
JanaSena Telangana
@JSPTelangana • 82,951 subscribers
JanaSena Party, Telangana
Shorts
Videos

హైదరాబాద్ అత్తాపూర్ లో తన సొంత ఆటోపై తన మతానికి సంబంధించిన సూక్తి రాసుకున్నందుకు ఆటో డ్రైవర్ ను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం సరికాదు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లడే వారిని చూసి చూడకుండా వదిలేస్తూ, ఆటో డ్రైవర్ను అలా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. హైదరాబాద్ ఆటో డ్రైవర్ ఘటనపై దర్యాప్తు జరపాలి. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి. ఎవరిపైనా మతం, కులం, భావజాలం ఆధారంగా వివక్ష చూపకూడదు. పోలీసు వ్యవస్థ పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలాగే ఆటో డ్రైవర్ కు జనసేన అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము! Revanth Reddy DGP TELANGANA POLICE Telangana CMO
JanaSena Telangana53,820 görüntüleme • 4 gün önce

సైదాబాద్ సక్సెస్ స్కూల్లో ‘కల్మా’ పేరుతో విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకమతానికి సంబంధించిన అంశాన్ని హోంవర్క్గా ఇవ్వడం తీవ్ర అక్షేపణీయం. పిల్లల డైరీలో బహిరంగంగా మతపరమైన అంశాన్ని హోంవర్క్గా రాస్తే, తరగతిగదిలో ఇంకేమి బోధిస్తున్నారో అనే అనుమానం సహజంగానే వస్తుంది. ఇది ప్రభుత్వం విచారించాల్సిన విషయం. మదరసా అయితే మదరసా అని చెబుతారు, మిషనరీ స్కూల్ అయితే తన ప్రత్యేకతను చెబుతుంది, వేద పాఠశాల అయితే వేదాలు బోధిస్తామని ముందుగానే తెలియజేస్తుంది. తల్లిదండ్రులు కూడా అదే అవగాహనతోనే పిల్లలను అక్కడ చేర్పిస్తారు. మరి “సక్సెస్ స్కూల్” అని పేరుపెట్టుకుని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం..? ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. రాష్ట్ర గుర్తింపు పొందిన సాధారణ విద్యాసంస్థల్లో అన్నిమతాలకు చెందిన విద్యార్థులు చదువుతారు. అలాంటి పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు, నైతిక విద్య, విజ్ఞానం బోధించాలి తప్ప, ప్రత్యేకంగా ఒక్కమతాన్ని ప్రోత్సహించకూడదు. గతంలో కూడా ఇలాంటి బోధన, హోంవర్క్ ఇచ్చారా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. జనసేన ఏ మతానికీ వ్యతిరేకం కాదని మరొక్కసారి స్పష్టంచేస్తూ..భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ తమమతాన్ని ఆచరించే హక్కును ఇచ్చింది. విద్యాసంస్థలు రాజ్యాంగస్ఫూర్తితో విద్యార్థులందరినీ సమానంగా చూడాలి. పాఠశాలలు మత ప్రచార వేదికలుగా కాకుండా.. జాతీయత, రాజ్యాంగస్ఫూర్తి, విజ్ఞానం, నైతిక విలువలను పెంపొందించే విద్యాలయాలుగా ఉండాలి. పిల్లలకు దేశభక్తి నేర్పండి, రాజ్యాంగ విలువలు నేర్పండి, విజ్ఞానం నేర్పండి. విద్య పేరుతో ఏ మతాన్ని కూడా పిల్లలపై రుద్దే ప్రయత్నాలను అనుమతించరాదు. పాఠశాలలు జాతీయతను నిర్మించే ఆలయాలు కావాలి, మత ప్రచార కేంద్రాలు కాకూడదు అని జనసేన పార్టీ స్పష్టంగా చెబుతోంది. Revanth Reddy DGP TELANGANA POLICE Telangana CMO
JanaSena Telangana53,006 görüntüleme • 5 gün önce

