హిందూ ధర్మ రక్షణకు పాటుపడే వారిపై హిందూ వ్యతిరేక శక్తులు దురాక్రమణలు చేయడం కొత్త ఏమీ కాదు. ఇది అనాదిగా వస్తున్నదే. అయితే ఆధునిక యుగంలో ఈ దురాక్రమణలు, దుష్ప్రచారాలు తీవ్రమైనాయి. కొన్ని ముఖ్యమైన ఉదాహరణల ద్వారా ఈ హైందవ వ్యతిరేక కుట్రను సాధారణ హిందువులకు తెలియజేయాలని నా ఈ ప్రయత్నం. 1. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో స్వామి శ్రద్ధానంద గారూ హిందూ సమాజానికి, హిందూ ధర్మ రక్షణకు, పునర్హైందవీకరణకు ఎన్నో విధాలుగా కృషి చేసేవారు. హిందూ వ్యతిరేక శక్తులకు ఆయన కొరకరాని కొయ్య అయ్యారు. అందుకు 1926 సంవత్సరంలో ముస్లింలు ఆయనను హత్య చేశారు. తద్వారా హర్యానా లోని మేవాట్ మరియు ఇతర ప్రాంతాల్లో ఆయన చేస్తున్న హిందూ ధర్మరక్షణ కృషి ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతాలు దాదాపుగా ముస్లిం మెజారిటీ అయ్యాయి. 2. అయోధ్యలోని రామ జన్మ భూమి సమస్యను పరిష్కరించడానికి ఆనాటి కంచి శంకరాచార్యలు వారు శ్రీ జయేంద్ర సరస్వతి గారు ఎన్నో విధాలుగా కృషి చేశారు. అలాగే వారూ హిందూ ధర్మ పరిరక్షణకు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో మత మార్పిడులు, హిందూ మతంపై జరుగుతున్న అత్యాచారాలను ఆపడానికి ఎంతో కృషి చేశారు. వారిని అప్రతిష్టపాలు చేస్తే వారి కృషిని ఆపవచ్చని హిందూ వ్యతిరేక శక్తులు కుట్ర పన్ని వారిని 2004 సంవత్సరంలో తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ కూడా చేయించారు. దానితో వారు తీవ్ర మనస్థాపానికి గురై బ్రహ్మ లీనం చెందారు. తద్వారా హిందూ వ్యతిరేక శక్తుల పన్నిన పన్నాగం ఫలించింది. 3. ఒడిశాలో స్వామి లఖ్నానంద సరస్వతి గారు సమాజంలోని అట్టడుగు వర్గాల మధ్య నివసిస్తూ వారి అభివృద్ధికి, వారిని మతమార్పిడి మహమ్మారీ బారి నుండి రక్షించడానికి ఎంతో కృషి చేస్తుండేవారు. ఒడిశాలో మత మార్పిడిలకు ఆయన అడ్డు కట్ట వేశారు అంటే అతిశయోక్తి కాదు. ఆయనను తొలగించి మత మార్పిడులను తీవ్రతరం చేయడానికి హిందూ వ్యతిరేక శక్తులు నక్సలైట్ల సహాయంతో ఆయనను 2008వ సంవత్సరంలో హత్య చేశారు. ఫలితంగా ఆ తర్వాత ఒడిశాలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్నాయి. 4. సంత్ ఆశారాం బాపు గారు ప్రఖ్యాత ప్రవచనకర్తయే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణకు, మత మార్పిడులను ఆపడానికి ఎంతో కృషి చేశారు. ఆయనను అప్రతిష్టపాలు చేసి ఆయన చేస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను ఆపడానికి హిందూ వ్యతిరేక శక్తులు ఆయన పై తప్పుడు కేసులు బనాయించి ఆయనను జైలు పాలు చేశారు. ఫలితంగా గత 10 సంవత్సరాలుగా ఆయన కారాగారవాసం చేస్తున్నారు. ఆయన చేపట్టిన హిందూ ధర్మ పరిరక్షణ ఉద్యమాలు కార్యక్రమాలు అన్నీ ఆగిపోవడంతో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో మత మార్పిడులు తీవ్రతరంగా జరుగుతున్నాయి. 