Harish Rao Thanneeru's banner
Harish Rao Thanneeru's profile picture

Harish Rao Thanneeru

@BRSHarish1,408,110 subscribers

Former Minister | MLA from Siddipet | BRS Party | Telangana State.

Shorts

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. Revanth Reddy గారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా... టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా.. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి Komatireddy Venkat Reddy గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది.. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే.. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా.. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా. రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. Revanth Reddy గారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా... టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా.. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి Komatireddy Venkat Reddy గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది.. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే.. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా.. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా. రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana

135,351 görüntüleme

ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో, Ponguleti Srinivasa Reddy కి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? 📍 నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పిసిబి, hmda అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా? నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? విద్యుత్ మంత్రి Bhatti Vikramarka Mallu, పర్యావరణ మంత్రి Konda Surekha, గనుల శాఖ మంత్రి Dr Vivek Venkatswamy సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు? ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి? క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? 1, Telangana PCB (Pollution Control Board) నుంచి Consent for Establishment (CFE) & Consent for Operation (CFO) అనుమతి లేదు. 2, పర్యావరణ అనుమతి MoEF&CC (Environmental Clearance) లేదు. 3, మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతి – మైన్స్ & జియాలజీ విభాగం అనుమతి లేదు. 4, స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి ల్యాండ్ యూజ్ మార్పిడి (Land Conversion) & HMDA క్లియరెన్స్ లేదు 5, విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం Explosives License లేదు. 6, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవు. Central Ground Water Board 7, రెవెన్యూ అనుమతులు లేవు. Office of Chief Secretary, Telangana Govt. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు–కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా? ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతడు. మరోవైపు అదే ముఖ్యమంత్రి Revanth Reddy తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతడు. 📍 ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు? 'తెలంగాణ అంటే బిజినెస్' అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ దనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా? ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? HYDRAA అంటే Hyderabad Disaster Response and Asset Protection Agency అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు? శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్ కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? ఈ మైనింగ్ దందాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము. (1/2)

ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో, Ponguleti Srinivasa Reddy కి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? 📍 నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పిసిబి, hmda అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా? నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? విద్యుత్ మంత్రి Bhatti Vikramarka Mallu, పర్యావరణ మంత్రి Konda Surekha, గనుల శాఖ మంత్రి Dr Vivek Venkatswamy సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు? ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి? క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? 1, Telangana PCB (Pollution Control Board) నుంచి Consent for Establishment (CFE) & Consent for Operation (CFO) అనుమతి లేదు. 2, పర్యావరణ అనుమతి MoEF&CC (Environmental Clearance) లేదు. 3, మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతి – మైన్స్ & జియాలజీ విభాగం అనుమతి లేదు. 4, స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి ల్యాండ్ యూజ్ మార్పిడి (Land Conversion) & HMDA క్లియరెన్స్ లేదు 5, విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం Explosives License లేదు. 6, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవు. Central Ground Water Board 7, రెవెన్యూ అనుమతులు లేవు. Office of Chief Secretary, Telangana Govt. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు–కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా? ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతడు. మరోవైపు అదే ముఖ్యమంత్రి Revanth Reddy తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతడు. 📍 ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు? 'తెలంగాణ అంటే బిజినెస్' అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ దనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా? ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? HYDRAA అంటే Hyderabad Disaster Response and Asset Protection Agency అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు? శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్ కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? ఈ మైనింగ్ దందాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము. (1/2)

65,487 görüntüleme

Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns. The police, rather than intervening to prevent this attack, seemingly protected the perpetrators. If an MLA's residence can be targeted so brazenly, what assurance do citizens have about their own safety? The destruction of government property in the presence of police is utterly unacceptable. DGP TELANGANA POLICE garu to take immediate action against this shocking incident and to ensure that such lawlessness is not tolerated. #CongressFailedTelangana #SaveTelangana

Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns. The police, rather than intervening to prevent this attack, seemingly protected the perpetrators. If an MLA's residence can be targeted so brazenly, what assurance do citizens have about their own safety? The destruction of government property in the presence of police is utterly unacceptable. DGP TELANGANA POLICE garu to take immediate action against this shocking incident and to ensure that such lawlessness is not tolerated. #CongressFailedTelangana #SaveTelangana

