Telangana CMO's banner
Telangana CMO's profile picture

Telangana CMO

@TelanganaCMO1,691,242 subscribers

Official account of CMO Telangana.

Shorts

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా కలిశారు. Chiranjeevi Konidela

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా కలిశారు. Chiranjeevi Konidela

89,738 Aufrufe

ముఖ్యమంత్రి Revanth Reddy గారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వెంకట దత్త సాయి ల రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. Pvsindhu

ముఖ్యమంత్రి Revanth Reddy గారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వెంకట దత్త సాయి ల రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. Pvsindhu

128,934 Aufrufe

Major milestone for #Telangana. The Government of Telangana has entered into an MoU with Sun Petrochemicals, a leading energy company to develop 3 Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and Mulugu districts, totalling a massive 3,400 MW capacity. Alongside, integrated solar power plants (5,440 MW) will be developed, driving the state's green energy goals. The project comes with an estimated ₹45,500 crore investment, creating over 7,000 jobs during the construction phase. This is set to boost socio-economic growth, particularly in these regions. Hon’ble Chief Minister Shri Revanth Reddy garu welcomed the huge agreement, noting that Telangana’s investments soared at #Davos last year, the #TelanganaRising delegation had scored a great watermark agreement with this deal with #SunPetrochemicals. This deal continues that momentum in the renewable energy sector. “Telangana is broadening its investment base, creating massive job opportunities and transforming areas like Nagarkurnool, Mancherial, and Mulugu,” Chief Minister added. IT & Industries Minister Shri Minister Sridhar Babu garu highlighted the year-long efforts to secure this deal, noting it’s one of the largest investments since 2014. Shri Dilip Shanghvi, MD of Sun Pharma & Sun Petrochemicals, hailed Telangana as an "irresistible investment destination" under CM Shri Revanth Reddy's leadership, with green energy as a game-changer for the state's economy. Sridhar Babu Duddilla Jayesh Ranjan #WEF25 #Davos25 #InvestInTelangana

Major milestone for #Telangana. The Government of Telangana has entered into an MoU with Sun Petrochemicals, a leading energy company to develop 3 Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and Mulugu districts, totalling a massive 3,400 MW capacity. Alongside, integrated solar power plants (5,440 MW) will be developed, driving the state's green energy goals. The project comes with an estimated ₹45,500 crore investment, creating over 7,000 jobs during the construction phase. This is set to boost socio-economic growth, particularly in these regions. Hon’ble Chief Minister Shri Revanth Reddy garu welcomed the huge agreement, noting that Telangana’s investments soared at #Davos last year, the #TelanganaRising delegation had scored a great watermark agreement with this deal with #SunPetrochemicals. This deal continues that momentum in the renewable energy sector. “Telangana is broadening its investment base, creating massive job opportunities and transforming areas like Nagarkurnool, Mancherial, and Mulugu,” Chief Minister added. IT & Industries Minister Shri Minister Sridhar Babu garu highlighted the year-long efforts to secure this deal, noting it’s one of the largest investments since 2014. Shri Dilip Shanghvi, MD of Sun Pharma & Sun Petrochemicals, hailed Telangana as an "irresistible investment destination" under CM Shri Revanth Reddy's leadership, with green energy as a game-changer for the state's economy. Sridhar Babu Duddilla Jayesh Ranjan #WEF25 #Davos25 #InvestInTelangana

86,099 Aufrufe

ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారిని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన డా. దత్తాత్రేయుడు గారు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. #DrDattatreyuduNori

ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారిని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన డా. దత్తాత్రేయుడు గారు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. #DrDattatreyuduNori

18,373 Aufrufe

The Telangana Government has signed an MoU with CtrlS Datacenters to establish a cutting-edge AI Datacenter Cluster in the state. With an investment of ₹10,000 crores and a 400 MW capacity, the project, unveiled at World Economic Forum 2025 in #Davos, will generate 3,600 jobs and contribute ₹254.9 crores in tax revenue during construction & ₹101.4 crores annually post-operation. #Telangana’s supportive policies like Data Center Policy & TG-iPASS ensure smooth execution. This transformative initiative will enhance IT capabilities, set new standards for innovation & sustainability, and reinforce Telangana’s vision of becoming a global leader in digital infrastructure. Sridhar Babu Duddilla Jayesh Ranjan #TelanganaRising #WEF25 #Davos2025 #InvestInTelangana #IndiaAtWefDavos2025 #CtrlSDatacenters

