Telangana CMO's banner
Telangana CMO's profile picture

Telangana CMO

@TelanganaCMO1,677,174 subscribers

Official account of CMO Telangana.

Shorts

నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (#TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. #SocialWelfare #ResidentialSchools #NEET2026

నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (#TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. #SocialWelfare #ResidentialSchools #NEET2026

20,698 Aufrufe

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ సంజయ్ జాజు గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, సలహదారు, సీఎం గారి ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమితులైన శ్రీ కె. రామకృష్ణా రావు గారు కూడా ఉన్నారు. #Telangana

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ సంజయ్ జాజు గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, సలహదారు, సీఎం గారి ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమితులైన శ్రీ కె. రామకృష్ణా రావు గారు కూడా ఉన్నారు. #Telangana

63,405 Aufrufe

ఢిల్లీ: హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్త‌ర‌ణ‌పై కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి గారు జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, ఫేజ్‌-2 విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రి శ్రీ Revanth Reddy గారు కేంద్ర మంత్రుల‌తో వ‌రుస‌గా రెండు రోజులపాటు చర్చలు విజయవంతమయ్యాయి. ✅మొదట సోమ‌వారం రాత్రి రైల్వే శాఖ మంత్రి శ్రీ Ashwini Vaishnaw గారు, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి శ్రీ G Kishan Reddy గారితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈరోజు ఉదయం కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ Manohar Lal గారితో, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణ‌వ్ గారు, కిష‌న్ రెడ్డి గారు, ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖ‌ట్ట‌ర్ గారి నివాసంలో సమావేశమై ఈ అంశంపై చ‌ర్చించారు. ✅ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి గారు సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ✅క‌న్స‌ల్టెంట్‌గా SBICAPS ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌-I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌పై #SBICAPS స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. ✅క‌న్స‌ల్టెంట్ అధ్య‌య‌నం స‌మ‌యంలో స‌మ‌న్వ‌యానికి ప్ర‌తినిధులుగా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి (MA&UD) శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ అధికారులు ఇద్ద‌రు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ ప్ర‌క్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తారు. Ministry of Housing and Urban Affairs #HyderabadMetro #MetroExpansion #Telangana #UrbanMobility #Hyderabad #MetroPhase2

ఢిల్లీ: హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్త‌ర‌ణ‌పై కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి గారు జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, ఫేజ్‌-2 విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రి శ్రీ Revanth Reddy గారు కేంద్ర మంత్రుల‌తో వ‌రుస‌గా రెండు రోజులపాటు చర్చలు విజయవంతమయ్యాయి. ✅మొదట సోమ‌వారం రాత్రి రైల్వే శాఖ మంత్రి శ్రీ Ashwini Vaishnaw గారు, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి శ్రీ G Kishan Reddy గారితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈరోజు ఉదయం కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ Manohar Lal గారితో, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణ‌వ్ గారు, కిష‌న్ రెడ్డి గారు, ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖ‌ట్ట‌ర్ గారి నివాసంలో సమావేశమై ఈ అంశంపై చ‌ర్చించారు. ✅ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి గారు సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ✅క‌న్స‌ల్టెంట్‌గా SBICAPS ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌-I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌పై #SBICAPS స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. ✅క‌న్స‌ల్టెంట్ అధ్య‌య‌నం స‌మ‌యంలో స‌మ‌న్వ‌యానికి ప్ర‌తినిధులుగా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి (MA&UD) శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ అధికారులు ఇద్ద‌రు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ ప్ర‌క్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తారు. Ministry of Housing and Urban Affairs #HyderabadMetro #MetroExpansion #Telangana #UrbanMobility #Hyderabad #MetroPhase2

73,213 Aufrufe

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, లోక్‌సభ సభ్యుడు కుందూరు రఘవీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు నివాళులు అర్పించారు. #YSRajasekharaReddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, లోక్‌సభ సభ్యుడు కుందూరు రఘవీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు నివాళులు అర్పించారు. #YSRajasekharaReddy

35,551 Aufrufe

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ #YIPESU ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఉష గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని కలిశారు. Hon’ble Chief Minister Sri Revanth Reddy was paid a courtesy call by Smt. P.T. USHA, President of the Indian #Olympic Association and Member of the Rajya Sabha. Smt. Usha, who came to Hyderabad to participate in the inauguration of the State Government's Gachibowli Sports District and the Young India Physical Education and Sports University (#YIPESU), met the Chief Minister at the MCR HRD Bodhi Pavilion. #TelanganaSport

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ #YIPESU ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఉష గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని కలిశారు. Hon’ble Chief Minister Sri Revanth Reddy was paid a courtesy call by Smt. P.T. USHA, President of the Indian #Olympic Association and Member of the Rajya Sabha. Smt. Usha, who came to Hyderabad to participate in the inauguration of the State Government's Gachibowli Sports District and the Young India Physical Education and Sports University (#YIPESU), met the Chief Minister at the MCR HRD Bodhi Pavilion. #TelanganaSport

14,943 Aufrufe

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో చర్చించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నివేదికను అందించారు. ✅ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి గారు, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి గారు భేటీ అయ్యారు. ✅ఖ‌మ్మం జిల్లాలో ₹ 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్టు ప్రతినిధులు వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, న‌ర్సరీ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం కేటాయించింది. ✅సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రాహ‌దారిని విస్త‌రించాల‌ని ముఖ్య‌మంత్రి గారిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు టీజీఐఐసీ ఆధ్వ‌ర్యంలో రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. #GodrejAgrovet #Godrej #PalmOil #Khammam

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో చర్చించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నివేదికను అందించారు. ✅ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి గారు, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి గారు భేటీ అయ్యారు. ✅ఖ‌మ్మం జిల్లాలో ₹ 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్టు ప్రతినిధులు వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, న‌ర్సరీ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం కేటాయించింది. ✅సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రాహ‌దారిని విస్త‌రించాల‌ని ముఖ్య‌మంత్రి గారిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు టీజీఐఐసీ ఆధ్వ‌ర్యంలో రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. #GodrejAgrovet #Godrej #PalmOil #Khammam