232,975 görüntüleme

"రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు… 3 గంటల కరెంట్ చాలు" అని ERC ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయి. ఇది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు… ఇది రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన. అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయి. పొలం అంటే ఏమిటో… బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో… రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది. కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. రుణమాఫీ అటకెక్కించారు. రైతు బంధు బంద్ చేశారు. పంట బోనస్ బోగస్ చేశారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు, పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు. ఇవి చాలదన్నట్లు కేసీఆర్ గారు ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్ ను ఖతం పట్టిస్తున్నారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా? కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. #CongressFailedTelangana #CongressBetrayedTelangana

"రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు… 3 గంటల కరెంట్ చాలు" అని ERC ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయి. ఇది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు… ఇది రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన. అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయి. పొలం అంటే ఏమిటో… బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో… రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది. కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. రుణమాఫీ అటకెక్కించారు. రైతు బంధు బంద్ చేశారు. పంట బోనస్ బోగస్ చేశారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు, పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు. ఇవి చాలదన్నట్లు కేసీఆర్ గారు ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్ ను ఖతం పట్టిస్తున్నారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా? కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. #CongressFailedTelangana #CongressBetrayedTelangana

12,990 görüntüleme

Shri Rahul Gandhi ji, It is with a heavy heart that I write this letter, not merely in my capacity as a senior leader of the BRS Party, but more importantly as a concerned citizen of this great nation. I wish to bring to your attention that the Congress government in Telangana appears to be operating not by the principles of Baba Saheb’s Constitution, but by the arbitrary exercise of power. The anti-constitutional actions of the Telangana Congress Government, which has trampled humanity and justice under the bulldozer, have now been exposed before the country. Today's High Court observations with respect to the Musi Riverfront and HYDRA issues are a stark reminder of this. The bulldozer has become a symbol of your Chief Minister Revanth Reddy’s “unbridled power,” continuously undermining civil rights with arrogance. The bulldozer, which is being used to establish a ‘rule of fear’ under the pretense of the HYDRA and Musi Riverfront projects, is targeting the homes of poor and middle-class families who have lived in these areas for decades, with all legal documentation in place. This "bulldozer policy" has become the face of the Telangana Congress government’s cruelty. The rule of law—one of the foremost political ideals that establishes the supremacy of law in modern society—is being disregarded by your party’s Chief minister. Originally, bulldozers were invented over 100 years ago to build homes, offices, roads, and other infrastructure. However, much like the BJP has misused bulldozers against the poor and middle class in Uttar Pradesh, Delhi, Madhya Pradesh, Gujarat, Assam, and Maharashtra, the Congress appears to be following their lead in Telangana. Without conducting adequate surveys before demolition, and in spite of a recent Supreme Court verdict, the Congress government in Telangana is adopting bulldozer tactics without following proper procedural guidelines. In light of these circumstances, I humbly urge you to advise your party’s Chief minister to uphold the rule of law and follow the principles of natural justice enshrined in the Constitution of India. With regards, T. Harish Rao Former Minister, MLA, Siddipet BRS Party

Shri Rahul Gandhi ji, It is with a heavy heart that I write this letter, not merely in my capacity as a senior leader of the BRS Party, but more importantly as a concerned citizen of this great nation. I wish to bring to your attention that the Congress government in Telangana appears to be operating not by the principles of Baba Saheb’s Constitution, but by the arbitrary exercise of power. The anti-constitutional actions of the Telangana Congress Government, which has trampled humanity and justice under the bulldozer, have now been exposed before the country. Today's High Court observations with respect to the Musi Riverfront and HYDRA issues are a stark reminder of this. The bulldozer has become a symbol of your Chief Minister Revanth Reddy’s “unbridled power,” continuously undermining civil rights with arrogance. The bulldozer, which is being used to establish a ‘rule of fear’ under the pretense of the HYDRA and Musi Riverfront projects, is targeting the homes of poor and middle-class families who have lived in these areas for decades, with all legal documentation in place. This "bulldozer policy" has become the face of the Telangana Congress government’s cruelty. The rule of law—one of the foremost political ideals that establishes the supremacy of law in modern society—is being disregarded by your party’s Chief minister. Originally, bulldozers were invented over 100 years ago to build homes, offices, roads, and other infrastructure. However, much like the BJP has misused bulldozers against the poor and middle class in Uttar Pradesh, Delhi, Madhya Pradesh, Gujarat, Assam, and Maharashtra, the Congress appears to be following their lead in Telangana. Without conducting adequate surveys before demolition, and in spite of a recent Supreme Court verdict, the Congress government in Telangana is adopting bulldozer tactics without following proper procedural guidelines. In light of these circumstances, I humbly urge you to advise your party’s Chief minister to uphold the rule of law and follow the principles of natural justice enshrined in the Constitution of India. With regards, T. Harish Rao Former Minister, MLA, Siddipet BRS Party