The Telangana Government has signed an MoU with CtrlS Datacenters to establish a cutting-edge AI Datacenter Cluster in the state. With an investment of ₹10,000 crores and a 400 MW capacity, the project, unveiled at World Economic Forum 2025 in #Davos, will generate 3,600 jobs and contribute ₹254.9 crores in tax revenue during construction & ₹101.4 crores annually post-operation. #Telangana’s supportive policies like Data Center Policy & TG-iPASS ensure smooth execution. This transformative initiative will enhance IT capabilities, set new standards for innovation & sustainability, and reinforce Telangana’s vision of becoming a global leader in digital infrastructure. Sridhar Babu Duddilla Jayesh Ranjan #TelanganaRising #WEF25 #Davos2025 #InvestInTelangana #IndiaAtWefDavos2025 #CtrlSDatacenters

20,381 Aufrufe

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రా రామచంద్రన్ లు ముఖ్యమంత్రి Revanth Reddy ని కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు మోసపోకుండా #RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. #TelanganaRERA

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రా రామచంద్రన్ లు ముఖ్యమంత్రి Revanth Reddy ని కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు మోసపోకుండా #RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. #TelanganaRERA

19,301 Aufrufe

Under the leadership of Hon'ble Chief Minister Shri Revanth Reddy garu, IT and Industries Minister Shri Minister Sridhar Babu garu, and other officials of the #TelanganaRising delegation, a meeting was held with Mr. Su Le, Chief Growth Officer of SambaNova Systems, to discuss the potential for investment in the semiconductor industry in the state. Headquartered in Palo Alto, California, SambaNova Systems has developed an AI platform that serves as the backbone for #AI innovation and harnesses deep learning capabilities. The discussions were encouraging and positive. World Economic Forum Sridhar Babu Duddilla #Davos2025 #InvestInTelangana #IndiaAtWefDavos2025

Under the leadership of Hon'ble Chief Minister Shri Revanth Reddy garu, IT and Industries Minister Shri Minister Sridhar Babu garu, and other officials of the #TelanganaRising delegation, a meeting was held with Mr. Su Le, Chief Growth Officer of SambaNova Systems, to discuss the potential for investment in the semiconductor industry in the state. Headquartered in Palo Alto, California, SambaNova Systems has developed an AI platform that serves as the backbone for #AI innovation and harnesses deep learning capabilities. The discussions were encouraging and positive. World Economic Forum Sridhar Babu Duddilla #Davos2025 #InvestInTelangana #IndiaAtWefDavos2025

12,796 Aufrufe

ముఖ్యమంత్రి Revanth Reddy గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రి Damodar Raja Narasimha గారు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కాలె యాదయ్య గారు, లక్ష్మీకాంతారావు గారు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ గారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు. @MadigaKrishna #Telangana

ముఖ్యమంత్రి Revanth Reddy గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రి Damodar Raja Narasimha గారు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కాలె యాదయ్య గారు, లక్ష్మీకాంతారావు గారు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ గారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు. @MadigaKrishna #Telangana

10,454 Aufrufe

Videos

TelanganaCMO's profile picture

క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ✅గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ముఖ్యమంత్రి గారు #TelanganaSportsHub ప్రతినిధులతో సమావేశమయ్యారు. ✅ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ Dr. Sanjiv Goenka గారు, కో-చైర్మన్ Upasana Konidela గారు, సభ్యులు కావ్య మారన్ గారు, సి.శశిధర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన #GachibowliStadium అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఆ స్టేడియంలో హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ✅క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని తెలిపారు. ✅“స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. #Olympic క్రీడలు కూడా హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి..” అని బోర్డు సభ్యులకు సూచించారు. #TelanganaSports #Hyderabad #SportsInfrastructure #KavyaMaran