15,438 Aufrufe

Telangana took another significant step towards deepening its global partnerships as Canada in India Mr Chris Cooter, called on Hon’ble Chief Minister Sri Revanth Reddy in Hyderabad for wide-ranging discussions on enhancing bilateral cooperation across trade, investment, innovation, education, and sustainable development. ✅The meeting underscored the growing momentum in Canada–Telangana relations, with both sides exploring new avenues for collaboration in sectors that are shaping the future of economic growth. ✅During the discussions, the High Commissioner extended an invitation to the Hon’ble Chief Minister to lead a high-level delegation to #Canada, paving the way for stronger institutional and business engagement between the two regions. ✅A key focus of the meeting was Telangana’s ambitious infrastructure and urban transformation agenda. The High Commissioner expressed keen interest in flagship initiatives such as the Musi River Development Project, the Hyderabad Metro Rail expansion, and the proposed Future City, highlighting the potential for Canadian expertise and investments to contribute to these landmark projects. ✅Reflecting the growing confidence of Canadian businesses in #Telangana, Mr. Cooter highlighted several recent milestones that reinforce the state's emergence as a preferred global investment destination. ✅These include Firan Technology Group's decision to establish a manufacturing facility in #Hyderabad, the launch of CIBC's Global Capability Centre (GCC) in the city, and the strategic partnership between CPP Investments and Hyderabad-based CtrlS Datacenters, under which CPP Investments has committed up to CAD 1 billion. ✅Sharing Telangana’s remarkable growth story, the Hon’ble Chief Minister outlined the state's rapid progress across Information Technology, Life Sciences, Defence, and Aerospace, while emphasizing Hyderabad’s position as one of the world’s fastest-growing hubs for Global Capability Centres (GCCs), attracting leading Fortune 500 companies. ✅The Chief Minister also elaborated on the government's transformative vision for the Musi River Rejuvenation Project, describing it as a catalyst for creating a vibrant riverfront economy that integrates sustainability, urban development, and economic opportunity. He sought Canada's partnership in advancing Telangana's renewable energy ambitions, including solarisation initiatives and the broader transition towards a green economy. ✅Highlighting Telangana's vision of becoming a global knowledge and innovation hub, the Chief Minister noted that several leading international universities are exploring opportunities to establish campuses in Hyderabad. ✅He also proposed the establishment of a multi-university campus by a consortium of Canadian universities, creating new opportunities for academic collaboration, research, and talent development. ✅Welcoming Canada's expanding engagement with Telangana, the Chief Minister invited Canadian companies, investors, academic institutions, and innovation partners to participate in the second edition of Telangana's Global Investors Summit, scheduled for December, as a platform to explore strategic partnerships and investment opportunities across high-growth sectors. ✅Speaking on the occasion, High Commissioner Chris Cooter commended Telangana's forward-looking governance, investor-friendly policies, and strong focus on job creation. He observed that the state's exceptional talent pool and innovation ecosystem position it as one of India's most promising destinations for global investment and collaboration. ✅Reaffirming Canada's commitment to strengthening ties with Telangana, Mr. Cooter assured full support for the state's development priorities and announced that a Canadian trade delegation will visit Telangana in the coming months to explore collaboration in areas including energy, urban development, defence, and aerospace. ✅The meeting was also attended by Advisor and Ex-Officio Special Chief Secretary to the CM K. Ramakrishna Rao garu, Invest Telangana CEO B. Ajith Reddy garu, TGIIC Managing Director Shashanka garu, ITE&C Joint Secretary Anudeep Durishetty garu, and Director of Industries Nikhil Chakravarthy garu. ✅The discussions reaffirmed the shared commitment of Canada and Telangana to building enduring partnerships that drive innovation, sustainable development, economic prosperity, and global competitiveness. #CanadaTelangana #CanadaIndiaRelations #InvestInTelangana

Telangana took another significant step towards deepening its global partnerships as Canada in India Mr Chris Cooter, called on Hon’ble Chief Minister Sri Revanth Reddy in Hyderabad for wide-ranging discussions on enhancing bilateral cooperation across trade, investment, innovation, education, and sustainable development. ✅The meeting underscored the growing momentum in Canada–Telangana relations, with both sides exploring new avenues for collaboration in sectors that are shaping the future of economic growth. ✅During the discussions, the High Commissioner extended an invitation to the Hon’ble Chief Minister to lead a high-level delegation to #Canada, paving the way for stronger institutional and business engagement between the two regions. ✅A key focus of the meeting was Telangana’s ambitious infrastructure and urban transformation agenda. The High Commissioner expressed keen interest in flagship initiatives such as the Musi River Development Project, the Hyderabad Metro Rail expansion, and the proposed Future City, highlighting the potential for Canadian expertise and investments to contribute to these landmark projects. ✅Reflecting the growing confidence of Canadian businesses in #Telangana, Mr. Cooter highlighted several recent milestones that reinforce the state's emergence as a preferred global investment destination. ✅These include Firan Technology Group's decision to establish a manufacturing facility in #Hyderabad, the launch of CIBC's Global Capability Centre (GCC) in the city, and the strategic partnership between CPP Investments and Hyderabad-based CtrlS Datacenters, under which CPP Investments has committed up to CAD 1 billion. ✅Sharing Telangana’s remarkable growth story, the Hon’ble Chief Minister outlined the state's rapid progress across Information Technology, Life Sciences, Defence, and Aerospace, while emphasizing Hyderabad’s position as one of the world’s fastest-growing hubs for Global Capability Centres (GCCs), attracting leading Fortune 500 companies. ✅The Chief Minister also elaborated on the government's transformative vision for the Musi River Rejuvenation Project, describing it as a catalyst for creating a vibrant riverfront economy that integrates sustainability, urban development, and economic opportunity. He sought Canada's partnership in advancing Telangana's renewable energy ambitions, including solarisation initiatives and the broader transition towards a green economy. ✅Highlighting Telangana's vision of becoming a global knowledge and innovation hub, the Chief Minister noted that several leading international universities are exploring opportunities to establish campuses in Hyderabad. ✅He also proposed the establishment of a multi-university campus by a consortium of Canadian universities, creating new opportunities for academic collaboration, research, and talent development. ✅Welcoming Canada's expanding engagement with Telangana, the Chief Minister invited Canadian companies, investors, academic institutions, and innovation partners to participate in the second edition of Telangana's Global Investors Summit, scheduled for December, as a platform to explore strategic partnerships and investment opportunities across high-growth sectors. ✅Speaking on the occasion, High Commissioner Chris Cooter commended Telangana's forward-looking governance, investor-friendly policies, and strong focus on job creation. He observed that the state's exceptional talent pool and innovation ecosystem position it as one of India's most promising destinations for global investment and collaboration. ✅Reaffirming Canada's commitment to strengthening ties with Telangana, Mr. Cooter assured full support for the state's development priorities and announced that a Canadian trade delegation will visit Telangana in the coming months to explore collaboration in areas including energy, urban development, defence, and aerospace. ✅The meeting was also attended by Advisor and Ex-Officio Special Chief Secretary to the CM K. Ramakrishna Rao garu, Invest Telangana CEO B. Ajith Reddy garu, TGIIC Managing Director Shashanka garu, ITE&C Joint Secretary Anudeep Durishetty garu, and Director of Industries Nikhil Chakravarthy garu. ✅The discussions reaffirmed the shared commitment of Canada and Telangana to building enduring partnerships that drive innovation, sustainable development, economic prosperity, and global competitiveness. #CanadaTelangana #CanadaIndiaRelations #InvestInTelangana

