Eatala Rajender's banner
Eatala Rajender's profile picture

Eatala Rajender

@Eatala_Rajender475,697 subscribers

Member of Parliament - Malkajgiri, Telangana | Chairperson - JCOP (18th LS) | Member - Standing Committee on Chemicals and Fertilizers | @BJP4India NEC Member.

Shorts

Thank you #Modi Ji for your surge of motivation and support to me and the party workers. With the same spirit will bring the party into power in forth coming elections in Telangana. #Modi4Telangana #BJP4Telangana #BJP4IND

Thank you #Modi Ji for your surge of motivation and support to me and the party workers. With the same spirit will bring the party into power in forth coming elections in Telangana. #Modi4Telangana #BJP4Telangana #BJP4IND

44,268 Aufrufe

Videos

Eatala_Rajender's profile picture

ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ(Nitin Gadkari) గారిని తెలంగాణ బీజేపీ ఎంపీల బృందంతో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కొంపల్లి ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో యాక్సిడెంట్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. కాబట్టి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులు గుంతలు లేకుండా చూడాలని నితిన్ గడ్గరీ గారిని విజ్ఞప్తి చేశాము. పదిరోజుల్లో సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, శ్రీ ధర్మపురి అరవింద్ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నగేష్ గారు ఉన్నారు. BJP BJP Telangana

Eatala Rajender

17,490 Aufrufe • vor 12 Tagen

Eatala_Rajender's profile picture

ఢిల్లీ : హైడ్రా పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారి స్పందన. 🔸హైడ్రా విషయంలో కోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. 🔸హిట్లర్ వారసున్ని అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. 🔸కోర్టు తీర్పును వెంటనే అమలుచేయాలి. 🔸అధికారులు బాసుల ఇష్టప్రకారం కాకుండా చట్టప్రకారం పనిచేయండి. 🔸హైడ్రా, రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. - ఎంపీ శ్రీ ఈటల రాజేందర్. ************* 🔸అహంకారం ఎక్కువయ్యి స్వయంగా ముఖ్యమంత్రి గారే నేను హిట్లర్ వారసున్ని అని చెప్పుకున్నారు. 🔸హిట్లర్ దగ్గర ఉన్న కోర్ కమిటీ పేరు హైడ్రా. 🔸ఆ హైడ్రా హక్కులతో సంబంధం లేకుండా ఎవరినైనా చంపేయవచ్చు. 🔸వేల మందిని చంపిన హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా అనే పేరు పెట్టాను అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. 🔸హిట్లర్ రాజ్యములో దుర్మార్గాలకు ఒడిగట్టిన హైడ్రా పేరు పెట్టి అదే పని ఈ రాష్ట్రంలో చేశారు. 🔸హిట్లర్ కు ఏ గతి పట్టిందో.. ఈ సర్కారు కూడా అదే గతి పడుతుందని తెలంగాణ ప్రజలు శాపనార్థం పెడుతున్నారు. 🔸హైడ్రా వచ్చిన తరువాత కబ్జకోరుల చేతుల్లో ఉన్న భూములు బయటపడతాయని, చెరువులు, నాళాలు కాపాడబడతాయని అనుకున్నాం. 🔸పేదవారికి అండగా ఉంటుందని భావించాం. కానీ హైడ్రా చెరువులలో కట్టుకున్న పెద్దల జోలికి పోలేదు. భూమాఫియా జోలికి పోలేదు. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలలో ఉన్న ఇళ్ళు కూలగొట్టింది. 🔸ఎంపీగా నేను తిరిగినప్పుడు అనేకమంది బాధలు విన్నా. బుచ్చమ్మ అనే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. జొన్నలబండలో వడ్డెరలు కన్నీరు పెట్టినా కరగలేదు. 🔸ముఖ్యమంత్రి అండదండలతో అరాచకం చేశారు. 🔸పేదల ఉసురు తగులుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. 🔸రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం తరువాత అన్ని అధికారాలు ఉన్నట్టు ప్రవర్తించారు. 🔸జైల్లో పెడతా అన్నా పట్టించుకోలేదు. 🔸63 సార్లు కోర్టు ధిక్కరణ చేసినందుకు రంగనాథ్ ను తొలగించమని కోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు. 🔸పెద్దలకి నోటీసులిచ్చి ఏమీ అనకుండా కాపాడి.. చట్టం ఉన్నవాడికి చుట్టం అన్నట్టు వ్యవహరించారు. పేదవారికి మాత్రం కన్నీళ్లు మిగిల్చారు. 🔸కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న. 🔸ప్రభుత్వ అధికారులు ఇష్టానికి కాకుండా చట్టానికి లోబడి పని చేయండి. బాసుల ఆదేశాలకు ఎస్ బాస్ అంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. 🔸హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. హైడ్రా వచ్చిన తర్వాత లేక్ వ్యూ రివ్యూ అనే పదం పోయింది. రియల్ ఎస్టేట్ రంగమంతా కుదేలు అయిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. 🔸హైడ్రా విశృంఖలంగా.. అతీతంగా పని చేసింది. 🔸హైదరాబాద్ లో భయానకమైన వాతావరణము ఉంది. 🔸కోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. 🔸హైడ్రా పెట్టిన బాధలకు రేవంత్ రెడ్డి సర్కారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. #HYDRAA #AdminPost

