Ponnam Prabhakar's banner
Ponnam Prabhakar's profile picture

Ponnam Prabhakar

@Ponnam_INC32,533 subscribers

Minister for Transport and BC Welfare- Telangana|MLA-Husnabad|Former MP,Karimnagar|Former NSUI State President-United Andhra Pradesh|ex PCC Working President

Videos

Ponnam_INC's profile picture

Yes మిస్టర్ పవన్ కళ్యాణ్..ఇది మా అయ్యా జాగిరే ... నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్యా జాగిరే.. నీ అయ్యా జాగిరి కాదు.. ముందు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి.. చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ నేను కారు కొనిచ్చా అని చెప్తున్నాడు.. తెలంగాణ లో ఉన్న దళిత వర్గాలు ఆలోచన చేయాలి.. ఆయన అహంకారం మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడము.. మా మీద ఏ దూరంకారం ఆదిపత్యం చెలాయించవద్దని కోరుకున్నాము అదే ఆధిపత్యం తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.. రాజకీయంగా ప్రజాస్వామ్యంలో భారతదేశం లో తెలంగాణ అంతర్భాగమే.. అనేక సందర్భాల్లో తెలంగాణ వాళ్లు ఆంధ్ర కి వెళ్తారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తారు.. హైదరాబాద్ ను పాకిస్తాన్ ఆ ఇండియా ఆ అన్నట్టు మాట్లాడుతున్నారు.. పాస్ పోర్ట్ తీసుకోవాలా అని మీ మైండ్ సెట్ మార్చుకోండి. Congress Telangana Congress

Ponnam Prabhakar

321,512 görüntüleme • 1 ay önce

Ponnam_INC's profile picture

పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలి.. తెలంగాణ అస్థిత్వం,ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారు తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేసినా అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ నవ నిర్మాణ సభ పెడితే తీవ్ర ఆక్షేపిస్తున్నాం. కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లి కి ఒడ్డాణం చేస్తారని సమేత ఉంది.. కుట్ల రాయి తీయలేని వాడు..ఎట్లా రాయి తీస్తాడా.. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దీనిని ప్రతి తెలంగాణ బిడ్డ వేడుకల పండగల జరుపుకుంటాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి విడిపోయిన రాష్ట్రంగా మాకు ప్రేమ ఉంటది.. భారతీయులుగా ఇతర రాష్ట్రాలను గౌరవించాలి..అవమాన పరుచుకోవద్దు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా పాల్గొనచ్చు.. ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రి గా చేయలేనిది ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఎవరు వినడానికి సిద్దంగా లేరు.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినను అన్న వెధవ వచ్చి. ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము వాస్తవంగా పవన్ కళ్యాణ్ సినిమా నటుడు .. . తెలంగాణ లో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలని బీజేపీ తో లోపాయికారి ఒప్పందం చేసుకొని పవన్ కళ్యాణ్ ఈ నటన స్టార్ట్ చేశారు.. 2014 లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పోచేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు.. తొడకలు తీస్తాం అని చెప్పం.. తెలంగాణ కళ్ళ దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయనీ చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ ఆయన సభకు పోరు.. బీజేపీ రెన్యుమనేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పు పవన్ కళ్యాణ్.. మాకు అస్సాం కంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర.. ఆంధ్రప్రదేశ్ తో సంత్సంబంధాలు ఉండాలని కోరుకుంటాం.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని అన్న దానికి సమాధానం చెప్పు.. తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యుడిగా ,సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ కోసం పోరాటం చేసినం.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ,పోరాట యోధులను గుర్తించాలని ప్రభుత్వం కమిటీ వేసి ముందుకు పోతుంది.. వారిని గుర్తించి గౌరవించాలని ప్రభుత్వం కార్యక్రమం చేస్తుంది.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారు.. నవ నిర్మాణ సభ గుజరాత్ ,కేరళ , ఉత్తర ప్రదేశ్ ,తమిళనాడు లో ఎందుకు పెట్టడం లేదు.. బీజేపీ డైరెక్షన్ లో తెలంగాణ లో విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు రెచ్చగొట్టేలా చేస్తే ఊరుకోరు.. పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఏం నటన చేయమంటే ఆది చేస్తాడు.. మీరు సినిమా నటులు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ తెలంగాణ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన వ్యక్తి వహిస్తే సహించం.. పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా చూడండి కానీ మన తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు ఇది ప్రజాస్వామ్య దేశం. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తోంది ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పేరు వెనుక ఆంతర్యం ఏమిటి.? బిజెపికి తెలంగాణను తాకట్టు పెట్టడమే మీరు స్థాపించే నవనిర్మాణమా? మీకు ఏపీ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చారు. అక్కడ చూయించండి మీ నవనిర్మాణము. కూట్లే రాయి తీయకుండా ఎట్ల రాయి ఇస్తానని బయలు తేరడం ఎందుకు? పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభలు బిజెపి పాలిత గుజరాత్ మధ్యప్రదేశ్ లో ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? మీ బాస్ మోదీ ను మెప్పించడానికి తెలంగాణ లో సభ పెడుతున్నారా..? తెలంగాణలో సభ ఏర్పాటు చేయాలి. నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి. ఇక్కడ జనాలు తన్నుకు చావాలి . ఇదేనా మీ పవనిజం? అనువనవున తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్ మొదట తెలంగాణ వాదులకు క్షమాపణ చెప్పాలి. తక్షణమే తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణలు చెప్పాలి.. తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్. ఇక్కడ విద్వేష రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదు. ఇక్కడ బిజెపి పప్పులు ఉడకక... ఏజెంట్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడికి పంపిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు చేసిన ఏమీ లేదు. అందుకే ఇక్కడ బిజెపి దొడ్డిదారిన పవన్ కళ్యాణ్ ను పంపిస్తోంది. Congress Telangana Congress

