
B R Naidu
@BollineniRNaidu • 13,707 subscribers
Chairman of Tirumala Tirupati Devastanams
Videos

ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ గారి మనవడు దిక్పతీ మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తెలిపారు. నవనీతమ్మ గారిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. #TTD #Tirumala #LordVenkateswara #BRNaidu
B R Naidu146,084 просмотров • 2 месяцев назад

తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటిరోజు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులు తొలిరోజు 550 నుండి 600 మంది వరకు తెలంగాణా లెటర్స్ పై విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించిన టీటీడీ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు గారికి మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపిన భక్తులు మంచి దర్శనం, వసతి కల్పిస్తున్న టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన భక్తులు #AdminPost #TTD #tirumalahills #tirupatibalaji #TDP #cbn #ChandrababuNaidu
B R Naidu110,871 просмотров • 1 год назад

తిరుమల తొక్కిసలాట దుర్ఘటన పై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ #AdminPost #TTDevasthanams #TTD #Tirupati
B R Naidu89,932 просмотров • 1 год назад

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు శుభ ముహూర్తంలో అర్ధరాత్రి దాటాక ప్రారంభమయ్యాయి. ధనుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదనలు అనంతరం ఆలయ జీయంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేశారు. అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించాం. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. #VaikuntaDwaraDarshan #Tirumala #TTD #LordVenkateswara #BhaktaSeva #SanatanaDharma
B R Naidu30,990 просмотров • 8 месяцев назад

కొండగట్టులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు కర్తకర్మ నిర్వహించడం అభినందనీయం. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని లేఖ ద్వారా ప్రతిపాదించగా, ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu ) గారి సూచనల మేరకు టీటీడీ నుంచి ₹35.19 కోట్లు కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా కొండగట్టు సమగ్ర అభివృద్ధికి టీటీడీ పూర్తి సహకారం అందిస్తుంది. #Kondagattu #TempleDevelopment #TTD #DevoteeWelfare #SanatanaDharma
B R Naidu30,364 просмотров • 8 месяцев назад

కియోస్క్ మిషన్లతో సులభతరంగా విరాళాలు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇచ్చే అవకాశం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు(సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన టీటీడీ ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో అందిన రూ.55 లక్షలు విరాళం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా మిషన్లు ఏర్పాటు ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15రోజుల్లో అందిన రూ.5 లక్షలు విరాళం ఇవాళ పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ఏర్పాటు చేసిన టీటీడీ మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్న టీటీడీ ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్న టీటీడీ #AdminPost #TTD #tirumala
B R Naidu50,597 просмотров • 1 год назад

సంక్రాంతిని భక్తులతో జరుపుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పండుగ వేళ భక్తులతో కలిసి భోజనం చేసిన చైర్మన్ బీఆర్ దంపతులు అన్నప్రసాదం రుచి, టీటీడీ సదుపాయాలు ఎలా ఉన్నాయని భక్తులను ఆరా తీసిన చైర్మన్ గతం కంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయంటు సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు #AdminPost #TTD #TTDevasthanams #Tirumala
B R Naidu46,557 просмотров • 1 год назад

శ్రీవారి ఆలయ పైకప్పు మరమ్మతులు టీటీడీ పాలకమండలి తీర్మానం, చైర్మన్ బీఆర్ నాయుడు అదేశం మేరకు ప్రారంభమైన పనులు తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది. ఆలయ ప్రాకారంలోని పలు మండపాలు, ఉప ఆలయాలు...లడ్డూలు, అన్నప్రసాదాలు తయారు చేసే పొటు లు నిర్మాణం జరిగి వేల సంవత్సరాలు కావడంతో వాటి పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తోంది...ప్రధానంగా పొటులో వర్షపు నీరు లీకేజీ వల్ల ప్రసాదాల తయారీలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ క్రమంలో గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి చైర్మన్ బీఆర్ నాయుడు తీర్మానం చేశారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు. #AdminPost #TTD #tirumala
B R Naidu29,780 просмотров • 1 год назад
Больше нет контента для загрузки