
Journey with Jogu
@JogulambaV • 34,627 subscribers
Entrepreneur, Avid Traveller, Spiritual,Yoga Enthusiast, Hobbies Unlimited, Love Himalayas, Politically Aware & Inclusive. https://t.co/cgZvnS63o5
Shorts
Videos

దేశద్రోహం, చైనా ఏజెంట్, టుకడే టుకడే గ్యాంగ్ వంటి కధనాలు కాసేపు పక్కన పెడితే, ఈ ఉద్యమానికి మానసికంగా, స్వచ్ఛందంగా దేశం నలుమూలల నుండి యువత బాగా కనెక్ట్ అయ్యారనేది వాస్తవం. ఇంత దూరం తెచ్చుకోకుండా ఉండవలసింది. పాలకుల నుండి సహానుభూతి, చర్చ అనేది ప్రజాస్వామ్యానికి ఊతమిస్తుంది, విభేదాలకు అతీతంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఇకనైనా ప్రశ్నించిన వారిపై దేశద్రోహులనే ముద్ర వేయడం ఆపాలి ఎందుకంటే “పరిమితి దాటితే అమృతం కూడా విషంలా మారుతుంది” అంటారు.ఇప్పటికే ఎంతో మంది బీజేపీ కి వోటేసిన కుటుంబాలలో పెద్దలకి పిల్లలకి మధ్య దీనిపై ఒక చర్చ మొదలైంది.
Journey with Jogu26,618 次观看 • 1 天前

2005 లో కీరవాణి గారు స్మిత ని ఒక రికార్డింగ్ కి పిలిచారు. స్టూడియో కి వెళ్ళాక పాట గురించి చెబుతూ, సీతారామ శాస్త్రిగారు చిరంజీవి గారి గురించి ఒక పాట రాసారు, చిరంజీవిగారు ధీమాగా తన గురించి తను ఈ పాట పాడితే ఎలా ఉంటుందో, అలా పాడాలి అన్నారు. అదే… అనుకోకుండా ఒక రోజు లో “ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని” అన్న పాట. ఇరవై సంవత్సరాల క్రితం ఈ పాట ఎంతో ప్రజాదరణ పొంది, స్మితకి ఫిల్మ్ ఫేయిర్ అవార్డు కూడా తెచ్చి పెట్టింది ❤️.
Journey with Jogu152,451 次观看 • 1 年前

జగన్నాథ రధ చక్రాలొస్తున్నాయి ఒస్తున్నాయి… నేను ఏమి చెప్తున్నానో తెలుగు వారికి అర్థం అవుతుంది. ఇది వ్యక్తులపై గానీ, ప్రభుత్వాలపై గానీ దాడి కాదు, ఈ సభలో నా పదవీకాలంలో అది జరగదు. ఇది కేవలం భావాల మధ్య సంఘర్షణ మాత్రమే. ఈ ప్రజాస్వామ్య రధం కేవలం విభేదాలపై నుండి ముందుకు సాగుతుంది, వ్యక్తులపై నుండి కాదు. మేము దానికి అనుమతించము. ఎవరూ శాశ్వతంగా జీవించరు, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతత్వాన్ని ఆశించకూడదు. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా దానిని సాధించలేదు, భవిష్యత్తులో కూడా సాధించబోదు. రాజ్యసభ లో కమల్ మొదటి ప్రసంగం.
Journey with Jogu53,299 次观看 • 5 个月前

మండుటెండలో పట్టే ఈ ఆవకాయ మన తెలుగువారికి పంచ ప్రాణాల్లో ఒకటి అంటే, అతిశయోక్తి కాదేమో. ఘాటైన ఆవపిండి, మెంతులు, కారం, ఉప్పు, వెల్లుల్లి నూనెల కలయికతో తయారయ్యే ఆవకాయను సంవత్సరం పొడవునా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే, జిహ్వకు అమృతంలా ఉంటుంది కదూ.. 🌶️ 🥭 ❤️.
Journey with Jogu21,130 次观看 • 1 个月前

1947 లో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా తన ప్రసంగం లో పాకిస్తాన్ సెక్యులర్ దేశం గా ఉంటుందని, అన్ని మతాలవారిని సమానంగా చూస్తుందని అన్నారు… కానీ, ఆ మాట నిలబెట్టుకోలేదు, ఇతర మతస్తులను సమానంగా కాదు కద, మనుషులు గా కూడా చూడలేదు. అదే భారత దేశం అందరికీ సమానమైన లేదా మెరుగైన అవకాశాలు కలిగేలా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేసింది. సెక్యులర్ భావాల గురించి వాజపాయ్ గారిని జావేద్ అఖ్తర్ గతం లో ఒక ప్రశ్న అడిగితే, వారి సమాధానం…..❤️
Journey with Jogu79,720 次观看 • 1 年前