
HYDRAA
@Comm_HYDRAA • 78,721 subscribers
Official ‘X’ Account of Commissioner Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA)-040-29565758 - DRF Control Room - 9000113667
Shorts
Videos

🔷 అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్. 🔷 భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు. 🔷 రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్. 🔷ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు. 🔷పేదల యిల్లజోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్. 🔷కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన Mukheem గెస్ట్ హౌస్ తో పాటు, mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో యిళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా. 🔷 సంగారెడ్డి జిల్లా ameenpur మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 🔷 ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. 🔷 ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడుతున్న ప్రభుత్వం. 🔷 863 ఎకరాల భూమి విలువ 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 🔷 యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా Mukheem నిర్మించిన గెస్ట్ హౌస్ ను తొలగించిన హైడ్రా. 🔷 అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా Mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷ఐలాపూర్ లో Mukheem తమ్ముడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండడం లేదు. 🔷ఖాళీగా ఉన్న భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷కొంతమందిని ఆప్పటికప్పుడు అద్దెలకు దించి నివాసాలున్నట్టు చూపిన భావన నిర్మాణ దారుడు. 🔷 భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా. #HYDRAA #Ameenpur #EncroachmentRemoval #LandProtection
HYDRAA45,753 views • 2 months ago

All real estate ventures with legally valid permissions have nothing to fear. False news is being spread that HYDRAA will demolish structures near lakes, even those legally permitted by competent authorities. The Honorable Chief Minister of Telangana has categorically stated that no structure with valid permissions will be demolished. HYDRAA will strictly adhere to this directive. Telangana CMO Secretary MAUD. Vijayalaxmi Gadwal GHMC HMDA
HYDRAA130,722 views • 1 year ago

దుర్గంచెరువులో దూకబోతున్న... యువకుడిని కాపాడిన హైడ్రా శుక్రవారం.. సమయం సాయంత్రం 6.30 గంటలు...హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది దుర్గం చెరువు తీగల వంతెనపై వర్షపు నీరు నిలవకుండా.. కిందకు వెళ్లే రంద్రాలను శుభ్రం చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు తీగల వంతెన నుంచి దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఇంతలో డీఆర్ ఎఫ్ సిబ్బందిలో ఒకరు ఆ దృశ్యాన్ని చూశారు. మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఒక వైపు ఉన్నవారు వద్దు.. వద్దు అని వారిస్తుంటే.. మరో వైపు నుంచి మెరుపు వేగంతో వచ్చి యువకుడిని చాకచక్యంగా డీఆర్ ఎఫ్కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఒడిసి పట్టి బయటకు లాగాడు. దీంతో ప్రమాదం తప్పింది. అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. పేరు రామి రెడ్డి (25) అని..పెళ్లి అయి.. ఒక పాప కూడా ఉందని విచారణలో తెలిసింది. మద్యానికి బానిసై.. తాగిన మత్తులో ఇంట్లో గొడవపడి వచ్చి ఆత్మహత్యకు యత్నించినట్టు తేలింది. అలిగి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతే.. అతని సోదరికి రామిరెడ్డిని పోలీసులు అప్పగించారు. #HYDRAA #DRF
HYDRAA76,320 views • 10 months ago

మోకాల లోతుకే ఉప్పొంగిన గంగ హైడ్రా తవ్వకాల్లో బయటపడిన బతుకమ్మకుంట ♦️బతుకమ్మ కుంట బతికే ఉంది. మోకాలు లోతు మట్టి తీయగానే బిరబిరా గంగమ్మ బయటకొచ్చింది. ఇక అంతే అక్కడి స్థానికులలో ఆనందం పెల్లుబికింది. ♦️బతుకమ్మ కుంట కాదు.. ఇది మా స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారు ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ♦️కబ్జాల చెరలో చెరువు ఆనవాళ్లను కోల్పోయిన చెరువుకు ప్రాణం పోయమని స్థానికులు హైడ్రాను ఆశ్రయించిన విషయం విధితమే. ♦️ఈ మేరకు అక్కడి ముల్ల పొదలను తొలగించి... తవ్వకాలు చేపట్టిన హైడ్రాకు గంగమ్మ స్వాగతం పలికింది. ♦️మంగళవారం మోకాలు లోతు మట్టిని తీయగానే గంగమ్మ ఉబికి వచ్చింది. దశాబ్దాలుగా నింపిన మట్టిని మొత్తం తొలగిస్తే చెరువు కళకళలాడుతుందని స్థానికులు చెబుతున్నారు. ♦️అయితే బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టుకు వెళ్లాలని సూచించిన విషయం విధితమే. నాటి నుంచి పనులను హైడ్రా కొనసాగించింది. చెరువు చరిత్ర ఇది..: ♦️బాగ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఉంది. ♦️అంబర్పేట మండలం, బాగ్అంబర్పేట్లోని సర్వే నంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట. ♦️బఫర్ జోన్తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చిన సర్వే అధికారులు. ♦️తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే. ♦️ప్రస్తుతతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు. ♦️ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారి ఆదేశాలు. ♦️ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందన్న స్థానికులు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ♦️కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందన్న స్థానికులు. ♦️బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టనున్న హైడ్రా. బతుకమ్మ కుంటలో నీటితో కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడనుంది. Telangana CMO #Hydraa
HYDRAA82,500 views • 1 year ago