Ponnam Prabhakar

232,869 görüntüleme • 1 ay önce

Ponnam_INC's profile picture

మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఆమెకు ఎటువంటి నోటీసు లేకుండా, ఏ కేసులోనూ హాజరు కాకుండా, తనపై అసలు కేసు ఉందనే విషయమే తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్‌లో ఆ కేసు గురించి పేర్కొనలేదు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాలలో భాగంగానే ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో ఆమె నామినేషన్‌ను తిరస్కరించింది. గాంధేయవాదిగా, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. ఒక సుశిక్షితురాలైన కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్‌ఎస్‌యూఐ నాయకురాలిగా ఎదిగిన ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం తీవ్రమైన రాజకీయ అప్రజాస్వామ్య చర్య. మహిళల గౌరవం గురించి మాట్లాడే, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పే, “బేటీ బచావో - బేటీ పఢావో” అని నినదించే బీజేపీ, ఒక మహిళా నాయకురాలి నామినేషన్‌ను ఇలా తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం. ఈ విషయంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆమె నామినేషన్‌ను తిరిగి పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ రాజకీయ క్రీడలో బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ నిరంకుశంగా, క్రూరంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. Meenakshi Natarajan Telangana Congress Congress Rahul Gandhi Mallikarjun Kharge MP Congress Indian Youth Congress Indian Youth CongressTelangana NSUI Indian Youth CongressMadhya Press Trust of India ANI

Ponnam Prabhakar

114,371 görüntüleme • 1 ay önce

Ponnam_INC's profile picture

కరీంనగర్ రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం.. గతంలో ఇందిరా చౌక్ లో ఇందిరా గాంధీ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం.. చరిత్రను మర్చిపోతే భవిష్యత్తులో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునే వారు ఉండరు.. రాజీవ్ గాంధీ చౌరస్తా లో nsui అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యల పై పోరాటాలు చేసాం .. రాజీవ్ గాంధీ మా అందరికీ స్ఫూర్తి ప్రదాత nsui నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ వారి స్వహస్తాలతో nsui అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు 21 సంవత్సరాల కు ఉన్న ఓటు హక్కు నుండి 18 సంవత్సరాలకు ఓటు హక్కు వచ్చింది సాంకేతికత ను తీసుకొచ్చారు పంచాయతీ రాజ్ చట్టం ,జవహర్ రోజ్ గార్ యోజన,మహిళలు రిజర్వేషన్లు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు ,ఇందిరా గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అధికారం ఉన్న లేకున్నా ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తున్నాం ఆనాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో పీవీ నర్సింహారావు గారు , చొక్కారావు గారు , వెంకట స్వామి గారు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యారు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు,నేను ,లక్ష్మణ్ కుమార్ గారు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నాం మహేష్ కుమార్ గౌడ్ nsui అధ్యక్షుడిగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అటు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి,ఇటు మహేష్ కుమార్ గౌడ్ జోడెద్దుల భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పని చేస్తున్నారు మా అందరికీ రాజీవ్ గాంధీ స్ఫూర్తి ప్రదాత వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది రాజీవ్ గాంధీ లాంటి విగ్రహాలు పెట్టడం వల్ల వాటి జ్ఞాపకాలు వారి మంచి పనులు భవిష్యత్ తరాలకు తెలవాలి Rahul Gandhi Priyanka Gandhi Vadra Mallikarjun Kharge Telangana Congress Congress K C Venugopal Bomma Maheshkumar goud

