#jsptelangana

JSPTelangana's profile picture

#JSPTelangana #TGSRTC #TelanganaRTC ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదలడం దురదృష్టకరం. దయ చేసి ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాలను రోడ్డున పడేయకండి, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో మంది బలిదానాలు ఇచ్చారు కానీ ఏ ప్రభుత్వము వారిని పట్టించుకున్నది లేదు. కాబట్టి ప్రాణాలు వదలడం కన్నా పోరాడి సాధించుకుందాం, 38 వేల మంది ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం జనసేన పార్టీ మద్దతిస్తుంది. శంకర్ గౌడ్ గారికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారని తెలిసింది. ఇప్పుడు వారు అండని కోల్పోయారు. కాబట్టి మరెవ్వరూ ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని ప్రాధేయపడుతూ ఈరోజు నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, వారి డిమాండ్లకు జనసేన పార్టీ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.

JanaSena Telangana

18,138 views • 3 months ago