
Telangana CMO
@TelanganaCMO • 1,676,334 subscribers
Official account of CMO Telangana.
Shorts
Videos

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీలను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారితో కలిసి వారు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మి గారు ఉన్నారు. #Badminton #WorldChampionships #GayatriGopichand #TreesaJolly #PullelaGopichand #Telangana
Telangana CMO34,793 views • 5 days ago

మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి గారి మాతృమూర్తి శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొని శేషమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, నాగరాజు గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Telangana CMO21,919 views • 4 days ago

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు. ✅#MusiRiverfrontDevelopment పై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు. ✅భూసేకరణ ప్రక్రియలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ✅మూసీ రివర్ఫ్రంట్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు. ✅గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే, కొత్వాల్గూడ బర్డ్స్ పార్క్కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. ✅ఈ సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్డీసీఎల్ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #MusiRejuvenation #MRDCL #UrbanDevelopment #Hyderabad
Telangana CMO15,481 views • 5 days ago

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ విందులో పాల్గొన్నారు. #Bonalu #Telangana
Telangana CMO56,632 views • 28 days ago

76 వ గణతంత్ర దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి Revanth Reddy గారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ఒక సందేశాన్ని ఇచ్చారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. #TelanganaRising #RepublicDay
Telangana CMO919,984 views • 1 year ago

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని దైవానుగ్రహం కోసం నాగార్జునసాగర్లోని విజయ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన పవిత్ర మహా వరుణయాగం, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి దంపతులు పూర్ణాహుతి సమర్పించడంతో క్రతువు పరిసమాప్తమైంది. #CMRevanthReddy #Telangana #VarunaYagam #NagarjunaSagar
Telangana CMO33,124 views • 20 days ago

A New Chapter in Advanced Healthcare Infrastructure for #Telangana Hon’ble Chief Minister Shri Revanth Reddy inaugurated the Dr. Marri Channa Reddy Telangana Institute of Medical Sciences (#DrMCRTIMS) at Sanath Nagar, #Hyderabad - strengthening Telangana’s public healthcare infrastructure and expanding access to advanced tertiary care. The super-specialty hospital will serve as a Centre of Excellence in cardiac, renal, transplant and trauma sciences, equipped with advanced technologies including a 3.0 Tesla MRI, 128-slice CT scanner, cath labs and LINAC radiation unit. The Hon’ble Chief Minister also reiterated the Government’s commitment to completing the Osmania General Hospital, TIMS Alwal, TIMS LB Nagar and Warangal Super Specialty Hospital in a phased manner. A stronger, more accessible and people-centric healthcare system for Telangana. #DrMCRTIMS #TIMS #TelanganaMedicalSciences #Healthcare #AdvancedHealthcare
Telangana CMO18,724 views • 12 days ago

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించడం, పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు విస్తృతంగా చర్చలు జరిపారు. ✅ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి గారితో ప్రముఖ ఆర్థికవేత్త Arvind Subramanian గారితో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై చర్చ జరిగింది. ✅ముఖ్యంగా #GST, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవింద్ సుబ్రమణియన్ గారితో చర్చించారు. జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత సమాచారంతో మరింత సులభతరం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్టు స్పష్టం చేశారు. ✅ఈ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (#EaseOfDoingBusiness) ను మెరుగు పరిచేలా టెక్నాలజీ వాడకం ఉండాలని సుబ్రమణియన్ గారు వివరించారు. ✅పన్నుల లీకేజీలను అరికట్టడంలో శాఖల మధ్య సమన్వయ లోపాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రధానంగా భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టడానికి మున్సిపల్, #RERA, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో ఏర్పాటు చేసే వ్యవస్థ ద్వారా సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ✅భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ డేటాతో పాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ✅ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. #Telangana #DigitalGovernance #ArtificialIntelligence #TaxReforms
Telangana CMO30,523 views • 23 days ago