వరద ముప్పు లేకుండా.. నాళాల విస్తరణకు హైడ్రా శ్రీకారం. -ప్యాట్నీ నాలాతో శ్రీకారం. #HYDRAA
HYDRAA59,609 views • 1 year ago

రెండు కాలనీలను కలిపిన హైడ్రా అడ్డుగోడను తొలగించడంతో మార్గం సుగమం ✳️రెండు కాలనీల మధ్య దూరాన్ని హైడ్రా తగ్గించింది. అడ్డు గోడను తొలగించి అనుసంధానం ఏర్పాటు చేసింది. హబ్సీగూడలో స్ట్రీట్ నంబరు 6 లోఉన్న అడ్డుగోడ తొలగడంతో నందనవనం, జయానగర్ కాలనీల మధ్య దూరం తగ్గింది. ఇప్పుడు నందనవనంలోని స్ట్రీట్ నంబరు 4 నుంచి నేరుగా 6లోకి వచ్చి హబ్సీగూడ ప్రధాన రహదారికి చేరుకుంటున్నారు. గురువారం ఉదయాన్నే స్ట్రీట్ నంబరు 6లో ఉన్న అడ్డుగోడను హైడ్రా తొలగించింది. ఈ అడ్డుగోడ తొలగడంతో కేవలం 300 మీటర్లు ప్రయాణించి ఎన్జీఆర్ ఐ మెట్రో స్టేషన్కు చేరుకుంటున్నామని నందనవనం కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. లేదంటే ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణించి నానా అవస్థలు పడేవాళ్లమని.. ఇప్పుడా ఇబ్బంది తొలగించదన్నారు. 15 ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం... ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులను కలిసాం ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరకు జయానగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడినా జగడమే కాని.. సమస్య పరిష్కారం కాలేదు. ఇదే విషయమై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో వెంటనే పరిష్కారం దొరికిందని నందనవనంలోని కాంక్రేట్ ట్రంపెట్ అపార్టుమెంటు వాసులు చెబుతున్నారు. #HYDRAA
HYDRAA50,491 views • 11 months ago

