
Bolisetty Satyanarayana
@bolisetti_satya • 119,737 subscribers
Environment Conservationist & a Jansainik
Shorts
Videos

2029లో మళ్ళీ జగన్ వస్తారు.. లేదా మేమే వస్తాం అనుకుంటున్న వారి కోసం.. 2024 ఎన్నికల ఫలితాల రోజు ఉదయం ఆర్టీవీ వేదికగా రవిప్రకాష్ గారితో ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణను ఒక్కసారి గమనిస్తే, ఆయన చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలని నిరూపితమయ్యాయి. ప్రశాంత్ కిషోర్ ఆనాడు మాట్లాడుతూ వైసీపీ 151 సీట్ల నుండి 51 సీట్లకు పడిపోయే స్థితికి చేరుకుందని, వారి పరిస్థితి 'పునర్మూషికో భవ' (ఎక్కడి నుంచి మొదలయ్యారో అక్కడికే) అన్నట్లుగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆగ్రహం ఎంతలా ఉందంటే అది 51 కాదు, ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. 2019లో జగన్ కోసం, వైసీపీ కోసం షర్మిల గారు రాత్రి పగలు కష్టపడి ప్రచారం చేశారు. కానీ ఐదేళ్లు తిరగకముందే సొంత తల్లి, చెల్లెలే ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. గెలుపుకు తోడ్పడిన వారిని విస్మరించడం జగన్ గారి వ్యక్తిత్వ లోపమని పీకే చేసిన విమర్శ నేడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎవరి సహాయంతోనైనా ఎదిగినప్పుడు కనీసం కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేకపోవడం కన్నా మించిన మహాపాపం మరొకటి లేదని భగవద్గీత చెబుతోందని కేవలం రాజకీయ వ్యూహకర్తల పట్ల మాత్రమే కాదు, తన కుటుంబం, ఓటర్లు మరియు మద్దతుదారుల పట్ల కూడా కృతజ్ఞత లేకుండా వ్యవహరించినందుకే వైసీపీ ఈ భారీ మూల్యం చెల్లించుకుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఈ కృతజ్ఞత అనేది చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి కూడా వర్తిస్తుంది. 2024లో ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారితో పాటు జన సైన్యం పట్ల కృతజ్ఞతతో మెలగాలి, లేదంటే ఫలితం అనుభవించాల్సి వస్తుంది. వైసీపీ పతనం నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అక్రమ భూ కబ్జాలు, ఇసుక మాఫియాలు, మైనింగ్ మాఫియాలు, అక్రమ లేఅవుట్లు నడుస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2029లో వారికి కూడా గెలుపు కష్టమే అవుతుంది. జగన్ గారిలో ఇప్పటికైనా మార్పు వచ్చి, చిత్తశుద్ధితో చేసిన తప్పులు ఒప్పుకుని పశ్చాత్తాపపడితేనే మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యమే.. గుర్తుంచుకోండి.. మీకు అధికారం ఇచ్చింది ప్రజలే.. 2029ని శాసించేది కూడా ప్రజలే.. Pawan Kalyan N Chandrababu Naidu YS Jagan Mohan Reddy #APPolitics Prashant Kishor JanaSena Party Telugu Desam Party BJP #AndhraPradesh #NDAAlliance
Bolisetty Satyanarayana105,387 görüntüleme • 1 ay önce

అసెంబ్లీలో గౌరవ ఎంమ్మెల్యే బాలకృష్ణ గారు పద్మవిభూషణ్ చిరంజీవి గారిని చులకన చేసి మాట్లాడిన దానిపై చర్చకు లేదా నా అభిప్రాయం చాలా మంది మీడియా సోదరులు కోరారు.. కానీ ఈ సున్నితమైన అంశంపై కూటమిలో భాగస్వామి అయిన JanaSena Party లో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను పార్టీ ఆదేశం లేకుండా మాట్లాడడం భావ్యం కాదు అని మౌనంగా ఉన్నాను.. కానీ సినీ పరిశ్రమను ఆదుకున్న ఆపద్భాందవుడు ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారే అని లక్షల మంది సమక్షంలో తెలుగు సినిమాకి ప్రపంచ ఖ్యాతిని కీర్తిని ఆర్జించి పెట్టిన మహానుభావుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు శ్రీ రాజమౌళి గారు అన్నది మరో సారి తెలుగు ప్రజలకు ముఖ్యంగా గౌరవ ఎంమ్మెల్యే బాలకృష్ణ గారికి గుర్తుచేస్తే మంచిది అనిపించింది.. Chiranjeevi Konidela Pawan Kalyan Naga Babu Konidela JanaSena Party Telugu Desam Party #AndhraPradesh #Telangana #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana192,688 görüntüleme • 9 ay önce