Ponnam Prabhakar

123,349 görüntüleme • 1 ay önce

Ponnam_INC's profile picture

నిన్న గన్ పార్క్ వద్ద గోషామహల్ లో ,మలక్ పేట లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉందని చెప్పి వెళ్ళాం.. హరీష్ రావు గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్తున్నారు.. టెలిఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నారు...మీడియా నుండి గన్ పార్క్ వద్ద జర్నలిస్ట్ రాహుల్ గారు ఫోన్ చేశారు ఆయన లిఫ్ట్ చేసాడా.. పోలీసులతో అరెస్ట్ చేసేంత పిరికి కాదు.. మాకు క్రెడిబిలిటీ ఉంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంగా వ్యతిరేకించాం.. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తులం మీకు తెలియదా.. 10 సంవత్సరాలుగా మీతో లాభపడ్డ చెంచా గాళ్ళు వచ్చి చెప్తే మీరు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా.. మొత్తం టెండర్లు 1142 కోట్లు అయితే 2 వేల కోట్లు స్కాం ఎలా జరుగుతుంది.. ప్రతి దానికి పేపర్లు చూపెట్టుకుంటూ చూస్తున్నారు.. అన్ని విధాలుగా బాగుండాలని గురుకులాల సెంట్రాలైజ్ చేయాలని చేశాం.. Telangana Congress Congress

Ponnam Prabhakar

19,346 görüntüleme • 11 gün önce

Ponnam_INC's profile picture

బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే ఆడలేక పాత గజ్జెలు అన్నట్లు ఉంది. ఆల‌స్యంగా పరీక్ష‌కు వ‌చ్చి అనుమ‌తించ‌క‌పోతే టీచ‌ర్ల‌ను దూషించిన‌ట్లుగా ఉంది హ‌రీష్ వాల‌కం. గన్‌పార్క్ వద్దకు రావాలని మేము అనలేదు ఎమ్మెల్యేలు అయినా మాజీ మంత్రులు చర్చకు సిద్ధం అన్నాము సమయం మరియు స్థలం చెప్పలేదు అయినా మేము చాలాసేపు వేచి చూశాం… ఎవరు రాకపోవడంతో ముందే నిర్ణయించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాం. ఆ విష‌యం తెలుసుకుని ఆ త‌ర్వాత నిమ్మ‌లంగా మీరు అక్క‌డికి మీరు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తే మా త‌ప్పు కాదు. మేము అధికారిక కార్యక్రమాల్లో ఉండగా మీ ఫోన్ కాల్‌కు స్పందించలేదని మమ్మల్ని పిరికివాళ్లమని అనడం హాస్యాస్పదం. ప్రజలకు, అధికారులకు ఇచ్చిన సమయాన్ని గౌరవించడం మా బాధ్యత. అధికారిక విధులను పక్కనపెట్టి రాజకీయ ఫోన్ కాల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి మాది కాదు. అధికారిక కార్యక్రమాల్లో మేం బీజీగా ఉంటే దాన్ని రాజకీయం చేయ‌డం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం మీరు వ్యక్తిగతంగా ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడు నేను స్పందించిన విషయం మీకు తెలుసు. ఒకసారి ఫోన్ ఎత్తలేదని దానిని రాజకీయ నాటకంగా మార్చడం ఏమాత్రం సమంజసం కాదు. ఫోన్ చేసినట్లు స్క్రీన్‌షాట్‌లు చూపిస్తూ ప్రచారం చేసుకోవడం మీ హోదాకు తగదు నేను భయపడే వ్యక్తిని కాదని మీకు బాగా తెలుసు. నా నియోజకవర్గం మీ సిద్ధిపేటకు ఆనుకుని ఉంటుంది. ప్రజల్లో తిరిగి రాజకీయాలు చేసే వ్యక్తిని నేను. నా పారదర్శకత గురించి మీకే తెలిసి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. హైదరాబాద్ జిల్లాలో ముందుగానే ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని మీడియా ముందు స్పష్టంగా చెప్పిన తర్వాతే మేము అక్కడికి వెళ్లాను. అయినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదు. మిమ్మల్ని అరెస్ట్ చేయించేంత పిరికివాడిని నేను కాదు. అసలు మీరు వస్తున్నారు అని తెలిస్తే నేను తప్పకుండా ఉండేవాడిని తెలంగాణ ఉద్యమంలో నా సొంత పార్టీ ప్రభుత్వం పై రోడ్లపై నిలబడి పోరాడిన వ్యక్తిని. నా రాజకీయ ప్రయాణం, నా ధైర్యం గురించి తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు... మీకూ బాగా తెలుసు. (Note: ఉదయం స్పష్టం గా చెప్పిన వీడియో 👇) Harish Rao Thanneeru BRS Party Congress Telangana Congress

