
Bolisetty Satyanarayana
@bolisetti_satya • 119,557 subscribers
Environment Conservationist & a Jansainik
Shorts
Videos

కూటమి నాయకత్వానికి బహిరంగ విజ్ఞప్తి.. కార్యకర్తల సహనాన్ని ఇంకా పరీక్షించకండి! నాదెండ్ల మనోహర్ గారు.. మన నాయకులు, కార్యకర్తల ఎదుగుదల ఎక్కడ? Manohar Nadendla గారు మీరే చెప్పండి, మనం నిజంగానే మన నాయకుల, కార్యకర్తల నాయకత్వాన్ని గుర్తించామా? వారిని ఎక్కడైనా ఎదగనిచ్చామా? కేవలం మనకు భజన చేసేవాళ్లకు, డబ్బు ఖర్చు పెట్టేవాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల నెత్తిన వేరే పార్టీకి కొమ్ము కాసే వాళ్లను తెచ్చి కూర్చోబెట్టాం. వారిని ఇప్పటికీ భరిస్తూనే ఉన్నారు, కానీ కార్యకర్తల సహనాన్ని ఇక పరీక్షించకండి. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసిన ఎందరో నాయకులకు మనం తీవ్ర అన్యాయం చేశాం. మనం తీసుకున్న ఆ 21 స్థానాల్లో ఎంతమందికి అన్యాయం జరిగిందో మీకు తెలియదా? ఉదాహరణకు పెందుర్తి నియోజకవర్గాన్నే తీసుకుందాం, అక్కడ 6 ఏళ్ళ సర్వీస్ మిగిలి ఉండగానే.. పార్టీ కోసం, నా ఒత్తిడిపై తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితుడై, పార్టీలో చేరి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన మన ప్రధాన కార్యదర్శి Tammireddy Sivasankara Rao గారు... ఎన్నికల ముందు పెందుర్తిలోని అన్ని పంచాయతీలలో మీటింగులు పెట్టి ప్రజా మద్దతు కూడగట్టిన ఆ నాయకుడు మీకు కనిపించలేదా? అక్కడ ఎవరికి, ఎందుకు సీటు ఇచ్చారో సమాధానం చెప్పగలరా? కూటమి ధర్మాన్ని టీడీపీ పాటిస్తుందా? Lokesh Nara గారు.. వైసీపీ వాళ్ళు కూటమి సోషల్ మీడియాలో దూరి మనస్పర్థలు సృష్టిస్తున్నారని జాగ్రత్తలు చెబుతున్నారు, సరే అనుకుందాం, ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అనేది పార్టీల అధినాయకుల మధ్య జరిగిన ఒప్పందం. కానీ నామినేటెడ్ పదవుల్లోనైనా మీరు పొత్తు ధర్మాన్ని పాటించారా? పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా 30% నామినేటెడ్ పదవులు జనసేనకు, 10% బీజేపీకి అని ఎన్నికలకు ముందు అన్నారు కదా అది ఆలయ్యిందా? అంతెందుకు, కనీసం ఏ ఎం రత్నం గారికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవినైనా ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పగలరా? చినబాబు గారు ఒకటి గుర్తుంచుకొండి కార్యకర్తలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు! ఇకనైనా మీ పంధాను మార్చుకోండి ఇలాంటి కప్పిపుచ్చే మాటలకు స్వస్తి చెప్పి, జనసేనకు దక్కాల్సిన 30%, బిజెపికి దక్కాల్సిన 30% నామినేటెడ్ పోస్టులపై కూటమి పార్టీలు వెంటనే చర్చించుకోవాలి, పొరపాటు ఎక్కడ ఏ స్థాయిలో జరిగిందో చూసి సరిచేయండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా జనసేనకు, బీజేపీకి కాసిన్ని ఎక్కువ స్థానాలు విదిల్చి పెద్ద మనసుతో టీడీపీ కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి కూటమి ధర్మ పునరుద్ధరణకు నడుం బిగించాలి. గత ఎన్నికల నాటి తప్పులే మళ్ళీ పునరావృతం చేస్తే.. స్థానిక సంస్థలను బంగారు పళ్లెంలో పెట్టి YS Jagan Mohan Reddy గారికి ఇచ్చినట్టే అవుతుంది! "పదవులకు రాజీనామా చేశాడు, మనం కూడా అనుబంధం లేదని ప్రకటించాక కూడా ఇదేంటి ఇలా అనుకుంటున్నారా?" జనసేనతో, పవన్ కళ్యాణ్ గారితో నా అనుబంధం తెంపితే తెగేది కాదు, అలా అని జనసేన తప్పు చేసినా నేను ఊరుకోను తప్పకుండా ప్రశ్నిస్తాను. ఎంతో మంది యువత Pawan Kalyan గారిని, ఆయన సిద్ధాంతాలను నమ్మి ముందుకు వచ్చారు. కొందరు పార్టీలో చేరారు, మరికొందరు బయటి నుంచే మద్దతు ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, వారి పరిరక్షణ బాధ్యత కూడా నాదే! నాయకత్వం వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇప్పటికైనా చిత్త శుద్ధితో కూటమిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోండి. సొంత శ్రేయోభిలాషులకు కాకుండా, పార్టీ కోసం రక్తం, శ్వేదం చిందించిన నిజమైన శ్రేయోభిలాషులకే పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నాను.. JanaSena Party Telugu Desam Party BJP changa
Bolisetty Satyanarayana56,532 görüntüleme • 29 gün önce

