#psychofekujagan

#PsychoFekuJagan వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఒక బూటకం. ఆ పరీక్ష నేను కూడా రాశాను. ఇప్పటికీ నాకు వచ్చిన ర్యాంక్ ఏంటో తెలియదు. నాకే కాదు, ఆ పరీక్ష రాసిన చాలా మందికి తమ ర్యాంకులు ఏమిటో తెలియదు. ర్యాంక్ లిస్ట్ లేదు, మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు... ఏదీ అధికారికంగా విడుదల చేయలేదు. కావాల్సిన వారికి మాత్రం నేరుగా మెసేజ్లు పంపించి ఉద్యోగాలు ఇచ్చారు. జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా... ఇది మీరు నిర్వహించిన నియామక విధానం. ఈ రోజు కూటమి ప్రభుత్వం డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే, అదే యువతపై విషం చిమ్ముతారా? పారదర్శకంగా జరిగిన నియామకాలపై కూడా దుష్ప్రచారం చేయడం సరికాదని గుర్తించాలి. #YCPFakeBrathuku #AndhraPradesh
Telugu Desam Party26,436 次观看 • 12 天前

#PsychoFekuJagan కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసాదం స్వీకరించే వీడియోని ఎడిట్ చేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు గొడ్డలి పార్టీ కూలీలు. దేవుడంటే భక్తి, ఆధ్యాత్మిక సంప్రదాయాలు భక్తిశ్రద్ధలతో పాటించే చంద్రబాబు గారు ప్రసాదంను కళ్ళకు అద్దుకొని స్వీకరించిన విజువల్స్ కింది వీడియోలో చూడొచ్చు. ఎడిటెడ్ వీడియోతో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
Lokesh Nara50,269 次观看 • 26 天前

#PsychoFekuJagan అసత్యాలు ప్రచారం చేయడం ఒక్కటే తమ జీవిత ధ్యేయం అన్నట్లు వైకాపా నాయకులు ప్రవర్తిస్తున్నారు. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తమ ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. 2018లో అమరావతి బాండ్స్ విడుదల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చేసిన ప్రసంగంలో దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి చెబితే దాన్ని ముందు భాగం కట్ చేసి, అమరావతి రాజధానికి అవసరమైన నిధుల గురించి చెబుతున్నట్లుగా ఒక ఫేక్ వీడియోను వైకాపా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, దేశంలో సుమారు 30 శాతం సేవింగ్స్ ఉంటాయని, అంటే ప్రతి సంవత్సరం సుమారు 750 బిలియన్ డాలర్ల సేవింగ్స్ సాధ్యమవుతాయని గౌరవ ముఖ్యమంత్రి తన 2018 నాటి ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే భారత్ ప్రస్తుతం 10 నుంచి 12 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని, సరైన ప్రణాళికలు అమలు చేస్తే 15 శాతం వరకు వృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వృద్ధి కొనసాగితే పదేళ్లలో సుమారు 10 ట్రిలియన్ డాలర్ల సేవింగ్స్ సమీకరించవచ్చని ఆయన అన్నారు. దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రసంగంలోని ‘‘2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని’’ అన్న వాక్యానికి ముందు చెప్పినదంతా కట్ చేసి ‘‘అమరావతికి’’ అనేది కలిపి వైకాపా వారు ఒక ఫేక్ వీడియోను రూపొందించారు. ‘‘ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రవేశపెట్టడం, భూముల ధరలు భారీగా పెరగడం వంటి పరిణామాలతో అమరావతి ప్రాజెక్ట్ రాష్ట్రానికి మరింత ఆర్థిక భారం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి’’ అనే కుట్రపూరిత వ్యాఖ్యను జత చేసి ప్రచారం చేస్తున్నారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘‘మావిగన్’’ అనే వికృత ప్రతిపాదన తెచ్చిన వైకాపా తప్పుడు వీడియోలతో ఫేక్ ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
Lokesh Nara88,019 次观看 • 2 个月前

