B R Naidu's banner
B R Naidu's profile picture

B R Naidu

@BollineniRNaidu13,724 subscribers

Chairman of Tirumala Tirupati Devastanams

Shorts

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు గారు. #AdminPost #TTD #TelanganaCM

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు గారు. #AdminPost #TTD #TelanganaCM

60,665 views

Videos

BollineniRNaidu's profile picture

ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ గారి మనవడు దిక్పతీ మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తెలిపారు. నవనీతమ్మ గారిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. #TTD #Tirumala #LordVenkateswara #BRNaidu

B R Naidu

145,756 views • 25 days ago

BollineniRNaidu's profile picture

కియోస్క్ మిషన్లతో సులభతరంగా విరాళాలు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇచ్చే అవకాశం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు(సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన టీటీడీ ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో అందిన రూ.55 లక్షలు విరాళం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా మిషన్లు ఏర్పాటు ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15రోజుల్లో అందిన రూ.5 లక్షలు విరాళం ఇవాళ పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ఏర్పాటు చేసిన టీటీడీ మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్న టీటీడీ ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్న టీటీడీ #AdminPost #TTD #tirumala

B R Naidu

50,597 views • 1 year ago

BollineniRNaidu's profile picture

శ్రీవారి ఆలయ పైకప్పు మరమ్మతులు టీటీడీ పాలకమండలి తీర్మానం, చైర్మన్ బీఆర్ నాయుడు అదేశం మేరకు ప్రారంభమైన పనులు తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది. ఆలయ ప్రాకారంలోని పలు మండపాలు, ఉప ఆలయాలు...లడ్డూలు, అన్నప్రసాదాలు తయారు చేసే పొటు లు నిర్మాణం జరిగి వేల సంవత్సరాలు కావడంతో వాటి పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తోంది...ప్రధానంగా పొటులో వర్షపు నీరు లీకేజీ వల్ల ప్రసాదాల తయారీలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ క్రమంలో గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి చైర్మన్ బీఆర్ నాయుడు తీర్మానం చేశారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు. #AdminPost #TTD #tirumala

B R Naidu

29,780 views • 1 year ago

BollineniRNaidu's profile picture

సచివాలయంలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ప్రారంభమైన టీటీడీ సమావేశం. ఈ సమావేశానికి హాజరైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు,ఈఓ శ్యామలరావు,జేఈవో వెంకన్న చౌదరి వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో పెండింగ్ అంశాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు గారు అంశాలు : టీటీడీ పూర్తిస్థాయి ప్రక్షాళన, అభివృద్ధి తో పాటు.... తిరుమల పవిత్రత పెంపుదల పై సమీక్ష ఏఐ టెక్నాలజీ తో శ్రీవారి దర్శనం, వసతి తదితర సదుపాయాలు కల్పన అన్యమత ఉద్యోగులను ప్రభుత్వశాఖలకు బదిలీ దేశ, విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మాణం గత ప్రభుత్వ హాయంలో ఇష్టానుసారం జరిగిన నిధులు కేటాయింపులు ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు‌ బదిలీలు తదితర కీలక‌ ఆంశాలపై సీఎం దృష్టికి తీసుకురానున్న టిటిడి చైర్మన్ మరియు అధికారులు #AdminPost #TTD #amaravati #CBN #AndhraPradesh #TirumalaTirupatiDevasthanam

B R Naidu

26,231 views • 1 year ago

BollineniRNaidu's profile picture

ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన భేటీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడుతూ, తాను ఇటీవల తిరుమలను సందర్శించినప్పుడు అక్కడ జరిగిన మార్పులను, టీటీడీ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్శన అనంతరం టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు గారి పనితీరుపై తనకు గొప్ప అభిప్రాయం ఏర్పడిందని పేర్కొన్నారు. బి.ఆర్. నాయుడు గారు ఎనర్జిటిక్, డైనమిక్, మరియు సమర్థవంతమైన నాయకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారని, ఆయన నియామకం సరైన సమయంలో తీసుకున్న మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రహ్లాద్ జోషి గారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. #AdminPost #CBN #TTDevasthanams #ttdchairman #DevotionalService

B R Naidu

14,605 views • 1 year ago

No more content to load