2029లో మళ్ళీ జగన్ వస్తారు.. లేదా మేమే వస్తాం అనుకుంటున్న వారి కోసం.. 2024 ఎన్నికల ఫలితాల రోజు ఉదయం ఆర్టీవీ వేదికగా రవిప్రకాష్ గారితో ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణను ఒక్కసారి గమనిస్తే, ఆయన చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలని నిరూపితమయ్యాయి. ప్రశాంత్ కిషోర్ ఆనాడు మాట్లాడుతూ వైసీపీ 151 సీట్ల నుండి 51 సీట్లకు పడిపోయే స్థితికి చేరుకుందని, వారి పరిస్థితి 'పునర్మూషికో భవ' (ఎక్కడి నుంచి మొదలయ్యారో అక్కడికే) అన్నట్లుగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆగ్రహం ఎంతలా ఉందంటే అది 51 కాదు, ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. 2019లో జగన్ కోసం, వైసీపీ కోసం షర్మిల గారు రాత్రి పగలు కష్టపడి ప్రచారం చేశారు. కానీ ఐదేళ్లు తిరగకముందే సొంత తల్లి, చెల్లెలే ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. గెలుపుకు తోడ్పడిన వారిని విస్మరించడం జగన్ గారి వ్యక్తిత్వ లోపమని పీకే చేసిన విమర్శ నేడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎవరి సహాయంతోనైనా ఎదిగినప్పుడు కనీసం కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేకపోవడం కన్నా మించిన మహాపాపం మరొకటి లేదని భగవద్గీత చెబుతోందని కేవలం రాజకీయ వ్యూహకర్తల పట్ల మాత్రమే కాదు, తన కుటుంబం, ఓటర్లు మరియు మద్దతుదారుల పట్ల కూడా కృతజ్ఞత లేకుండా వ్యవహరించినందుకే వైసీపీ ఈ భారీ మూల్యం చెల్లించుకుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఈ కృతజ్ఞత అనేది చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి కూడా వర్తిస్తుంది. 2024లో ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారితో పాటు జన సైన్యం పట్ల కృతజ్ఞతతో మెలగాలి, లేదంటే ఫలితం అనుభవించాల్సి వస్తుంది. వైసీపీ పతనం నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అక్రమ భూ కబ్జాలు, ఇసుక మాఫియాలు, మైనింగ్ మాఫియాలు, అక్రమ లేఅవుట్లు నడుస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2029లో వారికి కూడా గెలుపు కష్టమే అవుతుంది. జగన్ గారిలో ఇప్పటికైనా మార్పు వచ్చి, చిత్తశుద్ధితో చేసిన తప్పులు ఒప్పుకుని పశ్చాత్తాపపడితేనే మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యమే.. గుర్తుంచుకోండి.. మీకు అధికారం ఇచ్చింది ప్రజలే.. 2029ని శాసించేది కూడా ప్రజలే.. Pawan Kalyan N Chandrababu Naidu YS Jagan Mohan Reddy #APPolitics Prashant Kishor JanaSena Party Telugu Desam Party BJP #AndhraPradesh #NDAAlliance
Bolisetty Satyanarayana105,387 görüntüleme • 3 ay önce

