
Kandula Durgesh
@kanduladurgesh • 22,722 subscribers
Minister For Tourism, Culture and Cinematography - Government of AP | Member of Legislative Assembly - Nidadavole Constituency | @JanaSenaParty @PawanKalyan
Shorts
Videos

రాజకీయాల్లో విలువలు, నైతికత గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. గత ఐదేళ్ల పాలనలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు, రాజకీయ కక్ష సాధింపులతో రాష్ట్ర రాజకీయాలను దిగజార్చిన చరిత్ర కలిగిన వైసీపీ, అదే పంథా ఇప్పటికీ కొనసాగించడం బాధాకరం. సాయికృష్ణ అదృశ్యం కేసులో కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా విచారణను వేగవంతం చేశాం. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఎవరైనా తప్పు చేసినా, వారు ఏ హోదా వ్యక్తులైనా సరే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడదు. ఒక దురదృష్టకర సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు చేయాల్సిన విపక్షం, కుల భావోద్వేగాలను రెచ్చగొట్టి, మీ ఉనికిని కాపాడుకోవడం కోసం రాజకీయ లబ్ధి పొందాలని చూడటం విచారకరం. గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేయాలనే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. తన సొంత కులానికి గౌరవం ఇస్తూనే, అన్ని కులాల, వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రజాసేవను కించపరచే ప్రయత్నాలు ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా, మీ పార్టీని చీదరించుకునే పరిస్థితి వస్తుంది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసమే వైసీపీ అసహనానికి కారణం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకనే వైసీపీ నేతలు అనవసర వివాదాలకు తెరలేపుతున్నారు. కాపు సంక్షేమం గురించి మాట్లాడే ముందు గత ఐదేళ్లలో కాపు సమాజానికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలి. కాపు కార్పొరేషన్కు ఎంత నిధులు కేటాయించారు? కాపు యువతకు ఎన్ని అవకాశాలు కల్పించారు? కాపు సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ వైసీపీపై ఉంది. కాపులపై మీ నాయకుడి వైఖరిని, కాపుసంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన చరిత్రను మర్చిపోవద్దు. ప్రజలను కులాలుగా విభజించే రాజకీయాలు కాదు...ప్రజలను కలిపే రాజకీయాలే రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి. రాజకీయ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలే తప్ప, వ్యక్తిగత దూషణలు, కుల విద్వేషాలు, అసత్య ప్రచారాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైసీపీ నేతలకు సూచిస్తున్నాను. JanaSena Party Pawan Kalyan
Kandula Durgesh14,701 Aufrufe • vor 1 Monat

వైసీపీ నేతలు నిర్వహిస్తున్నవి "ఆత్మీయ సమావేశాలు" కావు... ప్రజల తిరస్కారం, రాజకీయ భవిష్యత్తుపై భయంతో చేసుకుంటున్న "ఆత్మావలోకన సమావేశాలు" మాత్రమే. ఐదేళ్ల YSR Congress Party పాలనలో కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి, విదేశీ విద్య పథకాలను నిలిపివేసి, కాపు యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన నాయకులకు నేడు కాపు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నేతల రాజకీయ నిరాశకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు ప్రతి నాయకుడికీ ఉంది, ప్రజల ఆశీర్వాదంతోనే పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. కార్యకర్తలను గౌరవించడం జనసేన పార్టీ సిద్ధాంతం, సామాన్య కార్యకర్త కొట్టె సాయిని ఆదుకుని, నేడు ఆలయ ఛైర్మన్ స్థాయికి తీసుకువచ్చిన చరిత్ర జనసేన పార్టీది. "దేశం, సమాజం బాగుండాలి... నన్ను కులాల చట్రంలో బంధించవద్దు" అనే పవన్ కళ్యాణ్ గారి ఉన్నత భావజాలాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కులాల పేరుతో సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవు, ప్రజలు నిజాలను గమనిస్తూనే ఉన్నారు, స్వార్థ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni
Kandula Durgesh14,101 Aufrufe • vor 1 Monat