శ్మశానవాటికలో అక్రమ లేఔట్ కరోనా సమయంలో కబ్జాల పర్వం పునాదులతో పాటు ప్రహరీలను తొలగించిన హైడ్రా 🔶 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కంచ పర్వతాపూర్ గ్రామం శ్మశాన వాటికలో వెలిసిన అక్రమ లే ఔట్ను, కట్టడాలను హైడ్రా గురువారం తొలగించింది. ప్రభుత్వ భూమిలో 40 ఏళ్లకు పైగా సాగుతున్న శ్మశాన వాటికను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరుపుతున్నారనే ఫిర్యాదుల మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. 3 షాపులతో పాటు.. 15 ప్లాట్లకు వేసిన పునాదులు, రెండు మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రహరీలను, అందులో వేసిన షెడ్డులను హైడ్రా తొలగించింది. 🔶 ఫిర్యాదు అందిందిలా.. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని కంచ పర్వతాపూర్ గ్రామంలో మైనారిటీలకు సంబంధించిన శ్మశానవాటికలు రెండు ఉన్నాయి. వీటిని కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయాలు జరిపారని హైడ్రా ప్రజావాణిలో అక్కడి శ్మశాన పరిరక్షక ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సుఖేందర్ రెడ్డికి సర్వే నంబరు 12లో సొంత భూమి ఉంది. తనకి ఉన్న ప్రైవేటు భూమికి పక్కనే సర్వే నంబరు 1లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వభూమిలో ఉన్న శ్మశాన వాటికల స్థలాన్ని కూడా కబ్జా చేసి లే ఔట్ వేశారు. అప్పటికే ఉన్న సమాధులపై మట్టి పోసి అవి కనిపించకుండా చేశారు. ఫిర్జాదీగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి, మాజీ కోఅప్షన్ మెంబరు జగదీశ్వర్ రెడ్డితో కుమ్మక్కయిన సుఖేందర్రెడ్డి ఈ కబ్జాలకు పాల్పడ్డారు. కరోనా సమయంలో ఇదంతా జరిగింది. లే ఔట్ వేసిన నుంచి వివాదం ఉందని తెలిసినప్పటికీ రజనీకాంత్ రెడ్డి అనే వ్యక్తి 200ల గజాల ప్లాట్ను కొన్నారు. 3 షాపులు నిర్మించి ప్రతి నెల పెద్ద ఎత్తున్న రెంటులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుదారులు చెప్పారు. 🔶 తప్పుడు కేసు వివరాలతో.. ప్రభుత్వ భూమిలో ఉన్న శ్మశానవాటికలను కబ్జా చేయడమే కాకుండా.. ఆ లేఔట్లోకి వెళ్లకుండా కోర్టు కేసులున్నాయని కబ్జాదారులు నమ్మబలికారు. 15 ప్లాట్ల ప్రహరీలమీద .. తప్పుడు రిట్ పిటిషన్ నంబర్లను రాయించారు. అటువైపు తాము వెళ్లకుండా అడ్డుకోవడానికే ఇలా చేశారని ప్రజావాణిలో పేర్కొన్నారు. ఇదంతా కొవిడ్ సమయంలో జరిగింది. తన సొంత భూమికి చెందిన సర్వే నంబరు చూపించి తప్పుడు అనుమతులు తీసుకోవడం.. అక్రమ కట్టడాలు చేపట్టడం జరిగిపోయింది. మాజీ మేయర్, కోఆప్షన్ మెంబరు సహకారంతో ఈ కబ్జాల పర్వం జరిగిపోయింది. తప్పుడు సర్వే నంబరు జోడించి అనుమతులు రావడంలో అప్పటి మున్సిపల్ మేయర్, కో ఆప్షన్ మెంబర్ సహకరించారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. సర్వే చేయించుకుని హద్దులు నిర్ధారించుకోవడం.. కొర్టు ద్వరా హక్కులు పొందకుండా భజబలంతో సొంతంగా నిర్ణయించుకున్నారని ఫిర్యాదు దారులు వాపోయారు. 🔶 ఫిర్యాదుల పరిశీలన ఇలా.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను గూగుల్ మ్యాప్స్, ఎన్ ఆర్ ఎస్ సీ ఇమేజీలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. అక్కడితో ఆగకుండా.. బుధవారం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని శ్మశాన వాటికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైడ్రా, స్థానిక రెవెన్యూ అధికారులతో విచారించి ప్రభుత్వ స్థలమే.. ఇందులో శ్మశానవాటికలున్నాయని నిర్ధారించుకున్నారు. సమాధులు కనిపించకకుండా మట్టితో కప్పినట్టు ఉండడాన్ని కూడా పరిశీలించారు. స్థానికులతో కూడా కమిషనర్ మాట్లాడారు. 7 ఏళ్లుగా ధర్నాలు చేశామని, అధికారులు, కోర్టులు చుట్టూ తిరిగామని శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఈ సంద్భంగా కమిషనర్కు తెలిపారు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 🔶 హైడ్రా చర్యలు ఇలా.. గురువారం ఉదయం హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఇక్కడ మూడు షాపులలో సామాన్లను తరలించడానికి కొంత సమయం కావాలని అడగగా.. వారికి హైడ్రా సహకరించింది. సామాన్లు మొత్తం తరలించిడంలోనూ హైడ్రా సిబ్బంది సహాయం చేశారు. మొత్తం సామాన్లు వాహనాలోకి ఎక్కించిన తర్వాత ఆ షాపులను కూడా హైడ్రా తొలగించింది. 200ల గజాల ప్లాట్లో ఉన్న 3 దుకాణాలతో పాటు.. పునాదులు వేసి 2 మీటర్ల ఎత్తులో నిర్మించిన 15 ప్లాట్ల ప్రహరీలను హైడ్రా తొలగించింది. 🔶సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. అక్కడ కబ్జాలకు పాల్పడిన వారు సామాన్యులు కాదు. మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మాజీ కోఅప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని సహకరించడంతో ఖేందర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ లే ఔట్ వేసి శ్మశానాన్ని కబ్జా చేశారు. ఆ స్థలంపై వివాదం ఉందని తెలిసే రజనీకాంత్ రెడ్డి 200ల గజాల ప్లాట్ను కొని ఫాపులు ఏర్పాటు చేశారు. రూ. 50 వేలకు పైగా ఆ షాపులపై ప్రతి నెలా రెంటులు వసూలు చేస్తున్నరు. ఆ షాపులు అద్దెకు తీసుకున్నవారికి ఈ వివాదాలేవీ తెలియవు. దుకాణదారులకు తగిన సమయం ఇచ్చి అక్కడ కూల్చివేతలు హైడ్రా చేపట్టింది. 7 ఏల్ల పోరాటం ఫలించిందని.. ఎకరాకు పైగా ఉన్న శ్మశాన వాటికల భూమి కాపాడుకోగలిగామని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. Telangana CMO #HYDRAA
HYDRAA55,290 views • 1 year ago