Telangana CMO

70,460 Aufrufe • vor 2 Monaten

TelanganaCMO's profile picture

ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడుతామని చెప్పారు. ✅రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ✅ముఖ్యమంత్రి గారితో పాటు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీడియాతో ముచ్చటిస్తూ.. “రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయింది. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించాం. ✅ఇందుకోసమే క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించాం. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు జారీ చేశాం. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తాం..” అని అన్నారు. Office of CA,F&CS, Telangana State #CMRevanthReddy #SannaBiyyam #TelanganaPDS #FoodSecurity #TelanganaSannabiyyamScheme

Telangana CMO

56,396 Aufrufe • vor 2 Monaten

TelanganaCMO's profile picture

అవుట‌ర్ రింగురోడ్డు ప‌రిధిలోని (#CURE) మూడు కార్పొరేష‌న్ల‌కు వ‌ర్తించేలా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ (#GHMC) చ‌ట్టం స్థానంలో కోర్ అర్బ‌న్ చ‌ట్టం రూపొందించాలని ముఖ్య‌మంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారుల‌ను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమ‌తులు, రుసుమ‌లు, అభివృద్ధి ప‌నుల నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర వ్య‌వ‌హారాల‌న్నింటికీ ఆ చ‌ట్టమే ఆధారంగా ఉండాల‌ని సూచించారు. ✅డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న 99 రోజుల కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నులు తొలుత చేప‌డ‌తామ‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. ✅కోర్ అర్బ‌న్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప‌లు ప్రాంతాల్లో చెత్త ఎక్క‌డ వేయాలో తెలియ‌క ప్ర‌జ‌లు ఖాళీ ప్ర‌దేశాల్లో వేస్తున్నారు. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాల‌ను గుర్తించి అక్క‌డ బోర్డులు ఏర్పాటు చేయాలి. ✅కోర్ అర్బ‌న్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విష‌యంలో నిర్దేశిత కాలం వ‌ర‌కు ఉండేలా సాంకేతిక‌త‌ను వినియోగించాలి. ✅కోర్ అర్బ‌న్ ఏరియాలో వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో తెలుసుకునేలా డ్యాష్ బోర్డులో క‌నిపించాలి. ఎక్క‌డైనా స‌మ‌స్య ఉంటే దానిని వెంట‌నే తెలుసుకొని ప‌రిష్క‌రించాలి. ✅ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. న‌గ‌రంలోని అన్ని హోట‌ళ్ల‌లోని కిచెన్ల‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి. త‌ర‌చూ త‌నిఖీలు తప్పనిసరి చేయడమే కాకుండా, ఫుడ్ సేఫ్టీకి ఆయా హోట‌ళ్లు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను మ‌దింపు చేయాలి. ✅కోర్ అర్బ‌న్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి ప్రధాన్యమివ్వాలి. 50 అంత‌స్తుల‌కుపైగా భ‌వనాల నిర్మాణాలు జ‌రుగుతున్నందున అగ్ని ప్ర‌మాదాలను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త‌ను స‌మ‌కూర్చుకోవాలి. ✅న‌గ‌రంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. ✅కోర్ అర్బ‌న్ ఏరియా ప‌రిధిలో ఆర్ అండ్ బీ, ఇత‌ర విభాగాల ప‌రిధిలోని రోడ్ల‌న్నింటిని మున్సిపల్ శాఖ ప‌రిధిలోకి తీసుకురావాలి. ✅న‌గ‌రంలో వివిధ ప్ర‌దేశాల్లో ర‌ద్దీ త‌గ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల న‌మూనాల‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి గారు ప‌లు సూచ‌న‌లు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గ‌ల క‌ట్ట‌డాలను ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని, వాటిని ప‌ర్యాట‌క స్థ‌లాలుగా మార్చాల‌ని చెప్పారు. ✅భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయాలి. అక్క‌డ అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాల భ‌వ‌నాల ప‌నులు వేగ‌వంతం చేయాలి. ✅న‌గ‌రంలోని పెద్ద చెరువులు, కుంట‌ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. హైడ్రా ప‌రిర‌క్షించిన చెరువుల చుట్టూ క‌ట్ట‌లు క‌ట్టి వ‌దిలి వేయ‌కుండా వాటి ర‌క్ష‌ణ‌తో పాటు సుంద‌రీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. ✅స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు Vem Narender Reddy గారు, Office of Chief Secretary, Telangana Govt. కె. రామ‌కృష్ణారావు గారితో పాటు ఉన్నతాధికారులు, హైడ్రా కమిషనర్, ఎంఆర్డీసీఎల్ ఎండీ, మూడు కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు. #CURE #GHMC #MunicipalAdministration #Hyderabad #Hydraa