తెలంగాణ గురించి మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఒక సామెతగా చెప్పిన మాట మాత్రమే తప్ప ఎవరిని కించపరచడానికి మాట్లాడిన మాట కాదు. తెలంగాణ పట్ల అమితమైన అభిమానం చూపించి అక్కడ ఏ చిన్న ప్రకృతి వైపరిత్యం వచ్చినా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించేటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణ అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ. - మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు Pawan Kalyan JanaSena Party #AdminPost #TeamKandula #JanaSenaParty #PawanKalyan
Kandula Durgesh57,004 Aufrufe • vor 7 Monaten

#AdminPost "ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవెనింగ్" కార్యక్రమంలో భాగంగా గౌరవ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు 'బాలచంద్ర' పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరిని అలరించారు. సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో మంత్రిగారి అభినయం, భావవ్యక్తీకరణ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కళలకు, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చూపుతున్న ఆసక్తి నిజంగా ప్రేరణదాయకం. Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh N Chandrababu Naidu Narendra Modi #APLegislatureCulturalEvening #AndhraPradesh #TourismMinisterDurgesh #KandulaDurgesh
Kandula Durgesh102,165 Aufrufe • vor 1 Jahr

శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను ఈ రోజు రాజకీయంగా మంత్రిని అయ్యాను. జనసేన పార్టీ నుండి మంత్రిగా ఉన్నాను. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. - మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు Pawan Kalyan #AdminPost #HariHaraVeeraMallu #HariHaraVeeraMalluOnJuly24th #HariHaraVeeraMalluPart1 #PawanKalyan #KandulaDurgesh #JanaSenaParty
Kandula Durgesh44,433 Aufrufe • vor 1 Jahr

ముంబయి పర్యటనలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా చేపట్టిన చర్యలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించడం ఆనందంగా ఉంది. IAAPI ఎక్స్పోలో రాష్ట్ర పర్యాటక పాలసీ, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించగా, ప్రముఖ సంస్థ మోడ్రన్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో రూ.100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అలాగే AI ఆధారిత సినిమా మరియు స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలపై యూరోస్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపాం. ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో అమరావతిలో “క్రియేటివ్ సిటీ” ఏర్పాటుతో క్రియేటివ్ ఎకానమీకి కొత్త అవకాశాలు సృష్టించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము. N Chandrababu Naidu
Kandula Durgesh14,491 Aufrufe • vor 4 Monaten

శాసన మండలిలో సూపర్ సిక్స్ అమలు కోసం పదే పదే ఎద్దేవా చేసిన వైసీపీ ఎంఎల్సీ లకి సమాధానం .. 2వేల పెన్షన్ 3 వేలు పెంచడానికి వైసిపికి ఐదేళ్లు పడితే మేమూ 15 రోజుల్లో 4 వేలుకి పెంచాం. 👉మీరు రైతులకు,విద్యార్థులకు చెల్లించలేని బకాయిలు మేము తీర్చాం !! Pawan Kalyan N Chandrababu Naidu Manohar Nadendla JanaSena Party
Kandula Durgesh40,477 Aufrufe • vor 1 Jahr

మూగజీవాల దాహానికి మానవత్వమే మూల్యమైన మార్గదర్శి! వేసవి మంటల మధ్య, మూగజీవాల దాహం తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనసుని కదిలించిన ప్రేరణతో "పల్లె పండుగ" కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు ఇప్పుడు గ్రామాల్లో పశువుల ప్రాణాలకు ప్రాణంగా మారాయి! ఈ మంచి సంకల్పానికి ఫలితంగా, పశువులు తీపి నీటిని తాగుతూ తమ దాహాన్ని తీర్చుకుంటున్న ఈ దృశ్యం మనసుని హత్తుకునే దయా దృశ్యంగా మారింది. ప్రేమతో కూడిన పాలకుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ఋణపు ప్రయత్నం, ప్రతి జీవికి బతకడం అనే హక్కును గుర్తు చేస్తున్న గొప్ప ఉదాహరణ. మనసున్న నాయకుడికి వందనం! Pawan Kalyan ✊🙏❤️ Pawan Kalyan N Chandrababu Naidu Narendra Modi #PallePanduga #PawanKalyanPallePanduga #IdhiManchiPrabhutvam #AndhraPradesh
Kandula Durgesh28,679 Aufrufe • vor 1 Jahr