12,358 Aufrufe

ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంత శాసనసభ్యులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కోరారు. ✅పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ✅ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ✅ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట) గారు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక) గారు, కోరం కనకయ్య (ఇల్లందు) గారు తెల్లం వెంకట్రావు (భద్రాచలం) గారు, వెడ్మ బొజ్జు (ఖానాపూర్) గారు ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా ఉన్నారు. #IndirammaIndlu #ITDA #AgencyArea

ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంత శాసనసభ్యులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కోరారు. ✅పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ✅ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ✅ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట) గారు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక) గారు, కోరం కనకయ్య (ఇల్లందు) గారు తెల్లం వెంకట్రావు (భద్రాచలం) గారు, వెడ్మ బొజ్జు (ఖానాపూర్) గారు ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా ఉన్నారు. #IndirammaIndlu #ITDA #AgencyArea

11,190 Aufrufe

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా కలిశారు. Chiranjeevi Konidela

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా కలిశారు. Chiranjeevi Konidela

89,738 Aufrufe

ముఖ్యమంత్రి Revanth Reddy గారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వెంకట దత్త సాయి ల రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. PV Sindhu

ముఖ్యమంత్రి Revanth Reddy గారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వెంకట దత్త సాయి ల రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. PV Sindhu

128,945 Aufrufe

Major milestone for #Telangana. The Government of Telangana has entered into an MoU with Sun Petrochemicals, a leading energy company to develop 3 Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and Mulugu districts, totalling a massive 3,400 MW capacity. Alongside, integrated solar power plants (5,440 MW) will be developed, driving the state's green energy goals. The project comes with an estimated ₹45,500 crore investment, creating over 7,000 jobs during the construction phase. This is set to boost socio-economic growth, particularly in these regions. Hon’ble Chief Minister Shri Revanth Reddy garu welcomed the huge agreement, noting that Telangana’s investments soared at #Davos last year, the #TelanganaRising delegation had scored a great watermark agreement with this deal with #SunPetrochemicals. This deal continues that momentum in the renewable energy sector. “Telangana is broadening its investment base, creating massive job opportunities and transforming areas like Nagarkurnool, Mancherial, and Mulugu,” Chief Minister added. IT & Industries Minister Shri Minister Sridhar Babu garu highlighted the year-long efforts to secure this deal, noting it’s one of the largest investments since 2014. Shri Dilip Shanghvi, MD of Sun Pharma & Sun Petrochemicals, hailed Telangana as an "irresistible investment destination" under CM Shri Revanth Reddy's leadership, with green energy as a game-changer for the state's economy. Sridhar Babu Duddilla Jayesh Ranjan #WEF25 #Davos25 #InvestInTelangana

Major milestone for #Telangana. The Government of Telangana has entered into an MoU with Sun Petrochemicals, a leading energy company to develop 3 Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and Mulugu districts, totalling a massive 3,400 MW capacity. Alongside, integrated solar power plants (5,440 MW) will be developed, driving the state's green energy goals. The project comes with an estimated ₹45,500 crore investment, creating over 7,000 jobs during the construction phase. This is set to boost socio-economic growth, particularly in these regions. Hon’ble Chief Minister Shri Revanth Reddy garu welcomed the huge agreement, noting that Telangana’s investments soared at #Davos last year, the #TelanganaRising delegation had scored a great watermark agreement with this deal with #SunPetrochemicals. This deal continues that momentum in the renewable energy sector. “Telangana is broadening its investment base, creating massive job opportunities and transforming areas like Nagarkurnool, Mancherial, and Mulugu,” Chief Minister added. IT & Industries Minister Shri Minister Sridhar Babu garu highlighted the year-long efforts to secure this deal, noting it’s one of the largest investments since 2014. Shri Dilip Shanghvi, MD of Sun Pharma & Sun Petrochemicals, hailed Telangana as an "irresistible investment destination" under CM Shri Revanth Reddy's leadership, with green energy as a game-changer for the state's economy. Sridhar Babu Duddilla Jayesh Ranjan #WEF25 #Davos25 #InvestInTelangana

86,099 Aufrufe

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. సింధు గారు తల్లిదండ్రులతో పాటుగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. PV Sindhu

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. సింధు గారు తల్లిదండ్రులతో పాటుగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. PV Sindhu

42,242 Aufrufe

ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారిని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన డా. దత్తాత్రేయుడు గారు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. #DrDattatreyuduNori

ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారిని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన డా. దత్తాత్రేయుడు గారు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. #DrDattatreyuduNori

18,373 Aufrufe

The Telangana Government has signed an MoU with CtrlS Datacenters to establish a cutting-edge AI Datacenter Cluster in the state. With an investment of ₹10,000 crores and a 400 MW capacity, the project, unveiled at World Economic Forum 2025 in #Davos, will generate 3,600 jobs and contribute ₹254.9 crores in tax revenue during construction & ₹101.4 crores annually post-operation. #Telangana’s supportive policies like Data Center Policy & TG-iPASS ensure smooth execution. This transformative initiative will enhance IT capabilities, set new standards for innovation & sustainability, and reinforce Telangana’s vision of becoming a global leader in digital infrastructure. Sridhar Babu Duddilla Jayesh Ranjan #TelanganaRising #WEF25 #Davos2025 #InvestInTelangana #IndiaAtWefDavos2025 #CtrlSDatacenters