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు సూచించారు. విద్యా సంస్థల క్యాంపస్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించి జరిగే ఏ ఘటననైనా యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని చెప్పారు. ✅రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి తీసుకునే చర్యల్లో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అవసరమైతే ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ✅రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియాన్లో ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ✅విద్యా సంస్థల క్యాంపస్లలో #Drugs మహమ్మారిని నిరోధంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి క్యాంపస్ బయట జరిగే కార్యకలాపాలను సైతం గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు. ✅డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, వాటిని నిరోధంలో విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతలను కూడా అప్పగించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు. ✅మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. ✅డ్రగ్స్కు సంబంధించి కార్యకలాపాలను గుర్తించడం, వినియోగిస్తున్న వారిని మాన్పించడం, శిక్షించడం అన్న మూడు దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే డీ-అడిక్షన్ సెంటర్కు పంపించడం, కౌన్సిలింగ్ ఇప్పించడమే కాకుండా తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ✅ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి గారు, కె. రామకృష్ణారావు గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, DGP TELANGANA POLICE సీవీ ఆనంద్ గారు, EAGLE FORCE TELANGANA డైరెక్టర్ సందీప్ శాండిల్య గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #SayNoToDrugs #AntiDrugs #EAGLEForce #AntiNarcoticsBureau #Telangana
Telangana CMO41,718 views • 1 month ago

దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి తగ్గించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలని కోరారు. ✅ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనమండలి, శాసనసభలను ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టసభలకు పోటీ చేసే కనీస వయో పరిమితిని తగ్గించాలని ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదిస్తామని ప్రకటించారు. ✅నీట్ లాంటి పరీక్షల విధానాల్లో లోపాలు, లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, యువత పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో “యువతే దేశం – దేశమే యువత” పేరుతో #GenZ కి మద్దతుగా పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహ కూడలి వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, మంత్రులు Sridhar Babu Duddilla గారు, Ponnam Prabhakar గారు, Ponnam Prabhakar గారు, Minister Adluri Laxman kumar గారు, Mohammed Azharuddin గారు, ఎమ్మెల్సీ Bomma Maheshkumar goud గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. 21 ఏళ్లకు శాసనసభ, లోక్సభకు, అలాగే 25 ఏళ్లకు రాజ్యసభకు పోటీ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ✅శాసనసభ, లోక్సభ, రాజ్యసభలు వేదికగా యువత గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగినట్టుగా పార్లమెంట్లో చట్ట సవరణ కోసం ప్రయత్నం చేస్తామని మాటిచ్చారు. యువతే ఈ దేశ భవిష్యత్తు, వారికేం కావాలో నిర్ణయించుకునే అధికారం కూడా యువతకు ఉండాలని, వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు. ✅దేశంలో యువకులు మార్గనిర్ధేశకులు కావాలన్న ఆలోచనతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. ✅రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు 21 ఏళ్ల నుంచి 18 కి తగ్గిస్తే, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావడానికి వీలుగా చట్ట సవరణ ద్వారా పోటీ చేయడానికి కనీస వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించారని ప్రస్తావించారు. ✅జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 సంవత్సరాలు నిండితే చట్టసభలకు పోటీ చేయడానికి అవకాశం ఉందని, సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మన దేశంలో ఆ పరిస్థితి ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ✅శాసనసభలో తీర్మానం చేసి ప్రధానమంత్రి గారికి పంపించడమే కాకుండా పార్లమెంట్లో బిల్లును ఆమోదించే విధంగా ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు. అలాగే 21 ఏళ్లు నిండిన వారే అత్యంత కీలకమైన విద్యా శాఖ, ఐటీ శాఖలకు మంత్రులైతే ఈ దేశ ముఖచిత్రం మారుతుందని అన్నారు. ✅“జెన్ జీ వెల్లువ ఇంతటితో ఆగొద్దు. చట్టసభల్లో జెన్ జీ గళం వినిపించాలన్నదే నా ఆలోచన. రాబోవు రోజుల్లో యువత గళం వినిపించాలి. జెన్ జీ విజయం సాధించడానికి తామంతా బాధ్యత తీసుకుంటాం” అని పేర్కొన్నారు. ✅ఈ దేశాన్ని నిర్మించేది యువతేనని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 30 శాతం ఉన్న జెన్ జీ (GenZ) చట్ట సభల్లో కనీసం ఒక్క శాతం ప్రాతినిధ్యం కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆ అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. #YouthPower #YouthInPolitics #FutureOfIndia #VoiceOfYouth #YouthRepresentation
Telangana CMO36,224 views • 1 month ago

రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు పునరుద్ఘాటించారు. ట్యాంక్బండ్ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, మంత్రులు Sridhar Babu Duddilla గారు, Ponnam Prabhakar గారు, Ponguleti Srinivasa Reddy గారు, Danasari Seethakka గారు, Minister Adluri Laxman kumar గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు Bomma Maheshkumar goud గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను అని గుర్తుచేశారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశాం. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నాం” అని చెప్పారు ✅గీత కార్మికుల వృత్తిని కాపాడటానికి నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి Uttam Kumar Reddy గారికి సూచించారు. ✅“దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం సాగించిన యోధుడు, ముదిరాజ్ల ఆరాధ్యదైవం పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న #PandugaSayanna జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది” అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ✅“గీత కార్మికులు, గౌడన్నలు ఎంతో కాలంగా #SardarSarvaiPapannaGoud గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యంలో నేనే స్వయంగా నెక్లెస్ రోడ్ చౌరస్తాకు వెళ్లి స్థలాన్ని పరిశీలించి జ్యోతిరావు పూలే దంపతులకు విగ్రహం ఉండాలని స్థలాన్ని ఎంపిక చేశాను. ✅అలాగే, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ట్యాంక్ బండ్ పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి ఆ స్థలంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్ సందర్శనకు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ నుంచి ఎవరు వెళ్లినా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం” అని వివరించారు. ✅“సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి కాదు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి. ✅ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు. బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది” అని గుర్తుచేశారు. ✅“కులవృత్తిని కొనసాగించండి. గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి. పిల్లల తలరాతలను మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. పిల్లలను చదివించి వారు ఉన్నతస్థానానికి చేరుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలి” అని పిలుపునిచ్చారు. ✅“విద్యార్థుల కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తాం. గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదు. మా ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. ✅మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏటీసీల్లో చేరేవాళ్లకు నెలకు 2 వేల రూపాయల ఉపకార వేతనం ఇస్తున్నాం. ✅ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం” ముఖ్యమంత్రి గారు చెప్పారు. #Telangana #SarvaiPapanna #SocialJustice #BCWelfare #WeaversCommunity #ToddyTappers #GoudCommunity
Telangana CMO13,899 views • 12 days ago

మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ✅ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి Uttam Kumar Reddy గారితో కలిసి ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం ఇచ్చి, తిరిగి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ✅ఇప్పటికే బకాయిల వసూలులో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు సంబంధించి బకాయిని వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. బకాయిల వసూలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ✅విధివిధానాల రూపకల్పన పూర్తయిన తర్వాత ఆ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించాలని సూచించారు. మంత్రివర్గ ఉప సంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్పారు. ✅ప్రతి సీజన్లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తగు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు. ధాన్యం భారీగా వచ్చే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని ఆదేశించారు. ✅స్వయం సహాయక సంఘాల (#SHG) ఆధ్వర్యంలో సైలో బ్యాగ్ నిర్మాణాలకు నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. వీటి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ✅వీబీ జీ రామ్ జీ లో ప్లాట్పాంల నిర్మాణానికి అవకాశం ఉన్నందున, విశాలమైన ప్లాట్పాంలు నిర్మించి జర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములు, ధాన్యం నిల్వకు ఉపయోగపడే కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి ధాన్యం నిల్వకు లీజుకు తీసుకోవాలని సూచించారు. ✅ఈ సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి గారు, Office of CA,F&CS, Telangana State కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు, సౌత్ ఇండియా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తూడి దేవేందర్ రెడ్డి గారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. #Telangana #PaddyProcurement #RiceMills #CivilSupplies #PaddyStorage #FoodSecurity #Farmers #SiloBags #RiceMilling
Telangana CMO18,909 views • 18 days ago

ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయి తిరిగి పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టల్స్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. #Kodangal #Hakeempet #EducationHub #Vikarabad
Telangana CMO37,729 views • 1 month ago

తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. ✅ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో #KheloIndiaYouthGames 2026 ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి Vakiti Srihari గారితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ✅జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ #KheloIndia పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ✅#Hyderabad లోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ✅ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ✅తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్తో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ✅ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో, క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ✅ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణా రావు గారు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) చైర్మన్ Shiva Sena Reddy గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి Jayesh Ranjan గారు, SATG ఎండీ ఎ. సోనీబాల దేవి గారు పాల్గొన్నారు. Khelo India #8thKheloIndia #IndiaYouthGames #KIYG2026 #Telangana
Telangana CMO18,630 views • 19 days ago

గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు ఎత్తిపోతలు చేపట్టాలన్నారు. ✅ముఖ్యమంత్రి గారు మంత్రి Uttam Kumar Reddy గారితో పాటు ఉన్నతాధికారులతో నీటి పారుదల శాఖపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ✅దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని సమావేశంలో మంత్రి గారు వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే అధికారులు వాటి పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ✅పలు ప్రాజెక్టుల కింద ఒకట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నీటి పారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ✅తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. అధికారులు ఆ పనులను పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవకాశం ఉంటుందని తెలిపారు. ✅గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్ నియమించాలని ఆదేశించారు. ✅జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (#NDSA) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం లేదని, ఈ విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలన్నారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ఎన్డీఎస్ఏతో సంప్రదించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. #Telangana #Godavari #WaterResources #IrrigationProjects #WaterManagement #Kaleshwaram #Devadula #SitaramaProject
Telangana CMO15,646 views • 18 days ago

ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా రోడ్ నెట్వర్క్కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులకు చెప్పారు. హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన రోడ్ నెట్వర్క్ విస్తరణ, జరుగుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ✅ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమీక్షలో #HMDA, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ #HRDCL ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅రోడ్ల నిర్మాణంలో ప్రధానమైన భూసేకరణ, రుణ సేకరణ, నిర్వహణ వంటి అంశాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇతర రోడ్లన్నింటినీ ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు. ✅ఓఆర్ఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, దానిపై ఎక్కడికక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఓఆర్ఆర్ నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ✅రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతం కావాలని, కొంగరకలాన్ నుంచి #BharatFutureCity వరకు ప్రారంభించిన రేడియల్ రోడ్డు 1ను డిసెంబర్ 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని, రోడ్ల నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ✅రోడ్లకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణం, బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరగా మొదలుపెట్టాలని చెప్పారు. ✅#Hyderabad మహానగర భవిష్యత్తు రోడ్ల విస్తరణ, అభివృద్ధి పైనే ఆధారపడి ఉందని, అందుకోసం అవసరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని, ఇందులో అలసత్వం చూపరాదని అధికారులకు స్పష్టంగా చెప్పారు. రోడ్ల విస్తరణకు జరిపే ల్యాండ్ పూలింగ్ విషయంలో మధ్యవర్తుల జోక్యం ఉండరాదని, టీడీఆర్లు జారీ చేసే విషయంలో కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. HMDA #ORR #RegionalRingRoad #RoadInfrastructure
Telangana CMO19,533 views • 24 days ago

