
BIG TV Breaking News
@bigtvtelugu • 16,683 subscribers
BIG TV Telugu | Bold New Avatar Voice of the People | Without Fear or Favour Asia's largest immersive news intelligence centre
Shorts
Videos

ప్రభుత్వ టీచర్ రిజైన్ రీల్స్తో పాపులరైన ఖమ్మం జిల్లాకు చెందిన టీచర్ భూక్యా గౌతమి ఉద్యోగానికి రిజైన్ చేశారు. ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ చేసినందుకు సస్పెండ్ చేశారని, ఆరునెలల తర్వాత పోస్టింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ DEO ఇబ్బందులకు గురిచేయడం వల్లనే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. #Khammam #BhukyaGowthami #TeacherResign #SocialMedia #TelanganaNews
BIG TV Breaking News210,148 Aufrufe • vor 6 Tagen

తిరుమల జాపాలి తీర్థం తిరుమల జాపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ట్యాప్లలో సడెన్గా తెల్లటి నీళ్లు రావడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది.ఇది స్వామివారి మహిమేనని భక్తులు నమ్ముతుండగా, టీటీడీ అధికారులు నీటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపి పరీక్షలు వేగవంతం చేశారు. #Tirumala #JapaliTeertham #TTD #AnjaneyaSwamy #Tirupati #BigtvBreakingNews
BIG TV Breaking News164,610 Aufrufe • vor 14 Tagen

భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపిన భార్య నిజామాబాద్ శివారులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త ప్రశాంత్కు మందు తాగించి, మొదట కిందకు తోసేసింది భార్య సంధ్య. అప్పటికీ చనిపోకపోవడంతో నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) లిక్విడ్ను ఎక్కించి మట్టుబెట్టింది. #Nizamabad #CrimeNews #MurderCase #BreakingNews
BIG TV Breaking News235,848 Aufrufe • vor 1 Monat

పోలీస్ స్టేషన్ ముందు దివ్వెల మాధురి ఆందోళన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు విచారించడంతో శ్రీకాకుళం కొత్తూరు పీఎస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దువ్వాడను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ దివ్వెల మాధురి అనుచరులతో కలిసి స్టేషన్ ముందు బైఠాయించారు. జిల్లాలో అక్రమాలు వదిలేసి, రెండేళ్ల క్రితం నాటి వ్యాఖ్యలపై ఇప్పుడు విచారణ ఏంటని ఆమె పోలీసులను నిలదీశారు. #DuvvadaSrinivas #DivvelaMadhuri #SrikakulamNews
BIG TV Breaking News242,994 Aufrufe • vor 1 Monat

రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకంటూ అడ్డుకుంటున్న పృథ్వీరాజ్ తెలంగాణ ప్రముఖులు గద్దర్, అందెశ్రీ విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం
BIG TV Breaking News1,224,436 Aufrufe • vor 8 Monaten

తాడేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. రైతుల పంటలు ధ్వంసం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలో సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూముల స్వాధీనం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా తమ పొలాల్లోని పంటలను సీఆర్డీఏ అధికారులు ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు, అధికారులను అడ్డుకున్న రైతులతో వాగ్వాదానికి దిగి వారిని బలవంతంగా లాక్కెళ్లారు. #Tadepalli #CRDA #FarmersProtest
BIG TV Breaking News126,233 Aufrufe • vor 29 Tagen

తిరుపతిలో 'మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ' మల్లారెడ్డికి తిరుపతి రేణిగుంట సమీపంలో పాత 'శ్రీ కాలేజీ' స్థలంలో ఏర్పాటు చేయనున్న "మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ"కి కేంద్రం అనుమతి పత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఒక తెలంగాణ బిడ్డగా ఏపీలో వర్సిటీ పెట్టడం గర్వంగా ఉందన్నారు. #MallaReddyUniversity #Tirupati #HigherEducation
BIG TV Breaking News98,019 Aufrufe • vor 29 Tagen