150,257 görüntüleme

తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం❌ ప్రణాళికలు వేయడంలో వైఫల్యం❌ ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం❌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్! ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే MGBS లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి! పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. Revanth Reddy గారు.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. #CongressFailedTelangana #HyderabadFloods

తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం❌ ప్రణాళికలు వేయడంలో వైఫల్యం❌ ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం❌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్! ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే MGBS లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి! పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. Revanth Reddy గారు.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. #CongressFailedTelangana #HyderabadFloods

56,374 görüntüleme

నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండ ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకున్నారు. అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారు. ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఈరోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా BRS చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం #CongressFailedTelangana #CongressBetrayedStudents

నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండ ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకున్నారు. అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారు. ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఈరోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా BRS చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం #CongressFailedTelangana #CongressBetrayedStudents

32,208 görüntüleme

ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్ఎస్ విజయం, కేసీఆర్ గారి విజయం. BRS Party నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదా? మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రావా? రైతుల నోరు కొడుతున్నడు, కడుపు కొడుతున్నడు రేవంత్ రెడ్డి అంటే గాని ఆలోచన రాదా? లక్షలాదిగా రైతులతో తరలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటే గాని చలనం ఉండదా? ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి, విడిచిపెట్టడం దుర్మార్గం ఇకనైనా రాజకీయకక్ష సాధింపు చర్యలపై దృష్టి పెట్టడం మానేసి రైతాంగంపై దృష్టి సారించండి. కల్వకుర్తి వలే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. #CongressFailedTelangana #CongressCheatedFarmers

ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్ఎస్ విజయం, కేసీఆర్ గారి విజయం. BRS Party నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదా? మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రావా? రైతుల నోరు కొడుతున్నడు, కడుపు కొడుతున్నడు రేవంత్ రెడ్డి అంటే గాని ఆలోచన రాదా? లక్షలాదిగా రైతులతో తరలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటే గాని చలనం ఉండదా? ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి, విడిచిపెట్టడం దుర్మార్గం ఇకనైనా రాజకీయకక్ష సాధింపు చర్యలపై దృష్టి పెట్టడం మానేసి రైతాంగంపై దృష్టి సారించండి. కల్వకుర్తి వలే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. #CongressFailedTelangana #CongressCheatedFarmers

56,607 görüntüleme

సిఎం రేవంత్ రెడ్డి గారూ! తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. 👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది. 👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను. మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?

సిఎం రేవంత్ రెడ్డి గారూ! తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. 👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది. 👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను. మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?

92,179 görüntüleme

Deeply saddened by the tragic stampede at Bengaluru Chinnaswamy Stadium which claimed more than 11 lives and left many injured. This horrific incident raises serious concerns about crowd management and public safety. My heartfelt condolences to the families of the victims. Praying for the speedy recovery of the injured.

Deeply saddened by the tragic stampede at Bengaluru Chinnaswamy Stadium which claimed more than 11 lives and left many injured. This horrific incident raises serious concerns about crowd management and public safety. My heartfelt condolences to the families of the victims. Praying for the speedy recovery of the injured.

55,599 görüntüleme

.@tgsrtcmdoffice @SajjanarVC Garu, requested to look into the problem faced by students and take necessary action by increasing the number of buses to avoid the risky footboard travel by school children. Statewide, students are facing this issue.

.@tgsrtcmdoffice @SajjanarVC Garu, requested to look into the problem faced by students and take necessary action by increasing the number of buses to avoid the risky footboard travel by school children. Statewide, students are facing this issue.