Ponnam Prabhakar

10,427 görüntüleme • 12 gün önce

Ponnam_INC's profile picture

జగిత్యాల లో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ ని తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. అతను కేవలం ఆర్టీసీ హైర్ (కిరాయి)బస్సు డ్రైవర్.. ఆర్టీసీ ఉద్యోగి కాదు. అయినప్పటికే అతన్ని ఉద్యోగం నుండి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించాం, అశోక్ రైతుల పక్షాన మాట్లాడారు ,అది స్వాగతిస్తున్నాం కేంద్రం ధాన్యం కొనుగోలు లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.. అయినప్పటికీ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోంది. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దు. TGSRTC Telangana CMO Telangana Congress Congress Revanth Reddy Bhatti Vikramarka Mallu Bomma Maheshkumar goud

Ponnam Prabhakar

30,248 görüntüleme • 1 ay önce

Ponnam_INC's profile picture

రాజకీయంగా వక్ర భాషా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్..నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా ఆయనకు పాత్ర కు ఎంగేజ్ చేసి మాట్లాడించే అవకాశం ఉండేది.. ఆయనకు వచ్చే చిట్టీలు బిజెపి నుండి వస్తున్నాయా టిఆర్ఎస్ నుండి వస్తున్నాయా తెలుస్తలేదు చంద్రబాబు నాయుడు గారు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే వాతావరణం కలుగజేస్తున్నాం.. మీరు కొండగట్టు వస్తె తెలంగాణ గెస్ట్ గా ప్రోటోకాల్ ఇచ్చాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ ఇది ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్న రోజు అని కోరు.. నవనిర్మాణ సభ అని ఏం చేస్తావు.. నువ్వు ఇక్కడ వచ్చి పీకేది ఏంది.. అక్కడే ఏం పీకలేకపోతున్నావు.. బీజేపీ వాళ్ళు సరిగా స్క్రిప్ట్ రాసిస్తాలేరు .. బీజేపీ ,brs ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ ను ఆర్టిస్ట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోండి ఉండవచ్చు.. 2009,2014 ఎన్నికల అప్పుడు తిరిగిన జనం వస్తుండొచ్చు ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తూ ఈలలు కొడుతుంటే అదంతా నా బలం అనుకుంటే ఏం చేస్తాం.. మీరు ఆంధ్రాలోనే గెలవలేకపోయారు ఇక్కడ ఏంది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రావడానికి పోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ ఆవిర్భావ దినోత్సవం రోజు గెలికి నవ నిర్మాణ సభ పెడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు తెలంగాణ మా అయ్యా జాగిరే..నీ అయ్యా జాగీరు కాదు.. అనే మాట స్పష్టంగా చెప్పడానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఎప్పుడు స్వాగతం పలుకుతుంది.. ఎప్పటికీ వ్యతిరేకం కాదు.. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాల ప్రస్తావన తెచ్చిన పవన్ కళ్యాణ్ ఎంత దైర్యం.. అహంకారం పవన్ కళ్యాణ్ తెలంగాణ లో తిరుగుతుంటే ఎవరు వద్దన్నారు.. తక్షణమే గద్దర్ గారి ఆత్మకు క్షమాపణలు చెప్తున్నట్టు ఇయల్సిందే..ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.. తెలంగాణ లో ఆంధ్రావాల్లకి పని లేదని మేము అనడం లేదు.. ఇది ఫెడరల్ సిస్టమ్.. ఇది హైదరాబాద్ అని భాషల వాళ్ళు ఉంటారు అనవసరంగా గెలకకు పవన్ కళ్యాణ్ గుజరాత్ లో పార్టీ పెట్టుకో Congress Telangana Congress