ప్రసాద కాలుషితాన్ని సమర్థిస్తున్న జగన్ రెడ్డి గారిని మన వెంకన్న స్వామి తన అపారమైన కరుణతో క్షమించినా, ఆయన ఆరాధించే యేసు ప్రభువు మాత్రం ఈ పరిహారం లేని మహాపాతకాన్ని క్షమించడు. బిడ్డకు తల్లి పాలు ఎలా రక్షణ ఇస్తాయో, భక్తుడికి దైవ ప్రసాదం అలాగే రక్షణ ఇస్తుంది. దైవ ప్రసాదంలో కల్తీకి ఎలాంటి తావు లేదు. కల్తీ జరిగితే అది క్షేమం కాదు అది క్షమించరాని నేరం, మహా అపరాధం. ఈ రోజు మళ్లీ తిరుపతి లడ్డూ కల్తీ గురించి ఒక చేదు నిజం మాట్లాడాల్సిన పరిస్థితిని సృష్టించినవారు స్వయన మన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే. అసలు నెయ్యే లేదని, 100 శాతం విషపూరితమైన కల్తీ రసాయనాలే వాడారని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తుంటే, జగన్ రెడ్డి గారు ఏ ముఖంతో మీడియా ముందుకు వచ్చి “సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది” అంటూ అబద్ధాలు చెబుతున్నారు? ఈ ఘోర అపచారానికి పూర్తి బాధ్యత ఆయనదే. రాజకీయాల కోసం ఇంతటి నీచానికి దిగజారడం మహాపాతకం. ఒక్కటి గుర్తుంచుకోండి "మన వెంకన్న స్వామి పెద్ద మనసుతో క్షమించినా, ఆయన నిత్యం ప్రార్థించే యేసు ప్రభువు మాత్రం ఈ మహాపాతకాన్ని క్షమించడు. దైవద్రోహం చేసినవారికి శిక్ష తప్పదు. ఈ అపచారాన్ని ఖండించడం మతాలకు అతీతంగా ప్రతి భక్తుని బాధ్యత. మనమంతా అపార భక్తితో కళ్లద్దుకుని తినే తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన ఈ అపచారం మన హృదయాలను కలచివేస్తోంది. అది లడ్డూ ప్రసాదం కాదు విషతుల్యమైన రసాయనాల మిశ్రమం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరుతో మన కళ్లముందే మహాపాపం జరిగింది. అసలు తిరుపతి లడ్డూ తయారీలో వాడాల్సింది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. కానీ జగన్ ప్రభుత్వ హయాంలోని గుత్తేదారు కనీసం గేదె పాల నెయ్యి కూడా వాడలేదు. అది నెయ్యే కాదు! పామాయిల్, విషతుల్యమైన రసాయనాలు, జంతువుల కొవ్వులతో చేసిన ఒక కెమికల్ కాక్టెయిల్ను భక్తులకు ప్రసాదంగా పెట్టారు. నెయ్యి వాసన రావాలనే ఉద్దేశంతో కృత్రిమ ఎస్టర్స్ (Esters) వాడి భక్తులను మోసం చేశారు, జగన్ రెడ్డిగారు దీనిని ఎలా సమర్థిస్తున్నారు ఇది అక్షరాలా మన ఆరాధ్య దైవంపై, భక్తుల నమ్మకంపై, హైందవ ధర్మంపై జరిగిన దాడి.. ఒక సర్జికల్ స్ట్రైక్. ఆనాడు లార్డ్ మెకాలే కలగన్నది, ఈనాడు జగన్ ప్రభుత్వ హయాంలో నిజమైంది. కానీ మన దేశం మన సనాతన ధర్మం అన్నింటిని తట్టుకొని నిలబడింది ధర్మో రక్షతి రక్షితః. Tirumala Tirupati Devasthanams #NoGheeInTTDLaddu #NamoVenkatesaya #TirupatiLaddu Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh #SanathanaDharma #ధర్మో_రక్షతి_రక్షతః
Bolisetty Satyanarayana81,505 görüntüleme • 4 ay önce