విద్యార్థులకు శుభవార్త. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ✅నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, మంత్రులు Sridhar Babu Duddilla గారు, Konda Surekha గారు, Ponnam Prabhakar గారు, Vakiti Srihari గారు, Mohammed Azharuddin గారు, సలహాదారులు కే కేశవ రావు గారు, వీ హనుమంత రావు గారి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు Bomma Maheshkumar goud గారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ✅ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, "ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదు. విద్యార్థులు అడక్కుండానే వారి ఖాతాలో డబ్బులు వేస్తాం. ✅ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా పెడుతున్నాం. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ. 2,400 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో వేసి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని తెలిపారు. ✅"మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అందుకే నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య, ఆ తర్వాత స్కిల్స్ నేర్పాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ఈ సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుంది. కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో.. చెప్పలేం" అని పేర్కొన్నారు. ✅"ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఏటీసీలు, పాలిటెక్నిక్, #SkillsUniversity.. ఇతర సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోండి. ఆడపిల్లలు నర్సింగ్ చదువుకుంటే రూ. 2 లక్షలతో జపాన్ , జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. ✅ఇప్పుడు చదువుల్లో పోటీ పెరిగింది. చాలా మందికి 90 శాతం పైగా మార్కులు వస్తున్నాయి. చదువు మాత్రమే కాదు. సాంకేతిక నైపుణ్యంలో రాణించే వారూ ఉంటారు. కొందరు క్రీడల్లో రాణించే వారుంటారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి" అని పేర్కొన్నారు. ✅యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని అందిస్తామని ముఖ్యమంత్రి గారు బాక్సింగ్ చాంపియన్ కు నిఖత్ జరీన్, సిరాజ్, దీప్తీ దివాంజీలను ఉదహరించారు. ✅"మీరూ క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించండి. దేశ స్థాయిలో గౌరవాన్ని తీసుకురాండి. #Olympics లో మెడల్స్ సాధించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి.. నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత నాది. ✅కేవలం చదువుకుంటేనే బతుకులు మారుతాయి. చదువుకుంటేనే మన తలరాతలు మారుతాయి. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవకాశాల కోసం పోటీ పడాలి. ✅ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే అమెరికాలో ఉద్యోగం వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సాంకేతిక విప్లవం వచ్చింది. #AI వల్ల ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తింది. ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో మనం ఆలోచన చేయాల్సిన అవసరముంది. ✅కులాల మధ్య అంతరాలను తగ్గించడానికి అన్ని వర్గాలు ఒకే చోట కలిసిమెలిసి జీవించడమనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నాం" వివరించారు. ✅జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే లాంటి మహనీయుల జీవిత విశేషాలను వివరిస్తూ విగ్రహాలు చేయడం ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించడానికి కాదని, గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలు, వారి గొప్పతనాన్ని విగ్రహాల ద్వారా స్ఫూర్తి పొందడానికి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ✅మహనీయుల స్ఫూర్తితో విద్యలో రాణించడమే కాకుండా సామాజిక చైతన్యంతో, సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఇక్కడ విగ్రహావిష్కరణ చేశామని చెప్పారు. #MahatmaJyotiraoPhule #SavitribaiPhule #Hyderabad #Telangana #FeeReimbursement #SkillDevelopment
Telangana CMO13,109 views • 16 days ago

క్రీడారంగంలో హైదరాబాద్ను దేశానికి ఒక రోల్ మాడల్గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ✅గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ముఖ్యమంత్రి గారు #TelanganaSportsHub ప్రతినిధులతో సమావేశమయ్యారు. ✅ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ Dr. Sanjiv Goenka గారు, కో-చైర్మన్ Upasana Konidela గారు, సభ్యులు కావ్య మారన్ గారు, సి.శశిధర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన #GachibowliStadium అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఆ స్టేడియంలో హెలిప్యాడ్తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ✅క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ను నియమించామని తెలిపారు. ✅“స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. #Olympic క్రీడలు కూడా హైదరాబాద్లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి..” అని బోర్డు సభ్యులకు సూచించారు. #TelanganaSports #Hyderabad #SportsInfrastructure #KavyaMaran
Telangana CMO82,082 views • 4 months ago

“India is the best country to invest in for the decades ahead. We will continue to invest in Telangana -the state I come from. The vision of a 3T economy is truly inspirational. Telangana has limitless potential for economic growth, and it will undoubtedly emerge stronger in the years to come..” : Shri V. Prem Watsa, Founder, Chairman & CEO of Fairfax Financial Holdings #TelanganaRisingGlobalSummit2025 #TelanganaRising2047 #BharatFutureCity
Telangana CMO116,165 views • 8 months ago