
Yash
@YashTDP_ • 14,239 subscribers
Proud Indian | Entrepreneur | Political Activist
Shorts
Videos

మేము ఒక్కరిమే అనడం లేదు YS Jagan Mohan Reddy ప్రజలు కూడా అంటున్నారు 😌
Yash159,036 görüntüleme • 1 ay önce

"హైదరాబాద్ నుండి చికాగోకు... మధుర జ్ఞాపకాలను మోసుకుని బయలుదేరింది ఒక సాధారణ తెలుగు కుటుంబం". క్యాథే పసిఫిక్ విమానంలో ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ హాంగ్కాంగ్ గడ్డ మీద కాలు పెట్టిన మరుక్షణం, వారి గుండెలు ఆగిపోయేంత పని జరిగింది. నలుగురి పాస్పోర్టులు ఉన్న బ్యాగ్ మాయం!. ఒక్క క్షణంలో ఆనందం భయంగా మారింది. తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన, ఇద్దరు చిన్నారుల కళ్ళల్లో అయోమయం. ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పారు — తదుపరి విమానం ఎక్కడానికి వీల్లేదు, తిరిగి బయటకు వెళ్లడానికీ అనుమతి లేదు. మరో దేశం, ఒక గుర్తింపు లేని అనిశ్చిత స్థితిలో వారు ఇరుక్కుపోయారు. అపరిచిత దేశం. తెలియని భాష. ఆసరా లేని రాత్రులు. ఎయిర్పోర్ట్ కుర్చీలే మంచాలుగా, ప్రకటనల శబ్దాలే జోలపాటలుగా ఆ కుటుంబం మూడు రోజులు గడిపింది. అలసట, భయం — అన్నీ కలగలిసిన ఆ క్షణాల్లో వారికి ఒక్కటే ప్రశ్న: "మా గొంతు ఎవరికైనా వినిపిస్తుందా?" నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి తన చివరి ప్రయత్నంగా ఫోన్ తీసుకుంది. వణుకుతున్న చేతులతో ఆపదలో స్పందించే ఆయనకు ట్యాగ్ చేస్తూ సాయం కోసం ఒక ట్వీట్ పంపింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు — ఆ ఒక్క ట్వీట్ ఒక పెద్ద యంత్రాంగాన్ని కదిలిస్తుందని. ఆమె నమ్మకం వమ్ముకాలేదు. నిమిషాల వ్యవధిలోనే స్పందన వచ్చింది. ఆయన వెంటనే విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రికి చేరవేశారు. అక్కడి నుండి కేంద్ర విదేశాంగ శాఖ కదం తొక్కింది, హాంగ్కాంగ్లోని భారత రాయబార కార్యాలయానికి తక్షణ ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడ నుండి కథ మలుపు తిరిగింది. ఆ కుటుంబాన్ని ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకురావడానికి అనుమతి సాధించారు. ఆపై అత్యవసర ప్రాతిపదికన కొత్త పాస్పోర్టులు జారీ చేసి, వారి ప్రయాణానికి తిరిగి మార్గం సుగమం చేశారు. మూడు రోజుల ఆందోళన తర్వాత, ఆఖరికి ఆ కుటుంబం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఆ తల్లి మాటల్లోనే చెప్పాలంటే: "ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించిన తీరు అభినందనీయం. దీనివల్ల ప్రభుత్వాల పట్ల మా నమ్మకం మరింత పెరిగింది." ఈ కథలో అందరి హృదయాలను తాకిన విషయం మాత్రం వేరే. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఏమీ తెలియని అమాయకత్వంతో చిరునవ్వుతో అన్న మాట — "థాంక్యూ ఇండియన్ గవర్నమెంట్!" సాంకేతికత అందించిన సోషల్ మీడియా వేదిక ఒక్కటే సరిపోదు, దానికి స్పందించే నాయకుల చిత్తశుద్ధి, దౌత్య వ్యవస్థ వేగం తోడైనప్పుడే ఇలాంటి కథలు సుఖాంతమవుతాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా కదిలితే, ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతి భారతీయుడికీ మాతృభూమి అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
Yash44,623 görüntüleme • 25 gün önce