లిఫ్ట్లో ఇరుక్కుపోయిన బాలుడు కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు ♦️లిఫ్టుకు - స్లాబ్కు మధ్య ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడిని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు శుక్రవారం కాపాడాయి. ♦️మాసబ్ ట్యాంకు, శాంతినగర్లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంటులో లిఫ్ట్ డోర్ కు గోడకు మధ్య 6 సంవత్సరాల అర్నవ్ ఇరుక్కున్నాడు అని హైడ్రాకు ఫిర్యాదు రాగానే డీఆర్ ఎఫ్ రంగంలోకి దిగింది. ♦️మధ్యాహ్నం 2.29 గంటలకు ఘటన జరిగినట్టు సమాచారం అందుకోగానే డీఆర్ ఎఫ్ మొదటి బృందం 10నిమిషాల్లో చేరుకుంది. తర్వాత మరో రెండు బృందాలు తోడయ్యాయి. ♦️గ్రిల్తో ఉన్న లిఫ్ట్ డోర్ తెరిచిన వెంటనే బయటకు వచ్చే క్రమంలో అంతస్తు స్లాబ్కు - లిఫ్ట్కు మధ్య ఉన్న గ్యాప్(ఖాళీగా ఉన్న సందులో)లో పడిపోయి కిందకు జారి మొదటి అంతస్తు దగ్గర ఇరుక్కున్నట్టు నివాసితులు చెప్పారు. ♦️నాలుగు అంతస్తుల అపార్టుమెంట్లో మూడో అంతస్తులో పిల్లలతో ఆడుకుని లిఫ్టు ఎక్కి జారిపడినట్టు నివాసితులు తెలిపారు. లిఫ్ట్ ఎవరూ ఆపరేట్చేయకుండా ముందుగా కరెంటు కనెక్షన్ తొలగించారు. ఆ వెంటనే డీఆర్ ఎఫ్ బృందాలు ఆపరేషన్ మొదలు పెట్టాయి. ♦️గ్యాస్కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పనిముట్లుతో లిఫ్టు ఫ్రేమ్ను కట్ చేయడంతో పాటు.. స్లాబ్ను కూడా అతి కష్టమ్మీద కట్ చేసి బాలుడుని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయి. ♦️సరిగ్గా 4.35 గంటల ప్రాంతంలో బయటకు తీసి.. తల్లిదండ్రులకు అప్పగించి.. తర్వాత ఆసుపత్రికి తరలించారు. ♦️జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎ. యజ్ఞ్ననారాయణ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి. దత్తు ఆధ్వర్యంలో డీఆర్ ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్ను పూర్తి చేశాయి. ♦️లిఫ్టు ఫ్రేమ్లు కట్ట చేసి క్లిష్టమైన ఈ ఆపరేషన్ను పూర్తి చేసి.... పిల్లాడిని సురక్షితంగా బయటకు తీయడాన్నిచూసిన స్థానికులు హైడ్రా బృందాలను అభినందించారు. Telangana CMO #HYDRAA #DRFHYDRAA
HYDRAA64,493 views • 1 year ago

-మూసీ నది గర్భంలో ఆక్రమణల తొలగింపు -20 మీటర్లకు పైగా మట్టితో నింపిన కబ్జాదారులు -కోర్టు ధిక్కరణ కేసులున్నా వెరవని వైనం -వాహనాల పార్కింగ్తో వ్యాపార దందా నగరం నడిబొడ్డున.. ఎంజీబీఎస్, హైకోర్టు ఒక వైపు.. మరో వైపు ఉస్మానియా ఆసుపత్రి.. ఇలా వేలాది మంది సంచరించే ప్రాంతంలో కబ్జాల పర్వం కొనసాగింది. మూసీ నది గర్భంలో... 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి రోడ్డుకు సమాంతరంగా చేసి ఆక్రమణలకు ఒడికట్టారు. ఆ ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభించి... మధ్యాహ్నం 1 గంటకు పూర్తి చేసింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి 9.62 ఎకరాల భూమిని కాపాడింది. వాహనాల పార్కింగ్, పండ్లను నిలవ ఉంచేందుకు ఫ్రీజర్ల ఏర్పాటుతో పాటు నర్సరీ పేరిట నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారానికి హైడ్రా అడ్డుకట్ట వేసింది. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించింది. మూసీ ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది. షెడ్డులు వేసుకుని నివాసముంటున్న వారి విషయంలో ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడింది. ❇️ కోర్టు ధిక్కరణ కేసులున్నా కొనసాగిన కబ్జాలు తికారం సింగ్ 3.10 ఎకరాల మేర కబ్జా చేశారు. 1.30 ఎకరాల మేర పూనమ్ చాంద్ యాదవ్ ఆక్రమించారు. 5.22 ఎకరాల మేర జయకృష్ణ కబ్జా చేశారు. వీరిపై కోర్టు దిక్కరణ కేసులు కూడా ఉన్నాయి. ఈ కబ్జాలపై హైకోర్టు గతంలోనే కన్నెర్రజేసింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని కూడా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు నాటి హైదరాబాద్ కలెక్టర్ వారిపై కేసులు కూడా పెట్టారు. ఇలా కోర్టు ధిక్కరణతో పాటు పోలీసు కేసులకు వెరవకుండా కబ్జాల పర్వం కొనసాగించారు. వాహనాల పార్కింగ్కు ప్రధానంగా వాడారు. పండ్లను నిలువ చేసేందుకు ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేశారు. నర్సరీని కొంతమేర పెంచి వ్యాపార దందా కొనసాగిస్తున్నారు. అక్కడ కార్యాలయాల నిమిత్తం చిన్న షెడ్డులు కూడా నిర్మించారు. ఒక్కో వాహనానికి రోజుకు రూ. 300ల వరకూ వసూలు చేసి బస్సులు, లారీల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. నదీ గర్భంలోకి ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేయడమే కాకుండా.. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పరిసర ప్రాంతాల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ❇️ 20 మీటర్ల మేర మట్టితో నింపి.. ఒకటి రెండు రోజుల్లో జరిగిన ఆక్రమణలు కావివి. మూసీ నదికి నిజాం కాలంలో రాతితో కట్టిన రిటైనింగ్ వాల్ స్పష్టంగా ఉంది. నదిలోంచి పైన రోడ్డుకు సమాంతరం చేసేందుకు వేలాది లారీలతో మట్టిని, నిర్మాణ వ్యర్థాలను పోశారు. ఇలా దశాబ్దాలుగా మూసీ నదిలో మట్టిని పోసి 20 మీటర్లకు పైగా నింపారు. అఫ్జల్గంజ్ రహదారికి సమాంతరంగా నదిని మార్చేశారు. వందల వేలాది బస్సులు, లారీల పార్కింగ్కోసం వినియోగిస్తుంటే వాటిని ఖాళీ చేయించింది హైడ్రా. షెడ్డులు వేసుకుని వ్యాపారం చేస్తుంటే వాటిని తొలగించి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫొటోలు చూస్తే.. వాహనాల పార్కింగ్తో మూసీ ఎలా నిండి ఉంది.. తర్వాత ఎలా ఖాళీ అయ్యిందనేది స్పష్టమౌతుంది. మూసీ పరీవాహకం కబ్జాలను తొలగించిన హైడ్రాకు స్థానికులు అభినందనలు తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ❇️ మూసీ సుందరీకరణతో సంబంధం లేదు.. మూసీ సుందరీకరణ పనులతో హైడ్రాకు సంబంధం లేదు. నదిలో ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడం వరకే హైడ్రా పరమితమైంది. మూసీని మట్టితో నింపి వ్యాపారానికి అడ్డాగా మార్చుకోవడంపైనే హైడ్రా చర్యలు తీసుకుంది. మూసీ సుందరీకరణ.. అభివృద్ధిలో హైడ్రా భాగస్వామ్యం అవ్వడంలేదని స్పష్టం చేసింది. ఓఆర్ ఆర్ పరిధిలో నాలాలు, చెరువులు, పార్కులు, రహదారుల కబ్జాలను తొలగించిన మాదిరే మూసీ నదిలో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. #HYDRAA #Hyderabad
HYDRAA46,388 views • 10 months ago

