
Telangana CMO
@TelanganaCMO • 1,676,267 subscribers
Official account of CMO Telangana.
Shorts
Videos

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్లో ముఖ్యమంత్రి గారిని దేవాదాయ శాఖ కమిషనర్ గారు, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు. #GaneshChaturthi #VinayakaChavithi #LordGanesha
Telangana CMO46,756 görüntüleme • 2 gün önce

అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు. గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. Governor of Telangana
Telangana CMO70,105 görüntüleme • 16 gün önce

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం చేసిన ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు గౌరవ సభ్యులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. #AssemblyCentralHall #TelanganaAssembly #MonsoonSession2026
Telangana CMO23,959 görüntüleme • 5 gün önce

తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ Ram Mohan Naidu Kinjarapu గారికి విజ్ఞప్తి చేశారు. #MamnoorAirport కు అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని తెలిపారు. ✅ఢిల్లీలోని MoCA_GoI కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు. #AdilabadAirport లో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, #MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ✅ఆదిలాబాద్లో రన్వే ఫైనలైజ్ చేయడానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. #WarangalAirport టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. ✅తెలంగాణలో చాపర్ల ద్వారా #HeliTourism అభివృద్ధికి కృషి చేయాలని రామ్మోహన్ నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. హుస్సేన్ సాగర్లో సీ-ప్లేన్ ల్యాండింగ్కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రి గారికి తెలిపారు. ✅ఈ సమావేశంలో ఎంపీలు Anil Kumar Yadav గారు, Suresh Kumar Shetkar గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) Harkara Venugopal Rao గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. #Telangana #AirportDevelopment #AirConnectivity #CivilAviation #TelanganaTourism
Telangana CMO39,347 görüntüleme • 10 gün önce

76 వ గణతంత్ర దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి Revanth Reddy గారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ఒక సందేశాన్ని ఇచ్చారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. #TelanganaRising #RepublicDay
Telangana CMO919,985 görüntüleme • 1 yıl önce

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారికి మంత్రులు శ్రీమతి Danasari Seethakka గారు, శ్రీమతి Konda Surekha గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి గారు, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, మలక్పేట్ గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు ముఖ్యమంత్రి గారికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. #CMRevanthReddy #RakshaBandhan #RakhiPurnami #Hyderabad #Telangana
Telangana CMO30,777 görüntüleme • 15 gün önce

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీలను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారితో కలిసి వారు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మి గారు ఉన్నారు. #Badminton #WorldChampionships #GayatriGopichand #TreesaJolly #PullelaGopichand #Telangana
Telangana CMO34,793 görüntüleme • 18 gün önce