ఇలాంటి నాయకులే కదా ప్రజలకు కావాల్సింది. పల్లా శ్రీనివాస్ గారి నియోజకవర్గానికి చెందిన ఒక డాన్స్ మాస్టర్కు ప్రమాదం జరిగిందని ఓ స్థానిక నాయకుడు ఫోన్ చేసి చెప్పగా, “ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ చేయించండి. డబ్బులు నేను సమకూరుస్తాను” అని చెప్పే నాయకులు చాలా అరుదుగా ఉంటారు..!! ఇలాంటి నాయకులను మనం గౌరవిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే ప్రజలు చల్లగా, సంతోషంగా ఉంటారు. హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే Palla Srinivasa Rao గారు 👏
Yash87,605 görüntüleme • 2 ay önce

అది పార్టీనా లేక రాజమండ్రి సెంట్రల్ జైలా అన్న ? 😂😂 YSR Congress Party YS Jagan Mohan Reddy
Yash16,119 görüntüleme • 10 gün önce

2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన గుండాలలో ప్రముఖుడు పానుగంటి చైతన్య. నేడు అమరావతి రైతులపై దాడి చేసిన వైసీపీ గుండాల బ్యాచ్లో కూడా పానుగంటి చైతన్య ఉన్నాడు. గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ.. YSR Congress Party YS Jagan Mohan Reddy
Yash45,089 görüntüleme • 1 ay önce

నెల్లూరులో లైవ్ ఆపేసిన వీడియో ఇదే!! "హంద్రీ-నీవా గురించి కనీస అవగాహన కూడా మన వైకాపాకు లేదు. మొదట మనం హంద్రీ-నీవా మీద క్లారిటీ తెచ్చుకోవాలి.ప్రస్తుతం మనం డిఫెన్స్ లో ఉన్నాం. కూటమి ప్రభుత్వమే రాయలసీమపై నిజంగా దృష్టి పెట్టింది. బాలక్రిష్ణ హిందూపురానికి మంత్రి రావడం నుండి, ప్రస్తుత ప్రభుత్వం దాదాపు 3000 కోట్ల రూపాయలను ప్రాజెక్టుల అభివృద్ధికి ఖర్చు చేస్తోంది. మనం పైసా ఖర్చు చేయలేదు, దీని మీద మనం దృష్టి పెట్టాలి" అని విశ్వేశ్వర రెడ్డి చెబుతుంటే, పక్కన ఐదేళ్లపాటు రోజూ గుడ్ మార్నింగ్ వీడియోలతో స్కిట్లు వేసి, ఇప్పుడు తనకు గుడ్మార్నింగ్ చెప్పే వారు లేక మొహం వాచిన కేతిరెడ్డి మొహంలోని హావభావాలు గమనించండి. ఇక సజ్జల మొహంలో నెత్తురు చుక్కలేదు. సాక్షి క్రూ కెమెరా మ్యాన్ ఆ ఎర్రబారిన మొహాన్ని చూసి టక్కున లైవ్ కట్ చేశారు. సాక్షిలో కూడా విశ్వేశ్వర రెడ్డి మాటలను తొలగించేశారు. కోపంతో వైకాపా సోషల్ మీడియాలో విశ్వేశ్వర రెడ్డి కనిపించే ఒక్క ఫోటోను కూడా పెట్టలేదు. ఏమిటో ఈ మధ్య తరచూ నెల్లూరులో వైకాపా అభాసుపాలవుతోంది. గతంలో జగన్ నెల్లూరు పర్యటనలో జనం రాలేదని, ఏకంగా చిత్తూరులోని బంగారుపాళ్యం గ్రాఫిక్స్ మిక్సింగ్ చేసి ప్రసారం చేసి అడ్డంగా దొరికిపోయారు. వాస్తవాలు మాట్లాడుతున్న సొంత నేత లైవ్ కట్ చేసిన వీడియో ఇలా బయటకు వచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల గురించి రాయలసీమలో ఇలాటివి పెడితే ఎవరూ రాక, డ్రైవర్లు కూడా కునికిపాట్లు పడుతూ కనిపించిన వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అందుకని వెరైటీగా నెల్లూరులో రాయలసీమకు జగన్ చేసిన ఉత్తిపోతల మీటింగ్ పెడితే, విశ్వేశ్వర రెడ్డి తలంటి, నిజాల ఎత్తిపోతలతో నిష్టూరపడ్డాడు. మింగుడు పడని వైకాపా మారదని, మార్చలేమని వైకాపా నేతలకు కూడా తెలుసు. YSR Congress Party
Yash27,435 görüntüleme • 21 gün önce