✅ HYDRAA has removed encroachments at Durgam Cheruvu by clearing 5 acres of illegal occupation, with satellite images revealing how the lake has shrunk from 160 acres to 116 acres over the years. #HYDRAA #DurgamCheruvu #LakeProtection #StopEncroachments #HyderabadLakes
HYDRAA23,426 views • 5 months ago

సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణల తొలగింపు అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా శ్రీధరరావుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 🔶 శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలను మంగళవారం హైడ్రా తొలగించింది.ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా చర్యలు తీసుకుంది. అనుమతి లేకుండా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్ మిని హాల్తో పాటు.. ప్రధాన కన్వెన్షన్ను ఆనుకుని నిర్మించిన వంట గదులను, 10 రెస్టు రూంలను హైడ్రా తొలగించింది. అలాగే ఐరన్ పిల్లర్లతో జీ ప్లస్ 2గా నిర్మించిన రెండు కట్టడాలను కూడా కూల్చింది. 1980 దశకంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 162 ప్లాట్లతో లే ఔట్ వేయగా దాని నామ రూపాలు లేకుండా సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు చేశారంటూ హైడ్రా ప్రజావాణిలో పలువురు ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. `` సంధ్యా కన్వెన్షన్ పేరిట అడుగుపెట్టి పక్కనే ఉన్న మా లే ఔట్ను కబ్జా చేశారు. కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ల చిరునామా లేకుండా..మొత్తం హద్దులను చెరిపేశారు. లే ఔట్లో రహదారులు, పార్కుల ఆనవాళ్లు లేకుండా ఆక్రమించేశారు. ఇదేమని అడిగితే తమపైనే దాడులు చేశారు. ఈ మోసాలను తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒకటా రెండా.. 30 వరకూ కేసులు ఆయనపై పలు పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. తమ లే ఔట్కు సంబంధించి కూడా 5కు పైగా కేసులు ఆయనపై నమోదయ్యాయి. హైడ్రా రావడంతో మాకు ధైర్యంవచ్చింది. మీరైనా చర్యలు తీసుకోండి `` అని లే ఔట్లోని పలువురు ప్లాట్ యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రాకు సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలు ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడ్డాయి. అక్కడ లే ఔట్ నామరూపాలు లేకుండా కబ్జాలు జరిగాయని.. పలునిర్మాణాలకు అనుమతులు లేవని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారికి అధికారులు నివేదించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. లే ఔట్ చుట్టూ నిర్మించిన ప్రహరీతో పాటు పలు ఆర్చిలను హైడ్రా కూల్చివేసింది. శ్రీధరరావుపై కొనసాగుతున్న ఫిర్యాదులు.. 🔶 హైడ్రా చర్యలతో ధైర్యాన్ని కూడగట్టుకున్నబాధితులు వివిధ మార్గాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. నగరంలో ఉన్నవారే కాకుండా.. విదేశాల్లో ఉన్నవారు కూడా హైడ్రాను ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తున్నారు. తమను లే ఔట్లోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారని.. మా ప్రమేయం లేకుండా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రాయించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదుచేశారు. విదేశాల నుంచి మెయిల్స్తో పాటు.. వీడియో రూపంలో వారి గోడును వెల్లగక్కుతున్నారు. అక్కడ మేము కొనుక్కున్న ప్లాట్ లేదని శ్రీధరరావు మనుషులు చెప్పడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారంటూ దిల్లీ నుంచి ఓ మహిళ ఆన్లైన్లో ఫిర్యాదుచేశారు. త్వరలో హైదరాబాద్ వచ్చి హైడ్రా కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేస్తానంటూ వేడుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా హైడ్రాను సంప్రదిస్తున్నారు. ఒక్క ఫెర్టిలైజర్స్ కార్పరేషన్ ఉద్యోగుల లే ఔట్ వారే కాకుండా.. వేర్వేరు ప్రాంతాల్లో శ్రీధర రావు చేసిన ఆక్రమణలపై ఫిర్యాదులందుతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలకు సంబంధించి హైడ్రాకు పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. Telangana CMO #HYDRAA
HYDRAA42,022 views • 1 year ago