అమెరికా నుండి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ NEET పేపర్ లీక్, CBSE, CUET, SSC GD పరీక్షల అవకతవకలపై నిరసన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP డిమాండ్
BIG TV Breaking News176,425 Aufrufe • vor 2 Monaten

మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యల వీడియో లీక్ ఇబ్రహీంపట్నం కార్యాలయంలో వైసీపీ నాయకులతో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఒత్తిడి వల్లే నాపై మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన బావమరిది దోచుకోవడం తప్ప ఎవరూ బాగుపడలేదు. రేపు ఆయన ఐతవరం పారిపోతారు' అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. #JogiRamesh #MylavaramPolitics #AndhraPradesh
BIG TV Breaking News95,619 Aufrufe • vor 1 Monat

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్రేప్ 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం అడిఅణ్ణామలై నుంచి బలవంతంగా..అటవీప్రాంతానికి లాక్కెళ్లిన దుండగులు నగ్నవీడియోలు తీశాక బంగారం దోచుకెళ్లిన నిందితులు ధర్మపురి పోలీసులకు బాధితురాలు కంప్లయింట్ ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు వాసుదేవన్, ఆకాష్, అప్పు సహా 8మంది అరెస్ట్ మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు
BIG TV Breaking News164,361 Aufrufe • vor 2 Monaten

ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్ రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ బాధ్యతారహితంగా ప్రవర్తించారు. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయి భారీగా జామ్ అయ్యాయి. ప్రమాదకరమైన ఈ చర్యను స్థానికులు ప్రశ్నించగా... "నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు" అంటూ ఆ ఎస్ఐ ఎదురు దబాయించడం తీవ్ర దుమారం రేపుతోంది. #RangaReddy #PoliceHighhandedness #TrafficJam
BIG TV Breaking News69,137 Aufrufe • vor 28 Tagen

దేవుళ్లపై, మహిళలపై పూరీ జగన్నాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో మొగుళ్లు ఏం చేసినా పెళ్లాలు సర్దుకుపోవాలన్న పూరీ జగన్నాధ్ ఆఖరికి దేవుడిని పెళ్లి చేసుకున్నా అంతేనని వ్యాఖ్య భార్యను ఏడిపించే హక్కు భర్తకే ఉంటుందని వ్యాఖ్య ఒకవేళ భర్తను కాదని సాక్షాత్తు ఆ దేవుడినే.. పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది -పూరీ
BIG TV Breaking News172,872 Aufrufe • vor 2 Monaten

జగన్ మద్దతు కోరిన రావణ్ కొలీగ్ గగన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ని రావణ్ కొలీగ్ గగన కలిశారు. జగన్ లోపలికి వెళ్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గగనను ఆయనకు చూపించారు. రావణ్ కు మీ సపోర్ట్ కావాలని కోరారు మీకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. అవినాష్ మీకు టచ్లో ఉంటారు’ అని జగన్ భరోసా ఇచ్చారు. #YSJagan #GannavaramAirport #YSRCP
BIG TV Breaking News67,982 Aufrufe • vor 1 Monat

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. ఓ అభిమాని తల్లి ఆవేదన క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలోలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ 'దేవర' సినిమా చూసి చనిపోవాలని, తన చివరి కోరిక అదే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు అబ్బాయి చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తానంటూ గతంలో కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇప్పుడు అటు నుంచి ఎలాంటి స్పందన లేదంటున్న అభిమాని తల్లి సరస్వతి మరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి ఉండడంతో అవస్థలు పడుతున్న బాధిత కుటుంబం
BIG TV Breaking News899,887 Aufrufe • vor 1 Jahr

డీకే శివకుమార్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్ తిరుమలలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నిత్యహారతి దర్శనం కల్పించాలన్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్ డిమాండ్ను టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది మైసూర్ మహారాజుకు ఇచ్చే సాంప్రదాయ గౌరవమని, రాజకీయాల కోసం వాడొద్దని పేర్కొన్నారు. #Tirumala #TTD #DKShivakumar #BhanuPrakashReddy
BIG TV Breaking News48,986 Aufrufe • vor 27 Tagen