5. పంజాబ్, హర్యానా ప్రాంతంలో సంత్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా తన డేరా సచ్చా సౌదా అనే సంస్థ ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాల ఉన్నతికి, వారిని మతమార్పిడి శక్తుల బారి నుండి రక్షించడానికి ఎంతో కృషి చేసేవారు. ఆయనను అప్రతిష్టపాలు చేసి ఆయన చేసే మత మార్పిడి వ్యతిరేక కార్యక్రమాలను ఆపడానికి ఆయనపై తప్పుడు కేసులు బనాయించి 2017 నుండి ఆయనను జైలు పాలు చేశారు. ఫలితంగా హర్యానా, పంజాబ్‌లలో మత మార్పిడులు తీవ్రతరమయ్యాయి. 6. తమిళనాడులో మహా విష్ణు గారు ఒక ప్రఖ్యాత హిందూ ప్రవచనకర్త, ప్రేరణాత్మక వక్త. ఇటీవల ఆయన ఒక కళాశాలలో విద్యార్థులకు ఇచ్చిన ప్రేరణాత్మక ప్రసంగంలో హిందూ కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు ప్రజలను సన్మార్గంలో ఎలా నడిపించడానికి దోహదపడుతున్నాయో వివరించారు. అయితే ఆయన చెప్పిన హిందూ ఆధ్యాత్మిక బోధన ఇతర మతస్థుల మనోభావాలను దెబ్బతీసిందని, ఇతర మతాలను కించపర్చినట్లుగా ఉందని హిందూ వ్యతిరేక శక్తులు ఆయనపై తప్పుడు కేసు బనాయించి ఆయనను అరెస్ట్ చేయించారు. ఫలితంగా ఆయన ఇప్పుడు స్తబ్దు అయిపోయారు. ఈ విధంగా దేశంలో పలు ప్రాంతాల్లో హిందూ ధర్మానికి, హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ సమాజ పునర్హైందవీకరణానికి కృషి చేస్తున్న వారినెందరినో ఏదో విధంగా మట్టు పెట్టడమో, స్తబ్దు చేయడమో, అప్రతిష్టపాలు చేసి వాళ్ళ చేసే కార్యక్రమాలను ఆపివేయడమో చేస్తే మత మార్పిడులు, హిందూ ధర్మ నాశనం చేయడం తేలికవుతుందని హిందూ వ్యతిరేక శక్తులు కుట్ర చేయడం కొత్తేమీ కాదు. గరికిపాటి నరసింహారావు గారి విషయంలో కూడా హిందూ వ్యతిరేక శక్తులు ఆయనను అప్రతిష్టపాలు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయనేది జగద్విదితం. ఈ నేపథ్యంలో, అకస్మాత్తుగా గరికిపాటి నరసింహారావు గారి విడిపోయిన మొదటి భార్య తెరపైకి రావడం, వారిని అప్రతిష్టపాలు చేసే విధంగా వారిపై అభాండాలు, నిందలు వేయడం వెనక హిందూ వ్యతిరేక శక్తులు ఉండ వచ్చని నా ప్రగాఢ నమ్మకం. గరికిపాటి నరసింహరావు గారిని అప్రతిష్టపాలు చేస్తే హిందువులలో ఆయన మీద నమ్మకం పోయి ఆయన చేసే ధార్మిక కార్యక్రమాలకు ప్రజాదరణ తగ్గితే హిందూ వ్యతిరేక శక్తుల హిందూ విధ్వంసక కార్యక్రమాలు, మత మార్పిడిలు సజావుగా సులువుగా సాగుతాయనే ఉద్దేశ్యంతో ఆ దుష్ట శక్తులు పన్నిన కుట్రయని నేను భావిస్తున్నాను. కాబట్టి హిందూ సమాజానికి, హిందూ సోదర సోదరీమణులకు నా విన్నపం ఏమిటంటే హిందూ ధర్మాచార్యుల పైన, పీఠాధిపతుల పైన, అర్చకుల పైన, పురోహితుల పైన, ప్రవచనకర్తల పైన మరియు హిందూ ధర్మానికి పాటుపడే ఎవరిపైనైనా ఏవైనా ఆరోపణలు, నిందలు వస్తే వాటిని వెంటనే నమ్మవద్దు. హిందూ వ్యతిరేక శక్తుల వలలో పడి హిందూ మత పెద్దల పైన, ఆచార్యులపైన అనుమానాలు పెంచుకోవద్దు. ఎందుకంటే అనుమానం పెను భూతం. అది మనల్ని దహించి వేస్తుంది. స్వస్తి🙏

M. Nageswara Rao IPS (Retired)

23,162 görüntüleme • 1 yıl önce