The Telangana Government has signed an MoU with CtrlS Datacenters to establish a cutting-edge AI Datacenter Cluster in the state. With an investment of ₹10,000 crores and a 400 MW capacity, the project, unveiled at World Economic Forum 2025 in #Davos, will generate 3,600 jobs and contribute ₹254.9 crores in tax revenue during construction & ₹101.4 crores annually post-operation. #Telangana’s supportive policies like Data Center Policy & TG-iPASS ensure smooth execution. This transformative initiative will enhance IT capabilities, set new standards for innovation & sustainability, and reinforce Telangana’s vision of becoming a global leader in digital infrastructure. Sridhar Babu Duddilla Jayesh Ranjan #TelanganaRising #WEF25 #Davos2025 #InvestInTelangana #IndiaAtWefDavos2025 #CtrlSDatacenters

20,381 Aufrufe

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రా రామచంద్రన్ లు ముఖ్యమంత్రి Revanth Reddy ని కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు మోసపోకుండా #RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. #TelanganaRERA

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రా రామచంద్రన్ లు ముఖ్యమంత్రి Revanth Reddy ని కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు మోసపోకుండా #RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. #TelanganaRERA

19,343 Aufrufe

ముఖ్యమంత్రి Revanth Reddy గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రి Damodar Raja Narasimha గారు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కాలె యాదయ్య గారు, లక్ష్మీకాంతారావు గారు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ గారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు. @MadigaKrishna #Telangana

ముఖ్యమంత్రి Revanth Reddy గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రి Damodar Raja Narasimha గారు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కాలె యాదయ్య గారు, లక్ష్మీకాంతారావు గారు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ గారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు. @MadigaKrishna #Telangana

10,455 Aufrufe

Videos

TelanganaCMO's profile picture

ఢిల్లీ: తెలంగాణలో నిర్మించ‌నున్న వ‌రంగ‌ల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్ర‌యాల‌ను అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ Ram Mohan Naidu Kinjarapu గారికి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు పౌర విమానయాన శాఖ కార్యాలయంలో కేంద్రమంత్రితో సమావేశమై రెండు విమానాశ్రయాలపై చర్చించారు. ✅ఉత్త‌ర తెలంగాణ‌లోని ఉమ్మడి ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంల‌తో పాటు న‌ల్గొండ జిల్లాల‌కు వరంగల్ కేంద్రంగా ఉంటుంద‌ని తెలిపారు. #WarangalAirport రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధాన‌మై ఉండ‌డంతో పాటు కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో నగరం కీల‌కంగా మారుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో వ‌రంగ‌ల్‌ను పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ✅వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యంలో #MRO (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవ‌ర్‌హాలింగ్‌), ఎయిర్‌కార్గో, హ్యాంగ‌ర్ వ‌స‌తులు క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టికే భూ సేక‌ర‌ణ పూర్తి చేసినందున టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించాల‌ని కోరారు. 2028, జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ ప‌నులు పూర్తి చేసి ప్రారంభోత్స‌వానికి సిద్ధం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ✅ఈ సంద‌ర్బంగా #Warangal ఎయిర్‌పోర్ట్ నిర్మాణాల‌కు సంబంధించిన డిజైన్ల‌పై చ‌ర్చించారు. వ‌రంగ‌ల్‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్నందున‌, కాక‌తీయ చ‌రిత్ర‌, సంస్కృతికి అద్దం ప‌ట్టేలా డిజైన్లు ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. అందుకు కేంద్ర మంత్రి సుముఖ‌త వ్య‌క్తం చేశారు. ✅#Adilabad లో ర‌క్ష‌ణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్ తో పాటు పౌర విమానాశ్ర‌యం నిర్మించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రెండు ఎయిర్‌పోర్ట్‌ల‌కు అవ‌స‌ర‌మైన భూమిని సేక‌రించి అంద‌జేస్తామ‌ని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం తరహాలోనే #AdilabadAirport లోనూ ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగ‌ర్ వ‌స‌తులు నెల‌కొల్పాల‌న్నారు. వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్ రెండు విమానాశ్ర‌యాల్లోనూ విమాన శిక్ష‌ణ సంస్థ‌లు (FTO) నెల‌కొల్పాల‌ని కోరారు. ✅హుస్సేన్ సాగ‌ర్ నుంచి ప్ర‌కాశం బ్యారేజీకి సీప్లేన్‌లు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌న్న ముఖ్యమంత్రి గారి సూచనలపై అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని కేంద్ర మంత్రి గారు కోరారు. ఈ స‌మావేశంలో న‌ల్గొండ ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి గారు, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్‌ గారు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ఎక్స్-అఫీషియో స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ కె. రామ‌కృష్ణారావు గారితో పాటు MoCA_GoI ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅అభివృద్ధికి రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని, రాజ‌కీయాలు ఎన్నిక‌ల స‌మయానికే ప‌రిమితం చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీడియాతో వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం వివిధ అంశాల్లో త‌మ‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని, ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే కేంద్ర మంత్రుల‌ను క‌లిసి చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. ఏవైనా స‌మాచారలోపం ఉంటే దానిని ప‌ర‌స్ప‌రం మార్చుకోవ‌డం ద్వారా అధిగ‌మిస్తున్నామ‌ని చెప్పారు. ✅దేశంలో ఎక్క‌డా లేనంత త్వ‌రగా తెలంగాణ ప్ర‌భుత్వం విమానాశ్ర‌యానికి అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ చేసి ఇచ్చి చ‌రిత్ర సృష్టించింద‌ని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు అభినందించారు. భూ సేకరణ విషయంలో త్వరగా స్పందించినందుకు ముఖ్య‌మంత్రి గారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. వ‌రంగ‌ల్ సంస్కృతికి అద్దం ప‌ట్టేలా విమానాశ్ర‌య డిజైన్ ఉంటుంద‌ని చెప్పారు. #AirportDevelopment #MamnoorAirport #CivilAviation #Kakatiya #RegionalConnectivity