Telangana CMO

35,338 Aufrufe • vor 3 Monaten

TelanganaCMO's profile picture

ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు. ✅ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా హుస్సేన్ సాగర్‌ (ట్యాంక్ బండ్) లో పడిన ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడారు. అయితే, కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి గారు స్పందించారు. ✅శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివ కుటుంబం ముఖ్యమంత్రి గారిని కలిశారు. ✅ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్‌ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ✅సహృదయంతో స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబ సభ్యులు అన్నారు. #CMRevantReddy #TankbundShiva #HelpingHands

Telangana CMO

25,662 Aufrufe • vor 2 Monaten

TelanganaCMO's profile picture

ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ఒక సామాన్యుడిలా ట్యాంక్‌బండ్ వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. 🛕ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్‌బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి గారు అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 🛕గణపతి బొప్పా... మోరియా.. అంటూ పెద్ద ఎత్తున భక్తుల నినాదాలు మారుమోగుతున్న వేళ.. ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి గారు భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు. 🛕అదే క్రమంలో క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఉదయం నుంచే శోభాయాత్ర ప్రారంభమై ఒక్కొక్కటిగా గణపతులు ట్యాంక్‌బండ్ తరులుతుండగా, సాయంత్రానికి మహా గణపతి శోభాయాత్ర ఊపందుకుంది. ఆ సమయంలో ఒక సాధారణ వ్యక్తిలా ముఖ్యమంత్రి గారు ఆ మహా జనంలో కలిసిపోయి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో కరచాలనం చేస్తూ ముందుకు నడిచారు. 🛕హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్) లో నిరాటంకంగా సాగుతున్న నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అదే స్ఫూర్తితో పని చేయాలని చెప్పారు. #GaneshChaturthi2025 #Tankbund #GaneshImmersionHyderabad