I appeal to the National Green Tribunal and the Andhra Pradesh High Court to take suo moto cognizance of this matter and direct immediate action to stop illegal blasting and protect the lives of the people in Durganagar. Illegal blasting near residential areas in Durganagar, Payakaraopet Constituency, Anakapalli district has been ongoing for the past 6 months, causing serious safety and health hazards. Despite repeated complaints by the residents to all government authorities including the State Chief Secretary and Chief Minister's Office no effective action has been taken to stop this illegal activity. I have personally witnessed the dangerous blasting and held a public meeting warning government officials that those supporting contractors involved in this illegal act will be held accountable and punished. About a month ago, the MLA and the State Home Minister also assured that no blasting would take place, yet blasting continues relentlessly. Even after visits by officials from the Superintendent of Police's office two days ago promising to prevent further blasting, these unauthorized activities persist dangerously close, less than 100 meters, to homes and schools. This blatant disregard for public safety demands urgent intervention. Even after the landmark judgment delivered by the Central Zone Bench of the NGT in OA 143 & 144 of 2024 dated 03.11.2025, the continuation of such illegal blasting activities clearly reflects the gross negligence and apathy of our law enforcement authorities. The Constitution guarantees every citizen’s right to life and a healthy environment under Article 21, and mandates the State to protect the environment under Article 48A, while citizens have a duty to safeguard it under Article 51A(g). Illegal blasting near residential areas flouts these fundamental rights and duties. Legally, the Explosives Act, 1884 strictly regulates manufacture, possession, and use of explosives, prescribing imprisonment up to three years or more and fines for violations. The Explosive Substances Act, 1908 further punishes malicious explosions endangering life with up to life imprisonment. The Indian Penal Code criminalizes acts of public nuisance and destruction by explosives with severe penalties. Regulatory bodies like the Petroleum and Explosives Safety Organisation (PESO) license blasting operations, while police authorities hold the mandate to enforce law and order locally. పాయకరాపేట నియోజక వర్గంలోని నివాస ప్రాంతాలలో అక్రమ బ్లాస్టింగ్ గత ఆరు నెలలుగా కొనసాగుతోంది. అందరు జిల్లా అధికారులకు చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి గారికి పలు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. సారాసరి హోంమంత్రి గారే ఒక నెల క్రితం ఇక బ్లాస్టింగులు జరగవు అని హామీ ఇచ్చినప్పటికీ, బ్లాస్టింగ్ ఇంకా నివాసాల మరియు పాఠశాలల సమీపంలో ప్రమాదకరంగా కొనసాగుతోంది. రెండు రోజుల పోలీసు అధికారులు ఇక బ్లాస్టింగులు జరగవు హామీ ఇచ్చినా బ్లాస్టింగ్ కార్యకలాపాలు ఆగలేదు. ఇటీవల నివాస ప్రాంతాలకు బ్లాస్టింగ్ మధ్య దూరన్ని 500 మీటర్లకు పెంచుతూ 03.11.2025న OA 143 & 144 పై NGT ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. అయినా ఈ అక్రమాలు కొనసాగటం స్థానిక అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం. భారత రాజ్యాంగం పౌరులకు జీవన హక్కు మరియు పర్యావరణ రక్షణ హక్కును కల్పిస్తుంది. పేలుళ్ల నియంత్రణ కోసం Explosives Act, IPC వంటి కఠిన చట్టాలు ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలు సూ మోటోగా ఈ విషయం తీసుకొని అక్రమ బ్లాస్టింగ్ తక్షణమే నిలిపివేసి దుర్గానగర్ ప్రజలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా #StopIllegalBlasting #ProtectResidents of #Durganagar request #NGT #APHighCourt to take the Durganagar case on #SuoMoto and to uphold #ConstitutionalRights #Citizens and do #EnvironmentalJustice
Bolisetty Satyanarayana80,279 görüntüleme • 7 ay önce

2014లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో పిలుపు కాంగ్రెస్ భూస్థాపితం 2018లో టీడీపీ అవినీతిపై పిలుపు టీడీపీ అధికారం కోల్పోయింది 2022లో #వైసీపీ అరాచకంపై పిలుపు వైసీపీ భూస్థాపితం అయ్యితీరుతుంది 10వ ఆవిర్భావసభలో Pawan Kalyan గారి పిలుపుకోసం ఎదురు చూస్తున్నారు, ఆయన చెప్పిందే జరుగుతుంది..
Bolisetty Satyanarayana178,623 görüntüleme • 3 yıl önce