Telangana CMO

21,090 Aufrufe • vor 10 Tagen

TelanganaCMO's profile picture

రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం (#FLO) ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం పక్కన వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ప్రకటించారు. 🔶#FICCI ఎఫ్‌ఎల్‌వో (హైదరాబాద్) ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (FICCI) ఏర్పడి 2027 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. 🔶ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హైటెక్ సిటీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సీఐఐ కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. 🔶ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న #BharatFutureCity లో కూడా ఫిక్కీ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు కోరారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్ 500 కంపెనీలను నెలకొల్పాలన్నది ప్రభుత్వ సంకల్పమని, ఫిక్కీ మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కూడా చాలా కీలకమవుతుందని చెప్పారు. 🔶ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మహిళా సాధికారత కోసం మరొక పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. 🔶మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు. వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అవార్డులు బహూకరించి గౌరవించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. 🔶ఈ కార్యక్రమంలో #TelanganaCS సంజయ్ జాజు గారు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు గారు, ఎఫ్ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్ గారు, ఎఫ్ఎల్‌వో హైదరాబాద్ చైర్‌పర్సన్‌ సీతా రెడ్డి గడ్డం గారితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. #Telangana #WomenEmpowerment #WomenEntrepreneurs

Telangana CMO

13,619 Aufrufe • vor 6 Tagen

TelanganaCMO's profile picture

ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ కల్తీ అవుతుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (#TGFADCA) పై ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ✅ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ✅ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయట పడుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు దిగుమతులకు నిరాకరిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ✅మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారని, అధిక ధరలు చెల్లించి ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ✅కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలులో ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించి శాసనసభలో సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. శాసనసభలో చర్చతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించాలని సూచించారు. ✅కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు విజిల్ బ్లోయర్ వ్యవస్థను, టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ✅కల్తీల నిరోధానికి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అక్కడ నిబంధనలను అమలు చేసి, వాటి అమలులో ఎదురయ్యే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సూచించారు. ✅ ఈ సమావేశంలో Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, DGP TELANGANA POLICE సీవీ ఆనంద్ గారు, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు గారు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి గారు, ఎన్.శ్రీధర్ గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #Telangana #FoodSafety #PublicHealth #ZeroAdultration

Telangana CMO

10,426 Aufrufe • vor 6 Tagen

TelanganaCMO's profile picture

తెలంగాణ విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ Revanth Reddy గారు రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసి ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు. ✅నీటి పారుద‌ల ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తుల సాధ‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ముఖ్యమంత్రి గారు కోరారు. ✅ఈ నెల 20 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభమవుతున్న నేప‌థ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల‌పై మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ద్వారా వివరించారు. ✅ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, Ponguleti Srinivasa Reddy గారు, ప్రభుత్వ సలహాదారు AP Jithender Reddy గారు, రాష్ట్ర ఎంపీలు Anil Kumar Yadav గారు, Dr. Mallu Ravi గారు, Eatala Rajender గారు, Kunduru Raghuveer Reddy గారు, Konda Vishweshwar Reddy గారు, Kiran Kumar Chamala గారు, Ramasahayam Raghuram Reddy గారు, కడియం కావ్య గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి గారు మాట్లాడుతూ, దేశ జ‌నాభాలో 10 శాతం జ‌నాభా ఆరు మ‌హా నగ‌రాల్లో #Hyderabad ఉంద‌ని, ఈ న‌గరాలు 25 శాతం జీడీపీ క‌లిగి ఉన్నాయ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో #IIM ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమ‌తి అవ‌స‌ర‌మని, ఎంపీలు ఈ విష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి Nirmala Sitharaman గారిని క‌లిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞ‌ప్తి చేయాల‌ని సూచించారు. ✅#HyderabadMetro ఫేజ్‌-I స్వాధీనం, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల స‌ర‌ళిని ఎంపీల‌కు వివ‌రించారు. ఇందుకు సంబంధించి #SBICAPS ని క‌న్స‌ల్టెంట్‌గా నియ‌మించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని, ఆ ప్ర‌క్రియ త్వ‌ర‌గా ముందుకు సాగేలా చూడాల‌ని కోరారు. ఈ విష‌యంలో ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని బీజేపీ ఎంపీలు ఈట‌ల రాజేంద‌ర్‌ గారికి, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి గారికి విజ్ఞ‌ప్తి చేశారు. ✅#RegionalRingRoad ఉత్త‌ర భాగంలో 95 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యింద‌ని, ఆ ప‌నుల ప్రారంభానికి, ద‌క్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేక‌ర‌ణ‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెల‌పాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో కూడా ఎంపీలు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించాలని కోరారు. ✅మూసీ పున‌రుజ్జీవ‌నం ప‌నుల్లో మొద‌టి ద‌శ టెండ‌ర్ల ద‌శ‌కు వ‌చ్చింద‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఈ ప‌నుల‌ను అర్బ‌న్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విష‌యంలో కేంద్ర అప్రూవ‌ల్ లెట‌ర్ ఇవ్వాల్సి ఉంద‌న్నారు. ఎంపీలు ఈ విష‌యంలో కేంద్ర మంత్రి Manohar Lal గారిని క‌లిసి విజ్ఞ‌ప్తి చేయాల‌ని సూచించారు. ✅అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల విష‌య‌మై ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో జ‌ల్‌శ‌క్తి మంత్రి C R Paatil గారి ఆధ్వ‌ర్యంలో ఏపీ, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చించిన అంశాల‌ను ఎంపీల‌కు వివ‌రించారు. తుంగ‌భ‌ద్ర నుంచి తెలంగాణ‌కు 15.09 టీఎంసీల నీరు రావలసి ఉన్నా పూడిక‌తో 5 టీఎంసీల‌కు మించి రావ‌డం లేద‌న్నారు. ✅డ్యామ్‌తో పాటు కాలువ‌ల్లో పూడిక తొల‌గింపున‌కు ఏపీ, క‌ర్ణాట‌క స‌హ‌క‌రించేలా ఒప్పించాల‌ని కేంద్ర మంత్రిని కోరామ‌ని, ఈ విష‌యంపై ఎంపీలు కేంద్ర మంత్రిని క‌ల‌సి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ✅నదుల అనుసంధానంలో గోదావ‌రి నుంచి నాగార్జున సాగ‌ర్‌కు నీళ్లు తీసుకునే విష‌యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను ఒప్పించే బాధ్య‌త‌ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంద‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ✅గోదావ‌రిలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు 300 టీఎంసీల వాటా ఉంద‌ని, వాటిని ఛ‌త్తీస్‌గ‌ఢ్ వాడుకోవ‌డం లేద‌న్నారు. భ‌విష్య‌త్‌లో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటాయ‌న్నారు. అందులో తెలంగాణ‌కు 43 టీఎంసీలు ల‌భించే అవ‌కాశం ఉంద‌న్నారు. ✅గోదావ‌రి నుంచి ఏపీ ప్రాంతం మీదుగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌కు నీరు తీసుకెళ్లే గోదావ‌రి-కావేరి అనుసంధానం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో ఎంపీలు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని సూచించారు. ఇక్క‌డ నీళ్లు ఛ‌త్తీస్‌గ‌ఢ్ వి అయితే నిధులు కేంద్రానివ‌ని, ఆ రెండింటిని తెలంగాణ‌కు అనుకూలంగా సాధించాల‌ని చెప్పారు. ✅ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిర‌భ్యంత‌ర ప‌త్రాలు (NOC) ఇవ్వాల్సి ఉంద‌ని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఈ విష‌యంపైనా Ministry of Jal Shakti, DoWR, RD&GR, GoI మంత్రి సీఆర్ పాటిల్‌ గారు, ఏపీ ముఖ్య‌మంత్రి గారితో చ‌ర్చించామ‌న్నారు. వారు సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించార‌ని, ఎన్‌వోసీలు వ‌స్తే వాటికి ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయ‌ని చెప్పారు. ✅తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150-151 అడుగుల్లో నిర్మించేందుకు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి Devendra Fadnavis గారితో భేటీ అవుదామ‌ని ఎంపీల‌కు సూచించారు. ✅శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగ‌ళూరు, చెన్నై, ముంబ‌యిల‌కు వెళ్లే బుల్లెట్ రైళ్ల‌కు సంబంధించి ఎలైన్‌మెంట్లు కొలిక్కివ‌చ్చాయ‌ని సమావేశంలో వివరించారు. ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్‌పోర్ట్‌, వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్ట్‌ల‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ పూర్తి చేశామ‌ని తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవ‌ర్ హాలింగ్‌), ఎయిర్ కార్గోలు ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నామ‌ని, ఈవిష‌యంపైనా ఎంపీలు దృష్టిసారించాల‌ని కోరారు. ✅రాష్ట్ర ప్ర‌యోజనాలే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వంతో స‌హ‌క‌రిస్తున్నామ‌ని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. పార్టీల‌కు అతీతంగా ఎంపీలకు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించ‌డానికి ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్‌లో కో-ఆర్డినేష‌న్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను నియ‌మించిన విషయాన్ని ప్రస్తావించారు. పెండింగ్ అంశాల‌కు సంబంధించి ఏ స‌మాచారం కావాలన్నాఆయ‌న ద‌గ్గ‌ర నుంచి తీసుకోవ‌చ్చ‌ని సూచించారు. ✅అన్ని పార్టీల ఎంపీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ముందుకు సాగాల‌ని ఎంపీల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వికి సీఎం సూచించారు. సమావేశంలో ఎంపీలు పలు అంశాలను ప్రస్తావించారు. #Telangana #MusiRiverfrontDevelopment #BulletTrain #PendingWithCentre