అసెంబ్లీలో గౌరవ ఎంమ్మెల్యే బాలకృష్ణ గారు పద్మవిభూషణ్ చిరంజీవి గారిని చులకన చేసి మాట్లాడిన దానిపై చర్చకు లేదా నా అభిప్రాయం చాలా మంది మీడియా సోదరులు కోరారు.. కానీ ఈ సున్నితమైన అంశంపై కూటమిలో భాగస్వామి అయిన JanaSena Party లో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను పార్టీ ఆదేశం లేకుండా మాట్లాడడం భావ్యం కాదు అని మౌనంగా ఉన్నాను.. కానీ సినీ పరిశ్రమను ఆదుకున్న ఆపద్భాందవుడు ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారే అని లక్షల మంది సమక్షంలో తెలుగు సినిమాకి ప్రపంచ ఖ్యాతిని కీర్తిని ఆర్జించి పెట్టిన మహానుభావుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు శ్రీ రాజమౌళి గారు అన్నది మరో సారి తెలుగు ప్రజలకు ముఖ్యంగా గౌరవ ఎంమ్మెల్యే బాలకృష్ణ గారికి గుర్తుచేస్తే మంచిది అనిపించింది.. Chiranjeevi Konidela Pawan Kalyan Naga Babu Konidela JanaSena Party Telugu Desam Party #AndhraPradesh #Telangana #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana192,704 görüntüleme • 10 ay önce