Ponnam Prabhakar

26,177 görüntüleme • 1 ay önce

Ponnam_INC's profile picture

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి బహిరంగ లేఖ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. సమకాలీన రాజకీయాల్లో ఎంతో సీనియర్, అనుభవజ్ఞులు అయిన మీకు హృదయపూర్వక నమస్సులతో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి చొరవతో తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ (నాటి హైదరాబాద్ రాష్ట్రం) ను 1948 లో బలవంతంగా విశాలాంధ్రలో విలీనం చేసిన నుంచి, అంటే 1956 నుంచి జరుగుతున్న పరిణామాలు, అభివృద్దిలో వివక్ష, ఇక్కడి ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలు, ముల్కీ-నాన్ ముల్కీ ఆందోళనలు, తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని 2000 తొలి దశకమంతా జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొని, కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. 2009 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల కన్వీనర్‌గా నేను తెలంగాణ అంశాన్ని ఎన్నో స్థానిక, జాతీయ వేదికల మీద ప్రస్తావించడం మీకు తెలిసిందే! ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ గారి సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదిక మీద అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. ఇందులో ప్రతి చర్య చట్టబద్దం, రాజ్యాంగబద్దం. లోకసభ, రాజ్యసభ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం తో గెజిట్ విడుదల చేసింది.ఇలా అన్ని పక్షాల ఆమోదంతో తెలంగాణ,`ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలుగువారమంతా సహృదయంతో, పరస్పరం మంచి కోరుకుంటే రెండు రాష్ట్రాలు తక్కువ కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా అభివృద్ది చెందుతున్నాయి. ఇదే మనందరికీ కావాల్సింది. ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు. ఇది మీకు తెలియంది కాదు. మీ భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ నాయకులొక‌వైపు, జనసేన అధినేత మరోవైపు అక్కడక్కడ మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవు. రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడ్డట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉంటున్నాయి. ఇతరులకు లేని అపోహలు కలిగిస్తున్నాయి. మనసు కలత చెందుతోంది. ఇది ఎవరికీ మంచిది కాదు. ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పెద్దగా మీరు చొరవ తీసుకొని మీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన నాయకులకు చెప్పండి. భారత్ - పాకిస్తాన్ విభజనలా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్మే విధంగా ఉన్నాయి.. ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలింది అంటూ మీ మరో భాగస్వామి పవన్ కల్యాణ్ (జనసేన అధిపతి) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాల్ని కలతకు గురిచేశాయి. ఇవి తెలుగు వారి మధ్య వైషమ్యాలు పుట్టించేవే! అలా మాట్లాడటం తప్పని మీ మంత్రివర్గ సహచరునికి చెప్పండి. ఇవన్నిటికీ మూలం బీజేపీ సీనియర్ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలే అనుకుంటాను. ‘రాష్ట్ర విభజన ద్వారా తల్లి-బిడ్డను విడగొట్టార’ని ఒకమారు, ‘బిడ్డను సంరక్షించడానికి తల్లిని చంపార’ని మరొకమారు ఆయన అనుచితంగా మాట్లాడారు. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాల’ని 1997లోనే తీర్మానం చేసిన పార్టీ బీజేపి అని బహుషా ప్రధాని మోదీకి తెలియదేమో! మీరు రాజకీయాల్లో ఆయనకన్న సీనియర్ కనుక కూటమి భాగస్వామి గా ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పండి. N Chandrababu Naidu

Ponnam Prabhakar

25,141 görüntüleme • 2 ay önce

Ponnam_INC's profile picture

పెట్రోల్ డీజిల్ పై కరోనా లాంటి పరిస్థితులు వస్తాయని ప్రధాన మంత్రి ప్రకటనతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు క్యూలైన్ లలో ఉన్నారు.. హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి గా చాలా మంది సూచనలు చేస్తే దీనిపై కలెక్టర్ ,సీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు .. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడాలి… బంకు ఓనర్స్ ఓల్డ్ డ్యూ ఉన్న 70-80 లక్షలు ఉన్నప్పుడు తక్షణమే కట్టమని అది కడితేనే స్టాక్ ఇస్తామని చెప్పడం వల్ల , ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ వల్ల తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు .. రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రజల ఇబ్బందులు లేకుండా చూడాలి ..

Ponnam Prabhakar

18,879 görüntüleme • 3 ay önce

Ponnam_INC's profile picture

గుజరాత్ లోని సబర్మతి నదిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది సబర్మతి మాదిరి మూసి అభివృద్ధి కి చేసే అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే పార్టీలకు అతీతంగా జీహెచ్ఎంసీ మేయర్ ,హైదరాబాద్ లో ఉన్న 150 మంది కార్పొరేటర్లు సబర్మతి స్టడీ టూర్ తీసుకెళ్తాము, సబర్మతి నది మాదిరి ముసి పునరాభివృద్ధికి ఫేజ్ -1 కింద బాపు ఘాట్ వరకు చేసే అభివృద్ధి పై స్టడీ టూర్ ద్వారా పరిశీలించనున్న జిహెచ్ఎంసి బృందం. Bomma Maheshkumar goud Vem Narender Reddy Telangana CMO Revanth Reddy Congress Telangana Congress GHMC Telangana Digital Media Wing

Ponnam Prabhakar

28,434 görüntüleme • 1 yıl önce