
Telugu Scribe
@TeluguScribe • 119,372 subscribers
By citizens, for citizens - TELUGU SCRIBE is fearless in exposing government failures and voicing public issues. News is power & it drives change
Shorts
Videos

ఆన్లైన్లో కూతురు పెళ్లి చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో తమ ఏకైక కుమార్తె హిమబిందు పెళ్లిని ఆన్లైన్లో చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి అమెరికాలో ఉద్యోగం చేస్తూ, అక్కడే పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హిమబిందు శుక్రవారం రాత్రి జరిగిన వీరి వివాహాన్ని ఆన్లైన్లో వీక్షించి, అనంతరం గ్రామంలో అతిథులకు పెళ్లి విందును ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు
Telugu Scribe992,369 views • 3 days ago
0:44
Sensitive content
This media may contain sensitive content.

టీచర్కు భయపడి కుప్పకూలి ఎల్కేజీ విద్యార్థి మృతి విశాఖపట్నంలో దారుణ ఘటన లిటిల్ గార్డెన్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయపడి గుక్కపెట్టి ఏడుస్తూ, కుప్పకూలి టీచర్ మీద పడిపోయిన ఎల్కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6) చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆగ్రహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
Telugu Scribe2,106,668 views • 13 days ago

ఏపీలో వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరో తెలంగాణ ఫోక్ సాంగ్
Telugu Scribe177,675 views • 2 days ago

మణుగూరులో దారుణం రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేసిన మణుగూరు కాందర్(MK) గ్రూప్లోని 30 మంది పండుగ రోజు చనిపోయిన తన సోదరుడికి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టిన సోదరి హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తూ, రాఖీ పండుగ సందర్భంగా సొంత గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు వచ్చిన శివ(28) అనే యువకుడు తన వద్ద పనిచేసే సతీష్ అనే కార్మికుడి సోదరిని స్థానిక యువకులు కొందరు వేధిస్తుండటంతో, గతంలో ఆ గ్యాంగ్ను హెచ్చరించిన శివ దీనిని మనసులో పెట్టుకొని, మాట్లాడుదామని శివను ఏరియా స్టోర్ గ్రౌండ్స్కు పిలిపించిన గ్యాంగ్ హెడ్ రమ్మీ, అతని అనుచరులు పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న శివపై మూకుమ్మడిగా దాడి చేసిన MK గ్యాంగ్లోని 30 మంది యువకులు పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఊపిరితిత్తులు పగిలిపోయి, పక్కటెముకలు విరిగిపోయి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందిన శివ శివను కాపాడడానికి వెళ్లిన ఉదయ్ కుమార్ అనే యువకుడికి కూడా తీవ్ర గాయాలు ఏడుగురిపై BNS సెక్షన్ 182(2), 103(2), 115(2), 190తో పాటు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, పరారైన వారి కోసం గాలిస్తున్న పోలీసులు మణుగూరులో MK గ్యాంగ్ నిత్యం అరాచకాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, నిత్యం వివాదాలు సృష్టించి ప్రజలను కొడుతూ హింసిస్తారని, 80 మంది ఉండే ఈ గ్రూప్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
Telugu Scribe410,264 views • 5 days ago

ఏపీలో మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్య పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్ద విషాద ఘటన తణుకు మండలం వేల్పూరుకు చెందిన తమ మూడేళ్ల పాపతో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చిన దొడ్డా సాయి(29), శిరీష(28) అనే దంపతులు పాపను స్కూటీ మీదే వదిలేసి.. దంపతులు ఇద్దరు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చీకట్లో చలికి వణుకుతూ ఆ చిన్నారి అమ్మా.. నాన్న అంటూ ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం చూసి కన్నీటి పర్యంతమైన స్థానికులు సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి.. నదిలో దూకిన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
Telugu Scribe396,233 views • 6 days ago

ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తుల వివాహేతర సంబంధం కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తిని హతమార్చిన మరో వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో ఒకే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మౌలానా (42), ఇస్మాయిల్ అనే ఇద్దరు వ్యక్తులు మహిళ విషయంలో ఇద్దరికీ గొడవ జరగగా, తన కారుతో మౌలానాను ఢీకొట్టిన ఇస్మాయిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన మౌలానా, తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు గుర్తింపు మౌలానా సోదరుడి ఫిర్యాదుతో ఇస్మాయిల్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగ్రహంతో ఇస్మాయిల్ ఇంటికి నిప్పంటించిన మౌలానా కుటుంబ సభ్యులు
Telugu Scribe143,328 views • 3 days ago