Telangana CMO

15,251 Aufrufe • vor 11 Tagen

TelanganaCMO's profile picture

క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ✅గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ముఖ్యమంత్రి గారు #TelanganaSportsHub ప్రతినిధులతో సమావేశమయ్యారు. ✅ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ Dr. Sanjiv Goenka గారు, కో-చైర్మన్ Upasana Konidela గారు, సభ్యులు కావ్య మారన్ గారు, సి.శశిధర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన #GachibowliStadium అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఆ స్టేడియంలో హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ✅క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని తెలిపారు. ✅“స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. #Olympic క్రీడలు కూడా హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి..” అని బోర్డు సభ్యులకు సూచించారు. #TelanganaSports #Hyderabad #SportsInfrastructure #KavyaMaran

Telangana CMO

79,165 Aufrufe • vor 3 Monaten

TelanganaCMO's profile picture

Hon'ble Chief Minister Sri Revanth Reddy held a meeting with a delegation led by Mr. Alex Kipman, Founder & CEO of Analog, and Mr. P. Krishna Reddy, Managing Director of Megha Engineering and Infrastructures Ltd, to discuss the deployment of next-generation intelligent infrastructure solutions in Telangana. ✅During the meeting, the Hon'ble Chief Minister suggested that #Analog and #MEIL develop and implement an advanced AI-powered traffic signal management system for #Hyderabad that can dynamically respond to real-time traffic conditions and help address the growing mobility challenges of the rapidly expanding metropolitan city. ✅Deputy Chief Minister Sri Bhatti Vikramarka Mallu, Ministers Sri Uttam Kumar Reddy and Sri Jupally Krishna Rao, Office of Chief Secretary, Telangana Govt. Sri Sanjay Jaju, Adviser to the Government Sri K. Ramakrishna Rao, and senior government officials were also present during the meeting. ✅The delegation presented their vision for bringing #PhysicalIntelligence to India through their strategic collaboration and shared updates on the Hyderabad Traffic Pilot initiative. They demonstrated how intelligent platforms can enable safer, smarter and more efficient urban mobility by optimizing traffic flow and improving real-time decision-making. ✅The discussions also explored the broader concept of Cognitive Cities and the transformative potential of Physical Intelligence across key sectors, including energy, power transmission, public infrastructure, healthcare, water management, transportation and irrigation. ✅The companies highlighted how advanced technologies can enhance operational efficiency, strengthen public service delivery and support data-driven infrastructure planning for sustainable urban growth. ✅The meeting also witnessed the ceremonial exchange of the Joint Venture Shareholders' Agreement between MEIL and Analog, marking an important milestone in fostering innovation-driven infrastructure development and positioning Telangana as a leader in adopting cutting-edge technologies for the benefit of its citizens. #Telangana #FutureOfMobility #UrbanMobility

Telangana CMO

20,264 Aufrufe • vor 23 Tagen

TelanganaCMO's profile picture

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు దేవస్థానంకే ఉండాలని చెప్పారు. ✅#Yadagirigutta శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ✅ఆలయం పరిధిలో భూముల కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ (చారిటబుల్) ఫౌండేషన్ కోసం మార్కెట్ ధర ప్రకారం భూమిని కేటాయించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు. ✅గుట్టపైన అతిథి గృహాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే వారి జాబితా రూపొందించాలని, అతిథి గృహాల నిర్మాణాల్లోనూ #TTD అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అనుసరించాలని, దశల వారిగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపైన కూడా స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం రూపొందించాలని అన్నారు. ✅ఆలయ పరిధిలోవివిధ అభివృద్ధి పనుల కోసం భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనంచేసి వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు. ✅ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు Vem Narender Reddy గారు, ఎంపీలు Kiran Kumar Chamala గారు, Kunduru Raghuveer Reddy గారు, ప్రభుత్వ విప్ Beerla Ilaiah గారు, ఎమ్మెల్యే Kumbam Anil Kumar Reddy గారితో పాటు దేవాదాయ, ఆర్థిక, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు. #Telangana #SriLakshminarasimhaSwamy #TempleDevelopment