🔹సున్నం చెరువు ఆక్రమణల తొలగింపు 🔹విషతుల్యమైన నీటి దందాకు హైడ్రా బ్రేకులు 🔹బోర్లను తొలగించి.. నీటి ట్యాంకర్ల సీజ్ చేసిన హైడ్రా 🔹హైడ్రా విధులకు ఆటంకం కలిగిస్తున్న వెంకటేష్పై కేసు సున్నం చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా స్పీడప్ చేసింది. ఈ క్రమంలో ఫుల్ ట్యాంక్ పరిధిలో మిగిలిన ఆక్రమణలను సోమవారం తొలగించింది. విషతుల్యం అని తెలిసినా.. సున్నం చెరువు ఆవరణలో బోర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంది. పదుల సంఖ్యలో ఉన్న బోర్లను తొలగించడమే కాకుండా.. ట్యాంకర్లను సీజ్ చేసింది. బోర్లుకు ఆనుకుని వేసిన షెడ్డులను కూడా హైడ్రా తొలగించింది. పీసీబీ ద్వరా పరీక్షలు చేయించి.. అక్కడి నీరు చాలా ప్రమాదకరమని వివరించినా పట్టించుకోకుండా నీటి దందా చేస్తున్నవారిపై కేసులు పెట్టింది. ఎవరి ఆరోగ్యాలు ఎలా పాడైనా ఫర్వాలేదు.. తన నీటి వ్యాపారం కొనసాగడమే చాలు అని హైడ్రా విదులకు ఆటంకం కలిగిస్తున్న వెంకటేష్పై మాధాపూర్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వెంకటేష్ను మాధాపూర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. 🔷ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణపైనే చర్యలు 1970లో సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ల ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు. ఈ క్రమంలోనే 2016లో హెచ్ ఎండీఏ ఈ చెరువు విస్తీర్ణాన్ని 32 ఎకరాలుగా పేర్కొంటూ ప్రాథమికంగా నిర్ధారించింది. అలాగే 2014లో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖలు నిర్ధారించిన హద్దుల మేరకే నగరంలో చెరువుల పునరుద్ధరణ జరుగుతోంది. సున్నం చెరువు విషయంలో కూడా అలాగే అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా స్పష్టం చేసింది. అందుకే అక్కడ గతంలో వేసిన లే ఔట్ను ఏళ్లక్రితం హుడా రద్దు చేసింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నందునే అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి 10 ఏళ్లుగా అనుమతులు ఇవ్వడంలేదు.కోర్టు కేసుల్లో ఈ అంశం ఉందని అక్కడి ప్లాట్ యజమానులు చెబుతున్నారు. ఒక వేళ ఎవరైనా నష్టపరిహారానికి అర్హులమని భావిస్తే వెంటనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని హైడ్రా సూచించింది. అలాగే టీడీఆర్ ( ట్రాన్సఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్) కింద కూడా చట్ట ప్రకారం నష్టపరిహారం పొందవచ్చునని పేర్కొంది. 🔷బోర్లను తొలగించిన హైడ్రా.. బోరు బావుల నీరు విషతుల్యమని తెలిసినా వెంకటేష్ నేతృత్వంలో అక్కడ నీటి వ్యాపారం కొనసాగుతోంది. వెంకటేష్కు చెందిన షెడ్డులో రూ. లక్షల మొత్తంలో ఉన్న నగదును మాధాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సిండికేట్గా నీటి వ్యాపారం చేయించడమే కాకుండా.. అక్కడే మందు పార్టీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఏకంగా చెరువు పరిధిలో బోర్లు వేసినట్టు అక్కడి మోటార్లు, వాటికి అమర్చిన ప్లాస్టిక్ పైపులు రుజువు చేస్తున్నాయి. దుర్గంధభరితంగా మారిన సున్నం చెరువు చెంత ఉన్న బోర్లలో ప్రమాదకర రసాయనాలు, భార లోహాలైన సీసం, కాడ్మియం, నికెల్ ఉందని.. ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైడ్రా గతంలోనే హెచ్చరించింది. ఈ మేరకు పీసీబీ ఇచ్చిన నివేదికను కూడా బయట పెట్టింది. క్యాన్సర్, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో పాటు.. కిడ్నీలు పాడౌతాయని.. గర్భశ్రావాలు కూడా అవుతాయని హెచ్చరించింది. అయినా ఆ నీటిని తాగునీటిగా హాస్టళ్లు, నివాసాలకు, కార్యాలయాలకు సరఫరా చేస్తూనే ఉన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్న బోర్లను పూర్తిగా తొలగించింది. 🔷చకచకా చెరువు పునరుద్ధరణ పనులు.. మాధాపూర్ ఐటీకారిడార్కు చేరువగా.. బోరబండ బస్తీకి ఆనుకుని.. గుట్టలబేగంపేట వద్ద ఉన్న సున్నం చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువులో కొన్ని దశాబ్దాలుగా రెండు మూడు మీటర్ల మేర పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు చెత్తను హైడ్రా తొలగించింది. చెరువులోకి మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలాలను ఏర్పాటు చేసింది. వర్షపు నీరు సులభంగా చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు నిర్మించే పనులకు కూడా శ్రీకారం చుట్టింది. అలాగే పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రెన్స్ పార్కు, ఓపెన్ జీమ్లను ఏర్పాటు చేసి.. పరిసర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు తీసుకుంటోంది. దోమలు, క్రిములు, కీటకాలతో దుర్గంధ భరితంగా ఉన్న వాతావరణం తొలగిపోవడంతో అక్కడ ఇంటి కిరాయిలు పెరిగాయి. ఇంటి స్థలాల ధరలు కూడా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే మాకు ఎంతో ఊరటని స్థానికులంటున్నారు. ఈ వర్షాకాలంలోనే చెరువును పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి హైడ్రా చకచకా పనులు సాగిస్తోంది. #HYDRAA
HYDRAA33,314 views • 11 months ago