74,108 görüntüleme

సిగాచి కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన వింటుంటే గుండె తరుక్కు పోతున్నది. అయిన వారిని కోల్పోయి, కడసారి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి కన్నీరు పెట్టిస్తున్నది. వీరిని ఓదార్చాలంటే మాటలు కూడా రావడం లేదు. 54 మంది ప్రాణాలు కోల్పోతే Revanth Reddy ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం బాధ కలిగిస్తున్నది. నెల రోజులుగా గుండెలవిసేలా రోధిస్తున్న ఆ కుటుంబ సభ్యుల ఆవేదన ఈ ప్రభుత్వానికి వినపడం లేదా? పరిహారం ఇచ్చి అండగా నిలవాలని ఈ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనిపించడం లేదా? #CongressFailedTelangana

సిగాచి కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన వింటుంటే గుండె తరుక్కు పోతున్నది. అయిన వారిని కోల్పోయి, కడసారి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి కన్నీరు పెట్టిస్తున్నది. వీరిని ఓదార్చాలంటే మాటలు కూడా రావడం లేదు. 54 మంది ప్రాణాలు కోల్పోతే Revanth Reddy ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం బాధ కలిగిస్తున్నది. నెల రోజులుగా గుండెలవిసేలా రోధిస్తున్న ఆ కుటుంబ సభ్యుల ఆవేదన ఈ ప్రభుత్వానికి వినపడం లేదా? పరిహారం ఇచ్చి అండగా నిలవాలని ఈ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనిపించడం లేదా? #CongressFailedTelangana

37,656 görüntüleme

Welcome back, #SunitaWilliams and crew! Space travel is never easy, but true explorers like you embody the spirit of embracing the unknown. After spending nine long months in space, you’ve finally touched down safely. Although the journey lasted longer than planned, your resilience, patience, and adaptability inspire us all—a true testament to perseverance!

Welcome back, #SunitaWilliams and crew! Space travel is never easy, but true explorers like you embody the spirit of embracing the unknown. After spending nine long months in space, you’ve finally touched down safely. Although the journey lasted longer than planned, your resilience, patience, and adaptability inspire us all—a true testament to perseverance!

45,962 görüntüleme

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నాను. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. Telangana CMO

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నాను. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. Telangana CMO

63,176 görüntüleme

జల పరవళ్లు.. జల జాతర.. సీఎం కేసీఆర్ గారి ముందుచూపు, సంకల్పంతో పెద్దవాగును ముద్దాడిన గోదావరి జలాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు సాకారంతో మరో చారిత్రాత్మక ఘట్టం అవిష్కృతం అయింది.రంగనాయక రిజర్వాయర్ నుండి పరుగులు పెట్టిన గోదారమ్మ, నంగునూరు మండలంలోని 5 చెక్ డ్యాములకు నీళ్లు అందించనుంది. ఈ సందర్భం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. త్వరలో రైతులతో కలిసి జల జాతరలో పాల్గొంటాను.. సీఎం కేసీఆర్ గారికి జన్మతః ఋణపడి ఉంటాం.

జల పరవళ్లు.. జల జాతర.. సీఎం కేసీఆర్ గారి ముందుచూపు, సంకల్పంతో పెద్దవాగును ముద్దాడిన గోదావరి జలాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు సాకారంతో మరో చారిత్రాత్మక ఘట్టం అవిష్కృతం అయింది.రంగనాయక రిజర్వాయర్ నుండి పరుగులు పెట్టిన గోదారమ్మ, నంగునూరు మండలంలోని 5 చెక్ డ్యాములకు నీళ్లు అందించనుంది. ఈ సందర్భం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. త్వరలో రైతులతో కలిసి జల జాతరలో పాల్గొంటాను.. సీఎం కేసీఆర్ గారికి జన్మతః ఋణపడి ఉంటాం.