Telangana CMO

20,933 Aufrufe • vor 24 Tagen

TelanganaCMO's profile picture

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (#CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ✅ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో #HDFC సమకూర్చిన రెండు ఆంబులెన్స్‌లకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చిన ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల నుంచి రుణాల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. ✅స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం పెద్ద ఎత్తున రుణాలివ్వాలని కోరారు. ✅ఈ కార్య‌క్ర‌మంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #CSR #HDFCBank #HealthCare #SelfHelpGroups #Telangana

Telangana CMO

17,628 Aufrufe • vor 24 Tagen

TelanganaCMO's profile picture

పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అవసరమైన మేరకు చట్టాలను రూపొందించాలని చెప్పారు. ✅రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి గారు #MCRHRD లోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా #DigitalGovernance అమలు చేయాలని సూచించారు. ✅ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు అందించేలా వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టంగా చెప్పారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు. ✅రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ✅ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌తో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని సూచించారు. ✅కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు. ✅ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగినప్పటికీ సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ✅దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు. ✅హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ✅ఈ సమావేశంలో ఎంపీ Vem Narender Reddy గారు, సలహాదారు కె. రామకృష్ణారావు గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు, హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #Telangana #TransparentGovernance #PublicService

Telangana CMO

12,372 Aufrufe • vor 17 Tagen

TelanganaCMO's profile picture

2036 లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని భారతదేశం పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలన్న బలమైన ఆకాంక్షను ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు వ్యక్తం చేశారు. ఆ క్రీడల నిర్వహణకు అనుగుణంగా తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా సర్వసన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. ✅తెలంగాణ క్రీడా వైభవం నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. గచ్చీబౌలి స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి గారు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు P.T. USHA గారితో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శుభారంభం పలికారు. ✅మంత్రి Vakiti Srihari గారు, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) AP Jithender Reddy గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, అధికారులు, విద్యార్థుల సమక్షంలో వాటికి శ్రీకారం చుట్టారు. ✅క్రీడలను ప్రోత్సహించాలన్న బలమైన ఆకాంక్షతో #YIPESU ని స్థాపించడం పట్ల ఈ సందర్భంగా పీటీ ఉష గారు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ✅ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, వచ్చే నవంబర్‌లో ఖేలో ఇండియా పోటీలను నిర్వహించడమే కాకుండా 2036 #Olympics నిర్వహించాలని భారతదేశం భావిస్తున్న నేపథ్యంలో అందుకు తెలంగాణ వేదిక కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ✅82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని ఇక్కడ నిర్మించబోతున్నాం. 2028 డిసెంబరులో ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం అని తెలిపారు. ✅"క్రీడారంగంలో స్పష్టమైన విధానం లేని కారణంగా క్రీడల్లో దేశం వెనుకబడిపోయింది. అందుకే తెలంగాణలో స్పష్టమైన క్రీడా పాలసీని తెచ్చాం. దేశంలో క్రీడా శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీలకు పాలసీ ఉండాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలో యంగ్ ఇండియా పేరుతో మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా దినపత్రిక స్ఫూర్తిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం" అని వివరించారు. ✅"ఆఫ్రోఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు వేదికగా ఉన్న #Hyderabad ఆ తర్వాత గడిచిన 20 ఏళ్లపాటు చెప్పుకోదగిన క్రీడలను నిర్వహించలేదు. 23 ఏళ్ల కిందట నిర్మించిన స్టేడియాలు ఆ తర్వాత పెళ్లిళ్లకు, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించారు. వాటన్నింటినీ పునరుద్ధరించాలని భావిస్తున్నాం" అని స్పష్టం చేశారు. ✅"నిజమైన క్రీడాకారులను సంపూర్ణమైన ప్రోత్సాహకాలను అందించడానికి స్పోర్ట్స్ పాలసీతో పాటు పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యంలో క్రీడా యూనివర్సిటీని నెలకొల్పాం. ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండదు. Dr. Sanjiv Goenka, Abhinav A. Bindra OLY, కపిల్ దేవ్, కావ్యా మారన్, Upasana Konidela, రవికాంత్ రెడ్డి లాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న వారితో యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ వర్సిటీ నిర్వహణ విషయంలో వారికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం" అని తెలిపారు. ✅చదువులోనే కాదు, క్రీడల్లో రాణించినా భవిష్యత్తు బాగుంటుందని, క్రీడలపై దృష్టి సారించండి. క్రీడల్లో రాణించి దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తెలంగాణ తీసుకుంటుందని ప్రకటించారు. ✅"యువకులు ఈ దేశ సంపద. ఒలింపిక్స్, ఇతర క్రీడలు జరిగినప్పుడు ఏ దేశాలు ఎన్ని గెలిచాయని గమనించినప్పుడు భారతదేశం చివరిస్థానాల్లో నిలుస్తోంది. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో పీటీ ఉష లాంటి వారు మాకు అవసరమైన సహకారం అందించాలి. పీటీ ఉష గారి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. క్రీడల్లో రాణించడం వల్లే ఈ రోజు రాజ్యసభ సభ్యులు కాగలిగారు" అని చెప్పారు. ✅"ఏ రంగంలోనైనా ఉత్తమంగా రాణించాలంటే ఏకాగ్రత ఉండాలి. అప్పుడే రాణించగలుతాం. వందకు వంద శాతం సాధన చేయాలి. ఒకసారి ఓటమి చెందినంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదు. ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదు. ఓటమిని సవాలుగా తీసుకోవాలి" అని ముఖ్యమంత్రి గారు ఉద్బోధించారు. ✅వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన ఆరుగురు క్రీడాకారులకు రూ. 7.15 కోట్ల మేరకు నగదు ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వారికి అందించారు. దీప్తి దివాంజీ (ప్యారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్) కి రూ. 50 లక్షలు, దనుష్ శ్రీకాంత్‌ (షూటింగ్ - డెఫ్లింపిక్స్) కు రూ. 2.10 కోట్లు, Esha Singh (ISSF ప్రపంచకప్ విజేత - వరల్డ్ రికార్డు) కు రూ. 3.3 కోట్లు, Nikhat Zareen (బాక్సింగ్) కు రూ. 60 లక్షలు, తనిష్క్ మురళీధర్ నాయుడు (షూటింగ్) కు రూ. 53.65 లక్షలు, రావూరి సురభి భరద్వాజ్‌ (షూటింగ్) కు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కులను అందించారు. ✅రాబోవు రోజుల్లో తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నమెంట్స్, లీగ్స్ వివరాలను ఈ వేదికగా ప్రకటించారు. 2026 #KheloIndia యూత్ గేమ్స్ (8వ ఎడిషన్) క్రీడలు, జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ టోర్నమెంట్స్‌ను తెలంగాణ నిర్వహించబోతోంది. ✅వీటితో పాటు హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారు “Telangana Sports Knowledge on Wheels” స్పోర్ట్స్ నాలెడ్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. #TelanganaSports #KIYG2026 #YoungIndiaSportsUniversity #Olympics2036 #TeamTelangana #SportsPolicy