ప్రసాద కాలుషితాన్ని సమర్థిస్తున్న జగన్ రెడ్డి గారిని మన వెంకన్న స్వామి తన అపారమైన కరుణతో క్షమించినా, ఆయన ఆరాధించే యేసు ప్రభువు మాత్రం ఈ పరిహారం లేని మహాపాతకాన్ని క్షమించడు. బిడ్డకు తల్లి పాలు ఎలా రక్షణ ఇస్తాయో, భక్తుడికి దైవ ప్రసాదం అలాగే రక్షణ ఇస్తుంది. దైవ ప్రసాదంలో కల్తీకి ఎలాంటి తావు లేదు. కల్తీ జరిగితే అది క్షేమం కాదు అది క్షమించరాని నేరం, మహా అపరాధం. ఈ రోజు మళ్లీ తిరుపతి లడ్డూ కల్తీ గురించి ఒక చేదు నిజం మాట్లాడాల్సిన పరిస్థితిని సృష్టించినవారు స్వయన మన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే. అసలు నెయ్యే లేదని, 100 శాతం విషపూరితమైన కల్తీ రసాయనాలే వాడారని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తుంటే, జగన్ రెడ్డి గారు ఏ ముఖంతో మీడియా ముందుకు వచ్చి “సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది” అంటూ అబద్ధాలు చెబుతున్నారు? ఈ ఘోర అపచారానికి పూర్తి బాధ్యత ఆయనదే. రాజకీయాల కోసం ఇంతటి నీచానికి దిగజారడం మహాపాతకం. ఒక్కటి గుర్తుంచుకోండి "మన వెంకన్న స్వామి పెద్ద మనసుతో క్షమించినా, ఆయన నిత్యం ప్రార్థించే యేసు ప్రభువు మాత్రం ఈ మహాపాతకాన్ని క్షమించడు. దైవద్రోహం చేసినవారికి శిక్ష తప్పదు. ఈ అపచారాన్ని ఖండించడం మతాలకు అతీతంగా ప్రతి భక్తుని బాధ్యత. మనమంతా అపార భక్తితో కళ్లద్దుకుని తినే తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన ఈ అపచారం మన హృదయాలను కలచివేస్తోంది. అది లడ్డూ ప్రసాదం కాదు విషతుల్యమైన రసాయనాల మిశ్రమం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరుతో మన కళ్లముందే మహాపాపం జరిగింది. అసలు తిరుపతి లడ్డూ తయారీలో వాడాల్సింది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. కానీ జగన్ ప్రభుత్వ హయాంలోని గుత్తేదారు కనీసం గేదె పాల నెయ్యి కూడా వాడలేదు. అది నెయ్యే కాదు! పామాయిల్, విషతుల్యమైన రసాయనాలు, జంతువుల కొవ్వులతో చేసిన ఒక కెమికల్ కాక్టెయిల్ను భక్తులకు ప్రసాదంగా పెట్టారు. నెయ్యి వాసన రావాలనే ఉద్దేశంతో కృత్రిమ ఎస్టర్స్ (Esters) వాడి భక్తులను మోసం చేశారు, జగన్ రెడ్డిగారు దీనిని ఎలా సమర్థిస్తున్నారు ఇది అక్షరాలా మన ఆరాధ్య దైవంపై, భక్తుల నమ్మకంపై, హైందవ ధర్మంపై జరిగిన దాడి.. ఒక సర్జికల్ స్ట్రైక్. ఆనాడు లార్డ్ మెకాలే కలగన్నది, ఈనాడు జగన్ ప్రభుత్వ హయాంలో నిజమైంది. కానీ మన దేశం మన సనాతన ధర్మం అన్నింటిని తట్టుకొని నిలబడింది ధర్మో రక్షతి రక్షితః. Tirumala Tirupati Devasthanams #NoGheeInTTDLaddu #NamoVenkatesaya #TirupatiLaddu Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh #SanathanaDharma #ధర్మో_రక్షతి_రక్షతః
Bolisetty Satyanarayana81,505 görüntüleme • 6 ay önce