Govt job is to register a case and gather the information and submit the accused to the court and the Judge will decide and punish according to the facts on record.. Hon'ble CM Of Telangana Mr Revanth Reddy is focussing only on Allu Arjun and treating him as a murderer! CM of Telangana should focus on 22 deaths happening in his state every day and he should discuss about it in the Assembly, whereas he is focussing on a person who earned a lot of reputation to Telugu people and Indian Cinema. Instead of felicitating him he is torturing him.. and trying to put a forged case on him and directing the investigation officers in a wrong way instead of allowing them to do their job. The former CM of AP Mr YS Jagan Mohan Reddy did misused the power against Pawan Kalyan and JanaSena Party. Kharma won't spare anyone they will have to suffer as per their acts and deeds, like Mr Jagan Reddy Mr Revanth Reddy also will receive his due punishment.. #Dharma #JSPforNewAgePolitics BJP
Bolisetty Satyanarayana89,505 görüntüleme • 1 yıl önce

మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి నా బహిరంగ సవాల్. అబద్ధపు ఆరోపణలు ఇక చాలు - వాస్తవాలు మాట్లాడదాం రండి.. అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అమరావతిలోనే రాజధానిగా ఉండాలని, రైతుల పక్షాన నేను ఎప్పుడూ నిలబడ్డాను. నేను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్ మరియు పర్యావరణ రక్షణ కోసం మాత్రమే! వైసీపీ పాలనలో మీరు కలుగులో దాక్కున్న సమయంలో.. జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది నేను.. అలాంటి నేను YS Jagan Mohan Reddy మనిషినా? సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు. పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణే నా ఏకైక లక్ష్యం. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను.. మీ కట్టుకథలను పక్కన పెట్టి, తక్షణమే మీరు నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి. లేదంటే, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రండి? సమయం, వేదిక మీరే నిర్ణయించండి! Open Challenge to Former DGP AB Venkateswara Rao Enough of these false allegations—let’s talk facts. The allegations you are making against me regarding the Amaravati capital issue are completely baseless. I have always stood by the farmers and supported Amaravati as the capital. The cases I filed were solely intended to protect the Jaribu lands and the floodplains of Amaravati. While you were hiding in a hole during the YCP regime, I was the one who fought bravely against the atrocities of the Jagan Reddy government and for the protection of mangrove forests. Does that sound like I am YS Jagan Mohan Reddy’s man? My only goals are environmental conservation and protecting the Constitution. I will not compromise with anyone on these matters. Put aside your fabrications and immediately withdraw your comments and apologize. Otherwise, I challenge you to a public debate in front of the media. You decide the time and the venue! #Amaravati #ABVenkateswaraRao #BolisettySatyanarayana #PoliticalChallenge #SaveEnvironment #AndhraPradeshPolitics #TruthPrevails
Bolisetty Satyanarayana33,337 görüntüleme • 5 ay önce

రోజా గారిని విమర్శించే స్థాయి నీకు లేదని వైసీపీ వెంకటరెడ్డి అన్నదానికి JanaSena Party #వీరమహిళ కొమ్మూరి కీర్తన గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు నిలదీయడానికి కావలసింది ధైర్యం.. అందుకే Pawan Kalyan గారు మహిళా విభాగానికి వీరమహిళల అని నామకరణం చేసింది #JSPVeeraMahila
Bolisetty Satyanarayana156,369 görüntüleme • 3 yıl önce

కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఉన్నత ఆశయాలతో వచ్చిన మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో Pawan Kalyan పాత్ర గురించి.. చక్కగా వివరించిన ప్రొఫెసరు నాగేశ్వర్ గారికి కృతజ్ఞతలు JanaSena Party #JSPforNewAgePolitics #NDAallianceWinning
Bolisetty Satyanarayana106,631 görüntüleme • 2 yıl önce