Telangana CMO

68,683 Aufrufe • vor 9 Monaten

TelanganaCMO's profile picture

వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి విజ్ఞప్తి చేశారు. ✅వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో గ్రోత్ ఇంజన్లుగా ఉన్న 6 ప్రధాన మహానగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయం (#PMO) లో ప్రత్యేకంగా సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ✅తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు, Governor of Telangana శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ✅ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు G Kishan Reddy గారు, Bandi Sanjay Kumar గారు, రాష్ట్ర మంత్రి Komatireddy Venkat Reddy గారు లోక్‌సభ సభ్యులు Konda Vishweshwar Reddy గారు పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, 2047 #ViksitBharat లక్ష్యాలను చేరుకోవడానికి తెలంగాణ కూడా తనవంతు భాగస్వామ్యం అందిస్తుందని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా #TelanganaRising2047 లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు వెళుతోందని వివరించారు. ✅“మీ సంకల్ప సాధనలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పయనించాలని తెలంగాణ ఆకాంక్షిస్తోంది. తెలంగాణకు సంబంధించి రీజినల్ రింగ్ రోడ్డు, #MetroRail, మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ – మచిలీపట్నం వ‌ర‌కు 12 వ‌రుస‌ల ర‌హ‌దారికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు మీ ముందు పెట్టాం” అని ప్రధానమంత్రి గారికి గుర్తుచేశారు. ✅“నా రాష్ట్రం, నా ప్రజల కోసం ప్రాజెక్టుల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. #Telangana రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు మీ ముందు పెట్టాం. రెండు గంటల సమయం కేటాయించి వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలించాలి” అని కోరారు. ✅"దేశ ఆర్థిక వృద్ధి మహానగరాల నుంచే జరుగుతుంది. మన దేశంలో ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ 6 మహాన‌గ‌రాలున్నాయి. ఈ దేశం ప్ర‌పంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే, యువ‌త‌కు ఉద్యోగాలు రావాలంటే ఈ మ‌హాన‌గ‌రాలను అభివృద్ధి చేయాలి. ✅దేశం విష‌యంలో మేం మీతో క‌లిసి ఉన్నాం. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల శక్తిగా ఎదగాలని నిర్ధేశించారు. ✅ఏ లక్ష్యాల కోసం మోదీ గారు కలగంటున్నారో అందుకు అనుగుణంగా తెలంగాణ నుంచి దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించాలని నిర్దేశించాం. తెలంగాణ రైజింగ్‌కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకుంది" అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ✅"కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి గారు, సంజ‌య్ గారు మంచి మిత్రులు. మీకు పెద్ద మనస్సు ఉంద‌ని చెబుతున్నారు. మోదీ గారూ మీకు పెద్ద మ‌న‌స్సు ఉంద‌ని తెలంగాణకు తెలుసు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప‌నులు, ప్రతిపాదనలు అన్నింటినీ ఆమోదిస్తారని ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు" అని అన్నారు. ✅ఈ కార్యక్రమంలో వరంగల్‌లో నెలకొల్పిన #PMMITRA పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్) ను ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారితో కలిసి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ✅అలాగే , జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌, మహబూబ్‌నగర్ నుంచి గూడబెల్లూరు జాతీయ రహదారి (నెంబర్ 167) కు, కాజిపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లో #IndianOil గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకితమిచ్చారు. #PMMITRAPark #PMModi

Telangana CMO

11,163 Aufrufe • vor 1 Monat

TelanganaCMO's profile picture

#GOAT, Global football icon and Argentina captain, Lionel Messi made a grand entry into Hyderabad, captivating sports fans during his much-anticipated visit. The historic Rajiv Gandhi International Stadium, Uppal, witnessed an electrifying atmosphere as fans from across the region gathered to welcome the football legend, marking a major highlight of the #TelanganaRising2047 celebrations. ✅An exhilarating celebrity friendly football match, held in the presence of thousands of enthusiastic spectators, added to the excitement. Hon’ble Chief Minister Shri Revanth Reddy’s Singareni RR9 team emerged victorious, defeating the Aparna All Stars team 4–0. The Chief Minister himself scored a goal, drawing loud cheers and delighting the audience. ✅The match brought immense energy and enthusiasm to the stadium as fans cheered passionately throughout. #Messi actively participated in team activities and warmly interacted with children on the field, creating memorable moments with young fan players. ✅After a gap of 14 years, Messi’s presence in India left sports lovers across #Hyderabad mesmerized. He was joined by renowned football stars Rodrigo De Paul (Argentina) and Luis Suárez (Uruguay). ✅The event was further graced by Leader of Opposition in the Lok Sabha Shri Rahul Gandhi and Chief Minister Shri Revanth Reddy, adding to the celebratory spirit. Messi also posed for photographs with the teams and young fan players. ✅The celebrations commenced with a vibrant musical concert and an elaborate laser show, featuring performances by Rahul Sipligunj and Mangli, setting an energetic tone ahead of the friendly football match. ✅Earlier in the day, a Meet & Greet programme was organised in honour of Lionel Messi at the historic Falaknuma Palace. Chief Minister Shri Revanth Reddy, along with Shri Rahul Gandhi, attended the event, where several distinguished personalities had the opportunity to interact with the football legend. ✅Upon arrival at Rajiv Gandhi International Airport, Messi and his delegation received a warm welcome from fans before proceeding directly to Falaknuma Palace. Following the Meet & Greet, they moved to the Rajiv Gandhi International Cricket Stadium, Uppal, for the friendly match. ✅As a mark of respect, Argentina team jersey No. 10 was presented to Shri Rahul Gandhi and Shri Revanth Reddy. In return, both leaders presented mementos to Messi, making the occasion truly memorable for sports enthusiasts and citizens alike. ✅“Welcome to Messi. Telangana is Rising. Come, join the rise,” said Hon’ble Chief Minister Shri A. Revanth Reddy, expressing his delight at hosting the football legend in Hyderabad and acknowledging the overwhelming affection shown by fans across the country. #LeonelMessi #MessiInIndia #MessiInHyderabad #RahulGandhi #GOATIndiaTour

