
Harish Rao Thanneeru
@BRSHarish • 1,407,818 subscribers
Former Minister | MLA from Siddipet | BRS Party | Telangana State.
Shorts
Videos

విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా Revanth Reddy .? ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు? ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే లాఠీలు.. హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా? విద్యార్థులన్నా.. నిరుద్యోగులన్నా ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి? వెంటనే పోలీసు దమనకాండను ఆపాలి. విద్యార్థులపై చేయి పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడంతో పాటు, మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని DGP TELANGANA POLICE డిమాండ్ చేస్తున్నాం.
Harish Rao Thanneeru70,367 views • 1 day ago

సర్కార్ నడుపుతున్నవా.. లేక సర్కస్ నడుపుతున్నవా రేవంత్ రెడ్డి? మీ తప్పులకు ప్రభుత్వ అధికారులు బలి కావాలా? తప్పు మీరు చేస్తే శిక్ష వారు అనుభవించాలా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను బంద్ చేయాలనే కుట్ర బయటపడటంతో ఆ తప్పును అధికారులపైకి నెట్టే ప్రయత్నం మంత్రి Ponnam Prabhakar చేస్తున్నారు. 22ఏ నిషేధిత భూముల విషయంలో భూదందా వెలుగులోకి రావడంతో మంత్రి Ponguleti Srinivasa Reddy ‘‘సారీ’’ అంటూ తప్పించుకుని, అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల జీవితాలతో ముడి పడి ఉన్న అంశాల్లో సరిదిద్దుకోలేని తప్పు చేసి, ‘‘సారీ’’ చెప్పి తప్పించుకుంటే సరిపోదు Revanth Reddy కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇక రావేమోనని పేదలు ఆందోళన చెందుతున్నారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంతో ఎంతోమంది మానసిక వేదనకు గురయ్యారు. బాధ్యులైన అధికారులపై మీరు చర్యలు తీసుకోవడం కాదు.. మీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వ వైఫల్యంపై ముందు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులపై మీరు సీరియస్గా ఉండటం కాదు.. తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వంపై సీరియస్గా ఉన్నారు. కర్రు కాల్చి వాత పెట్టేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎన్ని సార్లు సారీ చెప్పినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. కళ్యాణ లక్ష్మి పథకం ఆగకూడదు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితా నుంచి భూహక్కుదారుల భూములను తొలగించి, వారికి పూర్తి హక్కులు కల్పించాలి. Telangana CMO
Harish Rao Thanneeru41,134 views • 3 days ago

లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రూపాయి చెల్లించకుండా రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది సర్వేయర్లు ఏడాది కాలంగా ఎలా జీవించాలి? వారి కుటుంబాలను ఎలా పోషించాలి? అరెస్టులతో సర్వేయర్ల గొంతును అణచివేయడం అప్రజాస్వామికం. వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లైసెన్స్డ్ సర్వేయర్లతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana #PonguletiMustResign
Harish Rao Thanneeru23,302 views • 2 days ago

లక్షల క్యూసెక్కుల గోదావరి వరద వృథాగా పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పక్క రాష్ట్రం పట్టిసీమ మోటార్లతో గోదావరి జలాలను తోడుకుపోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా వాడకుండా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేవలం రాజకీయ కక్షతో పంతానికి పోయి.. సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతున్న ముఖ్యమంత్రి Revanth Reddy అసమర్థత ఇది. తెలంగాణ రైతుల కడుపు కొట్టి, మన నీళ్లను ఆంధ్రా పాలు చేస్తున్న రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. #CongressFailedTelangana #CongressBetrayedFarmers
Harish Rao Thanneeru175,911 views • 1 month ago

రేవంత్ రెడ్డి.. దేవుళ్ల మీద ఒట్టేసి రైతులకు ఇచ్చిన మీ రుణమాఫీ హామీని మరోసారి గుర్తు చేస్తున్నా. 32 నెలల పాలన గడిచిపోయింది. ఇంకెన్నాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు? ఒక్కటే ప్రభుత్వం.. కానీ రుణమాఫీ పై పూటకో మాట. బ్యాంకర్ల దగ్గర 51 వేల కోట్లు అన్నరు. బడ్జెట్లో 31 వేల కోట్లు అన్నరు. చివరకు 20 వేల కోట్లు చేసి, చేతులు దులుపుకున్నరు. ఎండలో ఐస్ ముక్క కరిగినట్లు రుణమాఫీ అంకెలు కరిగిపోయాయి. రుణమాఫీ కోసం ఎదురు చూసి చూసి రైతన్నల గుండెలు అలసిపోయాయి. సొల్లు పురాణం ఆపి.. ఇప్పటికైనా మాట నిలబెట్టుకోండి.. రైతులందరి రుణాలు మాఫీ చేసి, చిత్తశుద్ధి నిరూపించుకోండి. Revanth Reddy Telangana CMO
Harish Rao Thanneeru24,103 views • 5 days ago

రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు. 20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం. నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా? ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు? కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు. కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా? ఆనాటి రోజులు తెస్తానన్న Revanth Reddy ..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్కు వరంగా మారింది. ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది. ఎల్నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం. నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది? తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది. నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు. ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి? కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది? తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు? గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి? ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 tmc, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 tmc, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2tmc, రామగుండం STPP కోసం 6.50 tmc, NTPC కోసం 4.73 tmc మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 tmc, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 tmc, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 tmc కేటాయింపులు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? 1/2
Harish Rao Thanneeru93,035 views • 1 month ago

