
Harish Rao Thanneeru
@BRSHarish • 1,407,680 subscribers
Former Minister | MLA from Siddipet | BRS Party | Telangana State.
Shorts
Videos

లక్షల క్యూసెక్కుల గోదావరి వరద వృథాగా పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పక్క రాష్ట్రం పట్టిసీమ మోటార్లతో గోదావరి జలాలను తోడుకుపోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా వాడకుండా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేవలం రాజకీయ కక్షతో పంతానికి పోయి.. సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతున్న ముఖ్యమంత్రి Revanth Reddy అసమర్థత ఇది. తెలంగాణ రైతుల కడుపు కొట్టి, మన నీళ్లను ఆంధ్రా పాలు చేస్తున్న రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. #CongressFailedTelangana #CongressBetrayedFarmers
Harish Rao Thanneeru175,774 Aufrufe • vor 1 Monat

పెద్దన్నా.. మీరు భౌతికంగా మా మధ్య లేకున్నా మీ పోరాట స్ఫూర్తి, ఉద్యమ జ్ఞాపకాలు, మీ మంచితనం ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి. వేలాదిగా తరలివచ్చి మీకు అంతిమ వీడ్కోలు పలకడం చూస్తే.. మీరు జీవితంలో సంపాదించిన నిజమైన ఆస్తి ఏంటో అర్థమవుతున్నది. అది డబ్బు కాదు.. పదవి కాదు.. ప్రజల ప్రేమ, కొండంత అభిమానమే. ఈరోజు మీ కోసం కార్చిన ప్రతి కన్నీటి చుక్క.. మీరు పంచిన ఆత్మీయతకు, చేసిన పోరాటాలకు నిదర్శనం. మీరు లేరనే బాధ ఎప్పటికీ ఉంటుంది. మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మీకు మేమిచ్చే నిజమైన నివాళి ఓం శాంతి💐🙏
Harish Rao Thanneeru44,771 Aufrufe • vor 11 Tagen

శోకసంద్రమైన నర్సంపేట.. పెద్దన్నకు కన్నీటి వీడ్కోలు..
Harish Rao Thanneeru36,744 Aufrufe • vor 11 Tagen

10 Years of #MissionBhagiratha 💧 10 Years of Dignity. 10 Years of Transformation. A decade ago, Telangana embarked on a mission that transformed the lives of millions forever. Mission Bhagiratha was not just a drinking water project - it was an engineering marvel Launched on 7 August 2016 by Prime Minister Shri Narendra Modi at Komatibanda village in Gajwel, Mission Bhagiratha was born from the audacious dream of Shri K. Chandrashekar Rao, that every family, in every village, however remote, deserves safe drinking water right at their doorstep. There was a time when securing a pot of drinking water defined everyday life in Telangana. It meant: • Walking gruelling kilometres with empty pots in search of water. • Waiting endlessly for tankers and fighting over every single drop. • Families consuming fluoride-contaminated water that devastated their health and future generations. • Depending on unsafe water sources that spread disease instead of sustaining life. For decades, this hardship was accepted as normal. It never should have been. Mission Bhagiratha changed that forever. Under KCR Garu’s visionary leadership, Telangana built one of the world’s largest rural drinking water grids. Harnessing the waters of the Godavari and Krishna rivers, the State laid more than 1.2 lakh kilometres of pipeline, delivering treated drinking water to 23,968 rural habitations and crores of people across Telangana. What was once a daily struggle became a basic human right. What was once a burden became dignity. Mission Bhagiratha was never just about pipelines, pumps and reservoirs. It was about healthier families, empowered women freed from the burden of fetching water, happier children, improved public health, and a better quality of life for every household. The success of Mission Bhagiratha drew national attention. It became a benchmark in rural drinking water supply, inspired drinking water initiatives across the country, and demonstrated how visionary leadership, meticulous planning and unwavering political will can transform millions of lives. Today, Mission Bhagiratha completes 10 years. It is a milestone that Telangana should celebrate with immense pride. Yet, in less than three years, the Congress government has pushed many parts of the State back into uncertainty, with people once again facing drinking water shortages and struggling for a reliable supply. KCR filled every empty pot in Telangana. Today, those hard-earned gains are steadily being undone. Mission Bhagiratha is more than an engineering achievement. It is a monument to visionary leadership, a symbol of dignity, and a reminder that governments can transform lives when they dare to dream big. It remains one of Telangana’s proudest achievements a visionary project that quenched the thirst of a State and became an inspiration for India. Mission Bhagiratha is not just Telangana’s water story. It is Telangana’s story of vision, determination, and transformation. #10YearsOfMissionBhagiratha #KCR #Telangana
Harish Rao Thanneeru16,388 Aufrufe • vor 4 Tagen

రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు. 20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం. నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా? ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు? కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు. కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా? ఆనాటి రోజులు తెస్తానన్న Revanth Reddy ..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్కు వరంగా మారింది. ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది. ఎల్నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం. నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది? తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది. నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు. ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి? కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది? తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు? గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి? ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 tmc, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 tmc, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2tmc, రామగుండం STPP కోసం 6.50 tmc, NTPC కోసం 4.73 tmc మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 tmc, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 tmc, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 tmc కేటాయింపులు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? 1/2
Harish Rao Thanneeru92,898 Aufrufe • vor 1 Monat