Telangana CMO

41,911 Aufrufe • vor 5 Monaten

TelanganaCMO's profile picture

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు విడుదల చేశారు. ఈ ఎంట్రెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 2,07,190 విద్యార్థులు హాజరు కాగా, 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 81,198 విద్యార్థులు హాజరు కాగా, 71,309 (87.82%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు, నిర్వాహకులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి బాలకిష్టా రెడ్డి గారు, #TGEAPCET 2025 చైర్మన్ ప్రొ. టి. కిషన్ కుమార్ రెడ్డి గారు, కన్వీనర్ డా. బి. డీన్ కుమార్ గారితో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #TGHCE #JNTUH #TelanganaRising

Telangana CMO

75,954 Aufrufe • vor 1 Jahr

TelanganaCMO's profile picture

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి గారు అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ✅అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ముఖ్యమంత్రి గారు ఆదివారం ఆకస్మిక సందర్శించి పరిశీలించారు. బుద్ధనగర్‌లో వరద నీటి డ్రెయిన్ సిస్టమ్‌ను పరిశీలించి అక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు. ✅బాల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించిన ముఖ్యమంత్రి గారు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ✅ఆ కాలనీకి పక్కనే గంగూబాయి బస్తీకుంటను సందర్శించి ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేశారు. ✅ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు సందర్భాల్లో వరద నీరు నిలిచిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ✅అమీర్ పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి గారు వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రి గారికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి గారు బాలుడికి ధైర్యం చెప్పారు. ✅ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకోవలసిన చర్యలపై HYDRAA, Commissioner GHMC, సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. #HyderabadRains #Hydraa #GHMC #ReliefOperations #CMCityVisit

Telangana CMO

57,829 Aufrufe • vor 10 Monaten

TelanganaCMO's profile picture

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియా (#CURE) లో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు వివరించారు. కోర్-అర్బన్ రీజియన్‌ను మొత్తంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ❇️నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ #ICCC లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. ❇️“రాష్ట్రం మొత్తం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం. హైదరాబాద్ నగర పరిపాలన పట్టాలెక్కించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రధానంగా నగరంలో చెత్త నిర్వహణ అత్యంత సంక్లిష్టమైన సమస్య. ఈ సమస్యపై జోనల్ కమిషనర్లు తమ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ❇️చెత్త నిర్వహణతో పాటు జోన్ల వారీగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదే. జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిందే. నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దశల వారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి. ❇️చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ❇️నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు. అలాగే రోడ్లపై గుంతలు కనిపించొద్దు. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ❇️ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వీలయినంత తొందరగా స్పందించాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టాలి. ❇️కోర్-అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని నిర్ణయించాం. నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నాం. ❇️ప్రజలకు ముఖ్యంగా జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరక్కుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ఆన్‌లైన్ సేవల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి. ❇️కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లతో అనుసంధానం ఉండేలా కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి. ❇️HYDRAA, Commissioner GHMC, K Ashok Reddy, IAS వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలి. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. కోర్ అర్బన్ ఏరియాలో ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు. అందరూ కలిసి పనిచేస్తేనే నగర భవిష్యత్తు బాగుంటుంది..” అని దిశానిర్దేశం చేశారు. ❇️ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు Vem Narender Reddy గారు, Office of Chief Secretary, Telangana Govt. కె. రామకృష్ణ రావు గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #GHMC #Hyderabad #NetZeroCity #UrbanDevelopment

Telangana CMO

34,398 Aufrufe • vor 5 Monaten