92,458 görüntüleme

ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నా పై, బి ఆర్ ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. Revanth Reddy నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది. #CongressFailedTelangana #RIPDemocracy

ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నా పై, బి ఆర్ ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. Revanth Reddy నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది. #CongressFailedTelangana #RIPDemocracy

49,289 görüntüleme

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన Revanth Reddy గారు.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం మా పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. మీ నిర్బంధాలకు భయపడేది లేదు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదు. Telangana CMO DGP TELANGANA POLICE #CongressFailedTelangana

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన Revanth Reddy గారు.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం మా పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. మీ నిర్బంధాలకు భయపడేది లేదు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదు. Telangana CMO DGP TELANGANA POLICE #CongressFailedTelangana

18,939 görüntüleme

ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. DGP TELANGANA POLICE Telangana CMO #CongressFailedTelangana

ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. DGP TELANGANA POLICE Telangana CMO #CongressFailedTelangana

57,463 görüntüleme

Rejuvenating moments in my constituency, Siddipet. Captured some beautiful glimpses near the Ranganayak Sagar canal #KaleshwaramProject and amidst serene green fields.

Rejuvenating moments in my constituency, Siddipet. Captured some beautiful glimpses near the Ranganayak Sagar canal #KaleshwaramProject and amidst serene green fields.

35,934 görüntüleme

మింగడానికి మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది రేవంత్ రెడ్డి గారి తీరు. ఓయూ లా కాలేజీ మెస్ లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు.. కనీసం విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం లో గొడ్డుకారం, గురుకులాల్లో పురుగుల అన్నం, ఇప్పుడు యూనివర్సిటీల్లో పాడైపోయిన భోజనం.. ఇదేనా కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన ఘనత? అడుగడుగునా యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి Revanth Reddy విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు... రేవంత్ రెడ్డి గారూ.. మీ చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని ఆగం చేయకండి. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని.. విద్యార్థులకు కడుపునిండా మంచి భోజనం పెట్టండి. Telangana CMO #CongressFailedTelangana

మింగడానికి మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది రేవంత్ రెడ్డి గారి తీరు. ఓయూ లా కాలేజీ మెస్ లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు.. కనీసం విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం లో గొడ్డుకారం, గురుకులాల్లో పురుగుల అన్నం, ఇప్పుడు యూనివర్సిటీల్లో పాడైపోయిన భోజనం.. ఇదేనా కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన ఘనత? అడుగడుగునా యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి Revanth Reddy విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు... రేవంత్ రెడ్డి గారూ.. మీ చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని ఆగం చేయకండి. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని.. విద్యార్థులకు కడుపునిండా మంచి భోజనం పెట్టండి. Telangana CMO #CongressFailedTelangana

17,683 görüntüleme

Videos

BRSHarish's profile picture

రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ‘యూరియా యాప్‌’ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల Vemula Prashanth Reddy గారిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా చేతులెత్తేసిన Revanth Reddy ప్రభుత్వం, తన నిరంకుశ విధానాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం అత్యంత అవివేకం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎంతమాత్రం నిలువరించలేదు. రాబోయే రోజుల్లో అన్నదాతల ఆగ్రహం ఉప్పెనగా మారి ఈ నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే ‘యూరియా యాప్’ను రద్దు చేయాలని, పాత విధానంలోనే రైతులకు అవసరమైనంత యూరియా అందించాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO

Harish Rao Thanneeru

23,436 görüntüleme • 2 gün önce

BRSHarish's profile picture

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. Revanth Reddy గారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా... టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా.. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి Komatireddy Venkat Reddy గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది.. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే.. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా.. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా. రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana

Harish Rao Thanneeru

135,351 görüntüleme • 5 ay önce

BRSHarish's profile picture

రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు. #CheapMinister

Harish Rao Thanneeru

443,049 görüntüleme • 1 yıl önce

BRSHarish's profile picture

ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో, Ponguleti Srinivasa Reddy కి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? 📍 నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పిసిబి, hmda అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా? నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? విద్యుత్ మంత్రి Bhatti Vikramarka Mallu, పర్యావరణ మంత్రి Konda Surekha, గనుల శాఖ మంత్రి Dr Vivek Venkatswamy సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు? ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి? క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? 1, Telangana PCB (Pollution Control Board) నుంచి Consent for Establishment (CFE) & Consent for Operation (CFO) అనుమతి లేదు. 2, పర్యావరణ అనుమతి MoEF&CC (Environmental Clearance) లేదు. 3, మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతి – మైన్స్ & జియాలజీ విభాగం అనుమతి లేదు. 4, స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి ల్యాండ్ యూజ్ మార్పిడి (Land Conversion) & HMDA క్లియరెన్స్ లేదు 5, విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం Explosives License లేదు. 6, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవు. Central Ground Water Board 7, రెవెన్యూ అనుమతులు లేవు. Office of Chief Secretary, Telangana Govt. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు–కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా? ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతడు. మరోవైపు అదే ముఖ్యమంత్రి Revanth Reddy తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతడు. 📍 ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు? 'తెలంగాణ అంటే బిజినెస్' అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ దనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా? ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? HYDRAA అంటే Hyderabad Disaster Response and Asset Protection Agency అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు? శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్ కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? ఈ మైనింగ్ దందాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము. (1/2)