17.08.2017న సుగాలి ప్రీతి అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని స్కూల్ హాస్టల్లో దారుణంగా మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపేశారు.. 28.05.2018న ఉన్న సైంటిఫిక్ ఆధారాలను ప్రక్కనపెట్టి దోషులను రక్షించేలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చార్జి షీట్ దాఖలు చేశారు పోలీసు అలసత్వంపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్ధన మేరకు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్ప జెప్పుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28.05.2020న జీవో నెం 56 జారీ చేసి నిద్రపోయింది. 23.02.2021న సిబిఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.. కౌంటరు కాపీ పిటీషనర్కి ఇవ్వలేదు! కోర్టులో అడిగితే అది రిటర్న్ అయిందని చెప్పారు!! 13.02.2025న సీబీఐ కౌంటర్ నాలుగేళ్ళ తర్వాత దాఖలు చేసింది!!! 90 రోజుల్లో పరిష్కరించాల్సిన పోస్కో కేసును దాదాపు తొమ్మిది సంవత్సరాలకు తీసుకెళుతున్న పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సీబీఐ తీరు చూస్తే సిగ్గేస్తుంది.. సందట్లో సడేమియా అంటూ కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారని తెగ మదన పడిపోవడం.. బ్లూ చానల్ మైకులు పట్టుకొని సుగాలి పార్వతి గారి ఇంటికి వెళ్ళడం.. పెయిడ్ యూటుబర్లు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం.. చూసి వాళ్ళకి కాస్త విషయ పరిజ్ఞానం ఇవ్వడం కోసం ఈ వీడియో పెడుతున్నాను.. 12.02.2020న కర్నూలు వచ్చి సుగాలి ప్రీతి తల్లికి అండగా నిలిచి #JusticeForSugaliPreethi అని కేవలం హేష్ ట్యాగ్ కాదు అది ఆ కుటుంబానికి Pawan Kalyan గారి అండ.. ఆమెకు ఆమె కుటుంబానికి JanaSena Party అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆరోజు చెప్పినప్పటి నుండీ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నారు.. #DelayedJusticeIsDeniedJustice Central Bureau of Investigation (India) #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana73,679 görüntüleme • 1 yıl önce

మచిలీపట్నం గొడుగు పేట రోడ్డులో ఉన్న JanaSena Party ఆఫీసుపై సెప్టెంబర్ 4న పేర్నినాని గారి రౌడీ మూకల దాడి!జనసేన ఆఫీసుకి అడ్డుగా పేర్ని నాని కొడుకు ఫోటో ఫ్లెక్సీ!! దానిని తొలగించ కుండా కాపలాగా పోలీసులు!! ఎస్పీ గారు ఇదీ మీ పేర్ని లా & ఆర్డర్!! #VarahiVijayaYatra #వారాహి_విజయ_యాత్ర
Bolisetty Satyanarayana123,086 görüntüleme • 2 yıl önce

మేం అధికారంలో ఉన్నాం అందరు మాకు గులాం గిరీ చెయ్యాలి, మేం రోడ్డుకు అడ్డంగా ఉన్నా బస్ డ్రైవర్ హారన్ కొట్టకూడదు, హారన్ కొడితే ఆర్టీసీ డ్రైవర్ అయినా వెంబడించి తంతాం అనే స్థాయికి YS Jagan Mohan Reddy పాలనలో శాంతి భద్రతలు దిగజారాయి! #HelloAP_ByeByeYCP JanaSena Party
Bolisetty Satyanarayana115,134 görüntüleme • 2 yıl önce

రాష్ట్ర ప్రధాన కార్యదర్శగా ఉన్న నేను, విశాఖ తూర్పు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా కూడా ఉన్నాను, ఇక్కడ 5 దేవాలయాలు ఉన్నాయి అన్నింటికీ కమిటీలు వేశారు వాటిలో జనసేనకు చోటు లేదు, చివరిది అతి పెద్దది మత్స్యకార ఆరాధ్య దేవత ఆలయం కారకచేట్టు పోలమాంబ. నిన్న అమ్మవారి ఆలయ పాలకమండలి మొత్తం 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుండి ముగ్గురికి అవకాశం ఉండాలి. కానీ, ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. ఇది జనసేన వీరమహిళలను, జనసైనికులను తీవ్రంగా నిరుత్సాహ పరిచే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. క్షేత్రస్థాయిలో ఇలాంటి పొరపాట్లు దాదాపు అన్ని చోట్ల జరుగుతున్నాయని ప్రతి రోజూ నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నామీనేటెడ్ పదవుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, ఆశించిన 30% రిజర్వేషన్ అమలు కాలేదన్నది ఆరోపణ అది నిజం కాకూడదు అనే నా ఉదేశ్యం. జనసేన త్యాగానికి సముచిత గౌరవం ఇచ్చినప్పుడే రెట్టించిన ఉత్సాహంతో జనసైనికులు వీర మహిళలు భవిష్యత్తులో కూటమి విజయానికి పనిచేస్తారు🤝🙏 రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలన్నా, భవిష్యత్తులో వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా... శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ కార్యకర్తలకు రావాల్సిన వాటాను అందించి "కూటమి ధర్మాన్ని" కాపాడాలి. N Chandrababu Naidu Telugu Desam Party CMO Andhra Pradesh Pawan Kalyan JanaSena Party CMO Andhra Pradesh #NDAJointGovernment #JSP #TDP #BJP #PawanKalyan #AllianceDharma #JSPforNewAgePolitics JanaSena Shatagni
Bolisetty Satyanarayana26,517 görüntüleme • 5 ay önce