I appeal to the National Green Tribunal and the Andhra Pradesh High Court to take suo moto cognizance of this matter and direct immediate action to stop illegal blasting and protect the lives of the people in Durganagar. Illegal blasting near residential areas in Durganagar, Payakaraopet Constituency, Anakapalli district has been ongoing for the past 6 months, causing serious safety and health hazards. Despite repeated complaints by the residents to all government authorities including the State Chief Secretary and Chief Minister's Office no effective action has been taken to stop this illegal activity. I have personally witnessed the dangerous blasting and held a public meeting warning government officials that those supporting contractors involved in this illegal act will be held accountable and punished. About a month ago, the MLA and the State Home Minister also assured that no blasting would take place, yet blasting continues relentlessly. Even after visits by officials from the Superintendent of Police's office two days ago promising to prevent further blasting, these unauthorized activities persist dangerously close, less than 100 meters, to homes and schools. This blatant disregard for public safety demands urgent intervention. Even after the landmark judgment delivered by the Central Zone Bench of the NGT in OA 143 & 144 of 2024 dated 03.11.2025, the continuation of such illegal blasting activities clearly reflects the gross negligence and apathy of our law enforcement authorities. The Constitution guarantees every citizen’s right to life and a healthy environment under Article 21, and mandates the State to protect the environment under Article 48A, while citizens have a duty to safeguard it under Article 51A(g). Illegal blasting near residential areas flouts these fundamental rights and duties. Legally, the Explosives Act, 1884 strictly regulates manufacture, possession, and use of explosives, prescribing imprisonment up to three years or more and fines for violations. The Explosive Substances Act, 1908 further punishes malicious explosions endangering life with up to life imprisonment. The Indian Penal Code criminalizes acts of public nuisance and destruction by explosives with severe penalties. Regulatory bodies like the Petroleum and Explosives Safety Organisation (PESO) license blasting operations, while police authorities hold the mandate to enforce law and order locally. పాయకరాపేట నియోజక వర్గంలోని నివాస ప్రాంతాలలో అక్రమ బ్లాస్టింగ్ గత ఆరు నెలలుగా కొనసాగుతోంది. అందరు జిల్లా అధికారులకు చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి గారికి పలు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. సారాసరి హోంమంత్రి గారే ఒక నెల క్రితం ఇక బ్లాస్టింగులు జరగవు అని హామీ ఇచ్చినప్పటికీ, బ్లాస్టింగ్ ఇంకా నివాసాల మరియు పాఠశాలల సమీపంలో ప్రమాదకరంగా కొనసాగుతోంది. రెండు రోజుల పోలీసు అధికారులు ఇక బ్లాస్టింగులు జరగవు హామీ ఇచ్చినా బ్లాస్టింగ్ కార్యకలాపాలు ఆగలేదు. ఇటీవల నివాస ప్రాంతాలకు బ్లాస్టింగ్ మధ్య దూరన్ని 500 మీటర్లకు పెంచుతూ 03.11.2025న OA 143 & 144 పై NGT ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. అయినా ఈ అక్రమాలు కొనసాగటం స్థానిక అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం. భారత రాజ్యాంగం పౌరులకు జీవన హక్కు మరియు పర్యావరణ రక్షణ హక్కును కల్పిస్తుంది. పేలుళ్ల నియంత్రణ కోసం Explosives Act, IPC వంటి కఠిన చట్టాలు ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలు సూ మోటోగా ఈ విషయం తీసుకొని అక్రమ బ్లాస్టింగ్ తక్షణమే నిలిపివేసి దుర్గానగర్ ప్రజలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా #StopIllegalBlasting #ProtectResidents of #Durganagar request #NGT #APHighCourt to take the Durganagar case on #SuoMoto and to uphold #ConstitutionalRights #Citizens and do #EnvironmentalJustice
Bolisetty Satyanarayana80,279 görüntüleme • 9 ay önce

2014లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో పిలుపు కాంగ్రెస్ భూస్థాపితం 2018లో టీడీపీ అవినీతిపై పిలుపు టీడీపీ అధికారం కోల్పోయింది 2022లో #వైసీపీ అరాచకంపై పిలుపు వైసీపీ భూస్థాపితం అయ్యితీరుతుంది 10వ ఆవిర్భావసభలో Pawan Kalyan గారి పిలుపుకోసం ఎదురు చూస్తున్నారు, ఆయన చెప్పిందే జరుగుతుంది..
Bolisetty Satyanarayana178,625 görüntüleme • 3 yıl önce

Govt job is to register a case and gather the information and submit the accused to the court and the Judge will decide and punish according to the facts on record.. Hon'ble CM Of Telangana Mr Revanth Reddy is focussing only on Allu Arjun and treating him as a murderer! CM of Telangana should focus on 22 deaths happening in his state every day and he should discuss about it in the Assembly, whereas he is focussing on a person who earned a lot of reputation to Telugu people and Indian Cinema. Instead of felicitating him he is torturing him.. and trying to put a forged case on him and directing the investigation officers in a wrong way instead of allowing them to do their job. The former CM of AP Mr YS Jagan Mohan Reddy did misused the power against Pawan Kalyan and JanaSena Party. Kharma won't spare anyone they will have to suffer as per their acts and deeds, like Mr Jagan Reddy Mr Revanth Reddy also will receive his due punishment.. #Dharma #JSPforNewAgePolitics BJP
Bolisetty Satyanarayana89,505 görüntüleme • 1 yıl önce

