
Yash
@YashTDP_ • 14,395 subscribers
Proud Indian | Entrepreneur | Political Activist
Shorts
Videos

🚨 మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద ‘భావోద్వేగానికి’ గురైన చంద్రబాబు..! 🚨 జలహారతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు 'సాష్టాంగ ప్రణామం' చేసిన సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు సాష్టాంగ ప్రణామం చేయడంతో పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేసిన రైతులు, మహిళలు.. N Chandrababu Naidu #CBNfulfillsVeligondaDream
Yash48,538 views • 3 days ago

మేము ఒక్కరిమే అనడం లేదు YS Jagan Mohan Reddy ప్రజలు కూడా అంటున్నారు 😌
Yash159,159 views • 2 months ago

లండన్లో పీజీ చేసి వచ్చి, ఇడుపులపాయ సమాధి దగ్గర వైఎస్సార్కు మాట ఇచ్చి, వారు చెప్పినట్లే చేసి... చివరికి బోరుగడ్డ బతుకు ఇలా తెల్లారింది. కనీసం జగన్ తాడేపల్లి ప్యాలెస్ గేటు లోపలికి కూడా రానివ్వలేదు సజ్జల. ప్యాలెస్ బయట "ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మరిచిపోను" అని ఉన్న జగన్ ఫ్లెక్సీ ముందే "మీకు కూడా నా గతే పడుతుంది" అని నిరసన తెలుపుతూ... సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బోరుగడ్డ బోరుమంటున్నాడు. "నాపై రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా... సజ్జల, జగన్ పీఏ శ్రీహరి తమ అనుచరులతో నన్ను రౌడీషీటర్ అని ప్రచారం చేయిస్తున్నారు. నన్ను నిందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేస్తున్నాడు. అధికారంలో ఉండగా సజ్జల ఈ పని చేసి ఉంటే ప్రజలు హర్షించేవారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయేసరికి ఇలా కరివేపాకులా ప్యాలెస్ గేటు బయటకు గెంటేయడం ప్రతి వైకాపా కార్యకర్తకూ, నాయకుడికీ ఒక సందేశం. "రేపు మీ బతుకు కూడా ఆ ఫ్లెక్స్ ముందే రోడ్డు మీదకు వస్తుంది" అని. YSR Congress Party
Yash57,007 views • 1 month ago

సీదిరి అప్పలరాజు కొడుకు అరెస్ట్.. #ysjagan #SeediriAppalaRaju #trending #ycptrolls #AndhraPradesh
Yash54,883 views • 1 month ago

ఇలాంటి నాయకులే కదా ప్రజలకు కావాల్సింది. పల్లా శ్రీనివాస్ గారి నియోజకవర్గానికి చెందిన ఒక డాన్స్ మాస్టర్కు ప్రమాదం జరిగిందని ఓ స్థానిక నాయకుడు ఫోన్ చేసి చెప్పగా, “ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ చేయించండి. డబ్బులు నేను సమకూరుస్తాను” అని చెప్పే నాయకులు చాలా అరుదుగా ఉంటారు..!! ఇలాంటి నాయకులను మనం గౌరవిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే ప్రజలు చల్లగా, సంతోషంగా ఉంటారు. హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే Palla Srinivasa Rao గారు 👏
Yash87,931 views • 3 months ago

I personally know Sudhiksha Konanki’s father, Subbarayudu Konanki, for many years. He is a remarkable individual, a perfect family man, and a wonderful father to his three children. Sudhiksha is an exceptional student and a loving daughter. It is deeply regrettable that she went missing while on vacation. The pain and uncertainty caused to her parents by her disappearance are immense. I strongly pray for her safe return and the restoration of joy to her parents’ lives. Let us all keep her family in our thoughts and provide them with the space they need to heal and cope with this tragedy. Her absence is still difficult for me to come to terms with. Furthermore, I believe this incident should serve as a cautionary tale for other parents and their children. I plan to initiate a petition to the loudoun county, requesting that the school add a chapter or topic to the curriculum to educate middle and high school students on how to safely interact with strangers in their daily lives. #SudhikshaKonanki
Yash376,205 views • 1 year ago