మొన్న సింహాచలంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు దుర్మరణం చెందారు.. వెంటనే ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని వేసింది.. నిన్న ఆ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. కొంత విషయం మీడియా ద్వారా బయటకు వచ్చింది.. కానీ దర్యాప్తు ఇంకో కోణంలో కూడా జరపాలేమో అనిపిస్తుంది.. ఎందుకంటే.. 1. ఈ గోడ కట్టడానికి కాంట్రాక్ట్ గత ప్రభుత్వ హయాంలో వారికి ఇష్టమైన కాంట్రాక్టర్ కు 17.08.2023లో ఇచ్చారు 2. అప్పుడు ఋషికొండలో జగన్ రెడ్డి గారి కోసం ధృడంగా ప్యాలెస్ పర్యవేక్షణ చేసిన పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ గారే పర్యవేక్షణ చేశారు 3. ఏమో ఈ గోడ కూలి హిందూ భక్తులు చావాలనే అన్యమతస్థులు కుట్ర చేసేరా.? అన్న అనుమానం కలుగుతుంది.. 4. అసలు YS Jagan Mohan Reddy సింహాచలం వచ్చిందే డైవర్షన్ పాలిటిక్స్ చేయాడానికే నేమో?? ఇప్పుడు సంపూర్ణ విచారణ చేబట్టేటప్పుడు పై విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని విశాఖ వాసిగా నా విజ్ఞప్తి.. #SimhachalamTragedy #simhachalamtemple CMO Andhra Pradesh N Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan Kandula Durgesh Anitha Vangalapudi Andhra Pradesh Police #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana56,512 görüntüleme • 1 yıl önce

అమలాపురంలో సీఎం YS Jagan Mohan Reddy గారి బస్సు యాత్రకు అనూహ్యంగా భారీగా జనం తాకిడి కంట్రోల్ చెయ్యడానికి.. రోప్ పార్టీలు..పోలీసులు చాలా కష్ట పడాల్సి వస్తుంది.. ఇక #HelloAP_ByeByeYCP అని కన్ఫర్మ్ అయిపోయింది.. #HelloAP_WelcomeJSP JanaSena Party JanaSena Shatagni
Bolisetty Satyanarayana114,288 görüntüleme • 2 yıl önce

అసెంబ్లీలో కామినేని గారు మాట్లాడినవి అందుకు బదులుగా బాలకృష్ణ గారు మాట్లాడినవి నిన్న రికార్డుల నుండి తొలగించడం జరిగింది.. కాబట్టి చిరంజీవి గారికి అవమానం జరిగింది జనసేన ఎంమ్మెల్యేలు ఎందుకు స్పందించరు అని డిబేట్లు పెట్టిన మీడియా ఛానల్స్ వాటిలో మాట్లాడిన మేధావులు.. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి... అందరివాడైన చిరంజీవి గారిపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది వారికే నష్టం చేస్తుంది.. ఇకనైనా YS Jagan Mohan Reddy వారి పార్టీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే మంచిది.. Chiranjeevi Konidela Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Party YSR Congress Party #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana39,673 görüntüleme • 9 ay önce

జగన్ రెడ్డి గారిని అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు అదః పాతాళానికి తొక్కేసారు.. ఇక సీబీఐ కోర్టు విచారణకు హాజరై నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటకి రావాలి అదొక్కటే జగన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక రహదారి.. కానీ విచారణకు హాజరైతే బయటకు రావాన్న సంగతి ఆయనకు తెలుసు..! Pawan Kalyan JanaSena Party YS Jagan Mohan Reddy YSR Congress Party #NDAAlliance #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana61,864 görüntüleme • 1 yıl önce