ఆరు దశాబ్దాల పాటు మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని సర్వం ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు కొనియాడారు. ✅రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ✅భూమిలోని సారం నుంచి ప్రారంభించి దానికి అవసరమైన నీరు, విత్తనం, పెట్టుబడి, పంట, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వరకు రైతుల సమస్యలను లోతుగా విశ్లేషించి సంపూర్ణ అవగాహనతో పోరాటం చేసిన మల్లారెడ్డితో ఎవరూ పోటీ పడలేరని అన్నారు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై నిశితంగా అవగాహన కలిగిన వాకింగ్ ఎన్సైక్లోపీడియాగా అభివర్ణిస్తూ, అలాంటి రైతు నాయకుడిని కోల్పోవడం రైతాంగానికి తీరని లోటు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ✅సమాజంలో ఎంతో మంది హోదా గుర్తింపు రావాలని కోరుకుంటారని, కానీ సారంపల్లి మల్లారెడ్డి గారి శ్రమ రైతులు, రైతు కూలీలకు ఉపయోగపడాలని కాంక్షించి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని కొనియాడారు. ✅సమస్యల పట్ల అవగాహన ఉంటే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, రైతుల సమస్యల పట్ల సారంపల్లి గారు రాసిన పుస్తకాలు, లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. కమ్యూనిస్టులు పోరాటాలు చేసినప్పుడు తమ ప్రభుత్వం వాటిని పరిష్కరించిందని పలు సందర్భాలను ముఖ్యమంత్రి గారు ఉటంకించారు. ✅రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి భూమిలేని నిరుపేద కూలీలకు కనీస వేతనం ఉండాలని వామపక్ష యోధులు పోరాటాలు చేస్తే దాన్ని ఆధారం చేసుకుని తమ ప్రభుత్వాలు కనీస వేతన చట్టం చేసిందని గుర్తుచేశారు. ✅దున్నేవాడికే భూమి చెందాలన్న పోరాట నేపథ్యం నుంచి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తెచ్చి దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పోడు భూములు, మిగులు భూములను పంచిందని, 24.56 లక్షల ఎకరాల పట్టాలను అందించిందని చెప్పారు. ✅నిరుపేదలకు ఉండటానికి ఇళ్లు ఉండాలని వామపక్షాలు లేవనెత్తినప్పుడు దేశంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేశామన్నారు. భూమి మీద ఏ వస్తువు తయారైనా తయారు చేసిన వారే అమ్మకం ధర నిర్ణయిస్తున్నారని, కానీ దురదృష్టవశాత్తు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టులు ఉద్యమాలు సాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ను నియమించి కనీస మద్దతు ధర అమలులోకి తెచ్చిందని పేర్కొన్నారు. ✅నిరుపేదలకు పనిదొరకని పరిస్థితుల్లో వామపక్షాల సహకారంతో ఉపాధి హామీ చట్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే కోవంలో కరవుతో అల్లాడుతున్న పేదల కోసం కమ్యూనిస్టులు పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత తీసుకొచ్చిందని చెప్పారు. ✅ఈ రకంగా వామపక్షాలు సమస్యలపై పోరాటాలు సాగిస్తూ పరిష్కారానికి సూచనలు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని పరిష్కరించాయని వివరించారు. ✅మారుమూల గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారితో పాటు లోపాల పేరుతో ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సమస్యలపై ఎర్రజెండా పోరాటాలంటే ప్రజలకు ఒక నమ్మకం అని చెబుతూ ఎస్ఐఆర్ విషయంలో కూడా ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ✅సమావేశంలో నేతలు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు యోధుడు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టినట్టుగానే, రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారి సేవలు చిరస్థాయిలో గుర్తిండిపోయే విధంగా మంత్రివర్గంలో చర్చించి మంచి కార్యక్రమం తీసుకుంటామని స్పష్టం చేశారు. ✅ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారు, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఎం నాయకులు ప్రకాశ్ కారత్ గారు, జాన్ వెస్లీ గారితో పాటు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. #SarampalliMallaReddy #FarmersLeader #FarmersRights #KisanMovement
Telangana CMO11,152 görüntüleme • 5 gün önce

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ విందులో పాల్గొన్నారు. #Bonalu #Telangana
Telangana CMO57,314 görüntüleme • 1 ay önce

మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి గారి మాతృమూర్తి శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొని శేషమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, నాగరాజు గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Telangana CMO21,919 görüntüleme • 17 gün önce

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని దైవానుగ్రహం కోసం నాగార్జునసాగర్లోని విజయ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన పవిత్ర మహా వరుణయాగం, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి దంపతులు పూర్ణాహుతి సమర్పించడంతో క్రతువు పరిసమాప్తమైంది. #CMRevanthReddy #Telangana #VarunaYagam #NagarjunaSagar
Telangana CMO33,531 görüntüleme • 1 ay önce