"హైదరాబాద్ నుండి చికాగోకు... మధుర జ్ఞాపకాలను మోసుకుని బయలుదేరింది ఒక సాధారణ తెలుగు కుటుంబం". క్యాథే పసిఫిక్ విమానంలో ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ హాంగ్కాంగ్ గడ్డ మీద కాలు పెట్టిన మరుక్షణం, వారి గుండెలు ఆగిపోయేంత పని జరిగింది. నలుగురి పాస్పోర్టులు ఉన్న బ్యాగ్ మాయం!. ఒక్క క్షణంలో ఆనందం భయంగా మారింది. తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన, ఇద్దరు చిన్నారుల కళ్ళల్లో అయోమయం. ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పారు — తదుపరి విమానం ఎక్కడానికి వీల్లేదు, తిరిగి బయటకు వెళ్లడానికీ అనుమతి లేదు. మరో దేశం, ఒక గుర్తింపు లేని అనిశ్చిత స్థితిలో వారు ఇరుక్కుపోయారు. అపరిచిత దేశం. తెలియని భాష. ఆసరా లేని రాత్రులు. ఎయిర్పోర్ట్ కుర్చీలే మంచాలుగా, ప్రకటనల శబ్దాలే జోలపాటలుగా ఆ కుటుంబం మూడు రోజులు గడిపింది. అలసట, భయం — అన్నీ కలగలిసిన ఆ క్షణాల్లో వారికి ఒక్కటే ప్రశ్న: "మా గొంతు ఎవరికైనా వినిపిస్తుందా?" నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి తన చివరి ప్రయత్నంగా ఫోన్ తీసుకుంది. వణుకుతున్న చేతులతో ఆపదలో స్పందించే ఆయనకు ట్యాగ్ చేస్తూ సాయం కోసం ఒక ట్వీట్ పంపింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు — ఆ ఒక్క ట్వీట్ ఒక పెద్ద యంత్రాంగాన్ని కదిలిస్తుందని. ఆమె నమ్మకం వమ్ముకాలేదు. నిమిషాల వ్యవధిలోనే స్పందన వచ్చింది. ఆయన వెంటనే విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రికి చేరవేశారు. అక్కడి నుండి కేంద్ర విదేశాంగ శాఖ కదం తొక్కింది, హాంగ్కాంగ్లోని భారత రాయబార కార్యాలయానికి తక్షణ ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడ నుండి కథ మలుపు తిరిగింది. ఆ కుటుంబాన్ని ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకురావడానికి అనుమతి సాధించారు. ఆపై అత్యవసర ప్రాతిపదికన కొత్త పాస్పోర్టులు జారీ చేసి, వారి ప్రయాణానికి తిరిగి మార్గం సుగమం చేశారు. మూడు రోజుల ఆందోళన తర్వాత, ఆఖరికి ఆ కుటుంబం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఆ తల్లి మాటల్లోనే చెప్పాలంటే: "ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించిన తీరు అభినందనీయం. దీనివల్ల ప్రభుత్వాల పట్ల మా నమ్మకం మరింత పెరిగింది." ఈ కథలో అందరి హృదయాలను తాకిన విషయం మాత్రం వేరే. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఏమీ తెలియని అమాయకత్వంతో చిరునవ్వుతో అన్న మాట — "థాంక్యూ ఇండియన్ గవర్నమెంట్!" సాంకేతికత అందించిన సోషల్ మీడియా వేదిక ఒక్కటే సరిపోదు, దానికి స్పందించే నాయకుల చిత్తశుద్ధి, దౌత్య వ్యవస్థ వేగం తోడైనప్పుడే ఇలాంటి కథలు సుఖాంతమవుతాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా కదిలితే, ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతి భారతీయుడికీ మాతృభూమి అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
Yash44,664 views • 1 month ago