Eatala Rajender

18,615 Aufrufe • vor 21 Tagen

Eatala_Rajender's profile picture

సూర్యాపేట జిల్లా : పాతర్లపహాడ్ గ్రామ వార్డ్ సభ్యులు, ఎలక్ట్రికల్ హెల్పర్ శ్రీ కొప్పుల సంతోష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ముంపునకు గురవుతున్న ప్రాంత మధ్యలో కరెంట్ వైర్ తెగిపోవడంతో గ్రామానికి విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. లైన్ మ్యాన్ కింద హెల్పార్ గా పని చేస్తున్న సంతోష్ ఏమాత్రం వెనుకాడకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదలో ఈదుతూ వెళ్లి దెబ్బతిన్న తీగను మరమ్మత్తు చేసి గ్రామానికి విద్యుత్ ను తిరిగి తీసుకువచ్చాడు. ఒక ప్రజాప్రతినిధిగా, ఎలక్ట్రీషియన్ గా తన బాధ్యతను నిర్వహించినందుకు ఆయన నిస్వార్థ సేవను నిండు మనస్సుతో అభినందిస్తున్నాను.

Eatala Rajender

61,076 Aufrufe • vor 3 Jahren

Eatala_Rajender's profile picture

ఈ రోజే మనందరి ఆమోదయోగ్యంతో BJP Telangana రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ N Ramchander Rao గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మనందరి కర్తవ్యం.. యావత్ తెలంగాణ జాతి మన పట్ల ఏం కోరుకుంటుందో కేంద్ర మంత్రివర్యులు శ్రీ G Kishan Reddy గారు సవివరంగా చెప్పారు. దానిని సాధించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుల మీద ఉంది. రామచంద్ర రావు గారు నాకంటే చాలా పెద్దవారు కానీ.. నాకు ఆయనకు చాలా రోజుల నుంచి మంచి స్నేహితం ఉంది. మా అన్న గారితో పాటు వెళ్ళినప్పుడల్లా ఆయనని కలిసేవాన్ని. చదువుకునేటప్పుడు కూడా విద్యార్థి సంఘాల్లో పని చేశాము. 35 ఏళ్లుగా ఆయన్ను దగ్గర నుంచి చూసాము. వారు సౌమ్యుడు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త. అనేక విషయాలపట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు. శాసనమండలిలో మేము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆయన నిర్వహించిన పాత్ర ఎంత గొప్పగా ఉందో అని అనేకసార్లు ప్రశంసించాము. కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా మందు భాగంలో ఉంటారని.. మేమందరము సంపూర్ణ సహకారము అందిస్తామని.. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. #BJP4Telangana

Eatala Rajender

18,481 Aufrufe • vor 1 Jahr

Eatala_Rajender's profile picture

సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం వద్ద హిందూ భక్తులపై పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను. భక్తుల రక్తం కళ్ళచూసిన పాపం ఊరికే పోదు. అమ్మవారిని కాళ్ళతో తన్ని అవమానించిన వ్యక్తి వెనుక ఉన్నది ఎవరో ఇప్పటివరకు ప్రకటించని ప్రభుత్వం, హిందువుల తలలు పగిలేలా దాడి చేయించారు. వివిధ రాష్ట్రాల నుండి రెండు వందలమంది సికింద్రాబాద్ మెట్రోపోలీస్ హోటల్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే సమావేశం పెట్టుకున్నారని తెలిసినా ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారు. లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్లలో తెగిపడ్డ మాంసపు ముద్దలు గుర్తుకు వస్తున్నాయి. మీ చిల్లర రాజకీయాల కోసం తాత్సారం చేస్తే.. బలయ్యేది అమాయక ప్రజలు, మూల్యం చెల్లించాల్సింది మీ ప్రభుత్వమే అని మరోసారి హెచ్చరిస్తున్నా. ఒక్క పిలుపు ఇస్తే ఇంతమంది భక్తులు వచ్చారంటేనే హిందువులు ఎంత రగిలిపోతున్నారు.. ఎంత అభద్రతతో ఉన్నారో.. ఈ ర్యాలీ ఒక ఉదాహరణ. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వచ్చిన ముఠా వివరాలు బయటపెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలి, అప్పుడే మా వాళ్ళ ఆగ్రహావేశాలు చల్లారుతాయి. భారత్ మాతా కీ జై! #MuthyalammaTemple BJP BJP Telangana

Eatala Rajender

23,276 Aufrufe • vor 1 Jahr

Keine weiteren Inhalte verfügbar