🔶 బంజారాహిల్స్ లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా 🔹5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న హైడ్రా. 🔹రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. 🔹షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా. 🔹5 ఎకరాలలో జలమండలి కి 1.20 ఎకరాలను గతంలో కేటాయించిన ప్రభుత్వం. 🔹1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ కోర్టుకెక్కిన పార్థసారథి 🔹చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టిన పార్థసారథి. 🔹కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డు లు నిర్మించుకొని పహరా. 🔹ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు. 🔹అనేక నివప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను అడ్డుకున్న పార్థసారథి. 🔹హైడ్రాకు ఫిర్యాదు చేసిన జలమండలి, రెవెన్యూ అధికారులు. 🔹ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథి. 🔹ఈ మేరకు పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు పెట్టిన రెవెన్యూ, జలమండలి. 🔹వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు నిర్ధారణ. 🔹ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్ధారించుకున్న హైడ్రా. 🔹షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు. 🔹పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొలగించిన హైడ్రా. 🔹5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసిన హైడ్రా. #HYDRAA #Hyderabad #BanjaraHills #EncroachmentRemoval #GovernmentLand
HYDRAA24,834 views • 8 months ago

-- సంధ్యా శ్రీధర్రావు అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు -- రహదారులకు అడ్డంగా నిర్మించిన భవనాల కూల్చివేత -- హైకోర్టు ఆదేశాలమేరకు రహదారులను పునరుద్ధరించిన హైడ్రా -- రహదారుల పునరుద్ధరణతో ఊపిరి పీల్చుకున్న ప్లాట్ యజమానులు ✳️ శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని సంధ్యా శ్రీధరరావు నిర్మించిన పలు అక్రమ కట్టడాలను సోమవారం హైడ్రా కూల్చివేసింది. ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ (ఎఫ్సీఐ) లే ఔట్లో రహదారులు, పార్కులను పట్టించుకోకుండా.. చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైడ్రా ఈ చర్యలుతీసుకుంది. 40 ఫీట్ల రహదారిపై అడ్డంగా ఐరన్ ఫ్రేమ్తో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని తొలగించి రహదారిని క్లీయర్ చేసింది. అలాగే 40 ఫీట్ల రహదారిని పట్టించుకోకుండా.. నిర్మించిన మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొలగించింది. మరో చోట 40 ఫీట్ రహదారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొలగించి.. మార్గం సుగమం చేసింది. 40 ఫీట్ల రహదారిని కలిపేసి నిర్మించిన పెట్రోల్ బంక్ను కూడా పాక్షికంగా తొలగించింది. రెండు చోట్ల 25 ఫీట్ల రహదారులపై ఏర్పాటు చేసిన 40 వరకూ ఉన్న ఫుడ్ కంటైనర్లతో పాటు చైనా ఫుడ్ కోర్టులను తొలగించి మార్గాలను క్లియర్ చేసింది. 40 ఫీట్ల రహదారిపైకి జరిగి నిర్మించిన ఆసుపత్రి భవనం సెల్లార్ ర్యాంపులను హైడ్రా సోమవారం తొలగించింది. ఇలా మొత్తమ్మీద 7 చోట్ల రహదారులను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను తొలగించింది. రహదారుల హద్దులను నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు లే ఔట్లోని రహదారులను హైడ్రా పునరుద్ధరించడంతో అక్కడి ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ✳️ హైకోర్టు ఆదేశాలమేరకు.. గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ (ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ) లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలను హైకోర్టు మంగళవారం తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్లో 162 వరకూ ప్లాట్లుండగా.. అందులోని మెజార్టీ ప్లాట్లు నావనే ఉద్దేశంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. ఒకసారి లే ఔట్ వేస్తే.. అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. గతంలో ఆక్రమణలు తొలగించడంపై సంధ్యాశ్రీధరరావు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇదే కేసులో బాధిత ప్లాట్ యజమానులు కూడా కోర్టుకు వారి గోడును విన్నవించుకున్నారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని.. లే ఔట్లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో వెంటనే రహదారులను పునరుద్ధరించాలని కోర్టు పేర్కొంది. దీంతో సంధ్యా శ్రీధర్ రావు ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంది. ✳️ 1980వ దశకంలో వేసిన లే ఔట్.. ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట1980 దశకంలో 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 162 ప్లాట్లతో లే ఔట్ వే శారు. దాని నామ రూపాలు లేకుండా సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు చేశారంటూ హైడ్రా ప్రజావాణిలో పలువురు ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. `` సంధ్యా కన్వెన్షన్ పేరిట అడుగుపెట్టి పక్కనే ఉన్న మా లే ఔట్ను కబ్జా చేశారు. కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ల చిరునామా లేకుండా..మొత్తం హద్దులను చెరిపేశారు. లే ఔట్లో రహదారులు, పార్కుల ఆనవాళ్లు లేకుండా ఆక్రమించేశారు. ఇదేమని అడిగితే తమపైనే దాడులు చేశారు. ఈ మోసాలను తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒకటా రెండా.. 30 వరకూ కేసులు ఆయనపై పలు పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. తమ లే ఔట్కు సంబంధించి కూడా 5కు పైగా కేసులు ఆయనపై నమోదయ్యాయి. హైడ్రా రావడంతో మాకు ధైర్యంవచ్చింది. మీరైనా చర్యలు తీసుకోండి `` అని లే ఔట్లోని పలువురు ప్లాట్ యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రాకు సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలు ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడ్డాయి. అక్కడ లే ఔట్ నామరూపాలు లేకుండా కబ్జాలు జరిగాయని.. పలునిర్మాణాలకు అనుమతులు లేవని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారికి అధికారులు నివేదించారు. కమిషనర్ ఆదేశాల మేరకు గతంలో ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం విధితమే. అయినప్పటికీ సంధ్యాశ్రీధర్రావు ధోరణి మారలేదు. నిర్మాణాలు కొనసాగించడంతో సోమవారం మరోసారి ఆక్రమణలకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా తొలగించింది. #HYDRAA
HYDRAA21,320 views • 6 months ago