అందరికీ నకిలీ డాటర్ మహామేత జయంతి శుభాకాంక్షలు🇸🇱 😂 Wait for the end 🤣 YSR Congress Party
Yash31,710 görüntüleme • 27 gün önce

I personally know Sudhiksha Konanki’s father, Subbarayudu Konanki, for many years. He is a remarkable individual, a perfect family man, and a wonderful father to his three children. Sudhiksha is an exceptional student and a loving daughter. It is deeply regrettable that she went missing while on vacation. The pain and uncertainty caused to her parents by her disappearance are immense. I strongly pray for her safe return and the restoration of joy to her parents’ lives. Let us all keep her family in our thoughts and provide them with the space they need to heal and cope with this tragedy. Her absence is still difficult for me to come to terms with. Furthermore, I believe this incident should serve as a cautionary tale for other parents and their children. I plan to initiate a petition to the loudoun county, requesting that the school add a chapter or topic to the curriculum to educate middle and high school students on how to safely interact with strangers in their daily lives. #SudhikshaKonanki
Yash376,202 görüntüleme • 1 yıl önce

బాడీ లాంగ్వేజ్ టాక్: లోకేష్ ‘నోట్స్’ పాలిటిక్స్.. జగన్ ‘అయోమయ నవ్వుల’ స్టైల్! సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు నేతలను నిన్న, ఇవ్వాళ కలవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఇటు అధికార పక్షంలో యాక్టివ్గా ఉన్న ఐటీ మంత్రి నారా లోకేష్ భేటీకి, అటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సోషల్ మీడియా జనాలు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా వీడియో లోని విజువల్స్ చూస్తే ఇద్దరి లీడర్షిప్ శైలి మరియు బాడీ లాంగ్వేజ్లోని తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో లోకేష్ బాడీ లాంగ్వేజ్ ఒక కంప్లీట్ ప్రొఫెషనల్, 'సీఈవో తరహా' ప్రో-యాక్టివ్ లీడర్ను తలపించింది. ఒడిలో నోట్ప్యాడ్ పెట్టుకుని, పెన్నుతో పాయింట్స్ రాసుకుంటూ లోకేష్ కనిపించిన తీరు ఆయన సబ్జెక్ట్ పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో చూపించింది. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి కంపెనీల పురోగతిని, ఏపీ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ఆయన చేతుల కదలికలతో ఎక్స్ప్రెసివ్గా వివరించారు. ప్రతినిధులకు శాలువాలు కప్పి, ఏపీ బ్రాండ్ గిఫ్ట్స్ ఇస్తూ ఒక పక్కా మోడ్రన్ మేనేజర్ లా వ్యవహరించారు. ఇక తాడేపల్లిలో జరిగిన జగన్ భేటీ విజువల్స్ చూస్తే.. నెటిజన్లకు అది ఒక రేంజ్ ‘కామెడీ’లా అనిపించక మానదు. లోకేష్ లాగా ఎలాంటి నోట్స్, డేటా షీట్స్ లేకుండా.. సోఫాలో చేతులు కట్టుకుని పిసుక్కుంటూ కూర్చున్న జగన్ బాడీ లాంగ్వేజ్ ‘కేవలం నవ్వుతూ ఉంటే చాలు.. షూట్ అంతా అయిపోతుంది’ అన్నట్లుగా సాగింది. విదేశీ ప్రతినిధులను వారి ఊరిలో వెళ్ళి కలవడానికి కూడా నాంపల్లి సీబీఐ కోర్టు పర్మిషన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఒకవైపు ఉంటే.. ఈ నార్మల్ భేటీకి కూడా బ్యాక్గ్రౌండ్ లో బోయపాటి రేంజ్ ఎలివేషన్ మ్యూజిక్ వేసి వైస్సార్సీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వదిలిన వీడియో ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో జగన్ నవ్వుతున్న విధానం, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. "ఏదో నా పిచ్చిగుంట్ల ఫ్యాన్స్ కోసం నేను ఈ గెటప్ మెయింటైన్ చేస్తున్నా.. నన్ను ఒగ్గేయండి బాబోయ్" అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఒకరు యూత్, జాబ్స్, డేటా, డెవలప్మెంట్, అకౌంటబిలిటీ అంటూ దూసుకుపోతుంటే.. మరొకరు కేసుల వలయంలో ఉంటూ, కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారనేది ఈ రెండు భేటీల బాడీ లాంగ్వేజ్ చెప్తున్న పచ్చి నిజం! Lokesh Nara
Yash34,572 görüntüleme • 1 ay önce