Harish Rao Thanneeru

65,487 görüntüleme • 3 ay önce

BRSHarish's profile picture

హైదరాబాద్ నడిబొడ్డున 1972 నుంచి ఉన్న అంతర్జాతీయ సంస్థ ICRISAT (International Crops Research Institute for the Semi-Arid Tropics )ను అమెరికా సంస్థ అనడం సీఎం Revanth Reddy గారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం... నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాలు, సుంకేసుల ప్రాజెక్టుల మీదే కాదు.. కళ్ల ముందున్న సంస్థల పైనా మీకు క్లారిటీ లేదా? కనీస వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, ప్రాథమిక అవగాహన లేకుండా తెలంగాణ పరువు తీయకండి. రేవంత్ రెడ్డి గారూ, పటాన్‌చెరులో దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఇక్రిశాట్‌.. ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు. ఇది CGIAR వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ. దీని ఏర్పాటులో Food and Agriculture Organization (FAO), United Nations Development Programme(UNDP), వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయి. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ల సహకారంతో పాటు, భారత ప్రభుత్వం తోపాటు పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక ఇది. దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణం. ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో మీరు రాష్ట్రాన్ని నడపడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా వాస్తవాల ఆధారంగా ఉండాలి. ఇప్పటికైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. Telangana CMO

Harish Rao Thanneeru

36,871 görüntüleme • 3 ay önce

BRSHarish's profile picture

ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్‌గా తగ్గించిన Uttam Kumar Reddy గారూ.. మరికొన్ని రోజుల్లో ఏకంగా “కొనుగోళ్లు పూర్తయ్యాయి” అని ప్రకటిస్తారేమో! ఒకవైపు కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూ… మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం అంటారా? “చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం” అంటూనే మీరు పెట్టుకున్న టార్గెట్ ను మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా? దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పే ముందు.. 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన విషయం గుర్తు పెట్టుకోండి. ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమై… రైతుల గోసను కప్పి పుచ్చేందుకు మీరు చేస్తున్న అబద్ధాల ప్రచారం దుర్మార్గం. ఒకవైపు రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తుంటే… మరోవైపు కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు. వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా? కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా? తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోయింది అబద్ధమా? నెలల తరబడి కొనుగోళ్లు ఆలస్యం చేసింది అబద్ధమా? డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతులను అప్పుల పాలుచేసింది అబద్ధమా? హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చొని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదు.. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడండి.. వాళ్ల కన్నీళ్లు తుడవండి. మాటలు కట్టి పెట్టి, కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, టార్గెట్లు పక్కన పెట్టి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana #CongressBetrayedFarmers

Harish Rao Thanneeru

11,065 görüntüleme • 27 gün önce

BRSHarish's profile picture

తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం❌ ప్రణాళికలు వేయడంలో వైఫల్యం❌ ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం❌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్! ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే MGBS లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి! పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. Revanth Reddy గారు.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. #CongressFailedTelangana #HyderabadFloods

Harish Rao Thanneeru

56,374 görüntüleme • 9 ay önce

BRSHarish's profile picture

నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండ ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకున్నారు. అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారు. ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఈరోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా BRS చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం #CongressFailedTelangana #CongressBetrayedStudents

Harish Rao Thanneeru

32,208 görüntüleme • 5 ay önce

BRSHarish's profile picture

సిఎం రేవంత్ రెడ్డి గారూ! తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. 👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది. 👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను. మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?

Harish Rao Thanneeru

92,179 görüntüleme • 1 yıl önce