కాళేశ్వరం, సీతారామ సహా ఏడు ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఎజెండాలో పెట్టే ధైర్యం GRMBకి ఎవరిచ్చారు? త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణ నీటి హక్కులను ప్రశ్నించే దమ్ము ఏపీకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ అంటే అంత చులకనగా కనిపిస్తున్నదా? కేసీఆర్ గారు కష్టపడి అనుమతులు తెచ్చి, ప్రాజెక్టులు కడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అనుమతులు తేకపోగా, ఉన్న అనుమతులను రద్దు చేస్తుందా? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. తెలంగాణ నీటి హక్కులపై ఒక్క అంగుళం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. #CongressFailedTelangana #CongressBetrayedFarmers
Harish Rao Thanneeru20,439 Aufrufe • vor 6 Tagen

రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం అత్యంత దురదృష్టకరం. మన పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. Revanth Reddy వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోని ఇంజనీరింగ్ విద్యార్థులకు, టీచర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
Harish Rao Thanneeru32,232 Aufrufe • vor 12 Tagen

రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు. #CheapMinister
Harish Rao Thanneeru443,146 Aufrufe • vor 2 Jahren

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. Revanth Reddy గారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా... టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా.. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి Komatireddy Venkat Reddy గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది.. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే.. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా.. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా. రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana
Harish Rao Thanneeru135,393 Aufrufe • vor 7 Monaten

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని ఈడ్చుకెళ్లి అరెస్టులు చేయడం సీఎం Revanth Reddy నియంతృత్వ పాలనకు నిదర్శనం. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను అణచివేస్తూ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నడు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని, స్వయంగా DGP TELANGANA POLICE ప్రకటించిన 20 వేల పోలీస్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO
Harish Rao Thanneeru33,763 Aufrufe • vor 1 Monat

బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే Vemula Prashanth Reddy గారిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి గారు నిర్ణయించుకుంటే... ఆయనను పోలీసులు నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం. తమది 'ప్రజా ప్రభుత్వం' అని చెప్పుకుంటూ ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. హిట్లర్ స్పూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న Revanth Reddy కి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులపై అణిచివేత చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. Telangana CMO DGP TELANGANA POLICE
Harish Rao Thanneeru17,901 Aufrufe • vor 28 Tagen

మా రక్తం కావాలంటే తీసుకో.. కానీ రైతులకు నీళ్లు ఇవ్వు !! Revanth Reddy
Harish Rao Thanneeru15,512 Aufrufe • vor 23 Tagen

Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents
Harish Rao Thanneeru425,355 Aufrufe • vor 3 Jahren

Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns. The police, rather than intervening to prevent this attack, seemingly protected the perpetrators. If an MLA's residence can be targeted so brazenly, what assurance do citizens have about their own safety? The destruction of government property in the presence of police is utterly unacceptable. DGP TELANGANA POLICE garu to take immediate action against this shocking incident and to ensure that such lawlessness is not tolerated. #CongressFailedTelangana #SaveTelangana
Harish Rao Thanneeru233,067 Aufrufe • vor 2 Jahren

ఓఆర్ఆర్కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో, Ponguleti Srinivasa Reddy కి చెందిన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? 📍 నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పిసిబి, hmda అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా? నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? విద్యుత్ మంత్రి Bhatti Vikramarka Mallu, పర్యావరణ మంత్రి Konda Surekha, గనుల శాఖ మంత్రి Dr Vivek Venkatswamy సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు? ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి? క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? 1, Telangana PCB (Pollution Control Board) నుంచి Consent for Establishment (CFE) & Consent for Operation (CFO) అనుమతి లేదు. 2, పర్యావరణ అనుమతి MoEF&CC (Environmental Clearance) లేదు. 3, మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతి – మైన్స్ & జియాలజీ విభాగం అనుమతి లేదు. 4, స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి ల్యాండ్ యూజ్ మార్పిడి (Land Conversion) & HMDA క్లియరెన్స్ లేదు 5, విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం Explosives License లేదు. 6, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవు. Central Ground Water Board 7, రెవెన్యూ అనుమతులు లేవు. Office of Chief Secretary, Telangana Govt. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు–కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా? ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతడు. మరోవైపు అదే ముఖ్యమంత్రి Revanth Reddy తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతడు. 📍 ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు? 'తెలంగాణ అంటే బిజినెస్' అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ దనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా? ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? HYDRAA అంటే Hyderabad Disaster Response and Asset Protection Agency అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు? శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్ కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? ఈ మైనింగ్ దందాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము. (1/2)
Harish Rao Thanneeru65,620 Aufrufe • vor 5 Monaten

రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ‘యూరియా యాప్’ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల Vemula Prashanth Reddy గారిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా చేతులెత్తేసిన Revanth Reddy ప్రభుత్వం, తన నిరంకుశ విధానాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం అత్యంత అవివేకం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎంతమాత్రం నిలువరించలేదు. రాబోయే రోజుల్లో అన్నదాతల ఆగ్రహం ఉప్పెనగా మారి ఈ నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే ‘యూరియా యాప్’ను రద్దు చేయాలని, పాత విధానంలోనే రైతులకు అవసరమైనంత యూరియా అందించాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO
Harish Rao Thanneeru24,558 Aufrufe • vor 1 Monat

Further Strengthening the emergency health care services towards #ArogyaTelangana, Hon’ble CM Shri KCR garu will be flagging off 🚨108 Ambulances - 204 🚑102 Ammavodi vehicles -228 🚨 Hearse Vehicle - 34 A total 466 vehicles which will drive to reach patients quickly and ensure that their medical needs are attended. #ThankYouKCR
Harish Rao Thanneeru296,559 Aufrufe • vor 3 Jahren