నాన్న జాగ్రత్త.. బతకాలని ఉన్నా బతకలేకపోతున్నాము ఏపీలో గోదావరిలో దూకి ఆత్మహత్యకు ముందు చివరిగా ఆడియో విడుదల చేసిన దంపతులు స్నేహితుడు తాకట్టు పెట్టమని ఇచ్చిన ఉంగరం విషయంలో ఎదురైన వేధింపుల వల్లే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ ఆడియోలో వెల్లడించిన సాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్ద మూడేళ్ల బాబును వదిలి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ దొడ్డ వెంకట సాయికృష్ణ, శిరీష దంపతులకు వీరికి ఆరేళ్ల కిందట వివాహం కాగా, హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేసి అప్పులపాలై రెండు నెలల క్రితం భీమవరంలోని బంధువుల ఇంటికి వచ్చిన సాయికృష్ణ బతకాలని ఉన్నా బతకలేకపోతున్నామని, నాన్న జాగ్రత్త అంటూ ఆత్మహత్యకు ముందు ఆడియో విడుదల చేసిన దంపతులు
Telugu Scribe238,074 views • 5 days ago

నడిరోడ్డుపై సీఐ దాష్టీకం దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితుల ఆరోపణలు మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై నిరసనకు దిగిన బాధితులు బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ టౌన్ సీఐ
Telugu Scribe229,096 views • 5 days ago

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అకృత్యాల గురించి హైదరాబాద్ సిటీ మొత్తం తెలియాలి అతన్ని MIM పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అసదుద్దీన్ ఒవైసీ తన నోటితోనే చెప్పాలి ఈ కేసులో ఒక MIM ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ కూడా ఉన్నారు.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అసదుద్దీన్ ఒవైసీ ఏమో హిజాబ్ గురించి మాట్లాడుతూ, ఆడవారితో గౌరవంగా ప్రవర్తించాలని అంటాడు వాళ్ల నాయకులు ఏమో ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తారు నా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ అసదుద్దీన్ ఒవైసీ ముందు ఉంచుతాను.. వాళ్ల అకృత్యాలను అతని నోటితోనే చెప్పాలి - సల్మాన్ ఖాన్ HYC
Telugu Scribe175,441 views • 5 days ago

హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు నా రూం వాష్రూంలో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్రూం వాడుకోవడానికి వెళ్లాను అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు నేను, మాధురి రాథోడ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.. అది కూడా తప్పే ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి - ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి
Telugu Scribe332,069 views • 9 days ago

బిగ్ బ్రేకింగ్ న్యూస్ సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Telugu Scribe202,290 views • 7 days ago
5:16
Sensitive content
This media may contain sensitive content.

నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంది మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్లు చూసి కంగుతిన్నాను ఈ విషయంలో ఒకసారి నా కొడుకుతో కలిసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను నా భర్త మంచోడే కానీ అమ్మాయి మీద పడితే అతను మాత్రం ఏం చేస్తాడు? ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదు – ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి భార్య
Telugu Scribe434,018 views • 14 days ago

మద్యంలా శానిటైజర్ను తాగుతున్న విజయవాడ మందు బాబులు చీప్ లిక్కర్ కంటే తక్కువ ధర ఉండటంతో శానిటైజర్ తాగేస్తున్న వైనం విజయవాడలోని పటమట హైస్కూల్ రోడ్డుకు సమీపంలో గత మూడేళ్లలో 100 మి.లీ. శానిటైజర్ బాటిళ్లను 50 వేలకు పైగా విక్రయించిన ఓ మెడికల్ షాప్ యజమాని దీంతో అనుమానం వచ్చిన ఔషధ నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టగా వెలుగులోకి వచ్చిన అసలు వాస్తవం ఈ శానిటైజర్ బాటిళ్ల కోసం రోజూ 25-30 మంది వస్తున్నారని.. రోజూ ఎందుకు కొంటారంటే.. మద్యానికి బదులుగా శానిటైజర్ను నీటిలో కలిపి తాగుతున్నారని వెల్లడించిన మెడికల్ షాప్ యజమాని ఈ చిన్న శానిటైజర్ బాటిల్ ధర రూ.50.. అంటే క్వార్టర్ మద్యం బాటిల్ ధరలో ఇది సగమే ఉండడంతో ఈ మత్తుకు అలవాటు పడిన వాళ్లు రోజూ దీన్నే తాగుతున్నారని చెప్పడంతో షాక్ అయిన అధికారులు Video credits - TV9
Telugu Scribe95,013 views • 4 days ago

బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తింపు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న పోలీసులు
Telugu Scribe150,296 views • 7 days ago