రోజా గారిని విమర్శించే స్థాయి నీకు లేదని వైసీపీ వెంకటరెడ్డి అన్నదానికి JanaSena Party #వీరమహిళ కొమ్మూరి కీర్తన గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు నిలదీయడానికి కావలసింది ధైర్యం.. అందుకే Pawan Kalyan గారు మహిళా విభాగానికి వీరమహిళల అని నామకరణం చేసింది #JSPVeeraMahila
Bolisetty Satyanarayana156,387 görüntüleme • 3 yıl önce

కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఉన్నత ఆశయాలతో వచ్చిన మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో Pawan Kalyan పాత్ర గురించి.. చక్కగా వివరించిన ప్రొఫెసరు నాగేశ్వర్ గారికి కృతజ్ఞతలు JanaSena Party #JSPforNewAgePolitics #NDAallianceWinning
Bolisetty Satyanarayana106,632 görüntüleme • 2 yıl önce

17.08.2017న సుగాలి ప్రీతి అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని స్కూల్ హాస్టల్లో దారుణంగా మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపేశారు.. 28.05.2018న ఉన్న సైంటిఫిక్ ఆధారాలను ప్రక్కనపెట్టి దోషులను రక్షించేలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చార్జి షీట్ దాఖలు చేశారు పోలీసు అలసత్వంపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్ధన మేరకు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్ప జెప్పుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28.05.2020న జీవో నెం 56 జారీ చేసి నిద్రపోయింది. 23.02.2021న సిబిఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.. కౌంటరు కాపీ పిటీషనర్కి ఇవ్వలేదు! కోర్టులో అడిగితే అది రిటర్న్ అయిందని చెప్పారు!! 13.02.2025న సీబీఐ కౌంటర్ నాలుగేళ్ళ తర్వాత దాఖలు చేసింది!!! 90 రోజుల్లో పరిష్కరించాల్సిన పోస్కో కేసును దాదాపు తొమ్మిది సంవత్సరాలకు తీసుకెళుతున్న పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సీబీఐ తీరు చూస్తే సిగ్గేస్తుంది.. సందట్లో సడేమియా అంటూ కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారని తెగ మదన పడిపోవడం.. బ్లూ చానల్ మైకులు పట్టుకొని సుగాలి పార్వతి గారి ఇంటికి వెళ్ళడం.. పెయిడ్ యూటుబర్లు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం.. చూసి వాళ్ళకి కాస్త విషయ పరిజ్ఞానం ఇవ్వడం కోసం ఈ వీడియో పెడుతున్నాను.. 12.02.2020న కర్నూలు వచ్చి సుగాలి ప్రీతి తల్లికి అండగా నిలిచి #JusticeForSugaliPreethi అని కేవలం హేష్ ట్యాగ్ కాదు అది ఆ కుటుంబానికి Pawan Kalyan గారి అండ.. ఆమెకు ఆమె కుటుంబానికి JanaSena Party అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆరోజు చెప్పినప్పటి నుండీ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నారు.. #DelayedJusticeIsDeniedJustice Central Bureau of Investigation (India) #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana73,800 görüntüleme • 1 yıl önce

మేం అధికారంలో ఉన్నాం అందరు మాకు గులాం గిరీ చెయ్యాలి, మేం రోడ్డుకు అడ్డంగా ఉన్నా బస్ డ్రైవర్ హారన్ కొట్టకూడదు, హారన్ కొడితే ఆర్టీసీ డ్రైవర్ అయినా వెంబడించి తంతాం అనే స్థాయికి YS Jagan Mohan Reddy పాలనలో శాంతి భద్రతలు దిగజారాయి! #HelloAP_ByeByeYCP JanaSena Party
Bolisetty Satyanarayana115,134 görüntüleme • 2 yıl önce

మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి నా బహిరంగ సవాల్. అబద్ధపు ఆరోపణలు ఇక చాలు - వాస్తవాలు మాట్లాడదాం రండి.. అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అమరావతిలోనే రాజధానిగా ఉండాలని, రైతుల పక్షాన నేను ఎప్పుడూ నిలబడ్డాను. నేను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్ మరియు పర్యావరణ రక్షణ కోసం మాత్రమే! వైసీపీ పాలనలో మీరు కలుగులో దాక్కున్న సమయంలో.. జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది నేను.. అలాంటి నేను YS Jagan Mohan Reddy మనిషినా? సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు. పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణే నా ఏకైక లక్ష్యం. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను.. మీ కట్టుకథలను పక్కన పెట్టి, తక్షణమే మీరు నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి. లేదంటే, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రండి? సమయం, వేదిక మీరే నిర్ణయించండి! Open Challenge to Former DGP AB Venkateswara Rao Enough of these false allegations—let’s talk facts. The allegations you are making against me regarding the Amaravati capital issue are completely baseless. I have always stood by the farmers and supported Amaravati as the capital. The cases I filed were solely intended to protect the Jaribu lands and the floodplains of Amaravati. While you were hiding in a hole during the YCP regime, I was the one who fought bravely against the atrocities of the Jagan Reddy government and for the protection of mangrove forests. Does that sound like I am YS Jagan Mohan Reddy’s man? My only goals are environmental conservation and protecting the Constitution. I will not compromise with anyone on these matters. Put aside your fabrications and immediately withdraw your comments and apologize. Otherwise, I challenge you to a public debate in front of the media. You decide the time and the venue! #Amaravati #ABVenkateswaraRao #BolisettySatyanarayana #PoliticalChallenge #SaveEnvironment #AndhraPradeshPolitics #TruthPrevails
Bolisetty Satyanarayana33,337 görüntüleme • 6 ay önce

అమలాపురంలో సీఎం YS Jagan Mohan Reddy గారి బస్సు యాత్రకు అనూహ్యంగా భారీగా జనం తాకిడి కంట్రోల్ చెయ్యడానికి.. రోప్ పార్టీలు..పోలీసులు చాలా కష్ట పడాల్సి వస్తుంది.. ఇక #HelloAP_ByeByeYCP అని కన్ఫర్మ్ అయిపోయింది.. #HelloAP_WelcomeJSP JanaSena Party JanaSena Shatagni
Bolisetty Satyanarayana114,288 görüntüleme • 3 yıl önce

మొన్న సింహాచలంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు దుర్మరణం చెందారు.. వెంటనే ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని వేసింది.. నిన్న ఆ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. కొంత విషయం మీడియా ద్వారా బయటకు వచ్చింది.. కానీ దర్యాప్తు ఇంకో కోణంలో కూడా జరపాలేమో అనిపిస్తుంది.. ఎందుకంటే.. 1. ఈ గోడ కట్టడానికి కాంట్రాక్ట్ గత ప్రభుత్వ హయాంలో వారికి ఇష్టమైన కాంట్రాక్టర్ కు 17.08.2023లో ఇచ్చారు 2. అప్పుడు ఋషికొండలో జగన్ రెడ్డి గారి కోసం ధృడంగా ప్యాలెస్ పర్యవేక్షణ చేసిన పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ గారే పర్యవేక్షణ చేశారు 3. ఏమో ఈ గోడ కూలి హిందూ భక్తులు చావాలనే అన్యమతస్థులు కుట్ర చేసేరా.? అన్న అనుమానం కలుగుతుంది.. 4. అసలు YS Jagan Mohan Reddy సింహాచలం వచ్చిందే డైవర్షన్ పాలిటిక్స్ చేయాడానికే నేమో?? ఇప్పుడు సంపూర్ణ విచారణ చేబట్టేటప్పుడు పై విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని విశాఖ వాసిగా నా విజ్ఞప్తి.. #SimhachalamTragedy #simhachalamtemple CMO Andhra Pradesh N Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan Kandula Durgesh Anitha Vangalapudi Andhra Pradesh Police #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana56,525 görüntüleme • 1 yıl önce