చెన్నారెడ్డి తండ్రి హృదయమే గెలిచింది! రాజకీయ చదరంగంలో తండ్రి పేగుబంధం! కొడుకు దూరమైన తీరని లోటు ఒక్క ఎత్తయితే... ఆ బిడ్డ మరణం వెనుక ఉన్న చేదు నిజాలను గుండెల్లో దాచుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు దృశ్యాలు (వీడియోలు) కేవలం రాజకీయ రచ్చ మాత్రమే కాదు... ఒక కన్నతండ్రి పడుతున్న అగ్నిపరీక్షకు నిలువెత్తు సాక్ష్యాలు. మొదటి సందర్భంలో(రెండో భాగంలో), అధినేతతో ఫోన్ సంభాషణ సాగుతున్న వేళ, ఆ తండ్రి గుండెల్లోంచి వచ్చిన ప్రతీ మాటా నిజాయితీకి ప్రతీకగా నిలిచింది. "ఎవరు చేశారు?" అనే ప్రశ్నకు—ఏమాత్రం తటపటాయించకుండా, ఎదుటి రాజకీయ ప్రత్యర్థులపై నిందలు వేసేందుకు అధినేత జగన్ అందిస్తున్న అవకాశాన్ని కూడా తిరస్కరిస్తూ—"ఇది మనోళ్లే చేశారు... బయటివాళ్లు కారు, వేరే పార్టీ వాళ్లు అంతకంటే కాదు" అంటూ నిజాన్ని నిర్భయంగా చెప్పారు. పెంచుకున్న కొడుకు కళ్లముందే దారుణ హత్యకు గురైతే, ఆ కోపంలో ఎదుటి పార్టీపైకి తోసేయడం చాలా సులభం. కానీ, ఆ తండ్రి రాజకీయ లాభనష్టాల కంటే "నిజం" వైపే నిలబడ్డారు. సొంత మనుషులే వెన్నుపోటు పొడిచారన్న చేదు విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పారు. కానీ, రాజకీయ సమీకరణాలు మరియు ఒత్తిళ్ల నడుమ ఆ తండ్రి మళ్లీ మీడియా ముందుకు (వీడియో మొదట్లో) రావాల్సి వచ్చింది. మునుపటి వ్యాఖ్యలను సర్దుబాటు చేస్తూ మాట్లాడిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తుంది. మునుపటి సంభాషణను వెనక్కి తీసుకునే క్రమంలో కూడా ఆ తండ్రి ఎక్కడా హుందాతనాన్ని కోల్పోలేదు. పార్టీ శ్రేణులు లేదా నాయకత్వం కోరుకున్నట్లుగా—సొంత మనుషుల తప్పును కప్పిపుచ్చేందుకు ఎదుటి రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లే ప్రయత్నం మాత్రం ఆయన చేయలేదు. "హాస్పిటల్లో ఆవేశంలో, బాధలో నాలుగు మాటలు తప్పుగా అని ఉండవచ్చు" అని మాత్రమే చెప్పారు కానీ, ప్రత్యర్థి పార్టీల ప్రమేయం ఉందంటూ అసత్యపు ఆరోపణలు చేయడానికి ఆయన మనుసు అంగీకరించలేదు. తండ్రి హృదయమే గెలిచింది! వైకాపా నాయకులకు ఈ మర్డర్ కేసు కేవలం రాజకీయ కోణంలో సెటిల్మెంట్ కావచ్చేమో... కానీ ఆ తండ్రికి అది ఆరిపోయిన తన ఇంటి దీపం! పార్టీనే నమ్ముకున్న ఆ ఉసురు ఊరికేపోదు. సొంత పార్టీ ప్రయోజనాల కోసం నిజాలను మార్చాల్సిన ఒత్తిడి వచ్చినా... వేరే పార్టీ వారిని ఇరికించకుండా తన నిబద్ధతను చాటుకున్న ఆ తండ్రి సంస్కారం ముందర రాజకీయాలు ఓడిపోయాయి. బిడ్డను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ అబద్ధాన్ని ఆయుధంగా మార్చుకోని ఆ తండ్రి కన్నీటికి సమాజం శిరస్సు వంచి నమస్కరిస్తోంది!
Yash21,606 views • 23 days ago

రేయ్ చిన్నా దేవాన్ష ని ఒకసారి ఇటు పిలుపు అని అడిగిన బ్రాహ్మణి,మా వాడిని సంవత్సరానికి ఒకసారి తీసుకొస్తారు,వాడితో సాయంత్రం వరకు మేము ఆడుకోవాలి తర్వాత వస్తాడులే అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన బుడ్డోడు😍😍ఆ సమాధానానం విని చిరునవ్వులు చిందిస్తున్న నారా లోకేష్ దంపతులు 🥰🥰😍😍....
Yash155,541 views • 7 months ago

ఐఐటీ సీటు వచ్చినా వదులుకునే రేంజ్.. దుబాయ్లో సీటు వచ్చినా వెళ్లేంత క్రేజ్.. అదే బిట్స్ పిలానీ! భారతదేశం గర్వపడే విద్యాసంస్థ — ఇప్పుడు మన గడ్డపై! జొమాటో పుట్టింది ఇక్కడే.. స్విగ్గీ పుట్టింది ఇక్కడే.. బిగ్బాస్కెట్, గ్రో.. అన్నీ ఇక్కడే! ఆ 'ఇక్కడే' — ఇప్పుడు మన అమరావతి అవుతోంది! బిట్స్ అంటే ఏమిటో తెలుసా? 100% మెరిట్కే ప్రవేశాలు - కోటాలు లేవు 0% అటెండెన్స్ — స్వేచ్ఛగా నేర్చుకో ₹20–30 లక్షలు — సగటు జీతమే! గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ — క్యాంపస్కే వస్తాయి 7–8 నెలలు ఇండస్ట్రీలో పని — చదువులో భాగంగానే! ఇది కాలేజీ కాదు — కోటీశ్వరులను తయారుచేసే కర్మాగారం! అమరావతి క్యాంపస్ డిజైన్లు చూస్తే కళ్ళు తిరుగుతాయి! వెంకటాపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్ (E3) 70 ఎకరాల విశాలమైన క్యాంపస్ 10,000 మంది విద్యార్థుల సామర్థ్యం 36.36 లక్షల చ.అ. నిర్మాణం — 3 దశల్లో మొదటి దశకే ₹1,250 కోట్లు మొత్తం ₹4,500 కోట్ల పెట్టుబడి 2027 నుండే అడ్మిషన్లు అమరావతికి అర్థం మారిపోతోంది మొన్న — రాజధాని నగరం నిన్న — క్వాంటం వ్యాలీ ఈరోజు — బిట్స్ పిలానీ క్యాంపస్ రేపు? భారతదేశపు 'స్టార్టప్ కేపిటల్'! అమరావతి కట్టుకుంటున్నది రాళ్ళతో మాత్రమే కాదు — భవిష్యత్తును నిర్మించే మేధావులతో! N Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party
Yash82,139 views • 4 months ago