మహబూబాబాద్ ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు నీటి కొరత ఉందని చెప్తే సమస్య పరిష్కరించాల్సింది పోయి RCO రత్నకుమారి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలను చెప్పుతో కొడతా అనడం సమంజసం కాదు. ఈ సంఘటనపై విచారణ జరిపి, ఆమెతో క్షమాపణ చెప్పించి అవసరమైతే విధులనుండి తప్పించాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది! #Mahabubabad #JSPForTelangana #JanaSenaTelangana
JanaSena Telangana17,095 görüntüleme • 2 gün önce

మంచానికి పరిమితమైన తన బిడ్డను హేళన చేసినా ఆ తల్లి ఇంకా నిన్ను పెద్ద మనిషి అంటుంది, తన బిడ్డ పరిస్థితిని చూసి Pawan Kalyan గారు వచ్చారు తప్పా రాజకీయానికి సంబంధం లేదు, మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలాగే దిగజారిన వ్యాఖ్యలు చేస్తారా అని ఆ తండ్రి అడుగుతున్నాడు. బహిరంగ క్షమాపణ చెప్పి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో Perni Nani
JanaSena Telangana79,381 görüntüleme • 1 ay önce

కాంగ్రెస్ తెలంగాణలో పుట్టిందా...? టీఆర్ఎస్, బిఆర్ఎస్ గా ఎందుకు మారింది..?
JanaSena Telangana312,161 görüntüleme • 5 ay önce

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు పాముల గణపతి కాకినాడ వెంకట నగర్ కు చెందిన విష్ణుమూర్తి గారిపై తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా లక్షల రూపాయలు నష్టపోయేటట్టు చేశాడు విష్ణుమూర్తి గారికి జరిగిన అన్యాయం పైన కాకినాడ అప్పటి 2 Town సిఐ గారు కేసు తీసుకోకపోగా వారి అండతో తప్పుడు కేసులు పెట్టించారని బాధపడుతూ జనసేన జనవాణి కార్యక్రమంలో సంపత్ నాయక్ గారికి చెప్పడంతో సంపత్ నాయక్ గారు వెంటనే స్పందించి కాకినాడ టూ టౌన్ సిఐ అప్పలనాయుడు గారికి కాల్ చేయడమే కాకుండా విష్ణుమూర్తి గారికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని నిజానిజాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా CI గారితో మాట్లాడారు. #JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
JanaSena Telangana42,446 görüntüleme • 21 gün önce

నిరంజన్ అంత్యక్రియలకు హాజరైన జనసేన నాయకులు, కార్యకర్తలు జనసేన అధ్యక్షులు, ఉపముఖ్యముత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అబిమాని నిరంజన్ అంత్యక్రియలు వరంగల్ జిల్లా, హన్మకొండలో బుధవారం జరిగాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు నిరంజన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, వరంగల్ కోఅర్డినేటర్ ఎం. దామోదర్ రెడ్డి ఫొన్ ద్వారా నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నాయకులు గడ్డం రాకేష్, మేరుగు శివకోటియాదవ్, గాదే పృద్వి, బర్ల శివ నిరంజన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక నాయకులు కందికొండ రామ్ చరణ్, ఎలబోయిన డేవిడ్, అజ్మీర రాజేందర్, అనుదీప్, సురేష్, అభిలాష్, దయాకర్, అంజి, శివాజీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
JanaSena Telangana23,945 görüntüleme • 13 gün önce

భారత దేశ సైనికుడిగా మా తండ్రి ఒక ప్రాంతం కోసం పని చెయ్యలేదు. కానీ ఇవాళ నేను తెలంగాణ సమాజం కోసం JanaSena Party తరఫున పని చేస్తుంటే ప్రాంతం ప్రస్తావన తెస్తున్నారు. ప్రాంతాల వారీగా గొడవలు పడే లెక్కన దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు పోరాడటం అర్థం ఏముంది. #SenaPrasthanam
JanaSena Telangana59,994 görüntüleme • 1 ay önce