జగన్ రెడ్డి గారిని అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు అదః పాతాళానికి తొక్కేసారు.. ఇక సీబీఐ కోర్టు విచారణకు హాజరై నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటకి రావాలి అదొక్కటే జగన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక రహదారి.. కానీ విచారణకు హాజరైతే బయటకు రావాన్న సంగతి ఆయనకు తెలుసు..! Pawan Kalyan JanaSena Party YS Jagan Mohan Reddy YSR Congress Party #NDAAlliance #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana61,872 görüntüleme • 1 yıl önce

అసెంబ్లీలో కామినేని గారు మాట్లాడినవి అందుకు బదులుగా బాలకృష్ణ గారు మాట్లాడినవి నిన్న రికార్డుల నుండి తొలగించడం జరిగింది.. కాబట్టి చిరంజీవి గారికి అవమానం జరిగింది జనసేన ఎంమ్మెల్యేలు ఎందుకు స్పందించరు అని డిబేట్లు పెట్టిన మీడియా ఛానల్స్ వాటిలో మాట్లాడిన మేధావులు.. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి... అందరివాడైన చిరంజీవి గారిపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది వారికే నష్టం చేస్తుంది.. ఇకనైనా YS Jagan Mohan Reddy వారి పార్టీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే మంచిది.. Chiranjeevi Konidela Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Party YSR Congress Party #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana39,673 görüntüleme • 10 ay önce

రాష్ట్ర ప్రధాన కార్యదర్శగా ఉన్న నేను, విశాఖ తూర్పు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా కూడా ఉన్నాను, ఇక్కడ 5 దేవాలయాలు ఉన్నాయి అన్నింటికీ కమిటీలు వేశారు వాటిలో జనసేనకు చోటు లేదు, చివరిది అతి పెద్దది మత్స్యకార ఆరాధ్య దేవత ఆలయం కారకచేట్టు పోలమాంబ. నిన్న అమ్మవారి ఆలయ పాలకమండలి మొత్తం 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుండి ముగ్గురికి అవకాశం ఉండాలి. కానీ, ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. ఇది జనసేన వీరమహిళలను, జనసైనికులను తీవ్రంగా నిరుత్సాహ పరిచే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. క్షేత్రస్థాయిలో ఇలాంటి పొరపాట్లు దాదాపు అన్ని చోట్ల జరుగుతున్నాయని ప్రతి రోజూ నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నామీనేటెడ్ పదవుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, ఆశించిన 30% రిజర్వేషన్ అమలు కాలేదన్నది ఆరోపణ అది నిజం కాకూడదు అనే నా ఉదేశ్యం. జనసేన త్యాగానికి సముచిత గౌరవం ఇచ్చినప్పుడే రెట్టించిన ఉత్సాహంతో జనసైనికులు వీర మహిళలు భవిష్యత్తులో కూటమి విజయానికి పనిచేస్తారు🤝🙏 రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలన్నా, భవిష్యత్తులో వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా... శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ కార్యకర్తలకు రావాల్సిన వాటాను అందించి "కూటమి ధర్మాన్ని" కాపాడాలి. N Chandrababu Naidu Telugu Desam Party CMO Andhra Pradesh Pawan Kalyan JanaSena Party CMO Andhra Pradesh #NDAJointGovernment #JSP #TDP #BJP #PawanKalyan #AllianceDharma #JSPforNewAgePolitics JanaSena Shatagni
Bolisetty Satyanarayana26,517 görüntüleme • 6 ay önce

ఎందరో ఆశావహులను శాంతపరచే ఉద్దేశ్యంతో పెట్టిన ట్విట్టర్ పోస్టింగుకు కూటమి వ్యతిరేక మీడియా కాస్త వక్రభాష్యం చెప్పింది! YS Jagan Mohan Reddy ఇంటికి పంపే విషయంలో ఎప్పటికీ JanaSena Partyకి Pawan Kalyan గారికి నేను బలమే కానీ బలహీనత కాను, కాబోను #HelloAP_ByeByeYCP #HelloAP_VoteForJanaSenaTDPBJP
Bolisetty Satyanarayana81,844 görüntüleme • 2 yıl önce