కొల్లేరు పరిరక్షణకు అంతిమ హెచ్చరిక - నేరుగా ప్రధాని మరియు ముఖ్యమంత్రి గారికి బహిరంగ విన్నపం! ఈ ఉదయం నేను విడుదల చేసిన 'కొల్లేరు అస్తిత్వ పునరుద్దరణ - 2' చూశాక, మనందరిలో ఒకటే ప్రశ్న.. "ఇంకా ఎంతకాలం ఈ మౌనం?" అందుకే, నేడు మీడియా ముఖంగా దేశ ప్రధాని గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ప్రపంచ పర్యావరణవేత్తలకు ఈ బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉదయం ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు: • అల్టిమేటం: సుప్రీంకోర్టు ఆదేశాలను కాలరాస్తూ, కొల్లేరు సరిహద్దులను కుదించే (De-notification) ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే ఆపాలి. లేనిపక్షంలో ఒక భారీ ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. • కళంకిత వ్యవస్థలు: నిబంధనలను అతిక్రమించి అక్రమ ఆక్రమణలకు సహకరిస్తున్న అధికారులను జవాబుదారీలుగా చేయాల్సిందే. • గ్లోబల్ అప్పీల్: ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు. అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు (IUCN, Convention on Wetlands) కూడా స్పందించి, ఈ ప్రపంచ ప్రఖ్యాత చిత్తడి నేలను కాపాడాలి. మా డిమాండ్ ఒక్కటే: కొల్లేరును ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసి, దాని సహజ అస్తిత్వాన్ని పునరుద్ధరించండి. మన మనుగడకు ఆధారమైన ఈ జలవనరును కాపాడుకుందాం. మీడియా సమావేశంలో నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో ప్రసంగించిన పూర్తి వీడియోలను ఇక్కడ జత చేస్తున్నాను. ప్రతి ఒక్క పర్యావరణ ప్రేమికుడు దీన్ని వీక్షించి, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ వద్ద మరింత సమాచారం ఉంటే పంపండి : బోలిశెట్టి సత్యనారాయణ పర్యావరణవేత్త, జల బిరాదరి జాతీయ కన్వీనర్. ఈమెయిల్: [email protected] PMO India Bhupender Yadav BJP #మననుడి_మననది #కొల్లేరు #Kolleru #SaveKolleru #Ultimatum #EnvironmentJustice #GlobalAction Rajendra Singh #EcoRestoration MVR Sastry Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh N Chandrababu Naidu CMO Andhra Pradesh MoEF&CC
Bolisetty Satyanarayana17,558 görüntüleme • 3 ay önce

అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక చింతనతో గడపాల్సిన రాబోయే శివరాత్రిని ఒక సాధారణ కమర్షియల్ 'ఈవెంట్'గా మార్చకండి.. (అమరావతిలో జరుగబోయే శివరాత్రి ప్రకటన చూసాక మనసులో కలిగిన బాధను మీతో, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి గారితో పంచుకోవాలి అనిపించింది) ఆధ్యాత్మికతను కాపాడండి 🙏"శివుడు 'అభిషేక ప్రియుడు'.. 'ఆడంబర ప్రియుడు' కాదు. కొందరు భక్తిని వ్యాపారంగా 'కమర్షియల్ ఈవెంట్ల'గా మార్చేస్తున్నారు ఇది వారి విజ్ఞతకు వదిలేద్దాం. పవిత్ర దేవాలయాలు ఇంకా ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నాయి కాబట్టి ఈ మహా శివరాత్రి సందర్బంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి, మన పురాతన ఆలయాల పవిత్రతను, సంప్రదాయాలను కాపాడమని అదే నిజమైన శివ సేవ.. భక్తుల తరపున ఆంధ్రప్రదేశ్లోని ఈ తొమ్మిది ప్రముఖ పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడుతూ, అక్కడ భక్తులకు అవసరమైన కనీస వసతులపై దృష్టి సారించాలని కోరుతూ ప్రభుత్వానికి మరియు దేవాదాయ శాఖకు విన్నపం. ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడండి - క్షేత్రస్థాయి సౌకర్యాలను మెరుగుపరచండి ఈ మహాశివరాత్రి పర్వదినాన మన రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతాయి. అయితే, ఇటీవల కాలంలో ఆధ్యాత్మికతను 'కమర్షియల్ ఈవెంట్లుగా' మారుస్తున్న ధోరణి ఆందోళన కలిగిస్తోంది. పవిత్రమైన సంప్రదాయాలను ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు అప్పగించి కృత్రిమ హంగులు అద్దడం కంటే, ఈ క్రింది ప్రముఖ క్షేత్రాల్లో భక్తులకు శాశ్వత కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వానికి మా విన్నపం • శ్రీశైలం మల్లికార్జున స్వామి: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం ఉన్న ఈ మహాక్షేత్రంలో లక్షలాది మందికి సరిపడా శాశ్వత వసతి గృహాలు, పరిశుభ్రమైన తాగునీరు మరియు పటిష్టమైన క్యూ లైన్ల నిర్వహణ ముఖ్యం. 'ఈవెంట్'ల కంటే భక్తుల సౌకర్యమే ప్రధానం కావాలి. • శ్రీకాళహస్తి వాయులింగం: నిరంతరం రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలి. స్వర్ణముఖి నది తీరాన్ని పవిత్రంగా, కాలుష్య రహితంగా ఉంచాలి. • కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి: ఇక్కడి 'ప్రభల' సంస్కృతి మన జానపద కళకు నిదర్శనం. ఆ కొండపైకి వచ్చే భక్తులకు ఎండ తగలకుండా షెడ్లు, వైద్య సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంచాలి. • అమరావతి అమరేశ్వర స్వామి: పంచారామ క్షేత్రమైన అమరావతిలో కృష్ణా నదీ స్నాన ఘాట్లను ఆధునీకరించాలి. పురాతన ఆలయ నిర్మాణానికి నష్టం కలగకుండా పర్యాటక వసతులు పెంచాలి. • త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వర స్వామి: శ్రీశైల తూర్పు ద్వారమైన ఈ క్షేత్రానికి చేరుకునే రహదారులను మెరుగుపరచాలి. భక్తుల రక్షణ కోసం రాత్రి వేళల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలి. • భైరవకోన భైరవేశ్వర స్వామి: ప్రకృతి ఒడిలో ఉన్న ఈ గుహాలయాల్లో పర్యావరణాన్ని కాపాడుతూనే, భక్తులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను నిర్మించాలి. • రామతీర్థం మోక్ష రామలింగేశ్వర స్వామి: చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయంలో నిత్యాన్నదాన సత్రాలను అభివృద్ధి చేయాలి. • రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి: టెక్కలిలో లింగం పైకప్పు లేకుండా ఎండ, వానలకు బహిర్గతంగా ఉండటం వల్ల ఎండల మల్లిఖార్జున స్వామి అని పేరు వచ్చింది దీనిని శ్రీరాముడు ప్రతిష్టించాడని నమ్మకం • అప్పికొండ సోమేశ్వర స్వామి: సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయంలో శివరాత్రి నాడు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలి. • పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి: పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఇక్కడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనీస పారిశుద్ధ్య పనులను ఏడాది పొడవునా నిర్వహించాలి. ముఖ్యమైన డిమాండ్లు: • సంప్రదాయ పరిరక్షణ: వేద పండితులు, అర్చకులు నిర్ణయించిన పద్ధతిలోనే వేడుకలు జరగాలి. సినిమా పాటలు, డీజేలు, అశ్లీల నృత్యాలను నిషేధించాలి అవి ఆధ్యాత్మిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. • పర్యావరణ హితం: ప్లాస్టిక్ రహిత ఉత్సవాలను ప్రోత్సహించాలి. • నిధుల వినియోగం: వేడుకల ప్రచారానికి ఖర్చు చేసే నిధులను భక్తుల తాగునీరు, పారిశుద్ధ్యం మరియు భద్రత కోసం కేటాయించాలి ఆధ్యాత్మికతను ప్రదర్శనగా మార్చకండి; ఈ మహా శివరాత్రి ఒక పవిత్రమైన అనుభూతిగా మిగిలేలా చూడాలని కోరుకుంటున్నాము. ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నాయి.. చిత్త శుద్ధితో ప్రభుత్వం చెయ్యాలి అనుకుంటే తప్పకుండా జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి ఆ పరమ శివుడి అనుగ్రహంతో పాటు భక్తుల మన్ననలు దక్కుతాయి.. 🙏🙏🙏 #Mahashivratri2026 #Mahashivratri #మహాశివరాత్రి AnamRamaNarayanaRedd CMO Andhra Pradesh N Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan
Bolisetty Satyanarayana22,497 görüntüleme • 4 ay önce