Telangana CMO

10,971 Aufrufe • vor 15 Tagen

TelanganaCMO's profile picture

రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ✅ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి Jayesh Ranjan గారు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅#BharatFutureCity పరిధిలోని అటవీ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ✅నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు. మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను అధునికీకరించాలని ఆదేశించారు. ✅టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద #Vikarabad ను అభివృద్ధి చేయాలని, ప్రధానంగా వికారాబాద్‌లోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. యాదగిరిగుట్ట తరహాలో దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ✅#CURE పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను ముమ్మరం చేయాలని చెప్పారు. ✅నగరంలో పురానాపూల్ వంటి వారసత్వ సంపదగా నిలిచిన బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి చేసిన తర్వాత అవసరమైతే ట్రాఫిక్‌ను మరో మార్గం నుంచి మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని సూచించారు. ✅పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి అధికారులను ఆరా తీసిన ముఖ్యమంత్రి గారు వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే #GlobalInvestmentSummit పై కసరత్తును ప్రారంభించాలని చెప్పారు. ఈ సమ్మిట్ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. #TelanganaTourism #Hyderabad #BharatFutureCity #EcoTourism #UrbanInfrastructure

Telangana CMO

12,733 Aufrufe • vor 18 Tagen

TelanganaCMO's profile picture

రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను పేపర్ లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ✅మంత్రివర్గ సమావేశాలను తెలంగాణ డిజిటల్ కేబినేట్‌గా నిర్వహించడానికి వీలుగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి Sridhar Babu Duddilla గారు సమావేశంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారితో పాటు మంత్రులందరికీ ప్రత్యేకంగా ట్యాబ్‌లను అందజేశారు. ✅మంత్రిమండలి సమావేశాల నిర్వహణకు సంబంధించిన డిజిటల్ విధానాన్ని ట్యాబ్‌ల ద్వారా సమావేశంలో ప్రదర్శించి పరిశీలించారు. ఇక నుంచి ఈ-బుక్ ద్వారానే మంత్రిమండలి సమావేశం ఎజెండా, సంబంధిత నోట్స్ అన్నీ కూడా మంత్రులకు అందుబాటులో ఉంచనున్నారు. #DigitalCabinet #SmartGovernance #Telangana

Telangana CMO

21,637 Aufrufe • vor 1 Monat

TelanganaCMO's profile picture

Prominent industrialist and Chairman of Bharti Enterprises, Sri Sunil Bharti Mittal, paid a courtesy call on Hon'ble Chief Minister Sri Revanth Reddy at the Bodhi Pavilion, MCR HRD Institute. ✅During the meeting, the Hon'ble Chief Minister highlighted #Telangana's progressive governance, investor-friendly policies, and landmark reforms that have positioned the state as one of India's most preferred investment destinations. ✅The Chief Minister elaborated on the Government's transformative initiatives in the education sector, including the comprehensive revamp of government schools, the establishment of the Young India Skills University to equip youth with industry-relevant skills, the upgradation of Industrial Training Institutes (ITIs) into world-class Advanced Technology Centres (ATCs), and the modernization of polytechnic colleges to meet emerging industry requirements. ✅Emphasizing Telangana's vision to become a global hub for digital infrastructure, the Chief Minister urged Bharti Enterprises to expedite the implementation of the Chandanvelly Data Centre Project. He also invited the company to explore establishing a large-scale integrated data centre and AI infrastructure campus in the state. ✅The Chief Minister encouraged #Airtel to further expand its digital, cloud, cybersecurity, and artificial intelligence operations in Hyderabad. He also suggested that Bharti Enterprises nominate a senior executive to coordinate with the Government of Telangana to facilitate future investments and ensure the timely resolution of any operational issues. ✅Sri Sunil Bharti Mittal appreciated the Telangana Government's forward-looking initiatives and announced that the Bharti Airtel Foundation would provide scholarships to students studying in government schools and Advanced Technology Centres (ATCs). He also informed the Chief Minister that Hyderabad is being considered as Airtel's second headquarters. ✅Mr. Mittal further expressed Bharti Enterprises' commitment to expanding its data centre capacity in Telangana and conveyed the company's keen interest in strengthening fibre connectivity across the state. ✅Office of Chief Secretary, Telangana Govt. Sri K. Ramakrishna Rao was also present during the meeting. airtel India #InvestInTelangana #Hyderabad #DataCenters

Telangana CMO

15,569 Aufrufe • vor 24 Tagen

TelanganaCMO's profile picture

ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడుతామని చెప్పారు. ✅రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ✅ముఖ్యమంత్రి గారితో పాటు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీడియాతో ముచ్చటిస్తూ.. “రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయింది. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించాం. ✅ఇందుకోసమే క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించాం. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు జారీ చేశాం. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తాం..” అని అన్నారు. Office of CA,F&CS, Telangana State #CMRevanthReddy #SannaBiyyam #TelanganaPDS #FoodSecurity #TelanganaSannabiyyamScheme

Telangana CMO

56,396 Aufrufe • vor 3 Monaten