#csr

TelanganaCMO's profile picture

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారి సమక్షంలో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (#CSR) నిధులను అందించాయి. ✅ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, దివీస్, Aurobindo Pharma Limited - Official కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం సీఎస్‌ఆర్‌ నిధుల కింద దివీస్ సంస్థ రూ. 12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 10 కోట్లకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫౌండేషన్‌కు అందజేశారు. ✅ప్రభుత్వ పాఠశాలల్లో #HareKrishnaMovement చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకం కోసం సీఎస్ఆర్ నిధులను అందించిన దివీస్‌, అరబిందో సంస్థలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు. ✅ఆ పథకం అమలు కోసం హరే కృష్ణ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌లను ఏర్పాటు చేసిన చోట సమీప ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధులకు వివరించారు. అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి తీసుకునేలా, రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ✅రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతులకు లాభాలను అందించవచ్చని ముఖ్యమంత్రి గారన్నారు. ✅ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు గారు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ గారు, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ గారు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు గారు, అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. #Telangana #MidDayMeal #BreakfastScheme #AkshayaPatra #DivisLaboratories #AurobindoPharma

Telangana CMO

12,052 次观看 • 1 个月前

TelanganaCMO's profile picture

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (#CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ✅ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో #HDFC సమకూర్చిన రెండు ఆంబులెన్స్‌లకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చిన ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల నుంచి రుణాల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. ✅స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం పెద్ద ఎత్తున రుణాలివ్వాలని కోరారు. ✅ఈ కార్య‌క్ర‌మంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #CSR #HDFCBank #HealthCare #SelfHelpGroups #Telangana

Telangana CMO

17,628 次观看 • 1 个月前