-- ప్రగతినగర్ చెరువు పేరు నిలబెట్టే పనిలో హైడ్రా -- చెరువు చుట్టూ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం -- ఫెన్సింగ్ వేసి కాపాడేందుకు హైడ్రా చర్యలు -- హైడ్రాతో చేతులు కలిపిన స్థానిక నివాసితులు ✳️ పక్షుల కిలకిలరావాలతో.. వలసపక్షుల విడిదితో ఆహ్లాదంగా ఉన్నప్రగతినగర్ (అంబీర్)చెరువు దుర్గంధభరితంగా మారిపోయింది. వ్యర్థాల డంపిగ్ యార్డుగా తయారై ఆహ్లాదం ఆనవాళ్లు లేకుండా తయారయ్యింది. ఇప్పుడా చెరువును పరిరక్షించేందుకు హైడ్రా నడుం బిగించింది. ఆహ్లాదం ఆవిరై.. దుర్గంధభరితంగా మారిన చెరువును కాపాడేందుకు రంగంలోకి దిగింది. చెరువు ఒడ్డున పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం సోమవారం ప్రారంభించింది. ఇప్పటికే 30 ట్రక్కుల చెత్తను తొలగించింది. మరో 30 ట్రక్కుల వరకూ ఉంటుందని అంచనా వేసింది. ఒకటిరెండు రోజుల్లో మొత్తం అక్కడి వ్యర్థాలను తొలగించడానికి ఏర్పాట్లు చేసింది. కూకట్పల్లి - ప్రగతినగర్లను కలుపుతూ ప్రగతినగర్ చెరువు మధ్యలోంచి వేసిన రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలను తొలగించి.. భవిష్యత్తులో అక్కడ చెత్త వేయడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైడ్రా నిర్ణయించింది. -- స్థానికుల సహకారంతో.. ✳️ 169 ఎకరాల వరకూ ఉండే ప్రగతినగర్ చెరువు ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవించిన స్థానికులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదన చెందారు. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు పొడవునా చికెన్, మాంసం, చేపల విక్రేతలు వ్యర్థాలను పడేస్తున్నారని HYDRAAకు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన మరియు నీటి వనరు కాలుష్యం ఏర్పడింది. ఫర్ ఏ బెటర్ సొసైటీ ప్రతినిధులు కూడా ఈ చెరువు పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది. ఈ చెరువును కబ్జాల నుంచి కాపాడడంతో పాటు.. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని వీరంతా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని ఆశ్రయించారు. స్థానిక ప్రజలు/ప్రజా సంఘాలు మొదలైన వారి భాగస్వామ్యంతో మాంసం అమ్మే దుకాణాలను సమీపంలోని ప్రదేశానికి (ప్రస్తుత రోడ్డు వైపు నుండి) మార్చడానికి కూడా ప్రయత్నిస్తోంది. -- చెరువు చుట్టూ నిఘా.. ✳️ నగరంలో చెరువుల అభివృద్ధిని ఇప్పటికే ప్రారంభించిన హైడ్రా.. స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రగతినగర్ చెరువు ప్రగతిపై దృష్టి పెట్టింది. చెరువులో నాన్ వెజ్ వ్యర్థాలు వేయకుండా నిఘా పెట్టింది. నాలుగు వెహికల్స్ను పట్టుకుని కేసులు పెట్టింది. సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపడుతోంది. స్థానికులు కూడా హైడ్రాతో చేతులు కలిపారు. మరి కొద్ది రోజుల్లో పరిశుభ్రమైన వాతావరణం కనిపించనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. #HYDRAA #Hyderabad
HYDRAA13,810 views • 5 months ago