
Telangana365
@Telangana365 • 2,007 subscribers
Telangana | India | Politics | News | Nature |Movies Passionate about promoting our culture and heritage ..
Shorts
Videos

హైదరాబాద్ మణికొండలో క్షుద్రా పూజలు ? మణికొండ శివాజీ నగర్లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Telangana36598,627 次观看 • 1 个月前

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం విషయంలో రాజకీయం చేస్తున్న వారికోసం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల్లో కూడా మన తెలంగాణ నేతలు ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నారు. బండి పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. 2019 నుండి 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. దివనకొండ దామోదర్ రావు తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నుండి రాజ్యసభ సభ్యులు కూడా వారు కూడా 2019 నుండి 2021 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టిలో ఉన్నపుడు ఒక మాజీ ఎంపీ గారి సతీమణి కూడా సభ్యులుగా ఉన్నారు. జూపల్లి రామేశ్వర్ రావు కేసీఆర్కు, మరి ముఖ్యంగా హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. పలు వ్యాపారాలు కలిసి చేసేంత సన్నిహితులు. వారు కూడా 2019 నుండి 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం బోర్డులో కూడా మన తెలంగాణ రాష్ట్రం నుండి సభ్యులు ఉన్నారు. మన తెలంగాణ ప్రజాప్రతినిధుల రికమండేషన్లు కూడా తిరుమలలో నడుస్తున్నాయి... అప్పుడు అక్కడ మన సభ్యులు ఎందుకు అని గొంతులు లేవలేదు? ఒక్క మాట మాట్లాడలేదు? ప్రస్తుతం యాదగిరిగుట్ట బోర్డు చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ గారి సోదరుడే కదా, దాని గురించి మాట్లాడారే?
Telangana36549,955 次观看 • 24 天前

అదే జోరు కొనసాగిస్తున్న రామచందర్ రావు బీజేపీ పార్టీలో వరుసగా చేరికలు కొనసాగుతూ, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర రథసారథి రామచందర్ రావు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో సీరియల్ నటి జ్యోతి రెడ్డి బీజేపీలో చేరారు. జ్యోతి రెడ్డి చేరికతో పార్టీ సంస్థాగతంగా మరింత బలపడుతుందని పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Telangana36559,875 次观看 • 1 个月前

ముస్లిం బాలుడిని పాకిస్తాన్ వాడివి, నీకు మా దేశంలో ఏం పనిరా అంటూ అవమానించిన పెద్దమనిషి.. కాప్రా సొసైటీలో వివాదం. హైదరాబాద్లోని కాప్రా జనప్రియ లేక్ ఫ్రంట్ సొసైటీలో ఓ నివాసి, కమిటీ సభ్యుడి మధ్య వాగ్వాదం. తనను "పాకిస్తానీ" అని దూషిస్తూ అవమానించినట్టు బాలుడు పోలీసులకు తెలిపాడు. పోలీసుల ముందే "నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు?" అంటూ బెదిరిస్తున్న సదరు వ్యక్తి.. బాలుడు, "మా తాత భారత దేశ ఆర్మీలో పని చేశాడు. నేను భారతీయుడిని. నన్ను పాకిస్తానీ అని ఎలా అంటావ్?" అంటూ ప్రశ్నిస్తున్న బాలుడు..
Telangana36552,270 次观看 • 1 个月前

కమలం గూటికి మల్లారెడ్డి? కుటుంబసమేతంగా వెళ్ళి ప్రధాని మోడీనీ కలిసిన మల్లారెడ్డి దగ్గరుండి ప్రధాని మోడీ గారికి మరియు బీజేపీ పెద్దలకు పరిచయం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొద్దిరోజులుగా మల్లారెడ్డి కమలం గూటికి చేరుతారన్న వార్తలు వస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.. కొడుకు కోడలు రాజకీయ భవిష్యత్తు కోసమే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యార? Video Credits:- Rtv
Telangana36595,204 次观看 • 3 个月前

ఎన్టీఆర్ విగ్రహం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నా అదృష్టం - KTR నాకు రాముడు కృష్ణుడు ఎట్లుంటాడంటే తెల్వదు కానీ మాకు ఎన్టీఆర్ గారే రాముడు కృష్ణుడు అన్ని... తారకరామారావు అనే పేరులోనే పవర్ ఉంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది అన్న ఎన్టీఆర్, రాజకీయాల్లో విబేధాలు ఉండొచ్చు కానీ మహనీయుడు అన్న గారి స్థానం మా గుండెల్లో పదిలం. -కల్వకుంట తారకరామారావు. Video Credits:- Rtv
Telangana36553,272 次观看 • 2 个月前

“The toughest job in Hyderabad is driving.” - అక్బరుద్దీన్ ఒవైసీ మా డ్రైవర్ క్రిస్మస్ సందర్భంగా సెలవులో ఉంటే ఒక్క రోజు కూడా నేను హైదరాబాద్ లో కారు నడపలేక పోయాను నేను నడిపింది ఆటోమేటిక్ కారు అయినప్పటికీ ఇబ్బందీ అయ్యింది, ఎవరు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. అటు పక్క నుండి ఒకడు ఇటు పక్క నుండి ఒకడు రూల్స్ పాటించకుండా రోడ్ల మీద ఎలా పడితే అలా బండ్లు నడిపిస్తున్నారు. అలాంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదు ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయాలి.
Telangana365141,201 次观看 • 6 个月前

హరీష్ రావు మిల్లర్లతో కుమ్మక్కై రైతుల నుంచి వడ్లు కొనకుండా అడ్డుకుంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మిల్లర్లు అందరూ తన మనుషులే కావడంతో, ఉద్దేశపూర్వకంగా వడ్లు కొననివ్వకుండా ఆలస్యం చేయిస్తున్నారు. తన రాజకీయ స్వలాభం కోసం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -గజ్వేల్ నియోజకవర్గ రైతు
Telangana36537,753 次观看 • 1 个月前