ఐఐటీ సీటు వచ్చినా వదులుకునే రేంజ్.. దుబాయ్లో సీటు వచ్చినా వెళ్లేంత క్రేజ్.. అదే బిట్స్ పిలానీ! భారతదేశం గర్వపడే విద్యాసంస్థ — ఇప్పుడు మన గడ్డపై! జొమాటో పుట్టింది ఇక్కడే.. స్విగ్గీ పుట్టింది ఇక్కడే.. బిగ్బాస్కెట్, గ్రో.. అన్నీ ఇక్కడే! ఆ 'ఇక్కడే' — ఇప్పుడు మన అమరావతి అవుతోంది! బిట్స్ అంటే ఏమిటో తెలుసా? 100% మెరిట్కే ప్రవేశాలు - కోటాలు లేవు 0% అటెండెన్స్ — స్వేచ్ఛగా నేర్చుకో ₹20–30 లక్షలు — సగటు జీతమే! గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ — క్యాంపస్కే వస్తాయి 7–8 నెలలు ఇండస్ట్రీలో పని — చదువులో భాగంగానే! ఇది కాలేజీ కాదు — కోటీశ్వరులను తయారుచేసే కర్మాగారం! అమరావతి క్యాంపస్ డిజైన్లు చూస్తే కళ్ళు తిరుగుతాయి! వెంకటాపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్ (E3) 70 ఎకరాల విశాలమైన క్యాంపస్ 10,000 మంది విద్యార్థుల సామర్థ్యం 36.36 లక్షల చ.అ. నిర్మాణం — 3 దశల్లో మొదటి దశకే ₹1,250 కోట్లు మొత్తం ₹4,500 కోట్ల పెట్టుబడి 2027 నుండే అడ్మిషన్లు అమరావతికి అర్థం మారిపోతోంది మొన్న — రాజధాని నగరం నిన్న — క్వాంటం వ్యాలీ ఈరోజు — బిట్స్ పిలానీ క్యాంపస్ రేపు? భారతదేశపు 'స్టార్టప్ కేపిటల్'! అమరావతి కట్టుకుంటున్నది రాళ్ళతో మాత్రమే కాదు — భవిష్యత్తును నిర్మించే మేధావులతో! N Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party
Yash82,100 görüntüleme • 3 ay önce