పెద్దన్నా.. మీరు భౌతికంగా మా మధ్య లేకున్నా మీ పోరాట స్ఫూర్తి, ఉద్యమ జ్ఞాపకాలు, మీ మంచితనం ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి. వేలాదిగా తరలివచ్చి మీకు అంతిమ వీడ్కోలు పలకడం చూస్తే.. మీరు జీవితంలో సంపాదించిన నిజమైన ఆస్తి ఏంటో అర్థమవుతున్నది. అది డబ్బు కాదు.. పదవి కాదు.. ప్రజల ప్రేమ, కొండంత అభిమానమే. ఈరోజు మీ కోసం కార్చిన ప్రతి కన్నీటి చుక్క.. మీరు పంచిన ఆత్మీయతకు, చేసిన పోరాటాలకు నిదర్శనం. మీరు లేరనే బాధ ఎప్పటికీ ఉంటుంది. మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మీకు మేమిచ్చే నిజమైన నివాళి ఓం శాంతి💐🙏
Harish Rao Thanneeru44,927 views • 20 days ago

రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం అత్యంత దురదృష్టకరం. మన పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. Revanth Reddy వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోని ఇంజనీరింగ్ విద్యార్థులకు, టీచర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
Harish Rao Thanneeru32,232 views • 21 days ago

కాళేశ్వరం, సీతారామ సహా ఏడు ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఎజెండాలో పెట్టే ధైర్యం GRMBకి ఎవరిచ్చారు? త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణ నీటి హక్కులను ప్రశ్నించే దమ్ము ఏపీకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ అంటే అంత చులకనగా కనిపిస్తున్నదా? కేసీఆర్ గారు కష్టపడి అనుమతులు తెచ్చి, ప్రాజెక్టులు కడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అనుమతులు తేకపోగా, ఉన్న అనుమతులను రద్దు చేస్తుందా? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. తెలంగాణ నీటి హక్కులపై ఒక్క అంగుళం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. #CongressFailedTelangana #CongressBetrayedFarmers
Harish Rao Thanneeru20,687 views • 15 days ago

10 Years of #MissionBhagiratha 💧 10 Years of Dignity. 10 Years of Transformation. A decade ago, Telangana embarked on a mission that transformed the lives of millions forever. Mission Bhagiratha was not just a drinking water project - it was an engineering marvel Launched on 7 August 2016 by Prime Minister Shri Narendra Modi at Komatibanda village in Gajwel, Mission Bhagiratha was born from the audacious dream of Shri K. Chandrashekar Rao, that every family, in every village, however remote, deserves safe drinking water right at their doorstep. There was a time when securing a pot of drinking water defined everyday life in Telangana. It meant: • Walking gruelling kilometres with empty pots in search of water. • Waiting endlessly for tankers and fighting over every single drop. • Families consuming fluoride-contaminated water that devastated their health and future generations. • Depending on unsafe water sources that spread disease instead of sustaining life. For decades, this hardship was accepted as normal. It never should have been. Mission Bhagiratha changed that forever. Under KCR Garu’s visionary leadership, Telangana built one of the world’s largest rural drinking water grids. Harnessing the waters of the Godavari and Krishna rivers, the State laid more than 1.2 lakh kilometres of pipeline, delivering treated drinking water to 23,968 rural habitations and crores of people across Telangana. What was once a daily struggle became a basic human right. What was once a burden became dignity. Mission Bhagiratha was never just about pipelines, pumps and reservoirs. It was about healthier families, empowered women freed from the burden of fetching water, happier children, improved public health, and a better quality of life for every household. The success of Mission Bhagiratha drew national attention. It became a benchmark in rural drinking water supply, inspired drinking water initiatives across the country, and demonstrated how visionary leadership, meticulous planning and unwavering political will can transform millions of lives. Today, Mission Bhagiratha completes 10 years. It is a milestone that Telangana should celebrate with immense pride. Yet, in less than three years, the Congress government has pushed many parts of the State back into uncertainty, with people once again facing drinking water shortages and struggling for a reliable supply. KCR filled every empty pot in Telangana. Today, those hard-earned gains are steadily being undone. Mission Bhagiratha is more than an engineering achievement. It is a monument to visionary leadership, a symbol of dignity, and a reminder that governments can transform lives when they dare to dream big. It remains one of Telangana’s proudest achievements a visionary project that quenched the thirst of a State and became an inspiration for India. Mission Bhagiratha is not just Telangana’s water story. It is Telangana’s story of vision, determination, and transformation. #10YearsOfMissionBhagiratha #KCR #Telangana
Harish Rao Thanneeru16,695 views • 13 days ago

రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు. #CheapMinister
Harish Rao Thanneeru443,146 views • 2 years ago

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. Revanth Reddy గారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా... టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా.. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి Komatireddy Venkat Reddy గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది.. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే.. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా.. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా. రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana
Harish Rao Thanneeru135,404 views • 7 months ago

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని ఈడ్చుకెళ్లి అరెస్టులు చేయడం సీఎం Revanth Reddy నియంతృత్వ పాలనకు నిదర్శనం. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను అణచివేస్తూ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నడు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని, స్వయంగా DGP TELANGANA POLICE ప్రకటించిన 20 వేల పోలీస్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO
Harish Rao Thanneeru33,793 views • 1 month ago