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు, నల్ల బంగారం సంపదను సృష్టించి, దేశానికి అందించే సిరి సంపద, సింగరేణి కార్మికుల మమకారపు గని, రాష్ట్ర సాధనకు ముఖ్యభూమిక పోషించిన అడ్డ, కొత్తగూడెం గడ్డపై జనసేన ప్రభంజనం! #ChaloKothagudem #JanaSenaTelangana #JSPForTelangana
JanaSena Telangana14,393 görüntüleme • 8 gün önce

నువ్వు పెగ్గులు కలుపుకునే బార్ వెయిటర్ అని మేము కూడా అనగలం జగదీశ్వర్ రెడ్డి. అనాలంటే మాకు మాటలు చాలనే వస్తాయి కానీ అనం. సినిమా వాళ్ళు అంటే అంత చులకనా? నువ్వు ఉన్న పార్టీ అధ్యక్షుడు కూడా ఒక సినీ హీరో ఎన్టీరామారావు పెట్టిన పార్టీ నుండి వచ్చిన వాడే. దిగజారుడు మాటలు మానుకో! - జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ రాధారం రాజలింగం #JanaSenaTelangana
JanaSena Telangana32,311 görüntüleme • 28 gün önce

పాకిస్తానీయులకు, దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తామంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరికేపూడి గాంధీ గారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావించిన తెలంగాణ జనసేన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభ ప్రారంభానికి ముందే జనసేన నాయకులు డా. మాధవ్ రెడ్డి గారు, ప్రవీణ్ సాహు గారు, హరి నాయక్ గారు, కేశవ్ రావు గారు, మాధవ్ రావు గారు, రమేష్ రెడ్డి గారు, సుధాకర్ గారు, తిరుపతి గారు, వీర మహిళ అనుపమ గార్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని, అలాగే శ్రీ ఆరికేపూడి గాంధీ గారితో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించేలా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాము.
JanaSena Telangana45,810 görüntüleme • 1 ay önce

పాకిస్తానీయులకు, దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరికేపూడి గాంధీ గారు యావత్ భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. రేపు శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి Revanth Reddy గారు నిర్వహించబోయే సభకు హాజరయ్యే ముందు ఈ అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ! జై హింద్!
JanaSena Telangana45,655 görüntüleme • 1 ay önce

లెక్కలన్నీ సక్కగానే ఉన్నాయ్. లేవని నిరూపిస్తే ప్రభుత్వానికే ఇచ్చేస్తా అని Pawan Kalyan గారే అన్నారు. ప్రజల ముందు అఫిడవిట్ సాక్ష్యంగా ఉంచిన ఆస్తుల గురించి ఆరోపణలు మానేసి మీ ఆస్తుల లెక్కలు, జాగృతి నిధుల గురించి వివరాలు ప్రజల ముందు పెట్టగలరా Kavitha Kalvakuntla గారు? #JanaSenaMissionTelangana #JanaSenaTelangana #PawanKalyanLovesTelangana #TelanganaWithPawanKalyan
JanaSena Telangana45,803 görüntüleme • 1 ay önce

ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ నా కులం ఎత్తాడు అన్నారు. "నాగేశ్వర్ గారికి సంబంధించి కుల సంఘాలు ఖండించాయి అని విన్నాను, అసలు ఈ మొత్తం విషయంలో కులం ఎక్కడ వచ్చింది?" అన్నారు తప్పా మీ కులాన్ని అనలేదు. అనవసరమైన సింపతీ డ్రామాలు చెయ్యకండి. భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం మా ఉద్దేశం కాదు, కాకపోతే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకి మీ ఊహాగానాలు జోడించి ప్రచారం చెయ్యడం తప్పు అనే చెప్పాము. నాగేశ్వర్ గారు ఒక పక్క మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాను సమస్య సమసిపోయింది అని చెప్తూనే మరో పక్క మీ తప్పును సమర్ధించుకోడానికి తెలంగాణ జర్నలిస్టుల పేరుతో ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం బాధాకరం. జర్నలిస్టులు వాడే భాష ఇదా? ఇదే తెలంగాణ జర్నలిస్టుల వాడుక భాష అని ఇతర రాష్ట్రాల వారు అనుకోవాలనా? తెలంగాణ తల దించుకోవాలనా మీ తాపత్రయం? తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పుకుని కొందరు వారి గుర్తింపు కోసమో, వారు పని చేసే పార్టీల సంతృప్తి కోసమో పవన్ కళ్యాణ్ గారి పైన దుర్భాషలాడారు. నలుగురు ఐదుగురు భార్యలు అని వ్యక్తిగత విమర్శలకు దిగారు, ఇలాంటి విమర్శలు చేసే ఆంధ్రాలో ఒక పార్టీ భూస్థాపితం అయింది, మీకు అభ్యంతరం వుంటే ప్రజాజీవితంలో విధానాలపై మాట్లాడాలి కానీ వ్యక్తిగత విమర్శలకు దిగమని ఏ జర్నలిజంలో ఉంది? వాడు వీడు అరే తురే అని మాట్లాడారు, ఇదేనా మీ జర్నలిజం? తెలంగాణ ప్రజల దిష్టి తగిలి ఆంధ్రా కోనసీమ కొబ్బరి తోటలు పాడయ్యాయి అని మళ్ళీ అదే దుష్ప్రచారం. కావాలంటే ఇప్పటికీ వీడియో ఇంటర్నెట్ లో ఉంటుంది పోయి చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్నది "కొందరు తెలంగాణ నాయకుల దిష్టి తగిలి అని, ప్రజల దిష్టి" అని కాదు. వాక్ స్వాతంత్ర్యం ఉంది మేము ఎవరి మీదైనా ఆధారాలులేని ఆరోపణలు చేస్తాం అనేది జర్నలిజమా? మీపై ఒకటి రెండు కేసులు జనసేన అభిమానులు/నాయకులు నొచ్చుకుని వాళ్ళంతట వాళ్ళు పెట్టారు తప్ప జనసేన పార్టీ మీ పైన ఎలాంటి కేసు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తరువాత వారించి వదిలేయమని చెప్పారు. సినిమాల వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని నోటివిరేచనాలకు దిగడం సమంజసమా? ఆస్కార్ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమాని అవమానిస్తారా? పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల్లో ఎన్నో పాటలు, మాటలు తెలంగాణ భాషా యాస గొప్పతనం అర్థమయ్యేలా పెట్టలేదా? తెలంగాణ భాష పట్ల ప్రేమ లేకుంటే ఆయనకు పెట్టాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కు ఎందుకు వస్తున్నారు అన్నారు - రాజకీయ నాయకుడితో పాటు స్వతహాగా ఆయన ఒక సినిమా హీరో, రాష్ట్రం విడిపోక ముందు నుండి ఆయనకు ఇక్కడ స్థిరమైన ఇల్లు ఉంది. అంతెందుకు కేటీఆర్ గారు ఆంధ్రాలో చదవలేదా? రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రా వారితో చుట్టరికం లేదా? వాళ్ళని ఇలానే అడిగారా ఆంధ్రా జర్నలిస్టులు? జర్నలిస్టులు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసి తెలంగాణ సమాజాన్ని తల దించుకునేలా చేస్తారా? #Telangana #JanaSena
JanaSena Telangana54,974 görüntüleme • 1 ay önce

గోదావరిఖని, లక్ష్మీపురంకి చెందిన వాడిని. ఉద్యమాన్ని మీరు పెన్నుతో చేశారు మేము గన్నుతో చేశాం. జైళ్ళ గోడలు మధ్య కుటుంబ సభ్యులు పడుకుంటే పోలీసు బూట్ల చప్పుళ్ళు విని ఉలిక్కి పడి లేచేవాళ్ళం, నిత్యం పోరాటాల మధ్య బతికిన వాళ్ళం. పోరాటాల గురించి మీరు మాకు చెప్పకండి. సమస్యలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని తిడితే వచ్చే గుర్తింపు కోసం ప్రెస్ మీట్లు పెడతారా? ఇదా మీరు చెప్పుకునే జర్నలిజం? - జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి RK సాగర్ #Telangana #JanaSena
JanaSena Telangana53,252 görüntüleme • 1 ay önce