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు సూచించారు. విద్యా సంస్థల క్యాంపస్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించి జరిగే ఏ ఘటననైనా యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని చెప్పారు. ✅రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి తీసుకునే చర్యల్లో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అవసరమైతే ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ✅రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియాన్లో ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ✅విద్యా సంస్థల క్యాంపస్లలో #Drugs మహమ్మారిని నిరోధంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి క్యాంపస్ బయట జరిగే కార్యకలాపాలను సైతం గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు. ✅డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, వాటిని నిరోధంలో విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతలను కూడా అప్పగించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు. ✅మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. ✅డ్రగ్స్కు సంబంధించి కార్యకలాపాలను గుర్తించడం, వినియోగిస్తున్న వారిని మాన్పించడం, శిక్షించడం అన్న మూడు దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే డీ-అడిక్షన్ సెంటర్కు పంపించడం, కౌన్సిలింగ్ ఇప్పించడమే కాకుండా తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ✅ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి గారు, కె. రామకృష్ణారావు గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, DGP TELANGANA POLICE సీవీ ఆనంద్ గారు, EAGLE FORCE TELANGANA డైరెక్టర్ సందీప్ శాండిల్య గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #SayNoToDrugs #AntiDrugs #EAGLEForce #AntiNarcoticsBureau #Telangana
Telangana CMO41,718 görüntüleme • 1 ay önce

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించడం, పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు విస్తృతంగా చర్చలు జరిపారు. ✅ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి గారితో ప్రముఖ ఆర్థికవేత్త Arvind Subramanian గారితో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై చర్చ జరిగింది. ✅ముఖ్యంగా #GST, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవింద్ సుబ్రమణియన్ గారితో చర్చించారు. జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత సమాచారంతో మరింత సులభతరం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్టు స్పష్టం చేశారు. ✅ఈ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (#EaseOfDoingBusiness) ను మెరుగు పరిచేలా టెక్నాలజీ వాడకం ఉండాలని సుబ్రమణియన్ గారు వివరించారు. ✅పన్నుల లీకేజీలను అరికట్టడంలో శాఖల మధ్య సమన్వయ లోపాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రధానంగా భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టడానికి మున్సిపల్, #RERA, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో ఏర్పాటు చేసే వ్యవస్థ ద్వారా సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ✅భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ డేటాతో పాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ✅ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. #Telangana #DigitalGovernance #ArtificialIntelligence #TaxReforms
Telangana CMO30,523 görüntüleme • 1 ay önce

దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి తగ్గించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలని కోరారు. ✅ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనమండలి, శాసనసభలను ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టసభలకు పోటీ చేసే కనీస వయో పరిమితిని తగ్గించాలని ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదిస్తామని ప్రకటించారు. ✅నీట్ లాంటి పరీక్షల విధానాల్లో లోపాలు, లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, యువత పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో “యువతే దేశం – దేశమే యువత” పేరుతో #GenZ కి మద్దతుగా పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహ కూడలి వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, మంత్రులు Sridhar Babu Duddilla గారు, Ponnam Prabhakar గారు, Ponnam Prabhakar గారు, Minister Adluri Laxman kumar గారు, Mohammed Azharuddin గారు, ఎమ్మెల్సీ Bomma Maheshkumar goud గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. 21 ఏళ్లకు శాసనసభ, లోక్సభకు, అలాగే 25 ఏళ్లకు రాజ్యసభకు పోటీ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ✅శాసనసభ, లోక్సభ, రాజ్యసభలు వేదికగా యువత గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగినట్టుగా పార్లమెంట్లో చట్ట సవరణ కోసం ప్రయత్నం చేస్తామని మాటిచ్చారు. యువతే ఈ దేశ భవిష్యత్తు, వారికేం కావాలో నిర్ణయించుకునే అధికారం కూడా యువతకు ఉండాలని, వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు. ✅దేశంలో యువకులు మార్గనిర్ధేశకులు కావాలన్న ఆలోచనతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. ✅రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు 21 ఏళ్ల నుంచి 18 కి తగ్గిస్తే, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావడానికి వీలుగా చట్ట సవరణ ద్వారా పోటీ చేయడానికి కనీస వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించారని ప్రస్తావించారు. ✅జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 సంవత్సరాలు నిండితే చట్టసభలకు పోటీ చేయడానికి అవకాశం ఉందని, సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మన దేశంలో ఆ పరిస్థితి ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ✅శాసనసభలో తీర్మానం చేసి ప్రధానమంత్రి గారికి పంపించడమే కాకుండా పార్లమెంట్లో బిల్లును ఆమోదించే విధంగా ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు. అలాగే 21 ఏళ్లు నిండిన వారే అత్యంత కీలకమైన విద్యా శాఖ, ఐటీ శాఖలకు మంత్రులైతే ఈ దేశ ముఖచిత్రం మారుతుందని అన్నారు. ✅“జెన్ జీ వెల్లువ ఇంతటితో ఆగొద్దు. చట్టసభల్లో జెన్ జీ గళం వినిపించాలన్నదే నా ఆలోచన. రాబోవు రోజుల్లో యువత గళం వినిపించాలి. జెన్ జీ విజయం సాధించడానికి తామంతా బాధ్యత తీసుకుంటాం” అని పేర్కొన్నారు. ✅ఈ దేశాన్ని నిర్మించేది యువతేనని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 30 శాతం ఉన్న జెన్ జీ (GenZ) చట్ట సభల్లో కనీసం ఒక్క శాతం ప్రాతినిధ్యం కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆ అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. #YouthPower #YouthInPolitics #FutureOfIndia #VoiceOfYouth #YouthRepresentation
Telangana CMO36,280 görüntüleme • 1 ay önce

ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయి తిరిగి పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టల్స్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. #Kodangal #Hakeempet #EducationHub #Vikarabad
Telangana CMO37,729 görüntüleme • 1 ay önce

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు. ✅#MusiRiverfrontDevelopment పై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు. ✅భూసేకరణ ప్రక్రియలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ✅మూసీ రివర్ఫ్రంట్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు. ✅గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే, కొత్వాల్గూడ బర్డ్స్ పార్క్కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. ✅ఈ సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్డీసీఎల్ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #MusiRejuvenation #MRDCL #UrbanDevelopment #Hyderabad
Telangana CMO15,481 görüntüleme • 18 gün önce

A New Chapter in Advanced Healthcare Infrastructure for #Telangana Hon’ble Chief Minister Shri Revanth Reddy inaugurated the Dr. Marri Channa Reddy Telangana Institute of Medical Sciences (#DrMCRTIMS) at Sanath Nagar, #Hyderabad - strengthening Telangana’s public healthcare infrastructure and expanding access to advanced tertiary care. The super-specialty hospital will serve as a Centre of Excellence in cardiac, renal, transplant and trauma sciences, equipped with advanced technologies including a 3.0 Tesla MRI, 128-slice CT scanner, cath labs and LINAC radiation unit. The Hon’ble Chief Minister also reiterated the Government’s commitment to completing the Osmania General Hospital, TIMS Alwal, TIMS LB Nagar and Warangal Super Specialty Hospital in a phased manner. A stronger, more accessible and people-centric healthcare system for Telangana. #DrMCRTIMS #TIMS #TelanganaMedicalSciences #Healthcare #AdvancedHealthcare
Telangana CMO19,152 görüntüleme • 25 gün önce

క్రీడారంగంలో హైదరాబాద్ను దేశానికి ఒక రోల్ మాడల్గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ✅గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ముఖ్యమంత్రి గారు #TelanganaSportsHub ప్రతినిధులతో సమావేశమయ్యారు. ✅ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ Dr. Sanjiv Goenka గారు, కో-చైర్మన్ Upasana Konidela గారు, సభ్యులు కావ్య మారన్ గారు, సి.శశిధర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన #GachibowliStadium అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఆ స్టేడియంలో హెలిప్యాడ్తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ✅క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ను నియమించామని తెలిపారు. ✅“స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. #Olympic క్రీడలు కూడా హైదరాబాద్లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి..” అని బోర్డు సభ్యులకు సూచించారు. #TelanganaSports #Hyderabad #SportsInfrastructure #KavyaMaran
Telangana CMO82,082 görüntüleme • 5 ay önce